గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ హీరోగా జాన్వీ కపూర్ హీరోయిన్ గా టాలెంటెడ్ దర్శకుడు బుచ్చిబాబు సానా తెరకెక్కిస్తున్న లేటెస్ట్ అవైటెడ్ చిత్రమే “పెద్ది”. పక్కా స్పోర్ట్స్ అండ్ రూరల్ బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కిస్తున్న ఈ సినిమా రీసెంట్ ఫస్ట్ లుక్ పోస్టర్స్ తో సాలిడ్ హైప్ ని అందుకుంది. ఇక ఈ తరువాత గ్లింప్స్ డేట్ ని కూడా మేకర్స్ అనౌన్స్ చేయడంతో దాని కోసం అంతా ఎగ్జైటింగ్ గా ఎదురు చూస్తున్నారు.
మరి ఈ తర్వాత సినిమా ఆడియో హక్కులపై కూడా మేకర్స్ క్లారిటీ ఇచ్చేసారు. భారీ రీచ్ ఉన్న టీ సిరీస్ ఈ చిత్రాన్ని సొంతం చేసుకున్నట్టుగా రివీల్ చేయగా ఈ సినిమా ఆడియో రైట్స్ భారీ ధరకి అమ్ముడు పోయినట్టుగా ఓ టాక్ ఇపుడు వినిపిస్తోంది. దీనితో పెద్ది పాన్ ఇండియా భాషల ఆడియో హక్కులు టీ సిరీస్ వారు ఏకంగా 35 కోట్లు చెల్లించి సొంతం చేసుకున్నట్టుగా తెలుస్తుంది.
ఇది మన తెలుగు సినిమాల్లో అత్యధికం అన్నట్టు తెలుస్తుంది. ఇక ఈ చిత్రానికి లెజెండరీ సంగీత దర్శకుడు ఏ ఆర్ రెహమాన్ సంగీతం అందిస్తున్న సంగతి తెలిసిందే. అలాగే వృద్ధి సినిమాస్, మైత్రి మూవీ మేకర్స్ ఈ చిత్రాన్ని నిర్మాణం వహిస్తున్నారు. ఇక అవైటెడ్ గ్లింప్స్ ఈ ఏప్రిల్ 6న రామ నవమి కానుకగా రాబోతుంది.