సవాళ్లే ప్రతినాయక పాత్ర పోషిస్తే!

గ్లోబల్‌ స్టార్ రామ్‌ చరణ్‌, జాతీయ అవార్డు దర్శకుడు బుచ్చిబాబు కాంబోలో తెరకెక్కుతున్న చిత్రం ఆర్సీ 16. ఈ సినిమాని మైత్రీ మూవీస్‌ ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తుంది. ఈ సినిమా పనులు మార్చి 20న పూజా కార్యక్రమంతో మొదలు అయ్యాయి. ఈ సినిమాలో బాలీవుడ్‌ నటి జాన్వీ కపూర్ కథానాయికగా నటిస్తుంది.

ఈచిత్రంలో కన్నడ స్టార్‌ నటుడు శివరాజ్‌ కుమార్‌ కూడా ఓ కీలక పాత్ర పోషించబోతున్నట్లు చిత్ర బృందం తెలిపింది. ఈ సినిమాకు ఆస్కార్‌ అవార్డు గ్రహీత ఏఆర్‌ రెహమాన్‌ సంగీతం అందిస్తున్నారు. ఇక్కడ వరకు బాగానే ఉంది… మరి ఇంత మంది స్టార్‌ నటులు, ఇంత పెద్ద పెద్ద వారు పని చేస్తున్న ఈ సినిమాలో ప్రతి నాయకుడు అదేనండి విలన్‌ లేరని టాక్ గట్టిగా వినిపిస్తుంది.

ఈ సినిమాలో హీరోకు ఎదురయ్యే పరిస్థితులే ప్రతినాయక పాత్ర పోషిస్తున్నాయని ఓ టాక్‌ వినిపిస్తుంది. కన్నడ స్టార్‌ నటుడు శివరాజ్‌ కుమార్‌ ది కూడా ఓ పాజిటివ్‌ పాత్రే అని తెలుస్తోంది. ఈ విషయం తెలుసుకున్న చరణ్‌ అభిమానులు చరణ్‌ ఇలాంటి కథను ఎంచుకోవడం చాలా ఛాలెంజింగ్‌ విషయమని అంటున్నారు.

ఈ సినిమాను మెగాస్టార్‌ చిరంజీవి క్లాప్‌ కొట్టి ప్రారంభించారు. ఆ కార్యక్రమానికి బోనీ కపూర్‌, డైరెక్టర్‌ శంకర్‌, సుకుమార్‌,ఏఆర్‌ రెహ్మన్‌, దిల్‌ రాజ్‌, డైరెక్టర్‌ బుచ్చిబాబు వంటి వారు పాల్గొన్నారు. వ్యాపార వేత్త వెంకట సతీష్‌ కిలారు ఈ చిత్రానికి నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. ఈ సినిమాతో ఆయన నిర్మాతగా పరిచయం కాబోతున్నారు.

Related Posts

Comments

spot_img

Recent Stories