త్రిపాత్రాభినయం చేయబోతున్న బాలీవుడ్‌ ఫైర్‌ బ్రాండ్‌!

బాలీవుడ్ ఫైర్ బ్రాండ్ ‘కంగనా రనౌత్’ ఏదోక వివాదాస్పద విషయాలతో ఘాటైన వ్యాఖ్యలతో ఎప్పుడూ వార్తల్లో నిలుస్తూనే ఉంటుంది. అయితే, ‘కంగనా రనౌత్’ సినీ కెరీర్ లో ‘తను వెడ్స్‌ మను’ చిత్రం స్పెషల్ గా నిలుస్తుంది. బాలీవుడ్‌ ప్రేక్షకులను ఈ సినిమా ఆ స్థాయిలో ఆకట్టుకుంది. ఈ రొమాంటిక్‌ కామెడీ డ్రామాలో కంగనా రనౌత్, ఆర్‌.మాధవన్‌ సూపర్‌ గా నటించి అందర్ని మెప్పించారు.

అయితే, ఆనంద్‌ ఎల్‌ రాయ్‌ తెరకెక్కించిన ఈ సినిమాకి సీక్వెల్‌గా వచ్చిన ‘తను వెడ్స్‌ మను రిటర్న్స్‌’ కూడా సూపర్ హిట్ అందుకుంది.
దీంతో, ఇప్పుడు ‘తను వెడ్స్‌ మను’ మూడో పార్ట్ పై అందరూ ఎంతో ఆతృతగా ఎదురుచూస్తున్నారు. ఇటీవలే ఈ సిరీస్‌లో ‘తను వెడ్స్‌ మను 3’ను తెరకెక్కించడానికి సన్నాహాలు చేస్తున్నట్లు డైరెక్టర్‌ కూడా ఓ క్లారిటీ అయితే అభిమానుల ముందుకు తీసుకుని వచ్చారు.

ఈ మూడో పార్ట్ లో కంగనా త్రిపాత్రాభినయం చేయబోతుందట. ‘కంగనా తొలిసారి తన కెరీర్‌లో మూడు భిన్నమైన పాత్రల్లో కనిపించబోతుందని తెలుస్తుంది. పైగా ఆమె ఇప్పుడు బీజేపీ ఎంపీ కూడా. అందుకే, ఈ మధ్య ‘కంగనా రనౌత్’ కి క్రేజ్ మరి కొంత పెరిగింది. ఈ నేపథ్యంలోనే కంగనా త్రిపాత్రాభినయం వార్త బాలీవుడ్ లో వైరల్‌ అవుతుంది.

Related Posts

Comments

spot_img

Recent Stories