Home Blog Page 960

చరణ్‌ సినిమా మరో నెల వాయిదా?

గ్లోబల్‌ స్టార్‌ రామ్‌ చరణ్‌ హీరోగా, బాలీవుడ్ బ్యూటీ కియారా అద్వానీ కథానాయికగా , స్టార్‌ డైరెక్టర్ శంకర్‌ దర్శకత్వంలో తెరకెక్కుతున్న పొలిటికలర్ యాక్షన్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌ గేమ్‌ ఛేంజర్‌. ఈ సినిమాని దిల్‌ రాజు ఎంతో ప్రతిష్మాత్మకంగా నిర్మిస్తుండగా.. ఈ సినిమాకి సంగీతం తమన్‌ అందిస్తున్నారు.

ఈ సినిమా చివరి దశ షూటింగ్‌ జరుపుకుంటున్నట్లు సమాచారం. ఈ సినిమాని అక్టోబర్ లో  విడుదల చేస్తామని  ఇప్పటికే చరణ్, దిల్ రాజు పలు సందర్భాల్లో పేర్కొన్నారు. అయితే విషయం ఏమిటంటే, తాజాగా గేమ్ ఛేంజర్ తో పాటు పుష్ప 2, దేవర, కల్కి 2898 ఏడి మూవీస్  నార్త్ రైట్స్ ని అనిల్ తడానీ దక్కించుకున్నారు.

 ప్రముఖ హిందీ క్రిటిక్ అండ్ అనలిస్ట్ తరణ్ ఆదర్శ్ తన ట్విట్టర్ లో ఆ విషయం గురించి ఓ పోస్ట్ పెట్టారు. ఆ పోస్ట్‌  లో గేమ్ ఛేంజర్ రిలీజ్ ని నవంబర్ అని ఆయన పేర్కొన్నారు.  దీంతో ఈ  మూవీ విడుదల మరొ నెల వాయిదా పడిందనే అనుమానం అందరిలో మొదలైంది. అయితే పక్కాగా గేమ్ ఛేంజర్ రిలీజ్ పై క్లారిటీ రావాల్సి అంటే మేకర్స్ నుండి అఫీషియల్ కన్ఫర్మేషన్ వచ్చే వరకు ఎదురు చూడాల్సిందే.

ఆ రోజు తారక్‌ అభిమానులకు ట్రిపుల్‌ బొనాంజా!

యంగ్‌ టైగర్‌ ఎన్టీఆర్ హీరోగా , స్టార్‌ డైరెక్టర్‌  కొరటాల శివ దర్శకత్వంలో దేవర పార్ట్ 1 మూవీ షూటింగ్ జరుగుతున్న విషయం తెలిసిందే. ఈ సినిమాలో బాలీవుడ్‌ భామ జాన్వీ కపూర్‌ హీరోయిన్‌ గా చేస్తుంది. ఈ సినిమాని ఎన్టీఆర్‌ ఆర్ట్స్‌, యువ సుధా ఆర్ట్స్‌ సంస్థలు గ్రాండ్‌ గా పాన్‌ ఇండియా లెవల్లో నిర్మిస్తున్నాయి.

ఈ సినిమాని దసరా కానుకగా  అక్టోబర్ 10న విడుదల చేయనున్నారు. మరోవైపు తారక్‌ తాజాగా హృతిక్ రోషన్ తో కలిసి అయాన్ ముఖర్జీ తెరకెక్కిస్తున్న వార్ 2 మూవీ కూడా చేస్తున్నారు.  వీటి తరువాత ప్రశాంత్ నీల్ తో మైత్రి మూవీ మేకర్స్ నిర్మించనున్న ప్రతిష్టాత్మక మూవీ చేయనున్నట్లు సమాచారం.

అసలు విషయం ఏంటంటే..  మే 20న ఎన్టీఆర్ బర్త్ డే సందర్భంగా మొత్తం ఈ మూడు సినిమాల నుంచి కూడా మూడు అప్ డేట్స్ రిలీజ్ కానున్నట్లు టాలీవుడ్‌ లో గుసగుసలు వినిపిస్తున్నాయి.  ఆ రోజున వార్ 2 నుండి ఫస్ట్ లుక్, దేవర మొదటి సింగిల్ అప్ డేట్ తో పాటు ప్రశాంత్ నీల్ మూవీకి సంబంధించిన అప్‌డేట్‌ కూడా ఒకటి రానుంది. . ఈ విధంగా ఎన్టీఆర్ బర్త్ డే రోజున ఆయన ఫ్యాన్స్ కి ట్రిపుల్ బొనాంజా ఖాయం అని తెలుస్తుంది.

కడుపుబ్బ నవ్వించడానికి వచ్చేస్తున్న టీచర్‌!

ప్రేక్షకులను ఆద్యంతం కడుపుబ్బ నవ్వించడానికి టీచర్‌ అనే సినిమా తెరెక్కుతోంది. తెలంగాణలోని అంకాపూర్‌ అనే గ్రామానికి చెందిన ముగ్గురు డల్‌ స్టూడెంట్స్ కి సంబంధించిన కథతో ఈ సినిమా రూపుదిద్దుకుంటోంది.  ఈ సినిమాలో టీచర్‌గా కలర్స్ స్వాతి నటిస్తున్నారు. ఎలాంటి అదుపు ఆజ్ఙలు లేకుండా  అల్లరి చేసే ముగ్గురు విద్యార్థులు టీచర్‌ని కలిసిన తర్వాత ఏం జరిగింది? వాళ్ల జీవితాలు ఎలా మారాయి? అనేది ఆకట్టుకునే విధంగా ఉంటుందని మేకర్స్ చెబుతున్నారు.

ఇటీవల 90స్‌- ఎ మిడిల్‌ క్లాస్‌ బయోపిక్‌ తో బ్లాక్‌ బస్టర్‌ అందుకున్న టీమ్‌ నుంచి ఈ సినిమా వస్తుండడంతో సరదా సన్నివేశాలు, సంభాషణలు, అందమైన, అమాయకమైన ప్రేమ, భావోద్వేగాలతో కూడిన ప్రయాణం… ప్రేక్షకుల మనసులను టచ్‌ చేస్తుందనడంలో సందేహం లేదని చెప్పుకొవచ్చు.  90స్‌- ఎ మిడిల్‌ క్లాస్‌ బయోపిక్‌ దర్శకుడు ఆదిత్య హసన్‌ ఈ సినిమాను డైరక్ట్ చేశారు.

నవీన్‌ మేడారం ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ఎంఎన్‌ఓపీ సంస్థ నిర్మిస్తోన్న రెండో ప్రాజెక్ట్ కాగా మొదటి సినిమా ఇది. స్వాతి రెడ్డి , నిఖిల్‌ దేవాదుల , నిత్యశ్రీ , రాజేంద్ర గౌడ్‌, సిద్ధార్థ్‌ , హర్ష, పవన్‌ రమేష్‌, నరేందర్‌ నాగులూరి, సురేష్‌ తదితరులు  ఈసినిమాలో కీలక పాత్రల్లో  నటిస్తున్నారు.  

మీ అందరికీ మాట ఇస్తున్నా…!

ఈ ఏడాది సంక్రాంతికి హనుమాన్‌ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చి భారీ హిట్‌ ని తన ఖాతాలో వేసుకున్నాడు డైరెక్టర్ ప్రశాంత్‌ వర్మ. ఈ సినిమా తరువాత  ప్ర‌శాంత్ సినిమాటిక్‌ యూనివ‌ర్స్‌లో భాగంగా వస్తోన్న తరువాతి చిత్రం జై హ‌నుమాన్ . ఇప్ప‌టికే ఈ చిత్రం షూటింగ్ స్టార్ట్‌ కాగా  తాజాగా  శ్రీరామ‌న‌మి సంద‌ర్భంగా సినిమా నుంచి ఓ ప్ర‌త్యేక పోస్ట‌ర్‌ను ద‌ర్శ‌కుడు ప్ర‌శాంత్ వ‌ర్మ విడుద‌ల చేశారు.

ఇప్పుడు ఈ పోస్ట‌ర్ సోషల్‌ మీడియాలో  విప‌రీతంగా వైర‌ల్ అవుతోంది. ఈ సంద‌ర్భంగా ప్ర‌శాంత్ వ‌ర్మ మాట్లాడుతూ.. ఈ శ్రీరామ నవమి సందర్భంగా ప్రపంచ వ్యాప్తంగా ఉన్న తెలుగు చిత్ర అభిమానులందరికీ మాటిస్తున్నాను. వచ్చే జై హనుమాన్‌ సినిమా ప్రతి ఒక్కరూ కూడా జీవితాంతం గుర్తు పెట్టుకునే మంచి అనుభూతిని అందిస్తానని మాటిస్తున్నట్లు ప్రకటించారు.

ఈ పోస్టుకు హనుమంతుడు రాముల వారికి మాటిచ్చే పోస్టర్‌ ను ట్యాగ్‌ చేశారు.  ఈ సినిమా 2025 సంక్రాంతికి ప్రేక్ష‌కుల ముందుకు రానుండ‌గా టాలీవుడ్ అగ్ర న‌టుడు లీడ్ రోల్‌లో న‌టించ‌నున్నట్లు సమాచారం.

Chandrababu, Pavan, Lokesh Getting Ready To File Nominations

As the crucial filing of nominations begins on Thursday with the Election Commission issuing election notification, key leaders of TDP and Jana Sena are getting ready to file their nomination papers. TDP chief and former chief minister N Chandrababu Naidu, Jana Sena chief Pawan Kalyan and TDP general secretary Nara Lokesh announced their schedule of filing nominations.

On the first day itself Nara Lokesh has decided to file his nomination in Mangalagiri on Thursday. He will start a rally from Sitaramula Temple in Mangalagiri at 9 am tomorrow. From there, he will hold a rally through Midde Center, Vaishnavi Kalyanamandapam, Old Bus Stand Center and reach the MTMC Corporation office and file his nomination.

TDP chief Chandrababu Naidu will file nomination for Kuppam assembly seat on Friday (Apr 19th). But instead of him, his wife Nara Bhuvaneshwari is going to file nomination. Party sources said that Bhuvaneshwari will file her nomination on 19th at 12:33 pm.

TDP is making arrangements to file nomination by Bhuvaneshwari with a huge rally. In the morning first she will  worship at the Kuppam temple and then join  a rally and make nominations on behalf of Bhuvaneshwari Chandrababu.

Meanwhile, Pawan Kalyan has handed over B forms to all party candidates, contesting from 2 Lok Sabha seats and 2 Assembly seats in the state, including for himself. First he gave B form to party senior leader Nadendla Manohar. He also performed oaths for all the candidates. However, Jaya Krishna, Palakonda candidate was unable to be present due to personal reasons.

Jana Sena sources said that Pawan Kalyan will file his nomination in Pithapuram on 22nd of the month. It seems that TDP leader Chandrababu is likely to attend this event. Top BJP leaders will come to AP for an election campaign in the first week of next month. It is reported that Prime Minister Modi will participate in both meetings. Similarly Chandrababu – Pawan will continue their election campaign along with Amit Shah and Nadda. The manifesto is being worked on.

NDA-Led BJP Not Going To Cross 150-Seat Mark, Predicts Rahul

With the campaigning for the first phase of Lok Sabha elections ending on Wednesday, Congress former president Rahul Gandhi and Samajwadi Party chief Akhilesh Yadav asserted that the NDA-led BJP is not going to cross 150-seat mark in the upcoming elections.

Rahul Gandhi said, “I do not do prediction of seats. 15-20 days ago I was thinking BJP would win around 180 seats but now I think they will get 150 seats. We are getting reports from every state that we are improving. We have a very strong alliance in Uttar Pradesh and we will perform very well…”

Criticising the now-scrapped electoral bonds, Gandhi said the prime minister claims that the scheme was brought to bring transparency in poll funding but then why was it struck down by the Supreme Court.

“The electoral bonds scheme is the biggest extortion scheme in the world. India’s businessmen know it very well. No matter how much the prime minister clarifies, it will have no impact because the entire nation knows that the prime minister is the champion of corruption,” he added.

When asked whether he will contest the Lok Sabha elections from Amethi or Raebareli, Congress leader Rahul Gandhi said, “This is BJP’s question, very good. Whatever order I will get, I will follow it. In our party, all these (selections of candidates) decisions are taken by the CEC.”

Talking to the same tune, Akhilesh Yadav said, “I am happy that Congress leader Rahul Gandhi and the Samajwadi Party are doing a press conference together…Today, we are in Ghaziabad and this time INDIA alliance will wipe out BJP from Ghaziabad to Ghazipur. Today, farmers are upset as all the promises of BJP turned out to be fake…”

“…’Electoral bond ne inka band baja diya…BJP sabhi bhrashtachiroya ka godaam ban gayi’…They are not only taking corrupts (in their party) but also keeping the money earned by the corrupts..,” added Yadav.

ఆదిశక్తిగా మలయాళ భామ!

మలయాళ నటి సంయుక్త మీనన్‌ ప్రస్తుతం తెలుగు, తమిళం, మలయాళ చిత్రాలతో ఫుల్‌ బిజీగా ఉంది. భాషతో సంబంధం లేకుండా సినిమాలు చేస్తూ దూసుకుపోతుంది. నాలుగు రోజుల క్రితం ఆమెకు బాలీవుడ్‌ నుంచి కూడా పిలుపు వచ్చింది. అందుకే ఆమె ముంబైకి కూడా వెళ్లినట్లు సమాచారం.

అయితే ఆ విషయం గురించి పక్కన పెడితే.. తాజాగా ఆమె తీసుకున్న ఓ నిర్ణయం గురించి ఆమె మీద ప్రశంసలు కురుస్తున్నాయి. అది ఏంటంటే…నిస్సహాయులైన మహిళలకు అండగా ఉండేందుకు సంయుక్త ముందుకు వచ్చింది. సమాజంలో ఎలాంటి బ్యాక్ గ్రౌండ్ లేక అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్న మహిళలకు,  వారు ఎదుర్కొంటున్న సమస్యలకు తన వంతు పరిష్కారం సూచించేందుకు, సహాయం అందించేందుకు ఆమె ఒక అడుగు ముందుకు వేసి  శ్రీరామనవమి సందర్భంగా ఆదిశక్తి అనే ఒక సేవా సంస్థను స్థాపిస్తున్నట్లు ప్రకటించింది.

ఈ సంస్థ ద్వారా మహిళలకు అనేక రంగాల్లో సహకారం అందించడానికి తాను సిద్ధంగా ఉన్నానని, ఆమె ప్రకటించింది. మగవారితో సమానంగా మహిళలకు కూడా అవకాశాలు ఇస్తే, వారు కూడా అభివృద్ధి పథంలో నడుస్తారని, అలాంటి వారిని అభివృద్ధి పథంలో నడపాలనే లక్ష్యంతో ఈ ఆదిశక్తి సంస్థను స్థాపించినట్లు సంయుక్త వివరించింది.

 సమాజంలో ఉన్న అన్ని వయసుల మహిళలకు ఈ సంస్థ ద్వారా చేయూత  అందిస్తామని, విద్యా, ఉపాధి, శిక్షణ ఆరోగ్యం వంటి విషయాలలో మహిళలకు అండగా నిలుస్తామని చెబుతున్నారు. మహిళలు సైతం ఆత్మగౌరవంతో జీవించాలని, అన్ని రంగాల్లో తమ గొంతు వినిపించాలనేది తమ ఆదిశక్తి సంస్థ ఉద్దేశం అని సంయుక్త ఒక ప్రకటనలో పేర్కొంది.

సిద్దార్థ్‌ కు పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలిపిన భారతీయుడు 2 టీమ్‌!

లోక నాయకుడు కమల్‌ హాసన్‌ నటిస్తున్న మోస్ట్‌ అవైటెడ్‌ చిత్రం భారతీయుడు 2… స్టార్‌ డైరెక్టర్‌ శంకర్‌ ఈ సినిమాను తెరకెక్కిస్తున్న విషయం తెలిసిందే.  ఈ సినిమాని లైకా ప్రొడక్షన్స్‌, రెడ్‌ జెయింట్‌ బ్యానర్‌ పై సుభాస్కరన్‌ నిర్మిస్తున్న భారీ బడ్జెట్‌ చిత్రమిది. శంకర్‌, కమల్‌ కాంబినేషన్‌ లో గతంలో వచ్చిన భారతీయుడు సినిమాకి ఈ సినిమాకి సీక్వెల్ గా రాబోతుంది.

అప్పట్లో భారతీయుడు సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద ఎన్నో రికార్డులు క్రియేట్‌ చేసింది. ఆ విషయం అందరికీ తెలిసిందే. తాజాగా ఆ సినిమాకి సీక్వెల్ తెరకెక్కుతుండటంతో ప్రేక్షకులలో సినిమాపై ఆసక్తి పెరిగింది . అవినీతికి వ్యతిరేకంగా పోరాడే సేనాపతిగా కమల్ హాసన్ మరోసారి తన విశ్వరూపం చూపించడానికి రెడీ అయ్యారు. ఎన్నో అడ్డంకులను అధిగమించి షూటింగ్ పూర్తి చేసుకున్న భారతీయుడు సినిమాను తాజాగా జూన్ నెలలో థియేటర్లలోకి విడుదల చేస్తామని చిత్ర బృందం ఇటీవల ప్రకటించింది.

దీనికి సంబంధించిన పోస్టర్‌ను కూడా విడుదల చేశారు.ఈ పోస్టర్‌ లో తెల్లటి ధోతి,  కుర్తాలో కమల్ హాసన్ కనిపించారు. ఈ చిత్రంలో సిద్ధార్థ్‌, కాజల్ అగర్వాల్‌, రకుల్ ప్రీత్ సింగ్, ప్రియా భవానీ శంకర్‌, ఎస్‌.జె.సూర్య ,  బాబీ సింహ  ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు. ఈ చిత్రానికి యంగ్ మ్యూజిక్ సెన్సేషన్ అనిరుద్ సంగీతం అందిస్తున్నారు .

ఇదిలా ఉంటే నేడు హీరో సిద్దార్థ్ పుట్టినరోజు .ఈ సందర్భంగా చిత్ర యూనిట్ సిద్దార్థ్ ఫస్ట్‌ లుక్ ను విడుదల చేసింది . మీ వైవిధ్యభరితమైన పాత్రలు ,  కాలాతీత ఆకర్షణ అందరినీ ఆకర్షిస్తూనే ఉన్నాయి.. ఇదిగో మీ ప్రయాణంలో మరో ఏడాది విజయం అంటూ భారతీయుడు టీం సిద్ధార్థ్ కు బర్త్డే విషెస్ తెలియజేసింది .

ఇది కదా కావాల్సింది..గూస్‌బంప్స్‌ అంతే!

చియాన్‌ విక్రమ్‌ నటిస్తున్న పీరియాడిక్‌ యాక్షన్‌ సినిమా తంగలాన్‌….ఈ సినిమాని ప్రముఖ డైరెక్టర్‌ పా రంజిత్‌ తెరకెక్కిస్తున్న విషయం తెలిసిందే. ఈ సినిమాని జ్ఙానవేల్‌ రాజా స్టూడియో గ్రీన్‌, జియో స్టూడియోస్‌ బ్యానర్స్‌ పై నిర్మిస్తున్నారు. ఈ చిత్రం నుంచి ఓ స్పెషల్‌ గ్లింప్స్‌ ని విడుదల చేశారు.

బుధవారం చియాన్ విక్రమ్ పుట్టినరోజు సందర్భంగా ఆయనకు బర్త్ డే విశెస్ చెబుతూ “తంగలాన్” సినిమా నుంచి స్పెషల్ గ్లింప్స్ రిలీజ్ చేయగా సినిమా కోసం విక్రమ్ ఎంతగా కష్టపడ్డాడో ఈ గ్లింప్స్ చూస్తే తెలుస్తుంది.  విక్రమ్ ఎలా తన పర్ ఫార్మెన్స్, స్క్రీన్ ప్రెజెన్స్ తో ఎలా మెస్మరైజ్ చేయబోతున్నాడో ఈ ఒక్క వీడియోతో తెలిసిపోతుంది.  “తంగలాన్” సినిమా కోసం విక్రమ్ మారిపోయిన తీరు ప్రతి ఒక్కరినీ ఆశ్చర్యపరుస్తోంది.

తాజాగా విడుదలైన గ్లింప్స్ సందర్భంగా దర్శకుడు పా రంజిత్ మాట్లాడుతూ – “తంగలాన్” సినిమాను చరిత్రలో జరిగిన కొన్ని నిజ ఘటనల ఆధారంగా  తెరకెక్కిస్తున్నట్లు పేర్కొన్నారు. ఆ అడ్వెంచర్ స్టోరీని రూపొందించడంలో హీరో విక్రమ్ తో పాటు చిత్ర బృందం నాకు ఎంతో సపోర్ట్ చేసిందని, జియో స్టూడియోస్ “తంగలాన్” మూవీ కోసం స్టూడియో గ్రీన్ తో చేతులు కలపడం సంతోషంగా ఉందని పేర్కొన్నారు.

జియో స్టూడియోస్ రాకతో మా సినిమా గ్లోబల్ ఆడియెన్స్ కు మరింతగా రీచ్ అవుతుందని ఆశిస్తున్నా, హీరో విక్రమ్ “తంగలాన్” సినిమా కోసం ఎంతగా కష్టపడ్డారో ఈ గ్లింప్స్ మీకు చూపిస్తుందన్నారు. “తంగలాన్” సినిమాలో పార్వతి తిరువొతు, మాళవిక మోహనన్ హీరోయిన్లుగా నటిస్తున్నారు.

వార్‌ 2 నుంచి ఎన్టీఆర్‌..హృతిక్‌ ఫొటోలు వైరల్‌!

యంగ్‌ టైగర్‌ ఎన్టీఆర్, బాలీవుడ్‌ స్టార్‌ హీరో హృతిక్‌ రోషన్‌ కాంబోలో రాబోతున్న మోస్ట్‌ అవైటెడ్ చిత్రం వార్‌ 2. ఈ సినిమాని బాలీవుడ్‌ డైరెక్టర్‌ అయాన్‌ ముఖర్జీ దర్శకత్వం వహిస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాని యశ్‌ రాజ్‌ ఫిలిమ్స్‌ , స్పై సినిమాటిక్‌ యూనివర్స్‌ లో భాగంగా వార్‌ 2 రూపుదిద్దుకుటుంది.

ఇప్పటికే ఈ చిత్రం షూటింగ్‌ మొదలు అయ్యింది. కొద్ది రోజుల క్రితం ఈ షూటింగ్ లో జూనియర్‌ ఎన్టీఆర్‌ కూడా జాయిన్‌ అయిన సంగతి తెలిసిందే. ఈ షెడ్యూల్‌ లో ఎన్టీఆర్‌, హృతిక్‌ కాంబోలో వచ్చే సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు. తాజాగా  ఈ షూటింగ్ సెట్స్ నుంచి రెండు ఫొటోలు లీక్ అయ్యాయి. ఆ పిక్స్ లో హృతిక్ అండ్ ఎన్టీఆర్ కనిపిస్తున్నారు.

హృతిక్ బులెట్ జాకెట్ ధరించి టీ తాగుతూ కనిపిస్తుంటే.. ఎన్టీఆర్ బ్లాక్ టీ-షర్ట్ లో నడుస్తూ ఉన్నారు. ప్రస్తుతం ఈ లీక్డ్ పిక్స్ నెట్టింట బాగా వైరల్ అవుతున్నాయి . ప్రస్తుతం ఎన్టీఆర్,హృతిక్ మధ్య యాక్షన్ సీన్స్ చిత్రీకరిస్తున్నట్లు సమాచారం .ఇదిలా ఉంటే ఈ లీక్డ్ పిక్స్ షేర్ చేస్తూ ఫ్యాన్స్ నెట్టింట తెగ సందడి చేస్తున్నారు. ఇదిలా ఉంటే ఈ చిత్రంలో ఎన్టీఆర్ రా ఏజెంట్ గా కనిపించబోతున్న సంగతి తెలిసిందే.

ఈ మూవీలో ఎన్టీఆర్ పాత్ర నిడివి తక్కువ సమయమే ఉంటుందన్న విషయం తెలిసిందే. వార్ 2 లో ఎన్టీఆర్ పాత్రకి సంబంధించిన సీన్స్ చిత్రీకరించడం కోసం ఎన్టీఆర్ 60 రోజుల డేట్స్ ని కేటాయించారని సమాచారం.