పుష్ప రాజ్‌ తో క్యూట్ ఫొటో పోస్ట్‌ చేసిన బొద్దుగుమ్మ!

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ప్రస్తుతం ఓ భారీ స్థాయిలో తెరకెక్కుతున్న పాన్ ఇండియా సినిమాతో బిజీగా ఉన్నారు. ఈ ప్రాజెక్ట్‌కు తమిళ హిట్ డైరెక్టర్ అట్లీ దర్శకత్వం వహిస్తున్నారు. ఇంతవరకు అల్లు అర్జున్ ఎలాంటి స్టోరీలతో కనిపించలేదో, ఇప్పుడు ఆ రేంజ్‌ను దాటి మరింత స్టైలిష్‌గా, ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్‌తో ఈ సినిమా రూపొందుతోంది. ఈ సినిమా ప్రారంభమైన తరువాతే అల్లు అర్జున్‌కు గద్దర్ అవార్డు లభించింది. ఇదే అవార్డ్స్ ఫంక్షన్‌కు యువ నటి నివేతా థామస్ కూడా హాజరయ్యింది.

నివేత గతేడాది ‘35 చిన్న కథ కాదు’ అనే చిత్రంతో ఆకట్టుకున్నారు. చిన్న సినిమాగా వచ్చినా ఆ మూవీకి మంచి స్పందన వచ్చింది. గద్దర్ అవార్డ్స్ వేడుక సందర్భంగా అల్లు అర్జున్‌తో కలిసి ఒక ఫొటో తీసుకుని, సోషల్ మీడియా ద్వారా షేర్ చేశారు నివేత. ఆ ఫొటోలో ఇద్దరూ ఎంతో గ్రేస్‌ఫుల్‌గా కనిపించగా, ఆమె ఇచ్చిన క్యాప్షన్ “సరస్వతి అండ్ పుష్ప” అని ఉండడం ఆసక్తికరంగా మారింది. దీంతో ఆ ఫోటో వెంటనే వైరల్ అయింది.

ప్రస్తుతం నివేత థామస్ కొత్తగా ఏ సినిమాలోనూ నలుగురికి తెలిసే విధంగా సైన్ చేసినట్టు సమాచారం లేదు. అయితే త్వరలోనే ఆమె నుంచి కొత్త ప్రాజెక్టులపై క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. అటు అల్లు అర్జున్ సినిమా విషయంలో కూడా మరిన్ని అప్‌డేట్స్ కోసం అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

Related Posts

Comments

spot_img

Recent Stories