తెలంగాణ ప్రభుత్వం ఇటీవల డ్రగ్స్ పై అవగాహన కల్పించేందుకు ఏర్పాటు చేసిన ప్రత్యేక కార్యక్రమం ఎంతో మంది దృష్టిని ఆకర్షించింది. ఈ ఈవెంట్లో టాలీవుడ్ నుండి గ్లోబల్ స్టార్ రామ్ చరణ్, అలాగే యంగ్ స్టారుడు విజయ్ దేవరకొండ పాల్గొనడం విశేషం. ఈ కార్యక్రమంలో వీరి హాజరుతో పాటు చెప్పిన మాటలు కూడా అప్పటి నుంచి సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. యువతకు స్పష్టమైన సందేశాన్ని అందిస్తూ ఇద్దరూ సింపుల్గా కానీ స్ట్రాంగ్గా స్పందించడం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.
ఇక ఇప్పుడు విజయ్ దేవరకొండ ఆ రోజుకు సంబంధించిన కొన్ని మెమొరబుల్ మూమెంట్స్ని తన సోషల్ మీడియా ద్వారా అభిమానులతో పంచుకున్నాడు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, రామ్ చరణ్తో కలిసి ఉన్న ఓ ఫోటోను విజయ్ షేర్ చేయగా, ఆ ఫ్రేమ్లో చరణ్, విజయ్ ఇద్దరూ స్టైలిష్గా మెరిశారు. వీరి డైనమిక్ లుక్, కూల్ ఎక్స్ప్రెషన్స్తో ఆ ఫోటో ఒక్కసారిగా వైరల్గా మారిపోయింది. అభిమానులు కూడా ఈ క్లిక్కి భారీగా స్పందిస్తూ కామెంట్లు, షేర్లు చేస్తున్నారు.
ఇక ప్రొఫెషనల్ గాను చూస్తే విజయ్ దేవరకొండ తన “కింగ్డమ్” సినిమాను పూర్తి చేసి తన తదుపరి ప్రాజెక్ట్లో అడుగుపెట్టగా, రామ్ చరణ్ మాత్రం “పెద్ది” అనే మాస్ యాక్షన్ డ్రామాతో బిజీగా ఉన్నాడు. ఈ ఇద్దరూ తమ తమ సినిమాలతో ముందుకు దూసుకెళ్తున్న వేళ, ఇలా ఒకే ఫ్రేమ్లో కనిపించి సోషల్ మీడియాలో ట్రెండ్ అవ్వడం సినీ ప్రేక్షకులకు మంచి కిక్ ఇస్తోంది.