ఈ విషయం గురించి చిరంజీవి ఏడేళ్ల క్రితమే అన్నారా?

రామ్‌ చరణ్‌, జాన్వీ కపూర్‌ జంటగా బుచ్చిబాబు సాన దర్శకత్వంలో వస్తున్న చిత్రం ఆర్సీ 16. ఈ సినిమా పూజా కార్యక్రమాలు గత వారమే మొదలయ్యాయి. పూజా కార్యక్రమంలో పాల్గొన్న చరణ్‌ ను, జాన్వీని చూసిన మెగా అభిమానులు తెగ సంబరపడిపోతున్నారు.

ఎందుకంటే మెగాస్టార్‌ చిరంజీవి, అతిలోక సుందరి శ్రీదేవి కాంబోలో వచ్చిన సినిమాలు ఎంత పెద్ద హిట్టో అందరికీ తెలిసిందే. అందుకే ఎప్పటి నుంచో వీరి కాంబోలో సినిమా రావాలని అభిమానులు ఎంతగానో ఆశపడ్డారు. అయితే అభిమానులతో పాటు చరణ్‌, జాన్వీ కపూర్ కాంబోలో సినిమా రావాలని మరో వ్యక్తి కూడా చాలా గట్టిగా అనుకున్నారు.

అది కూడా ఏడు సంవత్సరాల క్రితమే ఆయన ఈ విషయం గురించి మీడియా ముందు ప్రస్తావన కూడా తీసుకుని వచ్చారు. ఇంతకీ ఆ వ్యక్తి ఎవరో తెలుసా.. మెగాస్టార్ చిరంజీవి. అవును చరణ్‌ , జాన్వీ కాంబోలో సినిమా రావాలని చిరంజీవి చాలా ఆశపడ్డారంట. ప్రస్తుతం చిరంజీవి మాట్లాడిన ఈ వ్యాఖ్యలు ప్రస్తుతం వైరల్‌ గా మారుతున్నాయి.

2017లో నిహారిక వ్యాఖ్యాతగా వచ్చిన ఓ షోకి చిరంజీవి గెస్ట్‌ గా రాగా… నిహారిక చిరంజీవిని కొన్ని ప్రశ్నలు అడిగింది. అందులో ఓ ప్రశ్నగా మీరు నటించిన ఏ సినిమా రీమేక్‌ చేయాలని కోరుకుంటున్నారని అడగగా.. చిరంజీవి వెంటనే జగదేకవీరుడు.. అతిలోకసుందరి సినిమాని చరణ్‌ రీమేక్‌ చేయాలని … అందులో శ్రీదేవి కుమార్తె జాన్వీ కపూర్ నటించాలని ఆయన అన్నారు.

ఇప్పుడు ఆ మాటే నిజమైంది. సాన బుచ్చిబాబు- చరణ్‌ – జాన్వీ కపూర్‌ కాంబోలో ఆర్సీ 16 సినిమా మొదలవుతుంది. ఈ సినిమాలో విజయ్‌ సేతుపతి ప్రతినాయకుని పాత్రలో కనిపించబోతున్నట్లు సమాచారం. ఏఆర్‌ రెహమాన్‌ సంగీతం అందిస్తున్నారు.

Related Posts

Comments

spot_img

Recent Stories