వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు రాష్ట్రవ్యాప్తంగా అసహనంతో రగలిపోతున్న వాతావరణం కనిపిస్తూనే ఉంది. రాష్ట్రంలో మెజారిటీ అభ్యర్థులకు తమ ఓటమి ఖరారు అయింది. సొంతంగా చేయించుకున్న సర్వేలు, పోలింగ్ సరైన తర్వాత సొంతంగా సాగించిన అధ్యయనాలలో తమ ఓటమి వారికి స్పష్టంగా తెలిసిపోయింది. అందువల్ల వారంతా అసహనంతో పేట్రేగిపోతుండడం సహజం. అయితే తమాషా ఏమిటంటే ఎమ్మెల్యేలుగా గెలిచే అవకాశం ఉన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు కూడా.. విపరీతమైన ఫ్రస్టేషన్ తో రగిలిపోతున్నారట. ఇన్ని కోట్లు ఖర్చుపెట్టి తాము నెగ్గితే పార్టీ అధికారంలోకి రాకపోతే ఏం చేసుకోవాలి. పెట్టిన పెట్టుబడి మొత్తం బూడిదలో పోసిన పన్నీరే కదా అనేది వారి అసహనానికి కారణం.
ఈ నేపథ్యంలో చంద్రగిరిలో తెలుగుదేశం పార్టీ తరఫున ఎమ్మెల్యే అభ్యర్థి పులివర్తి నాని మీద జరిగిన దాడి.. తదనంతర పర్యవసానాలు కీలకంగా గమనించాలి. ఆసుపత్రి నుంచి డిశ్చార్జి అయిన తర్వాత నా అని చెప్పిన మాటను పరిగణనలోకి తీసుకోవాలి. ‘‘చంపేయండి రా.. బై ఎలక్షన్స్ వస్తాయి’’ అని తనపై దాడి చేసిన వారిలో ఎవరో అన్నట్లుగా తన గన్ మెన్ తో పాటు, మరికొందరు తనతో చెప్పారని పులివర్తి నాని మీడియాకు వెల్లడించారు. అంటే వారు ఓడిపోతారని వారికి అర్థం అయిపోయిందని, తనను చంపేయడం ద్వారా బై ఎలక్షన్ కి వెళ్లాలనుకుంటున్నారని పులివర్తి నాని చెప్పుకొస్తున్నారు.
ఇప్పుడు ప్రజలలో కలుగుతున్న సందేహం ఏంటంటే.. గెలిచే అవకాశం ఉన్న తెలుగుదేశం మరియు కూటమి పార్టీల అభ్యర్థులను ఇలా అంతమొందించేస్తే ఉప ఎన్నికలు వస్తాయని అప్పుడు ఇంకాస్త జాగ్రత్తగా ప్లాన్ చేసుకొని పోలింగుకు అసలు ప్రజలే రాకుండా భయభ్రాంతులకు గురి చేయడం ద్వారా తాము ఈసారి కచ్చితంగా నెగ్గగలమనే ఆశ రాష్ట్రంలో ఇంకా ఎంతమంది వైసీపీ అభ్యర్థులలో ఉన్నదో కదా అని అనుమానం కలుగుతుంది. ఫలితాలు వెల్లడయ్యేవరకు ఈ 20 రోజులు మాత్రమే కాదు ఆ తర్వాత ఎమ్మెల్యేలు గెలిచిన సరే తెలుగుదేశం అభ్యర్థుల ప్రాణాలు గాలిలో దీపాలుగా మారిపోతాయా అనే భయం ప్రజలలో కలుగుతుంది.
పులివర్తి నాని ఒక్కరే కాదని, రాష్ట్రంలో ఇంకా అనేకమంది తెలుగుదేశం ఎమ్మెల్యే అభ్యర్థులను వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి చెందిన వాళ్లు టార్గెట్ చేసినట్టుగా ఉన్నదని ప్రజలు అనుకుంటున్నారు. వేరువేరు ప్రాంతాలలో జరుగుతున్న సంఘటనలు కూడా ఇలాంటి అభిప్రాయాన్ని కలిగిస్తున్నాయి. ముందు ముందు ఏం జరుగుతుందో వేచి చూడాలి.
నాని ఒక్కడేనా.. చాలామందిని టార్గెట్ చేశారా?
‘సొంత వారికి బిల్లు’లపై కోర్టుకెళ్లనున్న కాంట్రాక్టర్లు!
అవసానదశలో కూడా దింపుడు కళ్లెం అప్పులాగా.. రిజర్వు బ్యాంకు నుంచి నాలుగువేల కోట్ల రూపాయల నిధులు తీసుకువచ్చింది జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం. వివిధ పథకాల కింద బటన్లు ఆల్రెడీ నొక్కబడిన వాటి యొక్క లబ్ధిదారులకు పోలింగ్ ముందురోజు వేయాలని అనుకున్న సొమ్ములు 14వేల కోట్ల పైచిలుకు ఉన్నాయి. ఫిబ్రవరి నుంచి రకరకాల పథకాలకు పంచవలసిన డబ్బును పెండింగుపెట్టి.. సరిగ్గా పోలింగ్ కు ముందు డబ్బు వేయడం ద్వారా.. అనుచిత లబ్ధి పొందాలని ప్రభుత్వం అనుకుంది. అయితే ఈసీ ఆ కుట్రకు బ్రేక్ వేసింది.పోలింగ్ తర్వాత ఇచ్చుకోవచ్చునని చెప్పింది.
పోలింగు ముగిసి రెండు రోజులు అవుతోంది… పథకాల లబ్ధిదారులకు నిధులు పంపిన దాఖలాలు కనిపించడం లేదు గానీ.. కొత్తగా సేకరించిన అప్పులతో కలిపి తమ సొంత మనుషులైన కాంట్రాక్టర్లకు వేల కోట్ల రూపాయల బిల్లులు చెల్లించేయడానికి కుట్ర జరుగుతున్నట్టుగా వార్తలు వస్తున్నాయి. అధికారం నుంచి దిగిపోతున్నామని అర్థం కాగానే.. జగన్ ఇలాంటి కుట్రలకు తెరలేపడం గురించి చంద్రబాబునాయుడు గగ్గోలు పెడుతున్నారు. అయితే తాజాగా, విశ్వసనీయంగా తెలుస్తున్న సమాచారాన్ని బట్టి.. చాలాకాలంగా బిల్లులు రాకుండా పెండింగులో ఉన్న కాంట్రాక్టర్లు కొందరు కలిసి.. ముందు పనులు పూర్తిచేసిన వారికే ముందు బిల్లులు చెల్లించాలని కోరుతూ హైకోర్టును ఆశ్రయించే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తోంది.
జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత.. అదివరలో తెలుగుదేశం హయాంలో పూర్తిచేసిన అనేక పనులకు కూడా బిల్లులు చెల్లించకుండా మానేశారు. ఆ తర్వాత పనులు చేసిన వారికి కూడా సక్రమంగా బిల్లులు చెల్లించలేదు. తీరా ఇప్పుడు అధికారం నుంచి దిగిపోయే వాతావరణం ఉన్నట్టు అర్థం కాగానే.. హఠాత్తుగా తనకు కావాల్సిన కొందరికరి వేల కోట్ల బిల్లులు చెక్కులు ఇచ్చేయడానికి ప్రయత్నిస్తున్నట్టుగా పుకార్లు వస్తున్నాయి.
అయితే కొందరు కాంట్రాక్టర్లు కలిసి కోర్టును ఆశ్రయించనున్నట్టు తెలుస్తోంది.
ముందు పనులు చేసిన వారికి ముందు బిల్లులుఇవ్వాలని, లేదా.. ఎన్నికల ఫలితాలు వచ్చే వరకు ఈ బిల్లుల చెల్లింపు కుట్రను ఆపాలని వారు కోరబోతున్నట్టుగా తెలుస్తోంది. జగన్ సర్కారు పతనం కావడానికి ముందు తీసుకున్న చివరి నిర్ణయం కాంట్రాక్టర్లకు దోచిపెట్టడమే. ఈ చివరి నిర్ణయం కూడా కోర్టు ద్వారా ఆగిపోయే వాతావరణం కనిపిస్తోంది.
పెళ్లి కోసం ఎంతగానో ఎదురుచూస్తున్నాను అంటున్న బాలీవుడ్ ముద్దుగుమ్మ!
బాలీవుడ్ టాలెంటెడ్ దర్శకుడు సంజయ్ లీలా భన్సాలీ రూపొందించిన వెబ్ సిరీస్ ‘హీరామండి’ ఇటీవల ప్రేక్షకుల ముందుకు వచ్చిన విషయం తెలిసిందే. స్వాతంత్య్రానికి ముందు పాకిస్థాన్ లాహోర్లో ఉన్న వేశ్య వాటిక హీరామండిలో జరిగిన పలు సంఘటనల ఆధారంగా ఈ సిరీస్ని తెరకెక్కించారు.
ఓటీటీ నెట్ఫ్లిక్స్లో మే 1 నుంచి స్ట్రీమింగ్ అవుతోంది. సోనాక్షి సిన్హా, మనీషా కొయిరాలా, అదితి రావు హైదరి, రిచా చద్ధా, సంజీదా షేక్, షర్మిన్ సెగల్ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ వెబ్ సిరీస్కి మంచి రెస్పాన్స్ వస్తోంది. ప్రచారంలో భాగంగా హీరామండి టీమ్ ‘ది గ్రేట్ ఇండియన్ కపిల్ షో’లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా హోస్ట్ కపిల్ శర్మ.. సోనాక్షి సిన్హాను పెళ్లి గురించి ప్రశ్నించారు.
‘అలియా భట్, కియారా అద్వానీ పెళ్లి చేసుకున్నారు?. మరి మీది ఎప్పుడు’ అని అడగ్గా.. సోనాక్షి వెంటనే అక్కడ నవ్వులు పూయించారు. ‘మీరు నన్ను ఆటపట్టిస్తున్నారు కదా. వివాహ బంధంలోకి అడుగుపెట్టేందుకు నేను ఎంతగా ఎదురుచూస్తున్నానో మీకు తెలుసు. ఎప్పుడో ప్రారంభించిన హీరామండి షూటింగ్ కూడా అయిపోయింది. ప్రేక్షకుల ముందుకు వచ్చేసింది కానీ నాకింకా పెళ్లి కాలేదు. నాకు తప్ప ఈ సిరీస్లో నటించిన అందరికీ పెళ్లిళ్లు అయిపోయాయ’ అని సోనాక్షి అన్నారు.
హీరామండిలో నటించిన షర్మిన్ సెగల్ కూడా పెళ్లి చేసుకుందని కపిల్ శర్మతో సోనాక్షి అన్నారు. వెంటనే మనీషా కొయిరాలా మాట్లాడుతూ… ‘రిచా చద్ధా పెళ్లి చేసుకుని తల్లి కూడా కాబోతుంద’ అని సరదాగా వ్యాఖ్యానించారు. దాంతో అక్కడ నవ్వులు పూశాయి. నటుడు అలీ ఫజల్ను 2023 అక్టోబర్లో రిచా వివాహమాడారు. ఫిబ్రవరి 2024లో తాను గర్భం దాల్చినట్లు ఆమె ప్రకటించారు. షర్మిన్ వివాహం 2023 నవంబర్లో జరిగింది. 2024 మార్చిలో అదితి రావ్ హైదరీ వివాహం జరిగింది. నటుడు జహీర్ ఇక్బాల్తో సోనాక్షి డేటింగ్ చేస్తున్న విషయం అందరికీ తెలిసిందే.
కల్కి ప్రీ రిలీజ్ వేడుక ఎప్పుడంటే!
యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న చిత్రాల్లో మోస్ట్ అవైటెడ్ సినిమా కల్కి 2898 ఏడీ ఒకటి. ఈ సినిమాని మహానటి ఫేమ్ నాగ్ అశ్విన్ తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమా వైజయంతి మూవీస్ బ్యానర్పై భారీ బడ్జెట్ తో రూపుదిద్దుకుంటుంది. ఈ సినిమాలో బాలీవుడ్ స్టార్ అమితాబ్ బచ్చన్, లోకనాయకుడు కమల్ హాసన్ వంటి లెజెండరీ యాక్టర్స్ నటిస్తున్న విషయం తెలిసిందే.
ఈ సినిమాలో ప్రభాస్ సరసన దీపికా పదుకోన్ ,దిశా పటాని హీరోయిన్స్ గా చేస్తున్నారు.ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ లో బిజీ గా ఉంది. ఈ సినిమాను 2024 జూన్ 27న ప్రపంచ వ్యాప్తంగా విడుదల చేసేందుకు మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు.అయితే రిలీజ్ డేట్ దగ్గరపడుతుంటంతో చిత్ర యూనిట్ ప్రమోషన్స్ పై దృష్టిపెట్టినట్లు తెలుస్తుంది. ఇప్పటికే సినిమా నుండి మేకర్స్ రిలీజ్ చేసిన పోస్టర్స్ ,గ్లింప్స్ సినిమాపై భారీగా అంచనాలు పెంచేసాయి.
ఇదిలా ఉంటే ఈ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ని కూడా త్వరలోనే భారీ ఎత్తున నిర్వహించేందుకు చిత్ర బృందం ప్లాన్ చేస్తున్నట్టు సమాచారం. హైదరాబాద్లోని రామోజీ ఫిలిం సిటీలో ఈ మూవీ ప్రీ రిలీజ్ ఈ వెంట్ను మే 22న ఘనంగా నిర్వహించేందుకు మేకర్స్ ప్లాన్ చేసినట్టు సమాచారం.
పుట్టిన రోజు వేడుకలకు దుబాయ్ వెళ్లిన తారక్!
యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం చేతినిండా సినిమాలతో బిజీగా ఉన్నాడు. మాస్ డైరెక్టర్ కొరటాల శివ దర్శకత్వంలో దేవర సినిమా చేస్తూనే , బాలీవుడ్ లో హృతిక్ రోషన్ ప్రధాన పాత్రలో రూపుదిద్దుకుంటున్న వార్ 2 సినిమాలో ఓ ముఖ్య పాత్రలో చేస్తున్నాడు. ప్రస్తుతం వార్ 2 షూటింగ్ లో కూడా తారక్ పాల్గొంటున్నారు. దీనితో వరుస షూటింగ్ ల వల్ల ఎన్టీఆర్ కు తీరిక కూడా దొరకడం లేదు. ఇదిలా ఉంటే మే 20 బర్త్ డే అనే విషయం తెలిసిందే.
ఈ సందర్భంగా తన బర్త్ డే వెకేషన్ కోసం ఎన్టీఆర్ దుబాయ్ వెళ్లిపోయారు. ఎన్టీఆర్ పుట్టినరోజు అంటే ఆ రోజు అభిమానులకు పెద్ద పండగే. అయితే ఎన్టీఆర్ బర్త్ డే సందర్భంగా తన అప్ కమింగ్ మూవీస్ నుంచి స్పెషల్ అప్డేట్స్ కోరుకుంటారు. తాజాగా ఎన్టీఆర్ దేవర మూవీ నుంచి ఫస్ట్ సాంగ్ రిలీజ్ కానున్నట్లు తెలుస్తుంది. అలాగే వార్ 2 మూవీ నుంచి ఒక క్రేజీ అప్డేట్ రాబోతుంది.
అలాగే దీనితో పాటు స్టార్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ తో చేయబోయే సినిమాకి సంబంధించిన అప్డేట్ కూడా రానున్నట్లు సమాచారం. ఇలా వరుస క్రేజీ అప్డేట్స్ తో తారక్ తన బర్త్డే కు ఫ్యాన్స్ కు స్పెషల్ ట్రీట్ రాబోతున్నట్లు తెలుస్తుంది. తన సినిమా అప్డేట్స్ తో ఎన్టీఆర్ ఫ్యాన్స్ పండగ చేసుకుంటే.. ఎన్టీఆర్ తన ఫ్యామిలీతో తన బర్త్డే జరుపుకునేందుకు దుబాయ్ బయల్దేరి వెళ్లారు .ప్రస్తుతం ఎన్టీఆర్ వెకేషన్ కు వెళ్తున్న పిక్స్ సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.
కొండన్నకు జోడి దొరికేసిన్నట్లేనా?
టాలీవుడ్ యంగ్ అండ్ రౌడీ హీరో విజయ్ దేవరకొండ హిట్టు ఫ్లాపులతో సంబంధం లేకుండా బ్యాక్ టు బ్యాక్ సినిమాలను చేసుకుంటూ వెళ్లిపోతున్నాడు. నిన్న కాక మొన్న వచ్చిన ఫ్యామిలీ మ్యాన్ సినిమా ప్లాప్ గా నిలిచినప్పటికీ కూడా దిల్ రాజు మరోసారి విజయ్తో కలిసి పని చేస్తున్నారు. ఇటీవల విజయ్ బర్త్ డే సందర్బంగా సినిమాను అనౌన్స్ చేసిన సంగతి తెలిసిందే.
తాజాగా ఈ సినిమాకు హీరోయిన్ దొరికేసినట్లు తెలుస్తుంది. ఈ యాక్షన్ డ్రామాలో ఫిదా బ్యూటీ సాయి పల్లవి విజయ్ తో జత కట్టబోతుందునే వార్త ఇండస్ట్రీలో వినిపిస్తుంది. ఈ పాత్రకి సాయి పల్లవి అయితేనే బాగా సూట్ అవుతుందని డైరెక్టర్ బలంగా నమ్ముతున్నారు. అందులోనూ సాయి పల్లవిని దృష్టిలో పెట్టుకునే ఈ క్యారెక్టర్ను రాశారట దర్శకుడు.
ఈ పాత్రకు సినిమాలో ఎక్కువగా స్కోఫ్ ఉన్నట్లు తెలుస్తుంది. అందుకే ఆమెతో చర్చలు జరుపుతున్నట్లు తెలుస్తుంది. సాయి పల్లవి దిల్ రాజు కాంబో లో ఫిదా, ఎంసీఏ సినిమాల్లో నటించింది. కాబట్టి ఈ చిత్రానికి సాయి పల్లవిని ఒప్పించడం పెద్ద కష్టమేమీ కాదని అనుకుంటున్నారు. అయితే సాయి పల్లవి ఇప్పటివరకు ఎప్పుడు విజయ్ తో స్క్రీన్ షేర్ చేసుకోలేదు.. బేసిగ్గా అమ్మడు రొమాన్స్ కు కాస్త దూరంగా ఉంటుంది.. సాయి పల్లవి ఇలాంటి సన్నివేశాల్లో అస్సలు నటించదు. ఇప్పుడు ఇదే రౌడీ ఫ్యాన్స్ని కాస్త టెన్షన్ పెడుతుంది. మరి ఆమెకు తగ్గట్లు సీన్స్ ఉంటాయో లేక ఏదైనా మ్యాజిక్ చేస్తారో చూడాలి.
EC Summons DGP, CS Amid Fear Of Security At EVM Strong Rooms
The Central Election Commission of India (ECI) has expressed its anger over the violent incidents that took place in many places including Palnadu and Chandragiri, even after polling. It is more worried over ruling party goons reported plots at strongrooms, where EVMs were deposited.
Chief Electoral Officer Mukesh Kumar Meena has summoned Chief Secretary Jawahar Reddy and DGP Harish Kumar seeking explanation on the incidents of post-poll violence. He ordered the DGP to take immediate action against those responsible for the riots.
As it was identified that YCP candidates were responsible for post-poll violent incidents, Meena directed to keep all such candidates under house arrest. He said that probationary orders were promulgated under Section 144 in all such places and additional forces were deployed.
He warned that those responsible for such incidents will be booked and sent to jail. AP asked the DGP to arrest those who vandalized EVMs and send them to jail. He also warned that strict action will be taken against the police who acted negligently in preventing the incidents that took place in many districts. CEO MK Meena stated that a police picket has been set up in 715 areas in the state.
Meanwhile, no matter how many measures the Election Commission is taking the ruling party leaders are reportedly planning for large-scale manipulations at the strong rooms where the EVMs are kept. It is suspected that violent incidents taking place in Macherla, Karampudi, Tirupati, Tadipatri, Narasaraopet and other places were part of such a plot.
Opposition leaders alleged that the police force has completely failed to stop the attacks. In addition to this, some policemen are still paying attention to the YCP leaders in some areas. Police have identified seven policemen in Macherla, who had provided prior information on movements of additional forces to the local YCP candidate. They were kept under suspension.
In Four Phases Polling, AP Tops With 82% Voting
In the four phases of polling held so far, Andhra Pradesh has registered the highest turnout in the country at around 82 percent. In AP, Darsi assembly registered the highest polling of 90.99 percent in Prakasam district, followed by highest polling among LoK Sabha seats in Ongole with 87.07 percent.
Tirupati registered lowest polling among Assemblies with 62.32 percent, as against 65.9 percent in 2019, 65.9. Visakhapatnam Lok Sabha registered lowest turnout among Lok Sabha seats with 71.11 percent, as against 67 percent polled in 2019.
The number of postal ballots polled were almost doubled then last time. While as many as 56,000 postal ballots were rejected in 2019, this time due to care taken such rejection was avoided.
Chief Electoral Officer Mukesh Kumar Meena said that out of a total of 4,13,33,702 voters in AP, 3,33,40,560 of them voted for 25 parliamentary constituencies and 3,33,40,333 voters were cast in 175 assembly constituencies. 227 voters, who voted for Lok Sabha did not voted for Assembly.
A total of 80.66 percent polling took place in the EVM polling. Moreover, 4.44 lakh postal ballots were received. If votes of elderly, disabled and those who voted at home also included, a total of 4.97 lakh people voted. He said that 81.81 percent (almost 82 percent) polling took place in AP.
Though the polling was to be concluded at 6 pm, a large number of voters were seen at many polling booths and in some booths it continued till 2 am next day. He said that there was a delay in handing over the EVMs. It was explained that due to weather problems, delay in polling in some places, rains in Konaseema and Srikakulam, polling was held till the early hours of the next day.
He said that polling continued immediately even where the EVMs were broken. Stating that observers have not recommended re-polling anywhere in the state, he said that EVMs of 175 Assembly and 25 Parliament centers have been secured in strong rooms.
He said that 350 strong rooms have been set up in 33 locations across the state and separate centers have been set up for Lok Sabha and Assembly. He said that in 2019, 79.77 percent polling was done in AP, which is 1 percent more than the previous year.