పండంటి మగబిడ్డకు జన్మనిచ్చిన బాలీవుడ్‌ ముద్దుగుమ్మ!

ప్రముఖ బాలీవుడ్‌ హీరోయిన్‌ యామి గౌతమ్ గురించి పెద్దగా పరిచయం అక్కర్లేదు. ఫెయిర్ అండ్ లవ్లీ యాడ్ తో తెలుగు వారికి కూడా ఈ ముద్దుగుమ్మ పరిచయమే. యామి తెలుగుతో పాటు, బాలీవుడ్‌ లో కూడా  పలు సినిమాల్లో నటించింది.. తెలుగులో రెండు సినిమాల్లో నటించింది. అవి అనుకున్న హిట్ టాక్ ను అందుకోలేదు. దాంతో ఈ ముద్దుగుమ్మ బాలీవుడ్  లో సెటిల్‌ అయిపోయింది.

ఈ భామ కొద్ది రోజుల క్రితమే పెళ్లి చేసుకున్న సంగతి తెలిసిందే. తాజాగా ఈ అమ్మడు పండంటి మగ బిడ్డకు జన్మనిచ్చింది. సోషల్ మీడియా ద్వారా ఈ విషయాన్ని షేర్ చేశారు. యామీ గౌతమ్, దర్శకుడు ఆదిత్య ధర్‌ దంపతులు తమ మొదటి బిడ్డకు తల్లిదండ్రులయ్యారు. ఈ విషయాన్ని స్వయంగా ఆదిత్య తన సోషల్ మీడియా ద్వారా తెలియజేశారు. మే 20న ఈ జంట ఇన్‌స్టాగ్రామ్‌లో క్యూట్ నోట్‌తో ఈ విషయాన్ని ప్రకటించారు.

 అంతేకాదు ఆ పిల్లాడికి వేదవిద్ అనే పేరు కూడా పెట్టినట్లు తెలుస్తుంది.. ఈ పోస్ట్ చూసిన సెలెబ్రేటీలు సోషల్ మీడియా ద్వారా ఇద్దరికీ శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. దర్శకుడు ఆదిత్య ధర్ ను యామి గౌతమ్ ప్రేమించి పెళ్లాడింది. 2021 జూన్ 4న హిమాచల్ ప్రదేశ్‌లో ఈ జంట వివాహం చేసుకున్నారు.. ఆర్టికల్ 370 సినిమా అనంతరం ఆమె ప్రెగ్నెన్సీని ప్రకటించారు. 

Related Posts

Comments

spot_img

Recent Stories