టాలీవుడ్లో శేఖర్ కమ్ముల తెరకెక్కిస్తున్న తాజా సినిమా కుబేర విడుదలకు సిద్ధంగా ఉంది. ఇప్పటికే షూటింగ్ పూర్తయి, ప్రమోషనల్ కంటెంట్ కూడా ప్రేక్షకుల ముందుకొచ్చింది. ఈ సినిమా టైటిల్ ఎనౌన్స్మెంట్ నుంచి ట్రైలర్ వరకు వచ్చిన ప్రతి అప్డేట్కు మంచి స్పందన లభించింది.
కుబేర సినిమాలో ధనుష్, నాగార్జున, రష్మిక మందన్న ముఖ్య పాత్రలు చేస్తున్నారు. ఈ సినిమా ద్వారా నాగార్జునతో స్క్రీన్ పంచుకోవడం ధనుష్కి ప్రత్యేక అనుభూతి అని చెప్పుకోవచ్చు. తాజాగా ఒక ఇంటర్వ్యూలో నాగార్జున గురించి ధనుష్ కొన్ని ఆసక్తికర విషయాలు చెప్పాడు.
తన చిన్నప్పటి నుంచి నాగార్జున నటించిన సినిమాలంటే తనకు ఇష్టం అని, ముఖ్యంగా రచ్చగన్(తమిళంలో రక్షకుడు) తనకు ఎప్పుడూ ఇష్టమైన మూవీ అని ధనుష్ చెప్పాడు. అలాగే నాగార్జున నటనను చూస్తూ పెరిగిన తాను, ఇప్పుడు ఆయనతో కలిసి పని చేయడం చెప్పలేని సంతోషంగా ఉందని ఆయన వెల్లడించాడు.