Home Blog Page 883

జగన్ అరాచకం.. భూపందేరాలతో ఎన్నికల ఖర్చులా?

క్విడ్ ప్రోకో అనే పదం ఇవాళ తెలుగు ప్రజలకు తెలిసివచ్చింది అంటే.. అందుకు ఆద్యుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి. సామాన్యుల ఊహకు కూడా అందని విధంగా.. తన తండ్రి వైఎస్ రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న రోజుల్లో అడ్డగోలుగా దందాలు సాగించి లక్షల కోట్లు కాజేసిన కేసుల్లో జగన్ ఇప్పటికీ విచారణను ఎదుర్కొంటున్నారు. నీకు అది- నాకు  ఇది అంటూ ప్రభుత్వ ఆస్తులను లోపాయికారీగా దోచిపెట్టిన వ్యవహారాలు ఇంకా కోర్టుల్లో నలుగుతున్నాయి. ఇప్పుడు ముఖ్యమంత్రి స్థానంలో ఉంటూ క్విడ్ ప్రోకో అనే వ్యవహారానికి సరికొత్త రూపం ఇస్తున్నారు. వేల ఎకరాల భూములను తన పార్టీ తరఫున పోటీచేస్తున్న ఎంపీ అభ్యర్థికి కారుచవకగా ధారాదత్తం చేస్తున్నారు. అందుకు ప్రతిగా.. ఏమేం ఆశిస్తున్నారో అనే అనుమానాలు ఇప్పుడు ప్రజలకు కలుగుతున్నాయి.

వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తరఫున కాకినాడ ఎంపీ అభ్యర్థిగా చలమలశెట్టి సునీల్ పోటీచేస్తున్నారు. ఆయన కుటుంబానికి చెందిన కంపెనీలకు జగన్ ప్రభుత్వం అడ్డగోలుగా రాష్ట్రంలో ఉన్న భూములన్నీ దోచిపెడుతున్నదనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. చలమలశెట్టి సునీల్ కు చెందిన గ్రీన్ కోకు గత అయిదేళ్లలో ఏకంగా 7047 ఎకరాలు ధారాదత్తం చేసేశారు. ఎన్నికల ప్రకటన వస్తుందని తెలిసిన ముందురోజు కూడా ఏకంగా 1985 ఎకరాలు కేటాయించేశారు. ఇవన్నీ కూడా ఎకరా కేవలం రూ.5లక్షల వంతున ఇవ్వడం జరిగింది.

ఈ లెక్కన ఒక్క చలమలశెట్టి సునీల్ కే వందల కోట్ల వేలకోట్ల రూపాయల విలువైన ప్రభుత్వాస్తులను అడ్డదారుల్లో కారు చవకగా కట్టబెట్టేసినట్టు తెలుస్తోంది.

సాధారణంగా ఎంపీ స్థానానికి ఆర్థికంగా బలమైన అభ్యర్థిని రంగంలోకి దింపినప్పుడు.. ఆయన పరిధిలోని అసెంబ్లీ నియోజకవర్గాలకు సంబంధించి కూడా నిధులు ఏర్పాటు చేయాలని వారికి పురమాయిస్తుండడం కద్దు. గత ఎన్నికల్లో ఆ రకంగా నరసాపురం పరిధిలో ఎమ్మెల్యే అభ్యర్థులందరూ తన వద్ద డబ్బు తీసుకున్నారని రఘురామక్రిష్ణ రాజు ఆరోపించారు కూడా. ఇప్పుడు కాకినాడ వైసీపీ ఎంపీ అభ్యర్థి చలమలశెట్టి సునీల్ కు దోచిపెడుతున్న వైనం గమనిస్తే.. రాష్ట్రం మొత్తం అందరికీ నిధులు సరఫరాచేసే  బాధ్యత ఆయనకు ఇచ్చారేమో అన్నంత అనుమానాలు ప్రజలకు కలుగుతున్నాయి. కోడ్ రావడానికి ముందురోజున జరిగిన ఈ భారీ భూ కేటాయింపుల మీద కోర్టుకు వెళ్లడానికి కొందరు న్యాయనిపుణుల సలహాలు తీసుకుంటున్నట్టుగా తెలుస్తోంది. 

సాక్షి తప్పుడు కథనాలకు, చిన్నమ్మ ఘాటైన కౌంటర్!  

ఏది ఊహకు వస్తే అది రాసేయడం.. ఎలాంటి నిందలు వేయడానికైనా వెనకాడకపోవడం.. ఇవాళ్టి మీడియాలో ఒక ప్రధానమైన పోకడగా మారింది. ప్రతిక పుట్టుకలోనే రాజకీయ వక్ర ప్రయోజనాలే లక్ష్యంగా కలిగి ఉన్న సాక్షి దినపత్రిక.. అలాంటి వైఖరిలో మరెంత దూకుడుగా వ్యవహరిస్తుందో అర్థం చేసుకోవచ్చు. అందుకే ఇలా విశాకలో డ్రగ్స్ కంటైనర్ వ్యవహారం వెలుగులోకి రాగానే, ఆ డ్రగ్స్ దందా వెనుక వైఎస్సార్ కాంగ్రెస్ నాయకుల పాత్ర ఉన్నదని ప్రజలకు తెలియగానే.. ఎదురుదాడికి సర్వం దిగింది. ఆ ప్రయత్నాల్లో భాగంగానే.. దగ్గుబాటి పురందేశ్వరి కుటుంబానికి ముడిపెట్టే కుటిల ప్రయత్నం చేశారు. అలాంటి విషపూరితమైన ప్రచారానికి దగ్గుబాటి పురందేశ్వరి ఇప్పుడు ఘాటైన కౌంటర్ ఇస్తున్నారు. ఆ పత్రిక మీద 20 కోట్ల రూపాయలకు పరువునష్టం దావా వేయడానికి సిద్ధం అవుతున్నారు.

విశాఖ పోర్టులో దొరికిన 25 వేల కిలోల మాదకద్రవ్యం వ్యవహారానికి సంబంధించి తొలిరోజునుంచి సాక్షి దినపత్రికలో భిన్నమైన కథనాలు వచ్చాయి. బ్రెజిల్ నుంచి ఈ కంటైనర్ ను దిగుమతి చేసుకున్న సంధ్యా ఆక్వా ఎక్స్‌పోర్ట్ వ్యాపారంలో దగ్గుబాటి పురందేశ్వరి కుటుంబం భాగస్వాములు అంటూ సాక్షి దినపత్రిక కథనాల్ని ప్రచురించింది.

నిజానికి దగ్గుబాటి పురందేశ్వరి వియ్యంకుడికి, సంధ్య ఆక్వా యజమాని వీరభద్రరావుకు కొన్నేళ్లకిందట వేరే  భాగస్వామ్యం వ్యాపారం ఉండేది. సంవత్సరాల కిందటే వారు విడిపోయారు. ఆ వ్యాపారం కూడా ఇప్పుడు లేదు. కానీ.. ఆ విషయాల్ని స్పష్టంగా చెప్పకుండా.. పురందేశ్వరి కుటుంబం ఇప్పటికీ వీరభద్రరావుతో వ్యాపార భాగస్వాములు అన్నట్టుగా సాక్షి ప్రచారానికి దిగింది.

తెలుగుదేశం పార్టీతో భారతీయ జనతా పార్టీ పొత్తు పెట్టుకున్న నాటినుంచి.. కమలం పెద్దలను ఏమీ అనలేక..

పురందేశ్వరిపై సాక్షి, వైఎస్సార్ కాంగ్రెస్ విషం కక్కుతున్న సంగతి అందరికీ తెలుసు. డ్రగ్స్ దందా బయటకు వచ్చేసరికి.. ఒక పాత పనికిరాని లింకు కనిపించే సరికి, పురందేశ్వరి కుటుంబంపై బురద చల్లడానికి సాక్షి ప్రయత్నించింది. దాన్ని సీరియస్ గా తీసుకున్న చిన్నమ్మ ఏకంగా 20 కోట్ల రూపాయల పరిహారానికి పరువునష్టం దావా వేయబోతున్నట్టుగా నోటీసులు పంపింది. రెండువారాల్లోగా వివరణ ఇవ్వకుంటే తదుపరి చర్యలు తీసుకుంటానని హెచ్చరించారు. మరి సాక్షి మెట్టు దిగి లెంపలు వేసుకుంటుందో లేదా, లీగల్ పోరాటానికి సిద్ధపడుతుందో చూడాలి. 

ఈ చేరికలనుంచి జగన్ పాఠం నేర్చుకోవాలి!

తమ పార్టీనుంచి ఎవ్వరైనా ప్రత్యర్థి పార్టీలోకి వెళ్తే చాలు.. ఆ నాయకుడు ఎందుకూ పనికిరాని చెత్త అనీ.. ఒక చోట చెల్లని నాణెం మరొకచోట చెల్లుతుందా? అని.. ఆ నాయకుడు వెళ్లిపోవడమే తమకు చాలా మంచిదని..

అవకాశవాదంతో ఎన్నికల్లో టికెట్ కోసం ఆ పార్టీలోకి వెళ్లాడని.. ఇలా రకరకాలుగా పార్టీలు వ్యాఖ్యానిస్తుంటాయి.

కానీ టికెట్ల కేటాయింపు అనే పర్వం మొత్తం పూర్తయిపోయిన తర్వాత కూడా.. ఒక పార్టీలోకి చేరికలు జరుగుతున్నాయంటే.. ఎలాంటి హామీల గురించిన హామీలు తీసుకోకుండానే, టికెట్ మీద ఆశతో సంబంధమే లేకుండా నాయకులు వేరే పార్టీలో చేరుతున్నారంటే ఆ పరిణామాలను ఎలా అర్థం చేసుకోవాలి? ఆ చేరికల యొక్క అర్థం ఒకే ఒక్కటి. ప్రస్తుతం తాము ఉన్న పార్టీ ఎన్నికల్లో నెగ్గుతుందనే నమ్మకం వారికి లేదని మాత్రమే!
కర్నూలు జిల్లా డోన్ నియోజకవర్గ రాజకీయాల్లో ఒక కీలక పరిణామం ఆదివారం చోటు చేసుకుంది. వైఎస్సార్ కాంగ్రెస్ నుంచి ఒక కీలక నాయకుడు తెలుగుదేశంలో చేరారు. కోట్ల సూర్యప్రకాశ్ రెడ్డి, కెఇ కలిసి ఆయనను పార్టీలోకి ఆహ్వానించారు. ఆయన ఏ సాధారణ నాయకుడో అయితే ఇంత పెద్ద చర్చలేదు. జగన్ మంత్రి వర్గంలో కీలక నాయకుడు, అయిదేళ్లుగా ఆర్థిక మంత్రిగా బాధ్యతలను నిర్వర్తిస్తున్న బుగ్గన రాజేంద్రనాధ రెడ్డికి స్వయానా తమ్ముడు ప్రభాకర్ రెడ్డి. అందువల్లనే ఆ చేరిక బహుధా చర్చనీయాంశం అవుతోంది. చిన్న బుగ్గన చేరిక తెలుగుదేశానికి బలం మాత్రమే కాదు.. రాష్ట్రంలో వైఎస్సార్ కాంగ్రెస్ ఓడిపోతున్నదనడానికి కూడా సంకేతం అని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.

మొన్నమొన్నటిదాకా వైఎస్సార్ కాంగ్రెస్ ను విడిచిపెట్టి నాయకులు ఇతర పార్టీల్లోకి వెళుతున్నారంటే వారి మీద బోలెడు నిందలు వేశారు. అవకాశవాదులు అని అన్నారు. కానీ అన్ని పార్టీల్లోనూ టికెట్ల ఎంపిక కూడా పూర్తయిపోయిన తర్వాత.. ఇప్పుడు ఎవరైనా వెళుతున్నట్లయితే దాని అర్థం ఏమిటి? వారిని ఏమనాలి? వారిని ‘జాగ్రత్త పరులు’ అని అనాలి. అలాంటి వారు పార్టీ వీడి వెళ్లిపోతున్న ఉదంతాల నుంచి జగన్మోహన్ రెడ్డి పాఠాలు నేర్చుకోవాలి. నేర్చుకోకపోతే నష్టపోయేది కూడా ఆయనే.

వాళ్లు చావును నిర్దేశిస్తే.. బాబు బతుకును చూపించాడు!

వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకుల అరాచకత్వం, కబ్జాకోరుతత్వం, పేదలు పలుకుబడి లేని వారి ఆస్తులు కనిపిస్తే చాలు వాటిని- కనురెప్పకు తెలియకుండా కంటిని పెకలించినట్టుగా కాజేసే తత్వం ఇవన్నీ కలిసి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి సొంత జిల్లాలో ఒక నిండు కుటుంబాన్ని పొట్టన పెట్టుకున్నాయి. అధికార పార్టీ నాయకుల భూదాహం, అక్రమబాగోతాలు ఒక కుటుంబాన్ని నిస్సహాయ స్థితిలోకి నెట్టేసి.. ఇక జీవించడమే వృథా అనే భావనను కలుగజేశాయి. కుటుంబం మొత్తం ఆత్మహత్యకు పాల్పడ్డారు. నలుగురున్న కుటుంబంలో ఒక్క కూతురు మాత్రమే మిగిలింది. అయితే వైసీపీ నాయకుల దందాలు ఆ కటుుంబంలో ముగ్గురిని బలి తీసుకుంటే..

తెలుగుదేశం అధినేత చంద్రబాబునాయుడు మాత్రం ఆ కుటుంబంలో మిగిలిన ఒక్క అమ్మాయికీ బతుకును చూపించారు. తెలుగుదేశం స్థానిక నాయకుల ద్వారా.. ఆ కుటుంబంలో మిగిలిన కూతురు తో మాట్లాడిన చంద్రబాబునాయుడు.. ఆమె జీవితంలో స్థిరపడే వరకు ఆమెకు సంబంధించిన బాధ్యత పూర్తిగా తెలుగుదేశం పార్టీ తీసుకుంటుందని భరోసా ఇచ్చారు.

వివరాల్లోకి వెళితే.. కడప జిల్లా ఒంటిమిట్టలోని సుబ్బారావు అనే చేనేత కార్మికుడికి తన ముందు తరాల వారినుంచి వారసత్వంగా సంక్రమించిన భూమి ఉంది. ఆయనకు ఇద్దరు కూతుళ్లు. చేనేత మగ్గం పొట్ట నింపక పోవడంతో ఇతర వ్యాపారాలు కూడా చేసుకుంటూ బతుకుతున్నాడు. కానీ.. ఇటీవలి కాలంలో అప్పుల ఒత్తిడి పెరగడంతో ఉన్న పొలాన్ని అమ్మి అప్పులు తీర్చి బతకాలని అనుకున్నాడు. తీరా చూస్తే ఆయన పొలం కాస్తా కట్టా శ్రావణి అనే మరో మహిళ పేరు మీదకు మారిపోయి ఉంది. వారసత్వంగా తనకు సంక్రమించిందనే రికార్డులు అన్నీ తీసుకువెళ్లి అధికార్లకు చూపించినా.. పేరు మార్చడం గురించి వారు పట్టించుకోలేదు. ఈలోగా స్థానిక వైసీపీ నాయకుల నుంచి ఒత్తిళ్లు బెదిరింపులు వచ్చాయి. ఆ భూమి కడప-రేణిగుంట మధ్య కొత్తగా వేయబోతున్న ఫోర్ లైన్ రోడ్డుకు పక్కనే ఉండడంతో భూబకాసురుల కన్ను పడింది. వైసీపీనేత కట్టా నారాయణయ్య అనుచరులే ఈ పనికి పాల్పడినట్టుగా సుబ్బారావు కలెక్టరు పేరుతో సూసైడ్ నోట్ లెటరుగా రాశారు. దానినే మరణ వాంగ్మూలంగా భావించాలని రాశారు. హైదరాబాదులోని తన పెద్దకుమార్తె నిత్యకు ‘బిడ్డా జాగ్రత్త ఎవరినీ నమ్ముకోవద్దు.. మమ్మీ, డాడీ, విన్నీ’ అని మెసేజీ పంపారు. సుబ్బారావు రైలుకింద పడి ఆత్మహత్య చేసుకోగా, ఆయన భార్య పద్మావతి, చిన్నకూతురు వినయ ఇంట్లో ఆత్మహత్యకు పాల్పడ్డారు. పెద్దకూతురు నిత్య ఒక్కటే మిగిలింది.

ఆ అమ్మాయితో ఆదివారం సాయంత్రం చంద్రబాబునాయుడు స్వయంగా మాట్లాడారు. వైసీపీ నాయకులు ఆ కటుంబాన్ని బలి తీసుకోగా, చంద్రబాబునాయుడు మిగిలిన అమ్మాయికి బతుకు చూపించారంటూ అందరూ మాట్లాడుకుంటున్నారు.

Odds Favouring Pawan Kalyan In Pithapuram

Despite YS Jagan Mohan Reddy’s all-out efforts to thwart Pawan Kalyan’s ambition to enter the Andhra Pradesh assembly this time, it is going to be a canter for the Janasena president as per the latest ground reports from Pithapuram constituency. 

Though Pawan Kalyan’s surprise decision to relocate from Bhimavaram to Pithapuram initially appeared to be a strategic mistake, the political odds now seem to be hugely favouring the alliance given the recent developments in the constituency. The YSRCP expected former MLA SVSN Varma to rebel against the TDP’s decision to put him aside and allot the seat to Janasena chief as part of the alliance. Had he not been cajoled by Chandra Babu Naidu against contesting as a rebel with an assurance of an MLC post, he would have posed a big threat to Pawan Kalyan’s winning chances by splitting the votes of TDP. 

Having come to terms with the party’s high command, Varma has vowed to extend his full support to Pawan Kalyan. Varma wields a significant clout among TDP voters in Pithapuram constituency. So, he will play a decisive role in Pawan Kalyan’s victory. Moreover, Chandra Babu Naidu has reportedly told Varma to closely monitor the constituency and make sure that Janasena wins with a thumping majority. If Varma abides by his promise made to Naidu, it will be a cakewalk for Pawan Kalyan in Pithapuram. 

Even though Jagan is marshalling all his leaders to Pithapuram and also shelling out crores of money to defeat Pawan Kalyan by hook or crook, it is going to be a futile exercise as per political experts because the majority of Kapu voters in the constituency are inclined towards Janasena this time irrespective of the money spent by YSRCP leaders during the elections. The support of the TDP cadre will further bolster the chances for Pawan Kalyan. 

As many surveys are predicting a resounding victory for the alliance in the State, voters of Pithapuram are likely to support Janasena so that Pawan will take up various developmental activities in the constituency in the next five years. Also, the fact that there is a huge anti-incumbency on Jagan Mohan Reddy’s government is another reason why Pawan Kalyan will romp home with a landslide victory in these elections. 

చింతలపూడి టీడీపీకి కేక్ వాక్ అవుతుందా?

ఏపీలో పాలక- ప్రతిపక్షాలు ఈ ఎన్నికలను చాలా ప్రతిష్ఠాత్మకంగా తీసుకుంటూ ఉన్నాయి. ఒక్క సీటు చేజారినా కూడా.. మొత్తం అధికారాన్ని అందించే ఫలితమే తారుమారు అవుతుందన్న భయంతో ఆచితూచి అభ్యర్థుల్ని ఎంపిక చేస్తున్నాయి. రెండు పార్టీలకూ రెండు రకాల గండాలు పొంచి ఉండగా.. వాటిని అధిగమించడానికి చేతనైనంత స్థాయిలో ప్రయత్నాలు సాగిస్తున్నాయి. ఇన్నీ సమీకరణాలు నడుస్తుండగా.. ఏలూరు జిల్లా చింతలపూడి లోని వైసీపీ ఎమ్మెల్యే ఎలీజా ఆదివారం ఆ పార్టీని వీడి కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్నారు. కాంగ్రెస్ ఏపీ చీఫ్ షర్మిల సమక్షంలో ఆయన పార్టీ కండువా కప్పించుకున్నారు. కాంగ్రెస్ నుంచి ఆయన అదే చింతలపూడి బరిలో ఈ ఎన్నికల్లో తలపడబోతున్నారు. ఈ నేపథ్యంలో.. చింతలపూడిలో విజయం తెలుగుదేశానికి కేక్ వాక్ అవుతుందా అని పలువురు అంచనా వేస్తున్నారు.


ఎలీజా తనకు టికెట్ మళ్లీ కేటాయించాలని జగన్ ను తొలినుంచి అభ్యర్థిస్తూ వచ్చారు. అయితే.. అనేక నియోజకవర్గాల్లో అభ్యర్థులను ఎడాపెడా మార్చేస్తూ.. బదిలీల రాజకీయానికి తెరతీసిన జగన్.. ఈసారి చింతలపూడి అభ్యర్థిగా కంభం విజయరామరాజును ప్రకటించారు. దీంతో ఎలీజ్ హర్ట్ అయినప్పటికీ ఇన్నాళ్లూ మౌనంగానే ఉన్నారు. పార్టీ మళ్లీ గెలిస్తే తనకు ఏమైనా మంచి అవకాశాలు ఉంటాయని, అలాంటి హామీ పార్టీ అధినేతల నుంచి వస్తుందని ఆయన ఎదురుచూస్తూ ఉన్నారేమో తెలియదు. మొత్తానికి నిరీక్షించారు. కానీ జగన్ పట్టించుకోలేదు.

మరోవైపు పిఠాపురంలో టికెట్ తిరస్కరింపబడిన సిటింగ్ ఎమ్మెల్యే పెండెం దొరబాబును మాత్రం జగన్ స్వయంగా పిలిపించి.. పవన్ కల్యాణ్ ను ఓడించడానికి సహకరించాలని.. పార్టీ గెలిచాక తొలివిడతలోనే ఎమ్మెల్సీ ఇస్తానని భరోసా ఇచ్చి బుజ్జగించారు. అంతే తప్ప చింతలపూడి ఎమ్మెల్యే ఎలీజా, గూడూరు ఎమ్మ్లెల్యే వరప్రసాద్ లాంటివారిని పట్టించుకోలేదు.

ఆదివారం నాడు వరప్రసాద్ బిజెపిలో చేరి తిరుపతి ఎంపీ టికెట్ దక్కించుకోగా.. ఎలీజా హైదరాబాదులో కాంగ్రెసులో చేరి ఆ పార్టీ టికెట్ దక్కించుకున్నారు. ఎలీజా సిటింగ్ ఎమ్మెల్యే కావడం మూలాన ఆయన ప్రభావితం చేయగలిగిన ఓటు బ్యాంకు ఖచ్చితంగా ఉంటుందని, ఆ మేరకు కాంగ్రెసుకు పడే ప్రతి ఓటూ వైసీపీకే నష్టం అని పలువురు అంచనా వేస్తున్నారు. అందుకే.. తెలుగుదేశం అభ్యర్థి సొంగ రోషన్ సునాయాసంగా గెలుస్తారని కూడా అంటున్నారు. 

విజయసాయివి అన్నీ సెల్ఫ్‌గోల్ మాటలే!

వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి విజయసాయిరెడ్డికి ప్రత్యక్ష రాజకీయాల్లో తలపడి, ప్రజల మనసులు గెలుచుకుని విజేతగా నిలిచే పటిమ ఉన్నదా? ఆయన ఎంత సీనియర్ నాయకుడు అయినప్పటికీ..

జగన్మోహన్ రెడ్డి తర్వాత ఆ పార్టీలో నెంబర్ టూ నాయకుల పేర్లలో గుర్తింపు ఉన్నవాడు అయినప్పటికీ.. ఈ విషయం మాత్రం సందేహమే. ఎందుకంటే.. ఆయన చేతిలో పార్టీమీది పెత్తనం ఉన్నది గనుక.. పార్టీ నాయకులు అందరూ ఆయన ప్రాపకం కోసం ఎగబడుతుంటారు గనుక, జగన్ ఆయన మాటకు విలువ ఇస్తారు గనుక.. ఆయన కీలకనేతగా ‘పార్టీలో’ చెలామణీ అయ్యారే తప్ప.. ప్రజల్లో కూడా ఆయనకు అంతే విలువ ఉన్నదా? అనేది సందేహం. ఆ విషయం ఇప్పుడు నిరూపణ అవుతుంది. ఎందుకంటే.. ఆయన నెల్లూరు ఎంపీగా లోక్ సభ బరిలో ఉన్నారు.

ప్రత్యక్ష రాజకీయాలు అలవాటు లేని విజయసాయిరెడ్డి ప్రస్తుతం మాట్లాడుతున్న మాటలు .. ఆ పార్టీకి సెల్ఫ్ గోల్ లాగా కనిపిస్తున్నాయి. ప్రత్యర్థులను తిట్టడానికి చెబుతున్న మాటలు కూడా.. బలంగా లేవు. ప్రత్యర్థులే ఆ మాటలను పట్టుకుని ట్రోల్ చేసేవిధంగా ఉన్నాయి.

జనసేన ఇప్పటిదాకా ఎన్నడూ చట్టసభల్లోకి ప్రవేశించనే లేదని, చట్టసభల్లో ప్రవేశించాలనే ఏకైక లక్ష్యంతోనే ఈసారి ఎన్నికల్లో దిగుతోందని విజయసాయిరెడ్డి అంటున్నారు. ఆయన చెప్పిన మాటలో కొత్త విషయం ఏముంది? గత ఎన్నికల్లో జనసేన తరఫున ఒక ఎమ్మెల్యే గెలిస్తే.. ప్రలోభపెట్టి వైకాపా తమలో కలిపేసుకుంది. చట్టసభల్లో అడుగుపెట్టడానికే పోటీచేస్తున్నట్టుగా పవన్ కల్యాణ్ స్వయంగా చెబుతూనే ఉన్నారు. ప్రజలకోసం సొంతంగానే ఎంతో చేస్తున్న పవన్ కల్యాణ్.. జగన్ వంటి దుర్మార్గుల పాలనను అంతమొందించాలంటే.. చట్టసభల్లో ఉండాల్సిన అవసరం ఉన్నదని, అందుకే తన పార్టీ  పోటీచేస్తున్నదని పలుమార్లు చెప్పారు. ఇప్పుడు విజయసాయి మళ్లీ ఈ డైలాగుతో గుర్తు చేయడం.. జగన్ దుర్మార్గాలను పవన్ ఎండగట్టిన వైనాన్ని గుర్తిచేసినట్టే ఉంది.

నెల్లూరులో తెలుగుదేశానికి అభ్యర్థులు లేక తమ పార్టీనుంచి తీసుకున్నదని విజయసాయి అంటున్నారు. ఆ జిల్లాలో తెలుగుదేశం పంచన చేరిన వారు ముగ్గుర వైసీపీ ఎమ్మెల్యేలు అయితే , చంద్రబాబు ఇద్దరికే టికెట్లు ఇచ్చారు. అలాగని జిల్లాలో మిగిలిన సీట్లను గాలికి వదిలేయలేదు కదా? అనేది ప్రజల ప్రశ్న. అది కూడా.. వైసీపీ తరఫున గెలిచినా సరే.. ఆ ప్రభుత్వం మాయమాటలు చెప్పడం తప్ప నియోజకవర్గంలో ఒక్క అభివృద్ధి పని అయినా చేయలేకపోతున్నాం అని పాలక పక్షాన్ని ఛీకొట్టి వారు బయటకు వెళ్లిపోయిన తర్వాతనే కదా తెలుగుదేశం చేర్చుకున్నది  అని ప్రజలు అంటున్నారు.

ఈ రకంగా విజయసాయి తన మాటలతో ప్రత్యర్థుల్ని విమర్శిస్తున్నారని అనుకుంటున్నారు గానీ.. నిజానికి ఆయన సొంత పార్టీమీదికే సెల్ఫ్ గోల్ వేసినట్లు చేస్తున్నారని అంతా అనుకుంటున్నారు.

ఉండవిల్లి శ్రీదేవి : ఈ ‘అతి’ భవిష్యత్తును చెడగొట్టుకోవడమే!

ఉండవిల్లి శ్రీదేవి తాజాగా తెలుగుదేశం అధినేత చంద్రబాబునాయుడు మీద ఆగ్రహంతో ఉన్నట్టుగా కనిపిస్తోంది. తాడికొండ ఎమ్మెల్యేగా వైఎస్సార్ కాంగ్రెస్ తరఫున గెలిచి.. సుమారు ఏడాది కిందట తెలుగుదేశానికి అనుకూలంగా ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటు వేసి.. తర్వాత అనర్హత వేటుకు కూడా గురైన శ్రీదేవి తెలుగుదేశంలో చేరారు.

అయినప్పటికీ.. ఆమె ప్రస్తుతం టికెట్ దక్కలేదు. తనకు తిరువూరు అసెంబ్లీ టికెట్ గానీ, బాపట్ల ఎంపీ టికెట్ గానీ కావాలని ఆమె ఆశించారు. కానీ దక్కకపోవడంతో అలకపూనారు. ‘‘రాజకీయాలు ఎలా ఉంటాయో.. ఎవరు ఎలాంటి వారో ఈరోజు అర్థం అయ్యింది!!’’ అని వుండవిల్లి శ్రీదేవి తన ఎక్స్ ఖాతాలో పోస్టు చేశారు.

ఆ పోస్టుకింద హ్యాష్ ట్యాగ్ బాపట్ల అని పెట్టి దాని పక్కనే ఒక కత్తి బొమ్మ పెట్టకపోతే గనుక.. ఆమె ట్వీట్ గురించి చర్చ జరిగేదే కాదు. ఆమె అలకపూనినట్టుగా అర్థమయ్యేది కూడా కాదు.

ఆమె కోరుకున్నట్టుగా టికెట్ దక్కలేదు సరే.. నిన్న గాక మొన్న తెలుగుదేశంలోకి వచ్చిన (అది కూడా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో తనను పూర్తిగా లూప్ లైన్లోకి పెట్టేసిన తర్వాత.. తనకు వేరే గత్యంతరం లేకుండాపోయిన తర్వాత మాత్రమే) ఉండవిల్లి శ్రీదేవి ఒక్క ఫిరాయింపు ఓటు వేసినందుకు ప్రత్యుపకారంగా టికెట్ ఆశించడం ఒక చిత్రం. పోనీ ఆశించారే అనుకుందాం.. తాను సిటింగ్ ఎమ్మెల్యేగా ఉన్న తాడికొండ నియోజకవర్గాన్ని కాకుండా ఆమె తిరువూరును ఎందుకు కోరుకున్నట్టు?

ఆ రహస్యం అందరికీ తెలిసినదే. డాక్టరుగా రోరింగ్ ప్రాక్టీసు ఉన్న ఉండవిల్లి శ్రీదేవి వైసీపీ టికెటు మీద తాడేపల్లి ఎమ్మెల్యే అయిన తర్వాత నియోజకవర్గంలో చేయని దందా లేదు. అరాచకం లేదు. పాల్పడని అవినీతి లేదు.

రాష్ట్రవ్యాప్తంగా వైసీపీ ఎమ్మెల్యేలు చాలా మంది తమకు తోచినరీతిలో విచ్చలవిడిగా దందాలు సాగించారు గానీ..

ఉండవిల్లి శ్రీదేవి స్థాయిలో భ్రష్టుపట్టిన వారు లేరు.  నియోజకవర్గంలో అపరిమితమైన అపకీర్తి మూటగట్టుకున్నారు. తీరా జగన్ ఇన్చార్జిని మార్చిన తర్వాత అలిగారు. తెలుగుదేశంలోకి వచ్చారు సరే.. గెలిచిన చోట తనకు మళ్లీ ఠికానా లేదని అర్థమై ఆమె తిరువూరు సీటును కోరుకున్నారు. లేదా, బాపట్ల ఎంపీ సీటు కావాలని అడిగారుట. గెలిచినప్పుడు అంత దారుణమైన అవినీతికి పాల్పడకుండా కొంచెమైనా క్లీన్ రికార్డ్ ఉన్నట్లయితే బహుశా టికెట్ దక్కేదేమో. కానీ.. మచ్చ పడకుండా, మచ్చ వలన ఒక్కసీటు పోయినా పార్టీకి మొత్తంగా నష్టం అనే భయంతో ఆచితూచి టికెట్లు ఇస్తున్న చంద్రబాబు ఆమెకు టికెట్ ఇవ్వలేదు.

అందువలన అలిగి.. ఇలాంటి ఓవరాక్షన్ తో పోస్టు పెట్టడం ఆమెకే నష్టం అనే వాదన పార్టీలో సర్వత్రా వినిపిస్తోంది. కనీసం ఆమె సైలెంట్ గా ఉండి.. పార్టీకోసం తను చేయగలిగినంత పనిచేసి ఉంటే, తెదేపా సర్కారు వచ్చిన తర్వాత.. ఏదైనా పదవులు అడగడానికి అవకాశం ఉండేదని, ఇప్పుడు ఈ ట్వీటు ద్వారా అలాంటి భవిష్యత్తును కూడా ఆమె నాశనం చేసుకున్నారని పలువురు వ్యాఖ్యానిస్తున్నారు.

AP BJP Finding Leadership Crisis In Candidate Selection

Realizing the fact that its vote share is below NOTA votes and it was only less then 1 per cent in 2019 elections, though BJP succeeded in reviving its alliance with TDP and bargaining for a good number of seats, it is finding leadership crisis in choosing suitable candidates.

As part of alliance with TDP and Jana Sena, BJP got six Lok Sabha seats and 10 Assembly seats. But except former Chief Minister N Kiran Kumar Reddy in Rajampst and state president and former union minister D Purandeswari in Rajampet, it fails to locate suitable candidates from its own cadre. As a result, it is depending mostly on candidates with `suspecious’ character.

After finalizing its candidates at a meeting in New Delhi on Saturday and getting assurance from the BJP top leadership, YSRCP MLA Vara Prasad Rao joined BJP on Sunday to contest as its candidate for Tirupati Lok Sabha. Likewise, Rohan from a strong TDP family, joined BJP to contest for Badvel Assembly.

Likewise, it is fielding former MP Kottapalli Geetha, who was arrested along with her husband in a `bank fraud’ case. BJP is now choosing to field her from Araku Lok Sabha constituency, though TDP and its alliance partners are weak and YCP has a strong presence.

Though party senior leaders like GVL Narasimha Rao and Somu Veerraju are also keen to contest in the polls, all surveys indicated that they do not have any grass-root base and it is very difficult for them to give any fight in direct elections.

Former union minister Sujana Choudhary and BJP national secretary Sathya Kumar, who were never contested in any direct election, shelving their aspirations to contest for Lok Sabha, are now said to be settling themselves in Assembly seats.

TDP and Jana Sena circles are worrying that sparing some seats to BJP leaders, who do not have any gross-root presence will cost them heavily making those seats vulnerable to ruling YSRCP.

I.N.D.I.A Bloc To Hold Protest Rally In Delhi’s Ramlila Maidan On March 31

Aiming to display Opposition unity and show of strength weeks ahead of the Lok Sabha elections, the Opposition’s I.N.D.I.A bloc will hold a ‘Maha Rally’ in New Delhi’s Ramlila Maidan on March 31, Aam Aadmi Party leader and Delhi Minister Gopal Rai said on Sunday. The announcement comes against the backdrop of Arvind Kejriwal’s arrest in connection with the money laundering case linked to the alleged liquor scam under his government in the Union Territory.

Rai appealed to the people of the country to join the rally at 10 am on March 31 “against this dictatorship”. He hit out at the BJP-led Centre over Kejriwal’s arrest and alleged that Prime Minister Narendra Modi is “misusing” the central agencies.

“The way Delhi CM Arvind Kejriwal has been arrested, all those people across the nation who love and respect the constitution,  there is anger in their hearts”, he said.

He cautioned that it is not just about Arvind Kejriwal but one by one to wipe out the entire opposition, PM Modi is misusing central agencies, buying MLAs…either MLAs are being bought by money or they’re being threatened to join BJP. Those people who are not ready to be sold, bow down, fake cases are being registered against them, he added.

Arvinder Singh Lovely, the Congress’s Delhi unit chief, alleged that opposition parties are not being given a level playing field. “The March 31 ‘maha rally’ will not only be a political one but a call to save the country’s democracy and raise voices against the BJP-led Centre,” Lovely said.

Delhi Minister Atishi said that the ‘Maha Rally’ is not to save Kejriwal “but to save the democracy”. “INDIA alliance is organising a ‘Maha Rally’ in the Ramlila Maidan on 31 March. This is not being organised to save Arvind Kejriwal but to save the democracy. The opposition is facing one-sided attacks…” she said.