అక్కడికి చేరుకోబోతున్న చరణ్‌!

ప్రఖ్యాత మేడమ్‌ టుస్సాడ్స్‌ సంస్థ సింగపూర్‌ మ్యూజియంలో రామ్‌ చరణ్‌ మైనపు విగ్రహాన్ని ఏర్పాటు చేయబోతున్నారని తాజాగా తెలిసిన సంగతే. ఈ విషయం గురించి తెలుసుకున్న అభిమానులు ఫుల్ జోష్ లో ఉన్నారు. టుస్సాడ్స్‌ బృందం ఐఫా వేడుకల్లో ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటిస్తూ ఓ వీడియోని విడుదల  చేయడం జరిగింది. అన్నట్టు మెగా పవర్ స్టార్ రామ్‌ చరణ్, ఆయన పెంపుడు కుక్క రైమ్‌ కలిసి ఉన్న విగ్రహాన్ని మ్యూజియంలో ఏర్పాటు చేస్తుండటం విశేషం.

కాగా రామ్‌ చరణ్‌ మైనపు విగ్రహాం కోసం ఇప్పటికే కొలతల్ని తీసుకోవడంతో పాటు, దానికి సంబంధించిన ఫొటో షూట్‌ ని పూర్తి చేయడం కూడా జరిగింది. టుస్సాడ్స్‌ కుటుంబంలో భాగం కావడం గౌరవంగా భావిస్తున్నానని రామ్‌ చరణ్‌ ఈ సందర్భంగా చెప్పుకొచ్చారు. అన్నట్టు టుస్సాడ్స్‌ మ్యూజియంలో ఇప్పటికే తెలుగు స్టార్ హీరోలు రెబల్ స్టార్ ప్రభాస్, సూపర్ స్టార్ మహేశ్‌బాబు, ఐకాన్ స్టార్ అల్లు అర్జున్‌ ల మైనపు విగ్రహాలు ఉన్నాయి. తాజాగా ఈ లిస్ట్ లో ఇప్పుడు రామ్‌ చరణ్‌ కూడా చేరబోతున్నాడు.

Related Posts

Comments

spot_img

Recent Stories