Home Blog Page 873

NIA Arrests Key Conspirator In Rameshwaram Cafe Blast Case

In its first breakthrough in Bengaluru’s Rameshwaram Cafe blast case, the National Investigation Agency (NIA) has arrested a key conspirator following raids across multiple locations in three states. Muzammil Shareef was picked up and placed in custody as a co-conspirator, the NIA said in a press release on Thursday.

“Muzammil Shareef was picked up and placed in custody as a co-conspirator after NIA teams cracked down at 18 locations, including 12 in Karnataka, 5 in Tamil Nadu and one in Uttar Pradesh. NIA investigations have revealed that Shareef had extended logistic support to the other two identified accused in the case…Various digital devices were seized during the searches, along with cash,” the Central probe agency said in a statement.

NIA, which took over the case on March 3, had earlier identified the main accused, Mussavir Shazeeb Hussain, who had carried out the blast. It had also identified another conspirator, Abdul Matheen Taha, who is also wanted by the agency in other cases. Both the men are on the run.

The investigations revealed that Muzammil Shareef had extended logistic support to the other two identified accused in the case, involving an IED explosion at the Café located at ITPL road, Brookefield, Bengaluru, on March 1. Several customers and hotel staff members were injured, some of them grievously, in the blast, which caused extensive damage to the property.

Shazeeb and Taha are the alleged founding members of an Islamic State module that germinated in the Thirthahalli region of Shivamogga around 2016. Taha first appeared on the radar of agencies in January 2020 in connection with an IS radicalisation case registered in Bengaluru.

Shareef’s arrest comes after NIA teams raided 18 locations, including 12 in Karnataka, five in Tamil Nadu, and one in Uttar Pradesh. Searches were also conducted in Karnataka’s Mandya, Chikamagalur, and Bengaluru with one person from Chikmagalur being summoned by the NIA for further questioning.

 Various digital devices were seized during the searches, along with cash, the press release read. Efforts are on to nab the absconding accused and unearth the larger conspiracy behind the blast, it added.

Keshav Rao, GHMC Mayor Vijayalakshmi To Join Congress

Stage is almost set ready for the return of senior BRS leader and Parliamentary Party leader Dr K Keshava Rao and his daughter G. Vijayalakshmi, who is now GHMC Mayor, returning to the Congress party.

Sources said Keshava Rao called on BRS chief K Chandrashekhar Rao at the latter’s Erravelli residence on Thursday, where the duo are learnt to have discussed the party’s internal affairs and political scenario in the State as well as at the national level.

Later, Keshava Rao expressed his desire to rejoin Congress, where he began his political career. However, KCR has reportedly expressed his uneasiness over his decision and reminded him of the importance given during the 10-year BRS regime in the state.

Speaking to media persons after the meeting, Keshava Rao said Chandrashekhar Rao and himself shared mutual respect for each other. He was APCC President and also a Rajya Sabha member while in Congress. When the Congress refused to nominate him to Rajya Sabha for the second time, he resigned from the party and later joined TRS.

In TRS he was twice sent to Rajya Sabha, besides making him party leader in the Parliament. Moreover, he is the Secretary General of the party. At the same time, his daughter was made GHMC Mayor.

Now, after Congress returned to power in the state, he seems to be attracted towards his original party. Recently, Congress Telangana In charge Deepa Munshi met him and his daughter and invited them to join Congress. He is likely to join Congress on Saturday.

Meanwhile, his son Viplav Kumar said that he will continue in BRS and declared his leader will be KCR only. He made it clear that he did not share the idea of his father and sister joining the Congress. Keshava Rao appreciated the decision of his son Viplav Kumar to continue in the BRS.

Dr Sunita Objects Jagan’s Comments On Viveka’s Murder

Once again the murder case of former minister YS Vivekananda Reddy is coming to the fore at the time of election in AP. Chief Minister YS Jaganmohan Reddy’s comments in Proddatur public meeting on Wednesday led to a series of accusations asking him why didn’t attempt to book `culprits’ in the case during his five-year term in office.

Jagan’s allegations that Viveka’s killers are roaming around with the support of opposition TDP leadership attracted harsh reaction, as Jagan made these comments while campaigning alongside Avinash Reddy, who is being accused as an accused in Viveka’s murder.

Jagan’s sister and Viveka’s daughter Dr. Sunitha Reddy responding to the chief minister’s comments blaming her, asked him directly “what is your responsibility if your sister is roaming around the courts?”. Recalling that it has been five years since the death of her father, she asked him what has been done by his government during his period to pick up culprits?

She advised her brother that it is not proper on his part to make wild allegations as if he is in the opposition. Referring to Jagan’s comment that “God knows who killed Viveka and protecting those who killed Viveka”, Dr Sunitha reminded that the person who killed her father  openly admitting who killed and who are behind him (Avinash and Bhaskar Reddy).

She lamented that it is Jagan’s government providing security to the accused in this case. She asked the chief minister why he, as chief minister, tried to prevent a CBI probe, while demanding the same when he was in the opposition?

She wondered how CM Jagan is asking people to vote by keeping the accused in her father’s murder case besides him. She recalled that the CBI is saying that he is the accused.

She deplored that during five years in power, Jagan didn’t remember his Chinnamma (wife of Vivekananda Reddy), but now during the election period he is remembering her. She rubbished it all only to gain sympathy.

Narrating the difference between sisters and brother Jagan, Dr Sunita said that he is fighting for positions, but they are fighting for justice. She urged people not to vote for the murderers of her father.

On the other hand, some BJP senior leaders skipped the office-bearers meeting and core committee meeting held in Vijayawada on Tuesday. BJP former state president Somu Veerraju, Rajya Sabha member G V L Narasimha Rao and state general secretary S Vishnuvardhan Reddy did not attend the meeting. Somu Veerraju was hopeful of contesting from Rajamahendravaram Lok Sabha seat, GVL Narasimha Rao from Vizag and Vishnuvardhan Reddy from Hindupur Lok Sabha constituency.

State president Daggubati Purandeswari, party national general secretary Siddharthanath Singh and other leaders attended the meeting. Siddharthanath Singh told the BJP leaders to work in coordination with the alliance parties in the poll campaign and poll strategies.

భజనపరులకు మాత్రమే ముఖాముఖి ఎంట్రీనా?

ఎర్రగుంట్లలో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ప్రజలతో ముఖాముఖి కార్యక్రమాన్ని నిర్వహించారు. అయిదేళ్ల పాటు అధికారంలో ఉంటూ.. ఊర్లలో తన వాహనశ్రేణి వెళుతూ ఉంటే చాలు.. రోడ్లకు రెండు పక్కలా దుకాణాలు మూయించేసి, పరదాలు కట్టించేసి తిరిగిన జగన్మోహన్ రెడ్డి.. అధికారంలోంచి దిగిపోతున్న ప్రస్తుతతరుణంలో ఏ ఆలోచనతో ప్రజలతో ముఖాముఖి నిర్వహించారనేది తెలియదు. ఎందుకంటే.. ముఖాముఖి అంటే ప్రజలు తమ ప్రభుత్వ అధినేతకు చెప్పుకునే కష్టాలను విని వాటిని పరిష్కరించే చర్యలు తీసుకోవాలి. కానీ ఇప్పుడు జగన్ ప్రభుత్వాధినేత కాదు. కేవలం ఒక పార్టీ నాయకుడు. అధికారం చేతనుండగా ఎవరినీ పట్టించుకోకుండా, ఎవరి మొరలను ఆలకించకుండా.. ఇప్పుడు ముఖాముఖి అనే ప్రహసనం నడిపించారు జగన్.

ఇంతా కలిపి ఆ ముఖాముఖి కార్యక్రమానికి కేవలం భజనపరుల్ని  మాత్రమే అనుమతిస్తున్నారా? అనే అభిప్రాయం ఇప్పుడు రాష్ట్రవ్యాప్తంగా ప్రజలకు కలుగుతోంది. ఎందుకంటే.. ముఖాముఖి కార్యక్రమానికి వెళ్లే ప్రజలను పోలీసులు, అధికారులు పూర్తిగా స్క్రీనింగ్ చేసి, వారి పార్టీ భావజాలాలను కూడా గమనించి.. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి అనుకూలురైన వ్యక్తులను మాత్రమే లోనికి అనుమతిస్తుండడం విశేషం. అంటే కేవలం జగన్ భజన చేసేవారిని, నువ్వు రాగానే మా బతుకులు బాగుపడియాయి అయ్యా.. నువ్విచ్చే డబ్బులతోనే బతుకుతున్నాం అయ్యా అని చెప్పుకునే బాపతు వాళ్లను మాత్రమే ఫుల్ ట్రెయినింగ్ ఇచ్చి మరీ లోనికి పంపుతారన్నమాట.

ఇదంతా ఒక ఎత్తు అయితే.. ఎర్రగుంట్ల ముఖాముఖి సందర్భంగా మరో విచిత్రం చోటు చేసుకుంది. అక్కడ ముఖ్యమంత్రికి వినతిపత్రం ఇవ్వడానికి మాజీ మంత్రి, తెలుగుదేశం పార్టీ అభ్యర్థి భూమా అఖిలప్రయి అక్కడకు వచ్చారు. నిజం చెప్పాలంటే..  ఆమెను అనుమతించి ఉంటే.. జగన్ హుందాతనానికి అది చిహ్నంగా ఉండేది. ఫ్యాక్షన్లకు నెలవైన జిల్లాలో అఖిలప్రియ బ్యాచ్ ను అనుమతించడం వల్ల ఘర్షణ చెలరేగుతుందనే భయం ఉంటే.. ఆమెను ఒక్కదానినీ వినతిపత్రం ఇవ్వడానికి పంపి ఉంటే పోలీసులు కూడా చాలా బాగా వ్యవహరించినట్టు ఉండేది. అయితే.. పోలీసులు ఆమెను అడ్డుకున్నారు. ఆమెకు అనుమతి లేదని, లోనికి వెళ్లడానికి వీల్లేదని అన్నారు.

అఖిలప్రియ వర్గం ముఖాముఖికి వెళ్లేందుకు ప్రయత్నించిగా ఎమ్మెల్యే గంగుల నాని వర్గీయులు వాళ్లపై రాళ్లదాడికి దిగారు. ఘర్షణలు ముదురుతాయని భావించిన పోలీసులు అఖిలప్రియను అరెస్టు చేసి శిరివెళ్ల పోలీసుస్టేషనుకు పంపారు. మొత్తానికి జగన్ ముఖాముఖి అనే పేరు పెట్టి వినతిపత్రాలు స్వీకరించినా కూడా కేవలం పెయిడ్ కూలీల దగ్గరినుంచి మాత్రమే స్వీకరిస్తారని, కొత్తగా ఎవరినీ అనుమతించరని.. ప్రజలు అంటేనే, వారిని కలవడం అంటేనే ఆయన భయపడుతున్నారని పలువురు వ్యాఖ్యానిస్తున్నారు. 

పదేళ్ల తర్వాత మేనిఫెస్టోపై విమర్శలా?

ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి సాగిస్తున్న బస్సు యాత్ర ప్రసంగాల్లో ఒక రకమైన ఆందోళన కనిపిస్తోంది. బిజెపిని పల్లెత్తు మాట అనలేని భయంతో కూడిన నిస్సహాయత ఆయనను వెనక్కు లాగుతోంది. ఎంత తిట్టినా చంద్రబాబును, పవన్ కల్యాణ్ ను మాత్రమే తిట్టాలి. అందుకు తగిన పాయింట్లు ఆయన వద్ద లేవు. తెలుగుదేశం ఇప్పటికే సూపర్ సిక్స్ అనే కీలకమైన హామీలతో పాటూ.. ప్రజలకు అనేకానేక కొత్త వరాలను ప్రకటిస్తోంది. వాటికి కౌంటర్ ఇవ్వాలంటే జగన్మోహన్ రెడ్డికి భయం వేస్తోంది. ఇప్పటికే తెలుగుదేశం విడుదల చేసిన మినీ మేనిఫెస్టో అంశాలను కనీసం చదవాలంటే కూడా జగన్ కు భయం. వాటికి కౌంటర్ ఇవ్వడం తనకు చేతకాదు.. అలాగని, వాటిని మించి అవే పథకాలను నేనే ఇస్తా అని చెప్పడానికి కూడా ధైర్యం లేదు. 2024 ఎన్నికల ప్రచారసభల్లో.. 2014 నాటి తెలుగుదేశం మేనిఫెస్టోలోని అంశాలను, అందులోని హామీలను ప్రస్తావిస్తూ నిందలు వేయడం అనేది.. జగన్ లోని బేలతనానికి నిదర్శనంగా నిలుస్తోంది.

పదేళ్ల కిందటి తెలుగుదేశం పార్టీ మేనిఫెస్టోకు జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు బ్రాండ్ అంబాసిడర్ లాగా వ్యవహరిస్తున్నట్టుగా ఉన్నారు. ప్రతి సభలో అప్పటి పదేళ్ల పాతదైన తెలుగుదేశం  మేనిఫెస్టోను చూపిస్తూ.. అందులోని హామీలను చంద్రబాబునాయుడు మరచిపోయారని, తర్వాత పార్టీ వెబ్ సైట్ లోంచి కూడా దానిని తొలగించారని అంటున్నారు. నిజానికి అందులో చాలావరకు హామీలు తెలుగుదేశం నెరవేర్చినవే. మిగిలిపోయిన ఒకటిరెండు హామీలను మాత్రమే పదేపదే ప్రస్తావిస్తూ విమర్శిస్తున్నారు.

ఒకవేళ జగన్ చేస్తున్న ఆరోపణలన్నీ నిజమే అని కూడా అనుకుందాం. 2014 లో ఇచ్చిన హామీలు చంద్రబాబు నిలబెట్టుకోలేదనే అనుకుందాం. మరి అందుకే కదా.. ప్రజలు 2019లో ఓడించారు. ఇప్పుడు మళ్లీ అదే పాత మేనిఫెస్టోను పట్టుకుని చంద్రబాబును తిట్టిపోయడం వెనుక ఆంతర్యం ఏమిటి?

దానికి ఒక గట్టి కారణమే ఉంది. ఇప్పుడు చంద్రబాబునాయుడు ప్రకటించిన మేనిఫెస్టోలో తిట్టడానికి ఏమీ లేదు. దాదాపుగా ఏడాది కిందట చంద్రబాబు మినీ మేనిఫెస్టో ప్రకటించారు. సూపర్ సిక్స్ ఆయన వాగ్దానాలు బాగా చెలామణీలోకి వచ్చేశాయి. వాటిని ఎదుర్కోవడం ఎలాగో జగన్ కు బోధపడడం లేదు. అసహనానికి గురవుతున్నారు. అందుకే పాత మేనిఫెస్టో పట్టుకుని ఊరేగుతున్నారని అంతా అంటున్నారు. జగన్ కు నిజంగా చంద్రబాబు చిత్తశుద్ధిని విమర్శించే ఆలోచన ఉంటే.. ఇప్పుడు మేనిఫెస్టోలోని అంశాల గురించి మాట్లాడాలి.. అన ప్రజలు కోరుకుంటున్నారు. అవి ఆచరణ సాధ్యమో కాదో చెప్పాలని అంటున్నారు. జగన్ కు కేవలం అప్పులు తేవడం మాత్రమే తెలుసునని, చంద్రబాబునాయుడు అలా కాకుండా.. సంపదసృష్టి కూడా తెలిసిన నాయకుడు అని ప్రజలు వ్యాఖ్యానిస్తున్నారు. 

క్యూ కట్టి నిష్క్రమిస్తున్న గులాబీ నాయకులు!

అధికారాంతమునందు చూడవలె అయగారి వైభోగముల్ అంటారు పెద్దలు. అధికారంలో ఉన్నప్పుడు బెల్లం చుట్టూ మూగే ఈగల్లాగా చుట్టూ ఎందరైనా చేరవచ్చు గాక.. ఆశ్రితులుగా భృత్యులుగా కేసీఆర్ ను సేవించుకుని ఉండవచ్చు గాక..! కానీ.. పదేళ్ల అధికార వైభవం తరువాత ఒకసారి ఎన్నికల్లో ఓడిపోగానే.. ఆయన పరిస్థితి, ఆయన పార్టీ పరిస్థితి అగమ్యగోచరంగా ఉంది. ఇన్నాళ్లూ ఆ పార్టీలో ఉన్న నాయకులు రోజురోజుకూ ఆ పార్టీని వదలి వెళ్లిపోతున్నారు. పార్టీ టికెట్లు ఇస్తాం అంటే వద్దని అంటున్నారు. టికెట్లు ఇచ్చిన తర్వాత, టికెట్లు ప్రకటన పూర్తయిన కొన్ని రోజుల తర్వాత.. ‘తూచ్ ఈ టికెట్ మాకొద్దు’ అని వెళ్లిపోతున్నారు. ఈ పరిణామాలు చూస్తోంటే గులాబీ దళానికి భవిష్యత్తు లేదా అనే సందేహం కలుగుతోంది.

గురువారం నాడు భారాస రాజకీయాల్లో రెండు కీలక పరిణామాలు చోటు చేసుకున్నాయి. కేసీఆర్ తన పార్టీలో ఎంతో గౌరవంగా చూసుకుంటూ వచ్చిన సీనియర్ నాయకుడు, రాజ్యసభ సభ్యుడు 84 ఏళ్ల కె కేశవరావు కూతురుతో కలిసి పార్టీని వీడి కాంగ్రెసులో చేరడానికి నిర్ణయించుకున్నరు. స్వయంగా కేసీఆర్ ఫాం హౌస్ కు వెళ్లి, ఆయనతో చెప్పి, కాస్త ఆయన ఆగ్రహాన్ని కూడా చవిచూసి పార్టీనుంచి నిష్క్రమణను ధ్రువీకరించారు. ఎంతో కాలం కాంగ్రెస్ నాయకుడిగా ఉన్నానని, ఈ వయసులో తిరిగి మాతృసంస్థకు వెళ్లాలని అనుకుంటున్నానని చెప్పారు. పార్టీకి అదొక పెద్ద దెబ్బ అయితే.. వరంగల్ ఎంపీ నియోజకవర్గ రాజకీయం మరొక పెద్ద దెబ్బ.

అక్కడినుంచి పార్టీ అభ్యర్థిగా కేసీఆర్ ప్రకటించిన కడియం కావ్య.. తాను వరంగల్ నుంచి పోటీచేయడం లేదని ప్రకటించారు. మాజీ మంత్రి, ప్రస్తుతం భారాస ఎమ్మెల్యే కూడా అయిన కడియం శ్రీహరి కూతురే కావ్య. వరంగల్ అభ్యర్థిగా తప్పుకుంటున్నట్టు ప్రకటించిన కావ్య ఆ పార్టీలో ఎవరికి వారే అన్న తీరుగా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. ఢిల్లీ లిక్కర్ స్కామ్, ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం ఇత్యాది విషయాలతో పార్టీ భ్రష్టు పట్టిపోయిందని కూడా కావ్య నింద వేశారు. మొత్తానికి కడియం శ్రీహరి, ఆయన కూతురు కావ్య ఇద్దరూ కూడా భారత రాష్ట్ర సమితిని వీడిపోతున్నట్టుగా ప్రకటించారు. శుక్రవారం వారు కాంగ్రెస్ పార్టీలో చేరబోతున్నారు. కేకే, ఆయన కూతురు శనివారం నాడు కాంగ్రెస్ లో చేరుతున్నారు.

హఠాత్తుగా భారాస గ్రాఫ్ దారుణంగా పడిపోయినట్టు కనిపిస్తోంది,. తెలంగాణ జాతిపితగా తనను ప్రకటింపజేసుకున్న కల్వకుంట్ల చంద్రశేఖరరావు పరిస్థితి మరీ దయనీయంగా తయారైపోయిందని ప్రజలు వ్యాఖ్యానిస్తున్నారు. 

లోకేష్- రజినీ మూవీ టైటిల్‌ ఫిక్స్!

కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ లోకేష్‌ కనగరాజ్ ప్రస్తుతం రజినీకాంత్‌ తో ఓ సినిమా చేయబోతున్న విషయం తెలిసిందే. ఈ సినిమాకి ప్రస్తుతం వర్కింగ్‌ టైటిల్ గా తలైవర్ 171 ని అనౌన్స్ చేసిన విషయం తెలిసిందే. అయితే ఈ చిత్రం నుంచి ఓ ఇంట్రెస్టింగ్‌ అప్డేట్‌ ను చిత్ర బృందం గురువారం విడుదల చేసింది.

ఈ సినిమాకు సంబంధించిన టైటిల్‌ టీజర్ విడుదల గురించి ఓ క్లారిటీ ఇచ్చింది. ఏప్రిల్‌ 22న ఈ సినిమా టైటిల్‌ ను రివీల్ చేస్తున్నట్లు మూవీ మేకర్స్ ప్రకటించారు. ఈ విషయాన్ని వెల్లడించానికి చిత్రం బృందం ఓ కొత్త పోస్టర్ ను విడుదల చేసింది. ఇందులో రజినీ కొత్త లుక్ తో ఉండగా.. ఈ పోస్టర్‌ అభిమానులను విశేషంగా ఆకట్టుకుంటుంది.

చేతులకు బేడీలతో స్టైల్‌ గా ఉన్నారు. ఈ పోస్టర్ చూసిన అభిమానులు ఖుషీ అవుతున్నారు. రజినీ లుక్‌ చాలా కొత్తగా ఉందని పేర్కొంటున్నారు.

ఫ్యాషన్ కోసం వేసుకున్నా ప్రెగ్నేంట్‌ ఏనా?

తన ప్రెగ్నెన్సీ రూమర్స్ పై బాలీవుడ్ నటి పరిణీతి చోప్రా స్పందించారు. ఆమె తాజాగా నటించిన చిత్రం అమర్ సింగ్‌ చంకీల .  ఆ సినిమాకు సంబంధించిన ట్రైలర్‌ రిలీజ్‌ ఈవెంట్ లో ఆమె పాల్గొన్నారు. ఆ కార్యక్రమానికి పరిణీతి వేసుకుని వచ్చిన దుస్తుల గురించి ప్రస్తుతం చర్చ నడుస్తుంది. ఆమె తల్లి కాబోతుందని.. అందుకే బేబీ బంప్‌ కనిపించకుండా ఇలాంటి డ్రెస్ వేసుకున్నట్లు చర్చించుకుంటున్నారు.

దీంతో పరిణీతి ఇన్‌ స్టా వేదికగా స్పందించింది. ఫ్యాషన్‌ కోసం వదులుగా ఉండే దుస్తులు వేసుకున్నా.. పెద్ద సైజ్ డ్రెస్‌ ధరించినా…సౌకర్యవంతంగా ఉండే బట్టలు వేసుకుంటే ప్రెగ్నేన్సీ అని భావిస్తారా అంటూ నవ్వు ఎమోజీని ట్యాగ్‌ చేసింది. దీంతో ఆమె గర్భం గురించిన వార్తలకు చెక్ పడింది.

పరిణీతి , ఆప్‌ ఎంపీ రాఘవ్‌ చద్దాను గతేడాది వివాహం చేసుకున్న సంగతి తెలిసిందే. తాజాగా ఆమె నటించిన అమర్‌ సింగ్‌ చంకీల సినిమా కోసం అభిమానులు వెయిట్‌ చేస్తున్నారు. 

మైనపు విగ్రహంతో స్టైలిష్ స్టార్‌!

జాతీయ నటుడిగా పేరు తెచ్చుకున్న ఐకాన్‌ స్టార్ అల్లు అర్జున్‌ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. తనకంటూ ఓ స్పెషల్‌ ఇమేజ్‌ ని సొంతం చేసుకున్నాడు. కేవలం తెలుగులోనే కాకుండా బన్నీ కి ప్రపంచ వ్యాప్తంగా అభిమానులు ఉన్నారు.  ఈ క్రమంలోనే ఆయన కు మరో అరుదైన గౌరవం సొంతం అయ్యింది.

దుబాయ్‌ లోని మేడమ్‌ టుస్సాడ్స్‌ లో గురువారం అల్లు అర్జున్‌ మైనపు విగ్రహన్ని ఆవిష్కరించారు.  దీని గురించి ఎంతో సంతోషంగా ఉన్న బన్నీ సోషల్‌ మీడియా వేదికగా తన అభిమానులకు థ్యాంక్స్ చెప్పడమే కాకుండా.. ఓ స్పెషల్‌ ఫోటోను కూడా పంచుకున్నారు. ప్రతి నటుడికి మైనపు విగ్రహం అనేది ఓ మైలురాయిగా ఆయన పేర్కొన్నారు.

దీనికి సంబంధించిన ఓ ఫోటోను కూడా బన్నీ షేర్‌ చేశారు. అల వైకుంఠపురంలో ఎంతో క్రేజ్‌ సొంతం చేసుకున్న ఐకానిక్‌ సీన్స్‌ కి సంబంధించిన ఫోటోను విగ్రహంగా మ్యూజియంలో ఏర్పాటు చేశారు. విగ్రహంతో బన్నీ బ్యాక్ పోజ్‌ ఇచ్చారు. ఈ ఫోటో అభిమానులను విపరీతంగా ఆకట్టుకుంటుంది.

సభల్లో జనం నిల్ : ఆగ్రహంతో ఊగిపోతున్న జగన్!

‘వై నాట్ 175’ అనే ఆడంబరపు మాట తమ పార్టీ నినాదంగా ఈసారి జగన్మోహన్ రెడ్డి అసెంబ్లీ ఎన్నికలను ఎదుర్కొంటున్నారు. పోయినసారి ఎన్నికల సమయానికి ‘రావాలి జగన్.. కావాలి జగన్’ అనే నినాదంతో ప్రజల మధ్యకు వెళితే, ఈసారి ‘వై నాట్ 175’ అన్నదే ప్రధాన నినాదంగా ఉంది! ఎట్టి పరిస్థితుల్లోనూ నూటికి నూరు శాతం సీట్లు గెలుస్తామని జగన్మోహన్ రెడ్డి దగ్గరి నుంచి ఆ పార్టీ కిందిస్థాయి నాయకుల వరకు చాలా డాంబికంగా పలుకుతున్నారు.

అలాంటి నేపథ్యంలో ‘మేమంతా సిద్ధం’ అంటూ తండ్రికి నివాళులు అర్పించిన తర్వాత బస్సు యాత్ర ప్రారంభించారు జగన్. కడప జిల్లా ప్రొద్దుటూరులో నిర్వహించిన  మొట్టమొదటి బహిరంగ సభ కాస్తా, జనం హాజరు లేక దారుణంగా విఫలం కావడం జగన్మోహన్ రెడ్డిలో ఆగ్రహానికి కారణం అవుతోంది. ప్రొద్దుటూరులో జరిగిన సభకు జన సమీకరణ చేయలేకపోయిన సొంత పార్టీ నాయకుల చేతగానితనం మీద, పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి చిందులు తొక్కినట్టుగా గుసగుసలు వినిపిస్తున్నాయి.

సభకు జనం హాజరు అత్యంత పలుచగా ఉండడం ఆయన ఆగ్రహానికి ఒక కారణం అయితే, ఒకవైపు జగన్ ప్రసంగం సాగుతూ ఉండగానే ప్రజలు లేచి సభాస్థలి నుంచి బయటకు వెళ్లిపోవడం ఇంకొక కారణం! ఎన్ని ఏర్పాట్లు చేసినా, ప్రజలకు డబ్బులు ఇచ్చి ప్రలోభ పెట్టి సభకు తీసుకువచ్చినా తమ పని కాగానే వారు వెళ్ళిపోతున్నారు తప్ప సభ పూర్తి అయ్యేదాకా ఉండడం లేదని నాయకులు తలలు పట్టుకుంటున్నారు.

ప్రొద్దుటూరులో జనం హాజరు లేక వైయస్సార్ కాంగ్రెస్ సభ విఫలం కావడం అనేది ముందు ముందు సభలు జరగబోయే అన్ని ప్రాంతాలకు ఒక హెచ్చరిక లాంటిదని పార్టీ శ్రేణులు భయపడుతున్నాయి. ముందు ముందు జరగబోయే ప్రతి సభకు కూడా విపరీతంగా జన సమీకరణ జరగాలని జగన్ తరఫున ఇప్పటికే ఆయా ప్రాంతాల అభ్యర్థులకు ఆదేశాలు వెళ్లాయి. డబ్బు ఇవ్వగలం, లిక్కర్ పంపిణీ చేయగలం, బిర్యానీలు తినిపించగలం..

అయితే జనాన్ని సభ ముగిసే దాకా కూర్చుండబెట్టడం ఎలాగా అనేది స్థానిక నాయకులకు కూడా అర్థం కావడం లేదు! మధ్యలో వాళ్లు వెళ్లిపోతే మేము ఏం చేయగలం అని తమలో తాము మధనపడుతున్నారు. తన సభలకు జనాన్ని తీసుకురాలేకపోవడం అనేది అభ్యర్థుల వైఫల్యం లాగా జగన్ చూస్తారేమో అని భయపడుతున్నారు.

ప్రొద్దుటూరు సభను ఆయన సొంత టీవీచానెల్ కవర్ చేసిన తీరు గమనిస్తే చాలు.. జనం ఎంత పలచగా వచ్చారో అర్తమైపోతుందని వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. డ్రోన్ షాట్లు లాంగ్ వ్యూలో అస్సలు చూపించకుండా.. జనాన్ని క్లోజ్ లో రద్దగా ఉన్న ప్రాంతాలను మాత్రం చూపిస్తూ.. ఎక్కువగా స్టేజీని మాత్రమే కవర్ చేస్తూ పాపం వారు మేనేజ్ చేశారు. ఇలాంటి కవరేజీ ద్వారా ఆ చానెల్ చూసే ప్రజలను మాయ చేయగలరు తప్ప.. స్వయంగా సభకు ఎందరు వచ్చారో.. ఎందరు పారిపోయారో చూసిన జగన్ కు.. ముందుముందు ఎన్నికల ఫలితం ఎలా ఉండబోతున్నదో క్లారిటీ వచ్చి ఉంటుంది కదా అని పలువురు వ్యాఖ్యానిస్తున్నారు.