పూర్తి ఎంటర్ టైనర్‌ గా ధూం..ధాం..సినిమా!

చైతన్ కృష్ణ, హెబ్బా పటేల్ జంటగా తెరకెక్కిన సినిమా ‘ధూం ధాం’ ప్రేక్షకుల్లో మంచి అంచనాలను క్రియేట్ చేసిన సంగతి తెలిసిందే. ఈ సినిమాలోని పాటలు ఆడియెన్స్‌ను ఆకట్టుకోవడంలో ఫుల్‌ సక్సెస్ అయ్యాయి. దీంతో ఈ సినిమాపై పాజిటివ్ వైబ్స్ క్రియేట్ అయ్యాయి. ఇక ఈ సినిమా నుంచి తాజాగా ప్రేక్షకుల ముందుకు మూవీ మేకర్స్ టీజర్‌ ని ప్రేక్షకుల ముందుకు తీసుకుని వచ్చారు.

ఈ టీజర్‌లో సినిమా ప్లాట్ తెలిపేలా చిత్ర బృందం ప్లాన్ చేశారు. ఈ సినిమా కంప్లీట్ ఎంటర్‌టైనర్‌గా రానుందని ఈ టీజర్ కట్ చూస్తే తెలిసిపోతుంది.  ఒక మంచి సబ్జెక్ట్‌తో ఈ సినిమాను తెరకెక్కించినట్లుగా ఈ టీజర్ నిరూపించింది. యూత్‌తో పాటు ఫ్యామిలీ ఆడియెన్స్‌ను టార్గెట్ చేస్తూ ఈ సినిమాను తెరకెక్కించారు. దర్శకుడు సాయి కిషోర్ మచ్చా ఈ సినిమాని డైరెక్ట్ చేస్తున్న సంగతి తెలిసిందే.

గోపీ సుందర్ అందించిన మ్యూజిక్ ఈ సినిమాపై మరిన్ని అంచనాలను పెంచింది. ఫ్రైడే ఫ్రేమ్‌వర్క్స్ ప్రై లిమిటెడ్ బ్యానర్‌పై ఎంఎస్.రామ్ కుమార్ ఈ సినిమాను ప్రొడ్యూస్ చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాలో సాయి కుమార్, వెన్నెల కిషోర్, వినయ్ వర్మ, బెనర్జీ తదితరులు ఇతర ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు.

Related Posts

Comments

spot_img

Recent Stories