జగన్‌ కు తెలంగాణ హైకోర్టు షాక్‌!

ఆంధ్రప్రదేశ్‌ మాజీ ముఖ్యమంత్రి జగన్‌ అక్రమాస్తుల కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. సీబీఐ కోర్టులో ఉన్న మాజీ ముఖ్యమంత్రి జగన్‌ కేసులను రోజువారీ విచారణ చేయాలని టీజీ హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. జగన్పై సీబీఐ కోర్టులో 20 కేసులున్నాయని, కొన్నేళ్లుగా ఈ కేసులు ఇంకా విచారణ దశలోనే ఉన్నాయని, త్వరితగతిన విచారణ పూర్తి చేసేలా ఆదేశాలు జారీ చేయాలని మాజీ ఎంపీ హరిరామజోగయ్య గతేడాది హైకోర్టులో పిటీషన్ దాఖలు చేసిన విషయం తెలిసిందే. దీనిపై హైకోర్టు మరోసారి విచారణ చేపట్టింది.

విచారణలో ఎలాంటి పురోగతి లేదని వీలైనంత త్వరగా విచారణ పూర్తి చేసేలా సీబీఐ కోర్టును ఆదేశించాలని పిటీషనర్ తరఫు న్యాయవాది ధర్మాసనాన్ని కోరారు. రోజు వారీ విచారణ చేపట్టాలని ఈ సందర్భంగా హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. ప్రజా ప్రతినిధులపై పలు కోర్టులలో ఉన్న కేసులను కూడా హైకోర్టు ఈ సందర్భంగా విచారణ చేపట్టింది. 

ప్రజాప్రతినిధులపై ఉన్న కేసులను త్వరగా తేల్చాలని సుప్రీంకోర్టు జారీ చేసిన ఆదేశాల మేరకు గతేడాది హైకోర్టు సుమోటాగా విచారణకు స్వీకరించింది. ప్రజాప్రతినిధులపై ఉన్న కేసుల విచారణను వేగవంతం చేయాలని కోర్టులు ఆదేశించింది. విచారణకు సంబంధించిన నివేదికు సమర్పించాలని మూడు వారాలకు కేసును వాయిదా వేసింది.

Related Posts

Comments

spot_img

Recent Stories