ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అసలు ఎన్నికల వ్యవహారం ఎన్నికల సంఘం కంట్రోల్ లోనే నడుస్తున్నదా? లేదా, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కంట్రోల్ లో నడుస్తున్నదా? అనే అనుమానాలు ప్రజలకు కలుగుతున్నాయి. రాష్ట్రంలో ప్రతిరోజూ అధికార పార్టీ వారి అరాచకాలు వెలుగుచూస్తూనే ఉన్నాయి. ఎక్కడో ఒకచోట వారి దందాలు బయటపడుతున్నాయి. ఎన్డీయే కూటమి పార్టీల నుంచి ఎన్నికల సంఘానికి, స్థానికంగా ఆర్వోలకు పుంఖానుపుంఖాలుగా ఫిర్యాదులు వెల్లువెత్తుతూనే ఉన్నాయి. అయినా సరే.. అరాచకాలు ఆగడం లేదు, తెలుగుదేశం కూటమి కార్యకర్తలు మాత్రమే కాదు, అభ్యర్థుల మీద కూడా దాడులు ఆగడం లేదు. తాజాగా అనకాపల్లి ఎంపీ అభ్యర్థి సీఎం రమేశ్ మీద కూడా పోలీసుల ఎదుటే దాడి జరిగింది. ఇన్నేసి అరాచకాలకు ప్రధాన కారణం.. డీజీపీ రాజేంద్రనాథ్ రెడ్డి, చీఫ్ సెక్రటరీ జవహర్ రెడ్డి లను మార్చకపోవడం మాత్రమే అని తెలుగుదేశం భావిస్తోంది. అనేక వారాల కిందట ఎన్నికల పర్వం మొదలైన తొలిరోజుల్లో తెదేపా వారిపై దాడులు, శాంతి భద్రతల వ్యవహారం అదుపులో లేకపోవడం వంటి ఫిర్యాదుల మీద అయిదుగురు ఐపీఎస్ అధికారులను విధులనుంచి ఎన్నికల సంఘం తప్పించింది. తర్వాత ఇంటెలిజెన్స్ చీఫ్ ను, విజయవాడ కమిషనర్ ను కూడా తప్పించారు. కొందరు ఐఏఎస్ లను కూడా తప్పించారు. అయితే ఈ వ్యవహారాలేవీ అధికారుల తీరులో గానీ, పోలీసుల తీరులోగానీ కించిత్తు మార్పు కూడా తీసుకురాలేకపోయాయనే విమర్శ వినిపిస్తోంది.
కొత్తగా నియామకాలకు పంపే అన్ని పేర్లను కూడా వైసీపీ అనుకూల పేర్లనే పంపుతూ సీఎస్ జవహర్ రెడ్డి ఒక వ్యూహం ప్రకారం వ్యవహరిస్తున్నారని, అదే సమయంలో పోలీసులు ఎక్కడికక్కడ కిందిస్థాయి వరకు కూడా వైసీపీ నేతలకు సహకరిస్తూ ఉండేలాగా.. డీజీపీ రాజేంద్రనాథ్ రెడ్డి అనధికారి ఉత్తర్వులతో జగన్ కు సహకరిస్తున్నారని తెదేపా ఆరోపణలు చేస్తోంది.
రాష్ట్రంలో ఎన్నికల ప్రక్రియ సజావుగా, పారదర్శకంగా నిజాయితీగా సాగాలంటే ముందు ఈ ఇద్దరు అధికారులను మార్చాల్సిన అవసరం ఉన్నదంటూ తెలుగుదేశం కేంద్ర ఎన్నికల సంఘానికి పలుమార్లు ఫిర్యాదులు చేసినా పట్టించుకోవడం లేదు. తాగాజా ఢిల్లీలో మీడియా సమావేశంలో మాట్లాడినప్పుడు కూడా.. తెదేపా మాజీ ఎంపీ కనకమేడల రవీంద్రకుమార్ ఆరోపించారు. రాష్ట్రంలో ఎన్నికలను పర్యవేక్షించేందుకు ఇతర రాష్ట్రాలనుంచి ఉన్నతాధికారులను డిప్యూట్ చేయించాలని కూడా ఆయన కోరుతున్నారు. జగన్ మాటను అధికారులు వేదంలా పాటిస్తున్నారని ఆ పరిస్థితిలో మార్పు రావాలని కోరుతున్నారు. మరి ఈ విజ్ఞప్తులను అయినా ఈసీ పట్టించుకుంటుందో లేదో చూడాలి.
తెదేపా గోడు అదే: వారిద్దరూ ఉండగా న్యాయమెలా?
Mamata Accuses BJP Scripted Sandeshkhali Incident
While BJP has been making Sandeshkhali incident of sexual exploitation and land grabbing by a local TMC leader as a major political issue in West Bengal to grab majority of Lok Sabha seats in the state, chief minister and TMC chief Mamata Banerjee in a sensational revelation accused that the incident was `scripted by BJP’.
Moreover, TMC is attempting to push BJP into defence by questioning the party’s silence over a women’s allegation of sexual molestation against Governor C V Ananda Bose. Mamata asked Prime Minister Narendra Modi why he was silent on this issue.
“The entire Sandeshkhali incident was preplanned. The BJP had scripted it well. The truth has been exposed. I have been saying this for a long time,” Banerjee said at an election rally in Chakdah in Nadia district. “I have not seen the entire video. I will definitely see it,” she added.
Mamata wondered “PM Modi gave sandesh (messages) regarding Sandeshkhali, but remained silent on the representative of the Centre, the governor’s sexual molestation issue.”
On Saturday, the Trinamool Congress (TMC) released a video on social media, claiming that the Sandeshkhali episode was a “conspiracy” by the BJP to defame West Bengal in the run-up to the ongoing Lok Sabha election.
The 32-minute video, which the party claims was a ‘sting operation’, appears to show BJP worker Gangadhar Koyal, the block president of Sandeshkhali Block II, who is heard saying “there wasn’t any rape of women but it was framed as such”.
In the video, the man resembling Koyal is also heard saying that the entire incident was organised by state BJP chief Suvendu Adhikari (who was earlier Banerjee’s deputy in the TMC before switching sides), and that his personal assistant had visited the place.
“We couldn’t ask our wives to do this (make false rape claims), but dada managed everything from outside. He convinced the women. And I got the rape complaints done,” he added.
It may be recalled that trouble erupted in the Sandeshkhali area of North 24 Parganas district in the first week of February, when villages began witnessing protests over allegations of sexual atrocities against women and land grabbing by local TMC leaders, particularly Sheikh Shahjahan, who was subsequently arrested and suspended from the party for six years.
Kamal Haasan’s ‘Indian 2’ Gets Postponed Again
Universal star Kamal Haasan’s long-delayed vigilante thriller Indian 2, a sequel to his iconic blockbuster ‘Bharateeyudu’, which was supposed to hit the screens on June 13th, is likely to be postponed to an indefinite period due to the pending post-production activities. The main reason for the change in the release date of Indian 2 seems to be its director, Shankar Shanmugam, who is currently busy with Ram Charan’s Game Changer.
As Shankar is under immense pressure to complete Game Changer in the next two months and make sure that it hits screens in the second half of this year, the release plans of Indian 2 are likely to be changed because there is an adequate portion of post-production work left to be completed.
Though an official announcement about the new release date has yet to be made, reports suggest that the makers of Indian 2 informed all their buyers about this development. They are currently looking to release the film on July 18th. But there is no clarity on whether all activities will be completed by that time or whether the release may be pushed further to a new date.
Shankar is currently busy wrapping up the minor portions of Game Changer on short schedules. After completing these schedules, Shankar will return to the post-production activities of Indian 2. So, it is clear that Indian 2 stands postponed from June 13th.
Indian 2 stars Kajal Aggarwal as the female lead, and it features an array of artists in different roles. Anirudh Ravichander is the music composer. Lyca Production is bankrolling the film.
తారక్ – ప్రశాంత్ నీల్ సినిమాకు రంగం సిద్దం!
యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం దేవర సినిమాతో బిజీగా ఉన్నాడు. మాస్ యాక్షన్ డైరెక్టర్ కొరటాల శివ డైరెక్షన్ లో ఎన్టీఆర్ ఈ సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే వార్ 2 సినిమా షూటింగ్ తో ముంబైలో ఉన్నాడు. దేవర్ సినిమా దసరా కానుకగా అక్టోబర్ 10 న ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు రెడీ గా ఉంది.
వార్ 2 కూడా వచ్చే ఏడాది థియేటర్ల లోకి రానుంది. అయితే అందరూ ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న ప్రశాంత్ నీల్, ఎన్టీఆర్ మూవీ అప్డేట్ పై తాజాగా ఒక క్లారిటీ వచ్చింది. ప్రశాంత్ నీల్ ఎన్టీఆర్ తో సినిమా చేయనున్నట్లు గతంలో వెల్లడించిన సంగతి అందరికీ తెలిసిందే. మైత్రి మూవీ మేకర్స్ వారు ఈ చిత్రం ను నిర్మించనున్నారు.
అయితే ఎన్టీఆర్ పుట్టిన రోజు అయిన మే 20 న ఈ చిత్రం కి సంబందించిన అనౌన్స్ మెంట్ రానుంది. అదే రోజున టైటిల్ కూడా రివీల్ ను చేసే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తుంది. దీంతో ఈ క్రేజీ కాంబినేషన్ పై ప్రేక్షకుల్లో, అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి.
చెప్పుదెబ్బలా? : ఏ కాలంలో బతుకుతున్నాం?
ఎన్ని రకాలుగా ప్రజలను మభ్యపెట్టడానికి ప్రయత్నిస్తున్నప్పటికీ.. మాయోపాయాలు పన్నుతున్నప్పటికీ.. ఓటమి తప్పదనే భయం వైఎస్సార్ కాంగ్రెస్ అభ్యర్థులను వెన్నాడుతున్నట్టుగా ఉంది. విపరీతమైన అసహనానికి గురవుతున్నారు. ఆ ఫ్రస్ట్రేషన్ లో వైసీపీ అభ్యర్థుల విచ్చలవిడితనం కూడా పెరుగుతోంది. వారి అహంకారం కూడా శృతిమించుతోంది. తాజాగా అనకాపల్లి వైసీపీ ఎంపీ అభ్యర్థి, డిప్యూటీ ముఖ్యమంత్రి బూడి ముత్యాలనాయుడు కూటమికి మద్దతిస్తున్న ఒక వ్యక్తి మీద దాడికి పాల్పడి చెప్పుతో కొట్టిన సంఘటన సంచలనం సృష్టిస్తోంది. ఇంత జరిగినా పోలీసులు పద్ధతిగా కేసు నమోదు చేయకుండా చెప్పుదెబ్బ తిన్నవారినే వేధిస్తున్నారనే ఆరోపణలు కూడా వినిపిస్తున్నాయి.
ఏ కాలంలో ఉన్నాం మనం.. చెప్పుదెబ్బ కొట్టడం అంటే ఎంత దుర్మార్గమైన చర్య అది. అలాంటి వాళ్లను అసలు మనుషులుగా ఊహించగలమా? ఎంతటి అహంకారం వెల్లువ కాకపోతే.. ఒక వ్యక్తిని మరొక వ్యక్తి చెప్పుతో కొట్టడం జరుగుతుంది.. అనేది ఆలోచించాల్సి ఉంది.
వైఎస్సార్ కాంగ్రెస్ నాయకులు ఇలాంటి అహంకారానికి ప్రతీకలుగా నిగ్గుతేలడం ఇది తొలిసారి కాదు. ఈ ఎన్నికల పర్వంలోనే వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి చెందిన ఒక అభ్యర్థి తన అనుచరుడితో చెప్పులు మోయించుకుంటూ వార్తల్లో వ్యక్తిగా నిలిచారు. ఆయనేమీ అలాంటి అహంకారానికి తొలి వ్యక్తి కాదు. సినీనటి రోజా మంత్రిగా ఉండగా ప్రభుత్వ అధికారితో తన చెప్పులు మోయిస్తూ వివాదానికి కేంద్ర బిందువుగా నిలిచారు. ఇప్పుడు బూడి ముత్యాల నాయుడు ఏకంగా కూటమికి మద్దతిస్తున్న వ్యక్తిని చెప్పుతో కొట్టి వివాదాస్పదం అయ్యారు.
అనకాపల్లి బూడి చేసిన చెప్పుదాడి రచ్చరచ్చ అవుతోంది. పోలీసులు కేసు కూడా నమోదు చేయకపోవడంతో.. భాజపా ఎంపీ అభ్యర్థి సీఎం రమేశ్ పోలీసు స్టేషన్ ఎదుట బైఠాయించి నిరసన తెలియజేశారు. దాడికి గురైన వ్యక్తిని పరామర్శించడానికి కూడా సీఎం రమేశ్ ను పోలీసులు అనుమతించకపోవడంతో వివాదం మరింత ముదిరింది.
ఆ సంగతి పక్కన పెడితే.. ఈ స్థాయిలో అసహనానికి గురికావడం అనేది వైసీపీ నాయకుల ఓటమి భయం కారణంగానే అని పలువురు వ్యాఖ్యానిస్తున్నారు.
కేసీఆర్ తరహాలోనే జగన్ పతనం!
తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ అంటే తనకు దత్త తండ్రి లాగా.. ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి విపరీతమైన ప్రేమాప్యయతలను కురిపిస్తూ ఉంటారు. చాలా రాజకీయ వ్యూహాల విషయంలో ఆయన బాటను అనుసరించి నడుస్తూ ఉంటారు. కేసీఆర్ కు కూడా జగన్ అంటే వల్లమాలిన అభిమానం. 2014లో ఎన్నికలకు ముందు కూడా ఏపీలో జగన్ గెలుస్తారనే తమ సర్వే నివేదికలు చెబుతున్నాయంటూ కేసీఆర్ ఆయనకు మద్దతుగా నిలిచారు. ఇటీవల కూడా ప్రస్తుత ఎన్నికల్లో ఏపీలో జగన్ గెలుస్తారనే అంచనాలు తమకు ఉన్నాయని కేసీఆర్ సెలవిచ్చారు. ఈ ఇద్దరు నాయకులూ ఒకే జట్టు కావొచ్చు గానీ.. ప్రస్తుతం ముఖ్యమంత్రిగా జగన్ పతనం కూడా కేసీఆర్ బాటలోనే జరుగుతున్నదా అనే అభిప్రాయం పలువురికి కలుగుతోంది.
ప్రజల భూమి హక్కులకు సంబంధించిన ధరణి పోర్టల్ అనేది.. తెలంగాణ ఎన్నికల్లో కేసీఆర్ పతనాన్ని శాసించింది. ధరణికి అనుకూలం – ప్రతికూలం అనే రెండు రకాల ఎజెండా పాయింట్లతోనే తెలంగాణ ఎన్నికల్లో భారాస. కాంగ్రెస్ పార్టీలు తలపడ్డాయి. అధికారంలోకి వచ్చిన వెంటనే ధరణిని తొలగిస్తాం అని రేవంత్ రెడ్డి భీషణ ప్రతిజ్ఞలు చేశారు. ప్రజల ఆస్తులను కబ్జా చేయడానికే కేసీఆర్ ధరణి పోర్టల్ తీసుకువచ్చారని విస్తృతంగా ప్రచారం చేశారు. అదే సమయంలో కేసీఆర్ తన ప్రతి ఎన్నికల సభలోనూ ధరణి పోర్టల్ ను బీభత్సంగా వెనకేసుకుంటూ వచ్చారు. ధరణి లేకపోతే మీకు అసలు రైతు బంధువచ్చేదా? ధరణిని మించిన వ్యవస్థ లేనే లేదు.. అని పలురకాలుగా దానిని సమర్థించుకుంటూ వచ్చారు.
ఏది ఏకమైనప్పటికీ ధరణి- భారాస సర్కారును ఓడించింది. అందుకు సహేతుకమైన కారణాలు కూడా ఉన్నాయి. అప్పటికే ధరణి పోర్టల్ కారణంగా రేకెత్తిన భూవివాదాలు చాలానే ఉన్నాయి. తమ తమ భూములపై తమ హక్కులు ధరణిలో కనిపించటంలేదంటూ వేల సంఖ్యలో రైతులు ఆందోళన చెందే పరిస్థితి ఉంది. భూమి హక్కుదారుల పేర్లు మారిపోయిన దృష్టాంతాలు కబ్జాలుగా అనేకం వెలుగు చూశాయి. నాయకులు ఎవ్వరేం మాట్లాడినా, కేసీఆర్ ఎన్ని రకాలుగా సమర్థించుకున్నా ధరణి గురించి క్షేత్రస్థాయిలో వాస్తవాలు రైతులకు తెలుసు గనుక.. దానికి వ్యతిరేకంగా ఓటు వేశారు. కేసీఆర్ సర్కారు పతనం అయింది.
ఇప్పుడు అచ్చంగా ఏపీలో ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ కూడా అదే పనిచేస్తోంది. పేదల భూములను కబ్జా చేయడానికే వైఎస్సార్ కాంగ్రెస్ సర్కారు ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ తెచ్చిందని అటు చంద్రబాబునాయుడు, పవన్ కల్యాణ్ విచ్చలవిడిగా ఆరోపణలు చేస్తున్నారు. చంద్రబాబునాయుడు ఈ అంశానికి ఎంతగా ప్రాధాన్యం ఇస్తున్నారంటే.. తను అధికారంలోకి రాగానే రెండో సంతకం ఈ చట్టం రద్దుకు సంబంధించిన ఫైలు మీదనే పెడతానని కూడా వాగ్దానం చేశారు. ఆ మాట రైతుల్లోకి బాగా వెళ్లింది. రైతురుణాలు, రైతు బంధు వాగ్దానాలు వంటి వాటికంటె తమ పొలం కబ్జా కాకుండా చంద్రబాబు కాపాడుతారనే నమ్మకం వారికి కలిగింది. అదే సమయంలో అటు జగన్ గానీ, ఆయన అనుచరులు గానీ.. ఆ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ను సమర్థించుకోవడానికే తమ సమయం వెచ్చిస్తున్నారు. ఇది తాము తెచ్చిన చట్టం కాదని, కేంద్రంలోని బిజెపి మీద నెట్టేసి రాజకీయ లబ్ధి పొందడానికి ప్రయత్నిస్తున్నారు. కానీ ఆ మాటలు ప్రజల్లోకి వెళ్లడం లేదు.
తెలంగాణ ధరణిపోర్టల్ కేసీఆర్ పతనాన్ని నిర్దేశించినట్టుగా, ఏపీలో లాండ్ టైటిలింగ్ యాక్ట్ జగన్ ప్రభుత్వ పతనాన్ని శాసించనున్నదాని పలువురు వ్యాఖ్యానిస్తున్నారు.
కమల్ కు షాక్ ఇచ్చిన స్టార్ దర్శకుడు!
లోకనాయకుడు కమల్ హాసన్ చాలా కాలం తరువాత విక్రమ్ సినిమాతో సాలిడ్ కంబ్యాక్ అందుకున్నారు. ఈ సినిమాతో కమల్ హాసన్ కు భారీగా లాభాలు వచ్చాయి. ప్రస్తుతం కమల్ వరుస సినిమాలతో ఫుల్ బిజీగా ఉన్నారు. కమల్ శంకర్ కాంబోలో రాబోతున్న భారతీయుడు 2 విడుదలకు సిద్ధంగా వుంది .స్టార్ డైరెక్టర్ శంకర్ తెరకెక్కించిన ఈ సినిమా జూన్ 13 విడుదల కానున్నట్లు సమాచారం. ఈ సినిమా మాత్రమే కాకుండా కమల్ హాసన్ థగ్ లైఫ్, కల్కి 2898 AD లాంటి భారీ చిత్రాలలో కూడా యాక్ట్ చేస్తున్నారు.
ఇలాంటి సమయంలో లోకనాయకుడిపై నిర్మాతల మండలికి ఫిర్యాదు అందింది. ప్రముఖ నిర్మాతలు లింగుసామి, సుభాష్ చంద్రబోస్ ఈ ఫిర్యాదు చేశారు. 2015లో ఉత్తమ విలన్ చిత్రం కోసం కమల్ హాసన్, లింగుసామి, సుభాష్ కలిసి పని చేసారు.ఈ సినిమాకి రమేష్ అరవింద్ దర్శకత్వం వహించారు. భారీ అంచనాల మధ్య విడుదలైన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద మాత్రం డిజాస్టర్ గా నిలిచింది. దీంతో సినిమా ఫ్లాప్ అవ్వడంతో కమల్ వారితో మరో సినిమా చేసేందుకు ఒప్పందం కుదుర్చుకున్నారు.
30 కోట్ల బడ్జెట్తో మరో సినిమా చేసి గత సినిమా నష్టాన్ని భర్తీ చేస్తానని కమల్ వీరికి హామీ ఇచ్చినట్లు వారు పేర్కొన్నారు.అయితే హామీ ఇచ్చినప్పటికీ కూడా కమల్ హాసన్ తొమ్మిదేళ్లుగా తమతో ఎలాంటి సినిమా చేయలేదని వారు ఆరోపించినట్టు సమాచారం. తాను ఉత్తమ విలన్ సినిమాకు దర్శకత్వం వహించి ఉంటే ఆ సినిమా రిజల్ట్ వేరేలా ఉండేదని.. కానీ నిర్మాతగా మారినందువల్లే ఈ నష్టాలను భరించాల్సి వస్తుందని లింగుస్వామి అన్నారు.
ఈ సినిమా నష్టాలతో పాటు మరో సినిమా చేసేందుకు కమల్ ను చాలా సార్లు కలిశామని, కానీ ఆయన మాత్రం మరో సినిమా చేసేందుకు ముందుకు రావడం లేదని వివరించారు. దీంతో తప్పని పరిస్థితులలో కమల్ పై ఫిర్యాదు చేయాల్సి వచ్చిందని లింగుసామి తెలిపారు.
ఫైనల్ స్టేజ్ కు గేమ్ ఛేంజర్!
మెగా పవర్ స్టార్, గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ నటిస్తున్న లేటేస్ట్ మూవీ గేమ్ ఛేంజర్. ఈ సినిమాని కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ తెరకెక్కిస్తున్న విషయం తెలిసిందే. ఈ సినిమా ని దిల్ రాజు ఎంతో ప్రతిష్టాతక్మంగా రూపొందిస్తున్నారు. ఇందులో బాలీవుడ్ ముద్దుగుమ్మ కియారా అద్వానీ హీరోయిన్ గా నటిస్తుంది. అయితే ఈ సినిమా షూటింగ్ మొదలు పెట్టి చాలా కాలమే అయినప్పటికీ ఇంకా షూటింగ్ కంప్లీట్ పూర్తి కాలేదు
ప్రపంచ వ్యాప్తంగా రాంచరణ్ ఫ్యాన్స్ తన తరువాత సినిమాకోసం ఎంతగానో ఎదురు చూస్తున్నారు.ఈ సినిమా షూటింగ్ మొదలైన దగ్గరినుంచి అనుకోని కారణాల వల్ల ఈ సినిమా షూటింగ్ ఆలస్యం అవుతూ వచ్చింది. శంకర్ కమల్ హాసన్ తో ఇండియాన్ 2 పూర్తి చేసే పనిలో ఉండడంతో “గేమ్ చేంజర్” షూటింగ్ బాగా ఆలస్యం అయింది. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతుంది
.’ఆర్ఆర్ఆర్’ వంటి బ్లాక్బస్టర్ హిట్ తర్వాత రామ్చరణ్ నటిస్తున్న సినిమా కావడంతో ఈ సినిమాపై అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ ఫైనల్ స్టేజ్ కు వచ్చినట్లు తెలుస్తుంది. ప్రస్తుతం చెన్నైలో కొన్ని కీలక సన్నివేశాలను తెరకెక్కిస్తున్నారని ఇండస్ట్రీలో టాక్.
ఈ సినిమాలో తండ్రీకొడుకులుగా రామ్చరణ్ డ్యూయల్ రోల్ చేసున్నట్లు సమాచారం.ఈ సినిమాలో క్యూట్ బ్యూటీ అంజలి కీలక పాత్ర పోషిస్తుంది.అలాగే ఈ సినిమాలో సముద్రఖని, ఎస్.జె.సూర్య, శ్రీకాంత్, సునీల్ మరియు నవీన్చంద్ర కీలక పాత్ర పోషిస్తున్నారు .