Home Blog Page 921

పవన్ గుడ్ డెసిషన్ : తెదేపా సీనియర్ కు నో టెన్షన్!

తెలుగుదేశం పార్టీలో అత్యంత సీనియర్ నాయకుల్లో ఒకరైన గోరంట్ల బుచ్చయ్య చౌదరికి సీటు గురించిన ఒక టెన్షన్ తీరిపోయింది. 2019 ఎన్నికల్లో రాష్ట్రవ్యాప్తంగా వైఎస్సార్ కాంగ్రెస్ గణనీయమైన బలం చూపించినప్పటికీ.. దానికి ఎదురొడ్డి గెలుచుకున్న రాజమండ్రి రూరల్ సీటు.. అయిదేళ్లు గడిచేసరికి తనకు కాకుండా పోతుందా అనే భయం ఆయనను వీడిపోయింది. తెలుగుదేశం గత ఎన్నికల్లో గెలుచుకున్న సిటింగు సీట్లను కూడా జనసేన పొత్తుల్లో భాగంగా అడగడం ద్వారా రాజకీయ ధర్మం మీరి వ్యవహరిస్తున్నదనే చెడ్డపేరు లేకుండాపోయింది. గతంలో గెలిచిన సిటింగ్ సీట్లను కూడా పొత్తు కోసం పణంగా పెట్టేస్తూ.. తెలుగుదేశం సొంత పార్టీనేతలకు అన్యాయం చేస్తున్నదనే మాట రాకుండా పోయింది. అవును- ఈ పరిణామాలు అన్నీ కూడా జనసేనాని పవన్ కల్యాణ్ తీసుకున్న ఒకే ఒక్క నిర్ణయం ద్వారా సాధ్యం అయ్యాయి. ఇంతకూ ఆ నిర్ణయం ఏంటో తెలుసా- జనసేన పార్టీకి గోదావరి జిల్లాల్లో కీలక నాయకుడు కందుల దుర్గేష్ ను నిడదవోలు నుంచి ఎమ్మెల్యేగా బరిలోకి దించుతున్నట్టుగా అభ్యర్థిత్వాన్ని ప్రకటించడం.
అవును- కందుల దుర్గేష్ కు నిడదవోలు కేటాయించడం ద్వారా ఇరు పార్టీల పొత్తుల్లో ఏర్పడిన ఒక ప్రతిష్ఠంభన తొలగిపోయింది. కందుల దుర్గేష్ రాజమండ్రి రూరల్ నుంచి ఎమ్మెల్యే అభ్యర్థిత్వాన్ని ఆశించారు. అయితే అక్కడినుంచి 2019లో గోరంట్ల బుచ్చయ్య చౌదరి గెలిచారు. ఎంతో సీనియర్ అయిన ఆయన రాజకీయ రిటైర్మెంట్ కోరుకుని ఉంటే పరిస్థితి ఎలా ఉండేదో తెలియదు గానీ.. ఆయన కూడా కొనసాగాలనుకున్నారు. ఈలోగా నియోజకవర్గంనుంచి పోటీచేయబోయేది నేనే నని దుర్గేష్ తనంత తాను ప్రకటించుకోవడం, అలా ప్రకటించుకోవడానికి ఆయన ఎవరు అని గోరంట్ల కోప్పడడం జరిగింది. ప్రతిష్ఠంభన ముదిరింది.
పవన్ కల్యాణ్ హఠాత్తుగా ఈ గొడవకు తెరదించేశారు.  ఈ రెండు పార్టీల నాయకుల మధ్య మనస్పర్ధలు ఇంకా ఒక్కరోజు కూడా కొనసాగడం తనకు ఇష్టం లేదన్నట్టుగా కందుల దుర్గేష్ ను నిడదవోలు అభ్యర్థిగా ప్రకటిస్తూ.. ఒకే ఒక సీటు గురించిన వివరంతో పత్రికాప్రకటన విడుదల చేశారు. దీంతో సమస్య సమసిపోయింది.
తొలిజాబితాలో తెలుగుదేశం 94, జనసేన 5 సీట్లకు అభ్యర్థులను ప్రకటించాయి. మిగిలిన 76 సీట్లను పార్టీల మద్య పంచుకోవడానికి చంద్రబాబు ఉండవిల్లి నివాసంలో మూడు పార్టీల నాయకుల మధ్య భేటీ కూడా ప్రారంభం అయింది. ఒకటిరెండు రోజుల్లో ఆ పంపకాలు తేలితే.. ఆ తర్వాత మూడు పార్టీల జాబితాలు బయటకు వస్తాయని అందరూ అనుకుంటున్నారు. అయితే.. రాజమండ్రి రూరల్ ప్రతిష్ఠంభన కొనసాగడం ఏమాత్రం ఇష్టం లేని పవన్ కల్యాణ్.. కందుల దుర్గేష్ ను నిడదవోలుకు పంపుతూ ఒకే సీటు అభ్యర్థిత్వాన్ని ప్రకటించారు. పవన్ మంచి నిర్ణయం తీసుకున్నారని.. ఇక నిడదవోలు లోని నాయకుల్ని బుజ్జగించి జనసేనకు సహకరించేలా చేయడం చంద్రబాబు బాధ్యత అని ప్రజలు భావిస్తున్నారు. 

ReplyForwardAdd reaction

వామ్మో బన్నీ తో సినిమా చేయడానికి ఆ దర్శకుడు అంత అడుగుతున్నాడా!

Inbox

రాజారాణి సినిమాతో దర్శకుడిగా మారాడు అట్లీ…. మొదటి సినిమానే సూపర్ హిట్‌ కావడంతో రెండో సినిమానే విజయ్ ని డైరెక్ట్‌ చేసే ఛాన్స్ కొట్టేశాడు. అలా తెరి సినిమా చేసి హిట్‌ కొట్టి , ఆ తరువాత మెర్సల్, బిగిల్‌ వంటి సినిమాలు చేసి వరుస హిట్లు అందుకున్నాడు. ఇలా ఉండగానే షారూక్‌ ఖాన్‌ తో జవాన్‌ అనే సినిమా చేసి పాన్‌ ఇండియా లెవల్లో తన పేరు మారుమ్రోగేలా చేసుకున్నాడు.

చేసినవి తక్కువ సినిమాలే అయినా.. హిట్ల మీద హిట్లు అందుకోవడంతో కోలీవుడ్ లో అతి తక్కువ టైమ్‌ లోనే పెద్ద దర్శకుల చెంత కుర్చీ వేసుకుని మరీ కూర్చున్నాడు. ఈ సమయంలో అల్లు అర్జున్‌, పుష్ప 2 తరువాత త్రివిక్రమ్ తో కలిసి సినిమా చేయాల్సి ఉన్నప్పటికీ జవాన్‌ విజయం సాధించడంతో బన్నీ అట్లీతో సినిమా చేసేందుకు రెడీ అయ్యారు.

ఇప్పటికే వీరి ప్రాజెక్ట్‌ కి సంబంధించిన చర్చలు ఎప్పుడో పూర్తయ్యాయి. అల్లు అర్జున్‌ ప్రస్తుతం పుష్ప 2 షూటింగ్‌ లో ఉన్నాడు. ఆ షూటింగ్‌ పూర్తి కాగానే అట్లీ తో చేసే సినిమా షూటింగ్‌ లో పాల్గొనేందుకు బన్నీ రెడీ గా ఉన్నాడు. ఈ సినిమాకు సంబంధించిన ప్రీ ప్రొడక్షన్‌ పనులు కూడా చూసుకుంటూ అట్లీ బిజీగా ఉన్నాడు.

వచ్చే నెలలో అల్లు అర్జున్‌ పుట్టిన రోజు నాడు ఈ సినిమా గురించి అధికారిక ప్రకటను వెలువడే అవకాశం ఉన్నట్లు సమాచారం. ఇక్కడ వరకు అంతా మంచిగానే ఉంది. ఈ సినిమా చేసేందుకు అట్లీ డిమాండ్ రెమ్యూనరేషన్‌ గురించి ఇప్పుడు టాలీవుడ్ లో పెద్ద హాట్‌ టాపిక్‌ అయ్యింది. ఎందుకంటే అట్లీ డిమాండ్‌ చేస్తుంది ఏమి చిన్న చితకా అమౌంట్‌ కాదు… సుమారు 60 కోట్ల రెమ్యునరేషన్‌ అలాగే సినిమా లాభాల్లో కొంత వాటాను కూడా డిమాండ్‌ చేస్తున్నడట.

మరి అట్లీ మార్కెట్‌ అలా ఉంది. ఆయన సినిమాల రికార్డు చూస్తే ఆయన డిమాండ్ కూడా న్యాయంగానే అనిపిస్తుంది. ఇప్పుడు బన్నీ కూడా 120 కోట్ల భారీ రెమ్యునరేషన్ ను డిమాండ్‌ చేస్తున్నాడు. అట్లీ కి నేషనల్‌ వైడ్‌ మార్కెట్‌ ఉండడంతో అతను చేస్తున్న డిమాండ్‌ పెద్ద విషయం కాదని తెలుస్తోంది.

Search for all messages with label Inbox

Remove label Inbox from this conversation

టిల్లు ప్రేమాయణం నడిపేది ఆ స్టార్‌ హీరోయిన్‌ తోనా?

Inbox

టాలీవుడ్ లో మోస్ట్ ఎలిజిబుల్‌ బ్యాచిలర్స్‌ అందరూ కూడా పెళ్లి పీటలెక్కుతున్నారు. తాజాగా యువ హీరో కిరణ్‌ అబ్బవరం నిశ్చితార్థం చేసుకోబోతున్నట్లు ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ బాటలోనే ఇప్పుడు డీజే టిల్లు… సిద్దు జొన్నలగడ్డ కూడా ప్రయాణిస్తున్నట్లు తెలుస్తుంది. ఈ విషయం గురించి స్వయంగా టిల్లు తమ్ముడే వెల్లడించాడు.

బబుల్ గం సినిమాతో టిల్లు సోదరుడు చైతు జొన్నలగడ్డ మంచి పేరు సంపాదించుకున్నాడు. తాజాగా ఆయన ఓ యూట్యూబ్‌ ఛానెల్ ఇంటర్వ్యూలో పాల్గొన్నాడు.  ఈ క్రమంలో యాంకర్‌ సిద్దు జొన్నలగడ్డ గురించి కొన్ని ప్రశ్నలు అడిగింది. ఆ ప్రశ్నలలోనే సిద్దు పెళ్లి ప్రస్తావన కూడా వచ్చింది.

సిద్దు చాలా కాలం నుంచి ఓ స్టార్‌ హీరోయిన్‌ తో ప్రేమలో ఉన్నట్లు ఇండస్ట్రీలో టాక్‌ వినిపిస్తుంది. అది నిజమేనా అని ప్రశ్నించారు. అంతేకాకుండా వచ్చే ఏడాదే ఆ హీరోయిన్‌ తో వివాహం కూడా జరగనున్నట్లు సమాచారం వస్తుందని, ఆమె ఎవరూ అంటూ యాంకర్‌ పలు ప్రశ్నలు సంధించాడు. దానికి చైతూ నవ్వుతూ.. స్టార్‌ హీరోయిన్‌ ని చేసుకుంటే ఎలాంటి ప్రాబ్లం లేదు కానీ… స్టార్‌ హీరోను చేసుకుంటేనే ప్లాబ్లం అంటూ నవ్వేశాడు.

అయితే స్టార్‌ హీరోయిన్‌ నే చేసుకుంటాడో లేదో అంతగా తెలియదు కానీ.. వచ్చే ఏడాది మాత్రం అతను పెళ్లి చేసుకునే ఉద్దేశం అయితే ఉందని చైతూ తెలిపాడు. సమయానికి అన్ని కుదిరితే జరిగిపోవచ్చని చైతూ వివరించాడు.

Search for all messages with label Inbox

Remove label Inbox from this conversation

నాకు ఈ మధ్య ఆ పిచ్చి ఎక్కువ అయ్యింది: మెగా డాటర్‌ నిహారిక

మెగా ఫ్యామిలీ నుంచి హీరోలు మాత్రమే కాకుండా హీరోయిన్‌ గా ఎంట్రీ ఇచ్చింది. మెగా కుటుంబం నుంచి మొట్టమొదట కథానాయికగా వచ్చిన్నప్పటికీ ఇండస్ట్రీలో నిలబడలేకపోయింది. దీంతో చేసేదేమి లేక పెళ్లి చేసుకుంది. అది కూడా మూణాళ్ల ముచ్చటగానే మిగిలింది. పెళ్లైన మూడు సంవత్సరాలకే విడాకులు ఇచ్చేసింది.

ఆ తరువాత కొంత కాలం ఆమె తన స్నేహితులతో కలిసి రిఫ్రెష్‌ అవ్వడానికి విదేశాలకు చెక్కేసింది. మళ్లీ హీరోయిన్‌ గా ఎంట్రీ ఇచ్చేందుకు నిహారిక సిద్దమైనట్లు తెలుస్తుంది. కొద్ది రోజుల క్రితం నిర్మాతగా ఓ మూవీని స్టార్ట్‌ చేసింది. త్వరలోనే నటిగా కూడా రాబోతున్నట్లు తెలిపింది. తాజాగా నిహారిక  ఆహా యాప్‌ లో ఓ కార్యక్రమానికి యాంకర్‌ గా మారిపోయింది.

చెఫ్‌ మంత్ర సీజన్‌ 3 కి అన్ని తానై చూసుకుంటుంది. అంతర్జాతీయ మహిళా దినోత్సవం రోజున ఈ షో మొదటి ఎపిసోడ్‌ కూడా స్ట్రీమింగ్‌ అయ్యింది. అయితే తాజాగా నిహారిక ఓ ఇంటర్వ్యూలో పాల్గొంది. అందులో తనకి సంబంధించి పలు ఆసక్తికరమైన విషయాలను పంచుకుంది.

ఈ మధ్య కాలంలో నాకు తిండి పిచ్చి ఎక్కువ అయ్యింది. అందులోనూ ముఖ్యంగా పప్పు చారు కనిపిస్తే అసలు విడిచిపెట్టడం లేదు. దాంతో పాటు ప్రయాణాలంటే మరీ ఇష్టం పెరిగిపోయింది. అందుకే సడెన్‌ గా ఎక్కడికి వెళ్లాలి అనిపిస్తే అక్కడికి వెళ్లిపోతున్నాను.ఆ ప్రయాణాలకు అయ్యే ఖర్చు అంతటిని కూడా నేనే కష్టపడి దాచుకుంటున్నాను. నాకు కమర్షియల్‌ సినిమాల్లో యాక్ట్‌ చేయాలని ఉంది.

కానీ ఇప్పటి వరకు ఏ డైరెక్టర్‌ కూడా అలాంటి అవకాశం ఇవ్వలేదు. రానున్న రోజుల్లో అలాంటి పాత్రలు వస్తే మాత్రం కచ్చితంగా చేస్తా అంటూ చెప్పుకొచ్చింది. ఇక చెఫ్‌ మంత్ర షో గురించి చెప్పుకొచ్చింది. ఆ షో కి నాన్నమ్మను, సురేఖ అమ్మను, ఉపాసన వదినను తీసుకురావాలని ఉందని వివరించింది.

నాకు ఆడిషన్స్‌ కు వెళ్లడం అంటే చాలా ఇష్టమని కూడా వివరించింది. కానీ ఇప్పటి వరకు ఏ డైరెక్టర్‌ కూడా నన్ను ఆడిషన్‌ చేయలేదు. ఎందుకంటే నేను పెద్ద కుటుంబం నుంచి రావడమే దానికి కారణం. కానీ ఎవరైనా ఆడిషన్ కి పిలిస్తే మాత్రం కచ్చితంగా ఆడిషన్‌ కి వెళ్తాను అంటూ చెప్పుకొచ్చింది. 

ఆస్కార్స్ 2024: ‘ఓపెన్‌హైమర్’ 7 అవార్డులతో అగ్రస్థానంలో నిలిచింది)

Inbox

Search for all messages with label Inbox

ప్రతిష్టాత్మకమైన మరియు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న 96వ ఆస్కార్ అవార్డులను అకాడెమీ అవార్డ్స్ అని కూడా పిలుస్తారు, ఇది హాలీవుడ్‌లోని ప్రఖ్యాత డాల్బీ థియేటర్‌లో ప్రతి సంవత్సరం చలనచిత్రాలకు వారి సహకారం కోసం ఉత్తమ కళాకారులు మరియు సాంకేతిక నిపుణులను గుర్తించే గౌరవనీయమైన ఈవెంట్. ప్రముఖ టెలివిజన్ హోస్ట్ అయిన జిమ్మీ కిమ్మెల్ ఈ సంవత్సరం కూడా అదే పాత్రలో ఆస్కార్స్‌లో నాల్గవ దశను పూర్తి చేయడానికి ఈవెంట్‌ను భుజానకెత్తుకున్నారు.

ఈ సంవత్సరం, క్రిస్టోఫర్ నోలన్ యొక్క ఎపిక్ ఒపెన్‌హైమర్, ఫాదర్ ఆఫ్ అటామ్ బాంబ్ యొక్క బయోపిక్, ఈవెంట్‌లో ఆధిపత్యం చెలాయించింది, వివిధ విభాగాలలో 7 అవార్డులను గెలుచుకుంది. సిలియన్ మర్ఫీ తన అద్భుతమైన నటనకు ఉత్తమ నటుడి అవార్డును అందుకున్నాడు మరియు డన్‌కిర్క్ కోసం ఓడిపోయిన తర్వాత నోలన్ తన డైరెక్షనల్ స్కిల్స్‌కు మొదటి ఆస్కార్‌ను కైవసం చేసుకోవడంతో చరిత్ర సృష్టించాడు. ఈ చిత్రం ఎడిటింగ్, స్కోర్ మరియు సినిమాటోగ్రఫీ వంటి ఇతర విభాగాలలో కూడా స్ప్లాష్ చేసింది. రాబర్ట్ డౌనీ జూనియర్ ఉత్తమ సహాయ నటుడు అవార్డును గెలుచుకున్నాడు.

లా లా ల్యాండ్‌లో తన నటనకు తన మొదటి ఆస్కార్‌ను గెలుచుకున్న ఎమ్మా స్టోన్, ఆఫ్‌బీట్ పీరియడ్ కామెడీ పూర్ థింగ్స్‌లో తన పాత్రకు తన రెండవ ఆస్కార్‌తో దూరంగా వెళ్లిపోవడంతో ఆశ్చర్యపరిచింది. ఈ చిత్రం ప్రొడక్షన్ డిజైన్, హెయిర్ స్టైలింగ్ మరియు మేకప్ మరియు కాస్ట్యూమ్ డిజైన్ కోసం అవార్డులను కూడా కైవసం చేసుకుంది.

జోనాథన్ గ్లేజర్ యొక్క జర్మన్ మరియు పోలిష్ భాషా హోలోకాస్ట్ డ్రామా ది జోన్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఉత్తమ అంతర్జాతీయ ఫీచర్‌గా ఎంపికైంది, ఈ విభాగంలో గెలిచిన మొట్టమొదటి బ్రిటిష్ చిత్రం. సౌండ్ పరంగా కూడా సినిమా విజయం సాధించింది.

ఓపెన్‌హైమర్‌పై బాక్సాఫీస్ యుద్ధంలో ఆధిపత్యం చెలాయించిన బార్బీ, దాని ఎనిమిది నామినేషన్లలో కేవలం ఒక అవార్డును గెలుచుకుంది, బిల్లీ ఎలిష్ యొక్క వాట్ వాజ్ ఐ మేడ్ ఫర్? కోసం ఉత్తమ ఒరిజినల్ పాట ఆస్కార్‌ని ఇంటికి తీసుకువెళ్లింది. సోదరుడు మరియు సహకారి ఫిన్నియాస్‌తో కలిసి గెలిచిన ఎలిష్, సాయంత్రం వేదికపై పాటను ప్రదర్శించిన తర్వాత నిలబడి ప్రశంసలు అందుకున్నాడు. ఈ జంట గతంలో నో టైమ్ టు డై కోసం గెలిచింది.

ర్యాన్ గోస్లింగ్ తన నామినేటెడ్ పాట ఐ యామ్ జస్ట్ కెన్ అనే డైమండ్-స్టడెడ్ పింక్ సూట్‌లో డ్యాన్స్ చేసే కెన్స్‌తో పాటు సినిమాలోని తారలతో పాటు స్లాష్ నుండి గిటార్ క్యామియోతో కూడా ప్రదర్శించాడు.

ఈ సంవత్సరం ఆస్కార్ అవార్డుల విజేతల జాబితా ఇక్కడ ఉంది:

ఉత్తమ చిత్రం

ఓపెన్‌హైమర్

ఉత్తమ దర్శకుడు

క్రిస్టోఫర్ నోలన్ – ఒపెన్‌హీమర్

ఉత్తమ నటుడు

సిలియన్ మర్ఫీ – ఒపెన్‌హీమర్

ఉత్తమ నటి

ఎమ్మా స్టోన్ – పేద విషయాలు

ఉత్తమ సహాయ నటుడు

రాబర్ట్ డౌనీ జూనియర్ – ఒపెన్‌హైమర్

ఉత్తమ సహాయ నటి

డావిన్ జాయ్ రాండోల్ఫ్ — ది హోల్డోవర్స్

ఉత్తమ అడాప్టెడ్ స్క్రీన్ ప్లే

అమెరికన్ ఫిక్షన్

ఉత్తమ ఒరిజినల్ స్క్రీన్ ప్లే

అనాటమీ ఆఫ్ ఎ ఫాల్

ఉత్తమ సినిమాటోగ్రఫీ

ఓపెన్‌హైమర్

ఉత్తమ ప్రొడక్షన్ డిజైన్

పూర్ థింగ్స్

ఉత్తమ విజువల్ ఎఫెక్ట్స్

గాడ్జిల్లా మైనస్ ఒకటి

ఉత్తమ కాస్ట్యూమ్ డిజైన్

పూర్ థింగ్స్

ఉత్తమ మేకప్ మరియు కేశాలంకరణ

పూర్ థింగ్స్

ఉత్తమ ధ్వని

ఆసక్తి జోన్

బెస్ట్ ఫిల్మ్ ఎడిటింగ్

ఓపెన్‌హైమర్

బెస్ట్ ఒరిజినల్ స్కోర్

ఓపెన్‌హైమర్

బెస్ట్ ఒరిజినల్ సాంగ్

“నేను దేని కోసం తయారు చేసాను” – బార్బీ

ఉత్తమ అంతర్జాతీయ చలనచిత్రం

ఆసక్తి జోన్ (UK)

ఉత్తమ యానిమేటెడ్ ఫీచర్ ఫిల్మ్

ది బాయ్ అండ్ ది హెరాన్

ఉత్తమ యానిమేటెడ్ షార్ట్ ఫిల్మ్

యుద్ధం ముగిసింది! జాన్ మరియు యోకో సంగీతం నుండి ప్రేరణ పొందింది

ఉత్తమ లైవ్-యాక్షన్ షార్ట్ ఫిల్మ్

హెన్రీ షుగర్ యొక్క అద్భుతమైన కథ

ఉత్తమ డాక్యుమెంటరీ షార్ట్ ఫిల్మ్

చివరి మరమ్మతు దుకాణం

ఉత్తమ డాక్యుమెంటరీ ఫీచర్ ఫిల్మ్

మారియుపోల్‌లో 20 రోజులు

Mega heroes Vizag bound for shootings

Mega heroes Ram Charan and Allu Arjun are currently busy shooting for their upcoming films which are in different stages of production. While Pushpa 2, a sequel to Sukumar’s 2021 crime saga Pushpa, is undoubtedly the most eagerly anticipated pan-India film of 2024, Shankar’s political thriller ‘Game Changer’ is also generating immense buzz all over. 

Coincidentally, both Pushpa 2 and Game Changer will be shot in the popular coastal city of South India, Vishakapatnam in the next few days. While Pushpa 2 will be canned for a brief period of a few days, Game Changer will have a massive schedule of 20 days in which important episodes on Ram Charan will be shot by Shankar and his team. 

Allu Arjun landed in Vizag on Sunday and received a roaring welcome from his fans. Sukumar also joined him later in the evening. In the next couple of days, some crucial scenes featuring Bunny will be picturized by the team. Meanwhile, Charan will soon head to the same city this week for a long schedule. Shankar wants to shoot Charan’s flashback episodes in the surroundings of the city. 

While Pushpa 2 is aiming for release on August 15th, Game Changer is yet to lock the date. On the eve of Ram Charan’s birthday this 27th, an official announcement regarding the release date will be out. 

భోజనాలూ లేవ్.. వస్తే రండి.. పోతే పొండి!

0

ఒకవైపేమో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు జగన్ ఒక బహిరంగ సభ నిర్వహిస్తుంటే చాలు.. సభకు హాజరయ్యే ప్రతి ఒక్కరికీ 500 రూపాయల డబ్బు, క్వార్టర్ బాటిల్ మద్యం ఇస్తున్నారు. మహిళలకు ఇతర తాయిలాలు అందిస్తున్నారు. అదే సమయంలో వైఎస్సార్ కాంగ్రెస్ లో చేరడానికి వస్తున్న ముద్రగడ పద్మనాభం మాత్రం.. తన వెంట వచ్చే వారికి కనీసం భోజనాలు కూడా ఏర్పాటు చేయడం లేదంటూ ముందుగానే హెచ్చరించేశారు. ఈ మేరకు తన అభిమానులు (?) అందరకూ ఒక సుదీర్ఘమైన బహిరంగ లేఖ రాసిన ముద్రగడ పద్మనాభం.. అందులో రెండు అంశాలను ప్రత్యేకంగా పేర్కొన్నారు. ఒకటి- తన ర్యాలీ తాడేపల్లికి వెళ్లే రూట్ మ్యాప్ కాగా, రెండోది- తన వెంట తాడేపల్లికి వచ్చేవాళ్లు ఎవరి ఆహారం, ఇతర అవసరాలు తమతో పాటు తమ వాహనంలోనే తెచ్చుకోవాలనే సూచన.
ముద్రగడ పద్మనాభం.. ఈనెల 14వ తేదీన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరబోతున్నారు. కిర్లంపూడి గ్రామంలోని తన ఇంటినుంచి ఉదయం 7 గంటలకు బయల్దేరి సాయంత్రానికి తాడేపల్లి చేరుకోవాలనేది ముద్రగడ ప్లాన్ గా ఉంది. అయితే చాలా పెద్ద ర్యాలీగా వందల వాహనాలతో తాడేపల్లికి వెళ్లడం ద్వారా.. రాష్ట్రంలోనే కాపు కులానికి చలా పెద్ద నాయకుడిని అని జగన్ వద్ద బిల్డప్ ఇచ్చుకోవడం ముద్రగడ టార్గెట్గా ఉంది. ఈ టార్గెట్ ను అందుకోవడానికి ఆయన ఇప్పటికే తన అనుచరులకు అభిమానులకు ఫోను ద్వారా వర్తమానాలు పంపుతున్నారు. ఎన్ని వీలైతే అన్ని అదనంగా కూడా వాహనాలు తీసుకుని తాను వైసీపీలో చేరే ర్యాలీకి రావాలని ఆయన ఆహ్వానిస్తున్నారు.
ముద్రగడ ఆహ్వానాలు పంపడం బాగానే ఉంది. అయితే అధికార పార్టీలోకి వెళుతున్న ఆయన తనకోసం వస్తున్న వారికి కనీసం భోజనవసతి కూడా కల్పించలేని విధంగా మాట్లాడడం బాలేదని పలువురు వ్యాఖ్యానిస్తున్నారు. ఆయన వెంట ర్యాలీ ఒకేసారి బయల్దేరుతుంది గనుక.. మార్గమధ్యలో ఒక చోట లంచ్ ఏర్పాటుచేసి ఉంటే చాలా గౌరవంగా ఉండేదని, ఇలా తన వెంట వచ్చేవాళ్లని తమ భోజనాలు తమతోనే కారులో తెచ్చుకోవాలని అనడం బాలేదని వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి.
ముద్రగడ వైసీపీలో చేరికకు కాపు వర్గం నుంచి ఎంత మేర మద్దతు లభిస్తుందనేది
సందేహాస్పదంగా ఉంది. అదే సమయంలో.. కాపులు కాకపోయినప్పటికీ.. ఆయన వైసీపీ నాయకుడిగా ప్రచారంలో తమకు ఉపయోగపడగలరని నమ్ముతున్న ఉభయ గోదావరి జిల్లాల్లోని వైసీపీ నాయకులు మాత్రం.. ఆయన ర్యాలీకి వాహనాలు పంపడానికి తమ వంతు ప్రయత్నిస్తున్నారు. అయితే.. ఆయనకు రాష్ట్రవ్యాప్తంగా కాపు వర్గం మద్దతు మాత్రం లభించడం లేదు. వైసీపీ వారు ప్రతి సభకు బీభత్సంగా ఎంజాయ్ చేస్తోంటే.. ముద్రగడను నమ్మినందుకు తాము తమ తిండీతిప్పలు తామే చూసుకోవాలా? అని జనం పెదవి విరుస్తున్నారు. 

Box Office: Gaami triumphs over Bhimaa in Shivaratri clash

The Tollywood box office got some respite last weekend after going through a lean phase for several weeks due to lack of big hits since Sankranti season. On the eve of Maha Shivaratri, two Telugu films and one dubbing movie released last Friday. Out of these three, Vishwaksen’s ambitious science fiction drama Gaami emerged as a box office winner with decent revenues in the first weekend. 

Gaami, directed by debutant Vidyadhar Kagita, grossed over 20 Crores in the opening weekend. The film took a solid opening due to the strong pre-release hype after the impressive teasers and trailers. Despite a few shortfalls, Gaami managed to garner promising talk and maintained a good hold on Saturday and Sunday. It already attained the break-even mark in many territories. 

In Overseas, Gaami had a terrific weekend with close to $ 500k gross. It took an impressive start on Thursday premieres with $ 165K and followed it up with $ 125K on Friday. On Saturday, the film notched up $ 110K. By Sunday, it is likely to close in on the half-a-million-dollar mark. 

Another notable film Bhimaa starring Gopichand in the lead role fell short of the trade expectations. After taking a decent start, the film failed to maintain its hold due to weak reports. It grossed around 11 Crores in the first weekend. In overseas, Bhimaa collected a meagre $ 40K in three days. 

Runaway Malayalam blockbuster Premalu was dubbed into Telugu and secured so-so numbers in the first weekend. The Telugu version collected $ 60K in USA. 

బాలీవుడ్‌ లో  ఆ హీరో పక్కన నటించే ఛాన్స్‌ కొట్టేసిన బుట్టబొమ్మ!

టాలీవుడ్ పొడుగు కాళ్ల సుందరి పూజా హెగ్డే అభిమానులకు పరిచయం అక్కర్లేని పేరు. గత కొంతకాలంగా అపజయాలు ఎదురవుతున్నప్పటికీ వరుస సినిమాలు చేస్తూ ఫుల్‌ బిజీగా ఉంది. టాలీవుడ్ లో ఆఫర్లు లేకపోవడంతో బాలీవుడ్‌ కి చెక్కిసింది ఈ ముద్దుగుమ్మ. ఈ అమ్మడు సోషల్‌ మీడియాలో ఎప్పుడూ బిజీగా ఉంటుంది.

తన విషయాలను ఎప్పటికప్పుడు అభిమానులతో పంచుకుంటూంటుంది. కొత్త కొత్త ఫొటోలను షేర్‌ చేస్తూ కుర్రాళ్ల మనసులను దోచేస్తుంది. టాలీవుడ్‌ లో అగ్ర హీరోలందరితో ఈ భామ నటించింది. మహేష్‌, చరణ్‌, అల్లు అర్జున్‌, తారక్‌ సరసన నటించి హిట్లు అందుకుంది..  ఆ తరువాత ఆమెకు కాలం కలిసి రాలేదు.

తాజాగా ఈ ముద్దుగుమ్మ బాలీవుడ్ లో ఓ బంపరాఫర్‌ కొట్టేసింది. స్టార్‌ సినిమాలో నటించే ఛాన్స్ కొట్టేసింది. దీనితో పూజా హెగ్డే బాలీవుడ్ లో పాగా వేసుకుందుకు గట్టి ప్రయత్నాలు మొదలుపెట్టింది. ఈ ముద్దుగుమ్మ  పోయిన ఏడాది సల్మాన్‌ ఖాన్ నటించిన కిసీకి భాయ్‌ కిసీకి జాన్‌ అనే చిత్రంలో మెరిసింది. ప్రస్తుతం బాలీవుడ్‌ హీరో షాహిద్‌ కపూర్‌ పక్కన దేవా అనే చిత్రంలో హీరోయిన్‌ గా నటిస్తోంది. ఈ క్రమంలోనే పూజా చేతికి మరో సినిమా కూడా వచ్చిందని సమాచారం.

ప్రముఖ సీనియర్‌ నటుడు సునీల్‌ శెట్టి కుమారుడు  అహన్‌ శెట్టి హీరోగా సంకీ అనే సినిమా ని నిర్మిస్తున్నారు.  ఈ చిత్రంలో నటించేందుకు పూజా ఒప్పుకున్నట్లు తెలిపింది. ఈ సినిమా షూటింగ్‌ ను త్వరలోనే పూర్తి చేసి వచ్చే ఏడాది ప్రేమికుల దినోత్సవానికి అభిమానులకు అందించేందుకు చిత్ర బృందం తెలిపింది.