ఒకే వేదిక పై చిరంజీవి..బాలయ్య!

నందమూరి నటసింహం బాలయ్య బాబు వ్యాఖ్యాతగా వ్యవహరిస్తోన్న టాక్‌ అన్‌స్టాపబుల్‌…ఈ సినిమా ఇప్పటికే విజయవంతంగా మూడు సీజన్లు పూర్తి చేసుకుని మరో సీజన్‌ కి రెడీ అయిపోయింది. ఆహాలో ప్రసారం అవ్వబోతున్న ఈ షోకి సంబంధించిన పనులు కూడా ఇప్పటికే పూర్తయ్యాయని తెలుస్తోంది.

కొత్త సీజన్‌ సరికొత్త సర్‌ప్రైజ్‌లతో సిద్ధమవుతోందని నిపుణుల బృందం చెబుతుంది. నిజానికి మొదటి మూడు సీజన్లలో అనేకమంది హీరోలు, డైరెక్టర్లతో సహా చంద్రబాబు వంటి వారితో సందడి చేసిన ఈ షో ఇప్పుడు మరింత జోష్‌తో కొనసాగనుందని తెలుస్తోంది. ఈ సారి సీజన్లో చిరంజీవితో పాటు నాగార్జున ఎపిసోడ్స్ కూడా టీమ్‌ ప్లాన్ చేసినట్టు సమాచారం.

ఈ విషయాన్ని ఒక మీటింగ్ లో ప్రొడ్యూసర్ కౌన్సిల్ సెక్రెటరీ ప్రసన్న కుమార్ తెలిపారు. ఇక అధికారికంగా ప్రకటన వెలువడటమే లేట్ . ఇక చిరు పుట్టినరోజు సందర్భంగా ఈ ప్రకటన బయటకు వచ్చే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయని ఇండస్ట్రీ వర్గాల్లో టాక్‌ మొదలయింది. నిజానికి తెలుగు చిత్ర పరిశ్రమలో చిరంజీవి, బాలకృష్ణ, నాగార్జున, వెంకటేష్ లది ఓ ప్రత్యేక స్థానం. ముఖ్యంగా బాలయ్య-చిరు అభిమానుల మధ్య గొడవలు పీక్స్ లో ఉంటాయి.

కానీ ఇప్పుడు పోటీ తగ్గడంతో పాటు జనసేన టీడీపీ కలిసి పనిచేయడం ఓ కలిసి వచ్చిన అంశం. ఇక ఈ ఇద్దరు స్టార్‌ హీరోలు ఒకే వేదికపై కనిపిస్తే, అభిమానులకు అంతకుమించిన వినోదం ఏముంటుంది.

Related Posts

Comments

spot_img

Recent Stories