ఆ ఓటీటీలో స్ట్రీమింగ్‌ అవుతున్న చౌర్యపాఠం!

టాలీవుడ్‌ నుంచి ఇటీవల వచ్చిన క్రైమ్ కామెడీ చలనచిత్రం చౌర్యపాఠం, బాక్సాఫీస్‌ వద్ద పెద్దగా ఆకట్టుకోలేకపోయింది. ఈ సినిమాకు ధమాకా చిత్ర దర్శకుడు త్రినాథరావు నక్కిన నిర్మాతగా వ్యవహరించారు. కథానాయకుడిగా ఇంద్రరామ్‌ నటించిన ఈ సినిమాలో కంటెంట్‌ ప్రేక్షకులను ఆకర్షించడంలో విఫలమైంది.

థియేటర్స్‌ లో పెద్దగా ఫలితం చూపించని ఈ సినిమా ఇప్పుడు ఓటీటీ ప్రేక్షకులను ఆకట్టుకునే ప్రయత్నంలో ఉంది. తాజాగా చౌర్యపాఠం అమెజాన్‌ ప్రైమ్‌ వీడియోలో స్ట్రీమింగ్‌కి అందుబాటులోకి వచ్చింది. తెలుగు మాత్రమే కాదు, తమిళ్‌, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో కూడా ఈ సినిమా అందుబాటులో ఉంది.

పాయల్‌ రాధాకృష్ణ, రాజీవ్ కనకాల వంటి నటులు ఈ సినిమాలో ఇతర కీలక పాత్రల్లో కనిపిస్తారు. నిఖిల్ గొల్లమారి దర్శకత్వం వహించిన ఈ చిత్రం, థియేటర్లలో ఆశించిన స్థాయిలో విజయం సాధించలేకపోయినప్పటికీ, ఇప్పుడు డిజిటల్‌ ఆడియెన్స్‌ నుంచి మంచి స్పందన రావాలనే ఆశలు పెట్టుకుంది. ఈ సినిమాకు ఓటీటీలో ఎంత ఆదరణ లభిస్తుందో వేచి చూడాలి.

Related Posts

Comments

spot_img

Recent Stories