నాగ్‌ అశ్విన్‌ తో బిజీ బిజీ!

రీసెంట్ గా మన తెలుగు సినిమా నుంచి విడుదలకి వచ్చిన లేటెస్ట్ భారీ చిత్రాల్లో పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా దీపికా పడుకోణ్ అలాగే దిశా పటాని హీరోయిన్ గా చేయగా… దర్శకుడు నాగ్ అశ్విన్ తెరకెక్కించిన సెన్సేషనల్ ప్రాజెక్ట్ సినిమా “కల్కి 2898 ఏడీ” గురించి అందరికీ తెలిసిందే. పాన్ ఇండియా లెవెల్లో భారీ వసూళ్లతో అదరగొట్టిన ఈ సినిమా ఇప్పుడు ఓటిటిలో కూడా ముందుకు దూసుకుపోతుంది.

అయితే ఈ సినిమా నుంచి ఎప్పటికప్పుడు షూట్ మధ్యలో కొన్ని మూమెంట్స్ ని అయితే పలువురు నటీనటులపై షేర్ చేసుకున్న సంగతి తెలిసిందే. అలాగే ఈసారి కూడా కొన్ని ఫోటోలు అభిమానుల్లో  వైరల్ గా మారాయి. మరి లేటెస్ట్ గా వచ్చిన పిక్స్ లో చూస్తే ప్రభాస్ నాగ్ అశ్విన్ ల మధ్య ఓ సీరియస్ డిస్కషన్ నే సెట్స్ లో నడుస్తున్నట్టుగా తెలుస్తుంది.

దీనితో ఈ చిత్రాలు  ఫ్యాన్స్ లో వైరల్ గా మారాయి. ఇక ఈ భారీ సినిమాలో అమితాబ్ బచ్చన్, కమల్ హాసన్, శోభన తదితరులు యాక్ట చేయగా…సంతోష్ నారాయణన్ సంగీతం అందించాడు. అలాగే వైజయంతి మూవీస్ వారు నిర్మాణం వహించారు.

Related Posts

Comments

spot_img

Recent Stories