ఆ రూమర్ల పై స్పందించిన దేవర ముద్దుగుమ్మ!

బాలీవుడ్ ముద్దుగుమ్మ జాన్వీ కపూర్‌ అతిలోక సుందరి శ్రీదేవి కూతురుగా ఇండస్ట్రీకి పరిచయమైనప్పటికీ తన నటన, అందంతో అభిమానులను ఆకట్టుకుంది. బాలీవుడ్ లో వరుస సినిమాలతో ఫుల్ బిజీగా ఉంది. మాస్‌ యాక్షన్‌ హీరో జూనియర్‌ ఎన్టీఆర్‌ హీరోగా నటిస్తున్న దేవర చిత్రంతో తెలుగులోకి ఎంట్రీ ఇవ్వబోతుంది.

ఈ చిత్రంలో పల్లెటూరి అమ్మాయి తంగం పాత్రను ఆమె పోషిస్తున్నారు. మెగా పవర్ స్టార్ రాంచరణ్ తో కూడా జాన్వీ నటించనుంది. రాంచరణ్ బుచ్చిబాబు కాంబోలో తెరకెక్కనున్న మూవీ “ఆర్సీ 16 ” లో జాన్వీ హీరోయిన్‍గా నటించనున్నారు. బాలీవుడ్‍లో ఈ భామ ప్రస్తుతం మిస్టర్ అండ్ మిసెస్ మహీ, ఉల్జాతో పాటు మరో సినిమాను కూడా చేస్తుంది. ఇదిలా ఉంటే శిఖర్ పహారియాతో ఆమె ప్రేమలో ఉన్నారని కొంతకాలంగా రూమర్లు వస్తునే ఉన్నాయి.

జాన్వీ, శిఖర్ కలిసి ఎన్నోసార్లు బయట కనిపించారు. అయితే తిరుపతిలో శిఖర్ పహారియనాను జాన్వీ కపూర్ పెళ్లి చేసుకోనున్నారనే రూమర్‌ తెగ వైరల్ అయింది.ఆ రూమర్ పై తాజాగా జాన్వీ స్పందించారు. జాన్వీ కపూర్ ,శిఖర్ పహారియా వివాహం తిరుపతిలో జరగనుందంటూ ఓ ఫొటోను ఓ యూజర్ ఇన్‍స్టాగ్రామ్‍లో పోస్ట్ చేయడం జరిగింది. అయితే దీనికి జాన్వీ స్పందించారు. ‘కుచ్ బీ’ అంటూ ఆ పోస్ట్‌కు జాన్వీ రిప్లై ఇచ్చింది. ఏదైనా రాసేస్తారా అని అంటూ ఆగ్రహం వ్యక్తం చేసింది. తన పెళ్లి గురించి వస్తున్న వార్తల్లో మాత్రం నిజం లేదని జాన్వీ పేర్కొంది..

Related Posts

Comments

spot_img

Recent Stories