మల్టీప్లెక్స్‌ ఓపెన్‌ చేస్తున్న బన్నీ..ఎక్కడో తెలుసా!

తెలుగు చిత్ర పరిశ్రమలో హీరో , హీరోయిన్లు కేవలం సినిమాలతోనే కాకుండా .. వేరే బిజినెస్‌ లతో కూడా బాగా సంపాదిస్తున్నారు. కొద్ది రోజుల క్రితం మహేష్‌ బాబు మల్టీప్లెక్స్‌ బిజినెస్‌ లోకి ఎంట్రీ ఇచ్చి ఏఎంబీ మాల్స్‌ ను ప్రారంభించాడు. ఆ తరువాత అల్లు అర్జున్‌ కూడా ఏఏఏ సినిమాస్‌ పేరుతో  మల్టీప్లెక్స్‌ ని ప్రారంభించాడు.

విజయ్‌ దేవరకొండ కూడా ఈ బిజినెస్‌ లో దూసుకుపోతున్నాడు. తాజాగా మరో మల్టీప్లెక్స్ ని నిర్మించేందుకు అల్లు అర్జున్‌ రెడీ అవుతున్నాడు. కానీ హైదరాబాద్‌ లో కాదు. మరెక్కడ అనుకుంటున్నారా.. వైజాగ్‌ లో…. ఇక్కడ కొత్తగా నిర్మిస్తున్న ఇనార్బిట్‌ మాల్‌ లో మల్టీప్లెక్స్‌ ఓపెనింగ్‌ ప్లాన్‌ చేస్తున్నారట.

ఈ క్రమంలో ఏషియన్‌ సంస్థతో కలిసి హైదరాబాద్‌ లో ఉన్నట్లే హై క్లాస్‌ స్టాండర్స్‌ తో థియేటర్‌ ను నిర్మించబోతున్నట్లు సమాచారం. ఇంకా దీని పై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. హీరో రవితేజ కూడా ఏషియన్‌ సంస్థతో కలిసి హైదరాబాద్‌ లో ఓ మల్టీప్లెక్స్‌ ని నిర్మిస్తున్నట్లు తెలిసింది.

ఈ మల్టీప్లెక్స్‌ దిల్‌సుఖ్‌ నగర్‌ లో ప్రారంభం కానుంది. దీనికి ఏఆర్‌టీ అనే పేరు కూడా పెడుతున్నట్లు సమాచారం. గచ్చిబౌలిలో ఏఎంబీ, అమీర్‌పేట్‌ లో ఏఏఏ, మహబూబ్‌నగర్‌ ఏవీడీ … మహేష్‌ బాబు, అల్లు అర్జున్‌, విజయ్‌ దేవరకొండ లు మల్టీప్లెక్స్‌ ను నిర్మించిన సంగతి తెలిసిందే.

Related Posts

Comments

spot_img

Recent Stories