Home Blog Page 869

Center Provided Z Category Security To Nara Lokesh

The Central government has provided Z category security to TDP National General Secretary Nara Lokesh. He will be protected by ten armed men at all times. Armed commandos of the VIP wing of the Central Reserve Police Force (CRPF) will stand guard from Sunday.

On Sunday, 33 central personnel will reach Lokesh’s house with weapons. The state government and Lokesh received information to this effect from Delhi on Saturday evening. The National Security Force has replaced the security that the state government has deliberately reduced.

Soon after coming to power, YS Jaganmohan Reddy government downgraded the security of both former chief minister N Chandrababu Naidu and also his son and former IT Minister Lokesh from Z category to normal, keeping  2+2 security cover. However, immediately, Chandrababu Naidu’s security was restored with the judicial intervention.

Before 2019, the then Security Review Committee recommended to the Center that Lokesh, who served as the state’s IT and Panchayat Raj minister, required JD category security.

The influence of Maoists in AOB, the fact that Maoists have repeatedly warned that they will end Chandrababu’s family, and the killing of an MLA and former MLA by Maoists before the last election, the police increased security for Lokesh in the previous government.

The subsequent YCP government reduced the security of Lokesh due to political malice. Ignoring the recommendations of the Security Review Committee, Y category security was provided and Lokesh was prevented from moving freely outside.

Being a key leader in the main opposition party, he wrote letters 14 times to the state home department and the police boss asking for JD category security, but there was no response.

However, a law has been made to provide protection to Chief Minister Jagan Mohan Reddy’s family members in the country and abroad by forming a unit with more than 400 special armed men.

As the state government did not pay attention, the officials supervising Lokesh’s security wrote letters to the Governor and the Central Home Ministry to increase security. The Center responded by writing a letter explaining the need for security in the Yuvagalam Padayatra along with the videos of YCP inspired riots, physical attacks and other security issues.

KTR Serves Legal Notices To Social Media Channels

BRS working president and former minister KT Rama Rao, who is nowadays focusing more on keeping up morale of the party cadre in view of ruling Congress party engineering large scale defections aiming at dismantling of the erstwhile ruling party.  In this process, he is adopting an aggressive nature against his critics.

Taking severe exception towards a few social media channels and television channels, who are airing negative news stories against him, he served legal notices. Notices were serviced on Saturday against channels allegedly continuing publishing baseless reports with the sole intention of tarnishing his image and to defame his family.

Moreover, he warned such social media channels and television news channels to mend their ways and desist from publishing false and baseless reports. It may be recalled that when a few social media channels received legal notices, they had removed the videos and other baseless content.

The channels served notices include Mahaa News, iNews, Cr Voice, Mana Tolivelugu TV, Manam TV, Poly Tricks, Revanth Dandu, Wild Wolf News, Red TV and YouTube.

“In a planned manner, these channels are spreading false propaganda to defame me and my family. All this conspiracy is being done as part of the bigger agenda in the garb of media”, he alleged in the legal notices.

He further added that their pictures are being deliberately used in reports that were no way connected to them, besides creating thumbnails to derive mileage.

Once again, he warned the channels to remove the videos and other contents pertaining to him and his family that were uploaded on their respective channels with ulterior motives.

వారెవ్వా.. వైసీపీ! చేతల్లో అవమానం.. మాటల్లో పొగడ్తలు!

వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి ఉన్న కొద్ది మంది సీనియర్ నాయకుల్లో ప్రకాశంజిల్లా కందుకూరు ఎమ్మెల్యే మహీధర్ రెడ్డి కూడా ఒకరు. వైఎస్ రాజశేఖర రెడ్డితో కూడా సన్నిహితంగా మెలిగిన నాయకుల్లో ఒకరుగా గుర్తింపు ఉన్న మహీధర్ రెడ్డి తదనంతర పరిణామాల్లో వైఎస్సార్ కాంగ్రెస్ లో ఉన్నారు. వైఎస్సార్ తో అనుబంధం ఉండి, వైఎస్సార్ కాంగ్రెస్ లో మిగిలిన కొద్దిమందిలో ఆయన కూడా ఒకరు. అలాంటి సీనియర్ నాయకుడికి జగన్మోహన్ రెడ్డి ఈ విడత ఎన్నికల్లో టికెట్ నిరాకరించారు. కందుకూరు నియోజకవర్గం నుంచి బుర్రా మధుసూదన్ యాదవ్ కు టికెట్ ఇచ్చారు. ముందుగా సరైన సమాచారం కూడా ఇవ్వకుండా చాలా అగౌరవంగా టికెట్ తిరస్కరించారని మహీధర రెడ్డి వర్గం ఆవేదన వ్యక్తం చేసింది కూడా. అయితే.. ఆయన నియోజకవర్గంలో ఎన్నికల ప్రచారం నిమిత్తం ఆత్మీయ సమావేశం నిర్వహించిన నెల్లూరు ఎంపీ అభ్యర్థి విజయసాయిరెడ్డి మాత్రం తన మాటలతో నవనీతం పూస్తున్నారు. మహీధర రెడ్డిని ఆకాశానికి ఎత్తేసేలా పొగుడుతున్నారు. తన మాటల మాయాజాలాన్ని ప్రదర్శిస్తున్నారు.

విజయసాయిరెడ్డి ఇంతకూ ఏం అంటున్నారంటే.. ఈ ఎన్నికల్లో గెలిచిన తర్వాత మహీధర్ రెడ్డి మాటనే వేదంగా భావిస్తారట. ఆయన ఆలోచనలు, సూచనలను తప్పకుండా పాటిస్తారుట. తాను, తనతోపాటు మహీధర్ రెడ్డిని తోసిరాజని ఆయన అవకాశాన్ని దక్కించుకున్న ఎమ్మెల్యే కేండిడేట్ బుర్రా మధుసూదన యాదవ్ కూడా ఇలా చేస్తామని విజయసాయి అంటున్నారు. పైగా ఇలాంటి కల్లబొల్లి కబుర్లకు ‘వేంకటేశ్వర స్వామి సాక్షిగా’ అంటూ దేవుణ్ని కూడా ప్రమాణంలో ఒడ్డడం విశేషం.

మహీధర్ రెడ్డి మద్దతు లేకుంటే ఎంపీగా తన గెలుపుతో పాటు, ఎమ్మెల్యేగా బుర్రా గెలుపు కూడా అసాధ్యం అవుతుందని విజయసాయి చెబుతున్నారు. మహీధర రెడ్డి తన వర్గం అనుచరులతో ఏర్పాటుచేసిన ఆత్మీయ సమావేశం గనుక.. ఆయన ముఖప్రీతి కోసం విజయసాయి ఇలాంటి నయవంచన మాటలు చెబుతున్నట్టుగా ఆయన అనుచరులే భావిస్తున్నారు.

మహీధర్ రెడ్డి ఆలోచనలు, సూచనలు నిజంగా అంత విలువైనవి అనే నమ్మకం ఉన్నట్లయితే ఆయనకే టికెట్ ఇచ్చి ఉండొచ్చు కదా.. అనేది అభిమానుల ప్రశ్నగా ఉంది. దీనికి విజయసాయి ఏం చెబుతారో గానీ.. విజయసాయి చెప్పినంత అనన్యమైన ప్రజాదరణ కలిగి ఉన్నప్పటికీ.. జగన్ ద్వారా టికెట్ నిరాకరింపబడి.. రాజకీయాల మీదనే వైరాగ్యం పెంచుకున్న మహీధర రెడ్డి మాట్లాడుతూ.. ఇప్పటి ఆర్థిక రాజకీయాల్లో తాను ముందుకు నడవలేకపోతున్నానని అనడం విశేషం. అలాగే శాసనమండలి మీద కూడా ఆసక్తి లేదని అనడం ద్వారా.. ఆయన సూచన ప్రాయంగా తన రాజకీయ సన్యాసాన్ని ప్రకటించారు. ఆయన తన మాటలతో.. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీల్లో కోట్లు కుమ్మరించగలవారికి మాత్రమే టికెట్లు ఇస్తారనే భావం ధ్వనిస్తున్నదని పలువురు వ్యాఖ్యానిస్తున్నారు.

జగన్‌కు అవినాష్ అంటే ప్రేమ కాదా? భయమేనా?

నా తమ్ముడు’ అంటూ చిన్నాన్న కొడుకును వెనకేసుకు వస్తూ ఉంటే.. కడప ఎంపీ అవినాష్ రెడ్డి మీద ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి ఉన్నది అలవిమాలిన అభిమానమో, ప్రేమో అని ప్రజలందరూ అనుకుంటూ ఉన్నారు. కానీ ఇప్పుడు చంద్రబాబునాయుడు ఇస్తున్న క్లారిటీతో జనం కళ్లు తెరచుకుంటున్నాయి. అవినాష్ రెడ్డి పట్ల జగన్ కు ఉన్నది ప్రేమ కాదు, భయం మాత్రమే అని వారు కూడా నమ్ముతున్నారు.

కడపజిల్లాలో ఏ ప్రొద్దుటూరు వేదికగా అయితే ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి తన ఎన్నికల ప్రచారసభలో.. వివేకానందరెడ్డి హత్య కేసును చంద్రబాబునాయుడుకు ముడిపెట్టడానికి ప్రయత్నించారో అదే ప్రొద్దుటూరు నుంచి వివేకా హత్యను ప్రస్తావిస్తూ జగన్ దుర్బలత్వాన్ని, హత్య చేయించినట్టు ఆరోపణలు ఎదుర్కొంటున్న అవినాష్ రెడ్డి అంటే జగన్ కు ఉన్న భయాన్ని చంద్రబాబునాయుడు ఎండగట్టారు.

ప్రొద్దుటూరులో నాలుగురోజుల  కిందట జగన్ మాట్లాడుతూ.. చిన్నాన్న వివేకానందరెడ్డిని హత్య చేసింది ఎవరో ప్రజలందరకూ తెలుసునని చెప్పారు. దస్తగిరిని గుర్తుచేసేలా..హత్యచేసిన వారు బయట హాయిగా తిరుగుతున్నారని, వారికి ఎవరు మద్దతు ఇస్తున్నారో అందరికీ తెలుసునని చంద్రబాబుపై నిందలు వేశారు. చెల్లెమ్మలను కూడా తన మీదికి ఎగదోస్తున్నారంటూ.. చంద్రబాబును కుట్రదారుడిగా ప్రొజెక్టు చేసే ప్రయత్నం చేశారు.

అయితే ఆ మరురోజే వివేకా కూతురు సునీత ప్రెస్ మీట్ పెట్టి మరీ.. జగన్ మాటలకు ఘాటైన కౌంటర్ ఇచ్చారు. ఇన్నాళ్లూ హంతకులను కాపాడుతూ కూర్చుని.. ఇప్పుడు చిన్నాన్న హత్యను కూడా రాజకీయంగా వాడుకోవాలని చూస్తున్నావా అంటూ ధ్వజమెత్తారు. చంద్రబాబు చెప్పిన కోణంలోంచి గమనిస్తే.. అవినాష్ రెడ్డిమీద అభిమానంతో  కాపాడే ప్రయత్నం కంటె, ఆయన పట్ల భయంతో జగన్ కాపాగడాలని చూస్తున్నట్టు  కనిపిస్తోంది. జగన్ కీలకరహస్యాలు అన్నీ అవినాష్ చేతుల్లో ఉన్నాయని చంద్రబాబునాయుడు అంటున్నారు. అవినాష్ రెడ్డితో తేడా వస్తే.. వివేకా హత్య కేసులో తాను కూడా ముద్దాయి అవుతాననే భయం జగన్ లో ఉన్నదని చంద్రబాబు ఎద్దేవా చేశారు.

ఈ మాటలు ప్రజలకు మాత్రం నమ్మశక్యంగానే ఉన్నాయి. ఎందుకంటే.. జగన్ మాటల్లోనే ‘స్వయంగా నేనే చంపాను’ అన్న దస్తగిరి మాటలను నమ్ముతూ చెబుతున్నారు. అదే సమయంలో తనతో ఆ హత్య చేయించింది అవినాష్ రెడ్డే అనే  మాటలను మాత్రం జగన్ కొట్టి పారేస్తున్నారు.కుట్ర కింద అభివర్ణిస్తున్నారు. వివేకా హత్య కేసులో అవినాష్ రెడ్డి పాత్ర కడప జిల్లా వ్యాప్తంగా పార్టీ పరువు తీసేస్తున్నప్పటికీ, ప్రజల్లో జగన్ మీదనే అపనమ్మకం పెరుగుతున్నప్పటికీ.. ఆయన అవినాష్ కు మళ్లీ టికెట్ కేటాయించి తల బలహీనత చాటుకున్నారనే చర్చ నడుస్తోంది. అదే పాయింట్ ను ఇప్పుడు చంద్రబాబు రాష్ట్రవ్యాప్తంగా చర్చకు పెడుతున్నారు.

ఈసీ బ్రేక్ తో వైసీపీలో విషాదం, భయం!

వాలంటీర్ల ద్వారా ఇంటింటికీ సంక్షేమ పథకాల పేరుతో పెన్షను డబ్బులను పంపిణీ చేయడం మాత్రమే కాదు.. వారిద్వారా జగన్మోహన్ రెడ్డికి అనుకూల ప్రచారం చేయించుకోవచ్చునని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ చాలా చాలా ఆశలు పెంచుకుంది. అంతే కాదు.. జగన్ మళ్లీ గెలవకపోతే మీకు పెన్షన్లు కూడా రావు.. అంటూ ముసలివాళ్లను బెదిరించాలని కూడా అనుకుంది. ఇంకా అనేక రకాల వక్రప్రయోజనాలను ఆశిస్తూ, వక్రవ్యూహాలకు తెరతీస్తూ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు వాలంటీర్లకు అదనంగా తాయిలాలు.. భారీగా నగదు ముట్టజెప్పి లోబరచుకునే ప్రయత్నం చేస్తూ వచ్చారు. అయితే.. కోడ్ అమల్లో ఉన్న ఈ రెండు నెలల వ్యవధిలో సంక్షేమ పథకాల సొమ్ములను లబ్ధిదారులకు చేరవేయడానికి వాలంటీర్లను వాడుకోకూడదంటూ కేంద్ర ఎన్నికలసంఘం తీసుకున్న నిర్ణయం ఇప్పుడు అధికార పార్టీకి భయం పుట్టిస్తోంది. వారిద్వారా ఎన్నెన్నో సాధించవచ్చునని ఊహించుకుంటే.. ఇప్పుడు ఈసీ వేసిన బ్రేక్ వల్ల అదంతా సాధ్యం కాదని విషాదం అలముకుంది.

జగన్ చాలా ముందు చూపుతో తీసుకువచ్చిన వ్యవస్థ వాలంటీర్ల వ్యవస్థ. వీరిద్వారా ఇంటింటికీ డబ్బులు అందజేస్తున్నారు. ప్రతి యాభై ఇళ్లకు ఒకరు వంతున వాలంటీర్లు నిత్యం ఆ ప్రజలతో టచ్ లో ఉండేలా చూస్తున్నారు. వీరిని వాడుకుంటూ ఎన్నికల్లో మానిప్యులేషన్ చేయవచ్చుననేది, నియామకం సమయంలోనే ఆయన దూరాలోచన. దానికి తగ్గట్టుగానే వాలంటీర్లతో సమావేశాలు, శిక్షణలు నిర్వహించిన ప్రతి సందర్భంలోనూ వాలంటీర్లంటే అందరూ మన పార్టీ కార్యకర్తలే, జగన్ ను మళ్లీ సీఎం చేయడానికి మనమంతా కష్టపడి పనిచేయాలి అంటూ.. నాయకులు ఊదరగొడుతుండేవారు.

ఎన్నికలు దగ్గరపడిన తర్వాత.. పార్టీ అభ్యర్థులు అందరూ వాలంటీర్లను పోగేసి వారి భారీగా తాయిలాలు, నగదు కానుకలు ఇచ్చి.. తమకు అనుకూలంగా ఇంటింటికీ వెళ్లి లబ్ధిదారులకు చెప్పాలంటూ కోరుతూ వస్తున్నారు.

వాలంటీర్లు ఎటూ డబ్బుతో.. అన్ని ఇళ్లూ తిరుగుతూ ఉంటారు గనుక.. జూన్ మొదటి వారంలో పేద ప్రజల ఓట్లను కొనుగోలు చేయడానికి పార్టీ డబ్బులను కూడా వాలంటీర్ల ద్వారా ఇంటింటికీ చేరవేయవచ్చునని.. అభ్యర్థులు రకరకాలుగా ప్లాన్ చేశారు. ఇలాంటి కుట్రలను ఊహించి.. వాలంటీర్లను ఎన్నికలకు దూరంపెట్టాలని, కోడ్ సమయంలో పథకాల అమలులో వారి పాత్ర లేకుండా చేయాలని విపక్షాలు కోరుతూ వచ్చాయి. రాష్ట్ర ఎన్నికల సంఘం ప్రధానాధికారిగా గతంలో పనిచేసిన నిమ్మగడ్డ రమేశ్ కుమార్ కూడా ఈసీకి ఈ మేరకు లేఖ రాశారు. వాలంటీర్ల వల్ల వాటిల్లే విపరిణామాలను ఆయన వివరించారు. మొత్తానికి కేంద్ర ఎన్నికల సంఘం స్పందించింది. వాలంటీర్ల ద్వారా పథకాల అమలు చేయవద్దంటూ ఆదేశాలు ఇచ్చింది. దీంతో వైసీపీ శ్రేణులకు డబ్బు పంపిణీ గురించి అనువైన మార్గం చేజారిందని భయం పుట్టినట్టు ప్రజలు అనుకుంటున్నారు. 

జగన్ పేదరికంపై పవర్ స్టార్ ఎటాక్!

ముఖ్యమంత్రిగా అధికారంలోకి వచ్చిన తర్వాత వైఎస్ జగన్మోహన్ రెడ్డి కొన్ని కొత్త పదాలను నేర్చుకున్నారు. ‘క్లాస్ వార్’ అనేది అలాంటి పదాలలో ఒకటి! సీఎం అయిన రోజు నుంచి- ఏ వేదిక ఎక్కి ఏ సందర్భంలో ప్రసంగిస్తున్నా సరే సందర్భశుద్ధి లేకుండా తనకు ప్రతిపక్షాలకు మధ్య క్లాస్ వార్ జరుగుతున్నదని జగన్ మోహన్ రెడ్డి అంటూ ఉంటారు. రాష్ట్రంలో జరుగుతున్నది పేదలకు- పెత్తందారులకు మధ్య పోటీ అని, సమరమని ఆయన రకరకాలుగా అభివర్ణిస్తూ ఉంటారు. తాను పేదవాడినని, తనకు మీడియా గానీ, సొంత పత్రికలు గాని, టీవీ ఛానల్‌లు గానీ లేవని రకరకాలుగా తన పేదరికం గురించి ఆయన ప్రకటనలు చేస్తూ ఉంటారు. అయితే  ఆ రకంగా జగన్మోహన్ రెడ్డి చెప్పుకునే పేదరికం గురించి పవన్ కళ్యాణ్ తాజాగా తన ప్రచార సభలో ఒక రేంజిలో ఫైర్ అయ్యారు. ఊరికొక రాజ భవనం కట్టుకొని తులతూగుతూ ఉండే జగన్మోహన్ రెడ్డి- పేదవాడా అని పవన్ ప్రశ్నిస్తున్నారు. ఆయనకు సొంత పత్రిక సొంత టీవీ ఛానల్ ఉన్న సంగతి ప్రజలకు తెలియదా? ఇంత దారుణంగా అబద్ధాలు చెప్పే వ్యక్తిని ప్రజలు ఎందుకు నమ్మాలి? ఎలా నమ్ముతారు? అని పవన్ కళ్యాణ్ ప్రశ్నిస్తున్నారు!!

రాష్ట్రవ్యాప్తంగా ప్రజలను అనేక రకాలుగా జగన్మోహన్ రెడ్డి మోసం చేశారని పవన్ ఆరోపిస్తున్నారు. రాష్ట్రంలో ఏ మూల కూడా ఏ ప్రాంతంలో కూడా నిర్దిష్టమైన ఒక్క అభివృద్ధి కార్యక్రమాన్ని కూడా ఈ ప్రభుత్వం చేపట్టలేదని పవన్ చెప్పుకొచ్చారు. రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో తీసుకెళ్లే ప్రయత్నంలో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం సవ్యంగా పనిచేసే ఉంటే గనుక, ఈరోజున పవన్ కళ్యాణ్ అవసరంలేనే లేదని, వారు అలా చేయకపోయినందువలన మాత్రమే తాను క్రియాశీలంగా తలపడాల్సి వస్తున్నదని పవన్ కళ్యాణ్ వివరణ ఇచ్చుకున్నారు.

రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో తీసుకువెళ్లాలని ఏకైక లక్ష్యంతో మాత్రమే జనసేన తెలుగుదేశం భారతీయ జనతా పార్టీ మూడు కలిసి పొత్తు పెట్టుకున్నాయని ఆయన కూడా ఆయన వివరించారు. పదేపదే తన పేదరికం చెప్పుకుంటూ, ప్రజలను ఎన్నిసార్లయినా మోసం చేయగలనని అనుకునే ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి వైఖరికి పవర్ స్టార్ మాటలు చెంపపెట్టు లాంటివని ప్రజలు వ్యాఖ్యానిస్తున్నారు. ప్రత్యేకించి.. తాను పేదవాడిని అని పదేపదే చెప్పుకునే కొద్దీ.. ప్రజల్లో అబద్ధాలు చెప్పే నాయకుడిగా జగన్ గురించి అందరూ అనుకుంటారే తప్ప.. అలాంటి నాటకీయమైన మాటలను ఒక్కరు కూడా నమ్మరు అనే అభిప్రాయం సర్వత్రా వ్యక్తమవుతోంది.

వయసు మాట ఎత్తకుండా ఉతికి ఆరేసిన చంద్రబాబు!

జగన్మోహన్ రెడ్డి తన ప్రసంగంలో చంద్రబాబునాయుడు ప్రస్తావన వచ్చిన ప్రతిసారీ ‘ఒక ముసలాయన ఉన్నాడు..’ అంటూ వెటకారంగా మాట్లాడుతూ ఉంటారు. ప్రత్యర్థులు మాత్రమే కాదు, చనువు ఉన్న తమ సొంత మనుషులు అయినా సరే.. వారి వయసులోని ముసలితనం గురించి, శారీరక వైకల్యాల గురించి మాట్లాడడం అనేది ఎప్పుడూ మంచి పద్ధతి కాదు. అది వాచాలత్వమూ చవకబారుతనం కిందికి వస్తుంది. జగన్ మాత్రం ప్రతిసందర్భంలోనూ చంద్రబాబు విషయంలో అదే పనిచేస్తుంటారు. అయితే చంద్రబాబు మాత్రం తాజాగా తన ఎన్నికల ప్రచారంలో.. తన వయసు గురించి మరోమారు మాట్లాడే సాహసం చేయకుండా.. జగన్ కు చాలా స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. మళ్లీ నోరుమెదపని పరిస్థితి క్రియేట్ చేశారు.

‘నా వయసు గురించి జగన్ మాట్లాడుతున్నారు. నాలాగా రెండు గంటలు ఎండలో నిల్చో జగన్.. నీ కథ తేలిపోతుంది అంటూ చంద్రబాబు సవాలు విసిరారు. బేసిగ్గా చంద్రబాబునాయుడు ఎంత సీనియర్ నాయకుడు అయినప్పటికీ.. ఆయన ఫిట్ నెస్ విషయంలో చాలా పద్ధతిగా ఉంటారు. మితాహారం తీసుకుంటారు. ఆయనలా శారీరక కష్టానికి సిద్ధంగా ఉండగల రాజకీయ నాయకుడు సమకాలీననేతల్లో దేశంలోనే మరొకరు లేరంటే అతిశయోక్తి కాదు. నిజానికి ఈ ఎన్నికలకు ముందు చంద్రబాబునాయుడే రాష్ట్రవ్యాప్త పాదయాత్రకు సిద్ధపడ్డారు గానీ.. పార్టీ ఇతర అవసరాలు.. అనేక వ్యూహరచనల కారణంగా పాదయాత్రను లోకేష్ తో చేయించారు.  ఇప్పటికీ రాష్ట్రవ్యాప్త పాదయాత్ర చేయగల స్థాయి ఫిట్ నెస్ ఉన్న వ్యక్తి చంద్రబాబు అనడంలో సందేహం లేదు. అయితే జగన్ మాత్రం.. వయసు గురించి చాలా వెటకారంగా, హేయంగా మాట్లాడుతూ ఉంటారు. గత అయిదేళ్లలో ఆయన ఎన్నడూ శారీరక కష్టం కలిగే పనిచేసింది లేదు. తాడేపల్లి నుంచి తెనాలిలో సభ పెట్టినా సరే.. హెలికాప్టర్ లో వెళ్లే సుఖానికి అలవాటుపడ్డారు. అందుకే.. ముసలితనం గురించి మళ్లీ నోరెత్తే ధైర్యం లేకుండా.. నాలాగా రెండు గంటలు ఎండలోనిల్చో చూద్దాం అంటూ చంద్రబాబు సవాలు విసరడం విశేషం.

బాబు అంతటితో వదలిపెట్టలేదు. నేను ఎస్వీ యూనివర్సిటీలో ఎంఏ ఎకనామిక్స్ చదివా.. నువ్వేం చదివావ్.. ఏ యూనివర్సిటీలో చదివావ్.. రహస్య యూనివర్సిటీలో చదివావా అంటే ఎద్దేవా చేశారు. జగన్ తన విద్యార్హతల గురించి ఎన్నడూ చాలా గోప్యంగా ఉంచుతారనే సంగతి తెలిసిందే. విదేశాల్లో చదివినట్టు చెప్పుకుంటారు తప్ప.. వివరాలు బయటపెట్టరు. ఆవిషయాన్నే ఎత్తిచూపిన చంద్రబాబు.. నువ్వు గోలీలు ఆడుకుంటున్న సమయంలో నేను ముఖ్యమంత్రిని అయ్యా అంటూ చరిత్ర చూసుకో అంటే గేలిచేశారు.

తనపై చవకబారు విమర్శలకు ఇవన్నీ కౌంటర్లు అనుకోవచ్చు గానీ.. చంద్రబాబునాయుడు మాటల్లో ఒక్క విషయం మాత్రం రాష్ట్రవ్యాప్తంగా నిరుద్యోగుల్లో నమ్మకం కలిగించేదిగా ఉంది. తాను సీఎంగా ఉన్న పద్నాలుగు ఏళ్లలో ఎనిమిది సార్లు డీఎస్సీ వేశానని, జగన్ అయిదేళ్లలో ఎన్ని డీఎస్సీలు వేశారో చెప్పాలని చంద్రబాబు ప్రశ్నించారు. మరి దీనికి వైసీపీ వారి వద్ద పాపం ఏం జవాబు ఉంటుంది. 

పరిటాల శ్రీరాం సహకారం అపూర్వం!

ఎన్నికల్లో పార్టీలు పొత్తులు పెట్టుకున్నప్పుడు.. టికెట్లు ప్రకటించే సమయానికి నాయకుల్లో కొంతమేర అసంతృప్తులు ఉండడం సహజం. ప్రారంభం నుంచి ఉండే పొత్తులే అయితే పెద్దగా ఇబ్బంది లేదు. సరిగ్గా ఎన్నికల ముందు పొత్తులు కుదిరితే.. అప్పుడు సీట్లు పంచుకోవడం వలన.. నియోజకవర్గాల్లో అప్పటిదాకా పనిచేసుకుంటూ వచ్చిన నాయకులు షాక్ తింటారు. అసంతృప్తికి గురవుతారు.. తిరగబడతారు.. పొత్తు పార్టీని ఓడించడానికి కూడా ప్రయత్నిస్తుంటారు. అలాంటివారిని ఆయా పార్టీలు ఎంత మేర బుజ్జగించాయి అనేదానిమీదనే పొత్తులు పెట్టుకున్న కూటమి విజయం ఆధారపడి ఉంటుంది.

ఇప్పుడు ఏపీలో జగన్‌ను ఓడించాలనే కృతనిశ్చయంతో తలపడుతున్న ఎన్డీయే కూటమి విషయంలో కూడా అంతే. పలు నియోజకవర్గాల్లో భిన్నమైన పరిస్థితులు ఉన్నాయి. ఆయా పార్టీల నాయకులు బుజ్గగించడానికి ప్రయత్నిస్తూ ఉన్నారు. అయితే, అనంతపురం జిల్లా ధర్మవరం నియోజకవర్గం నుంచి తెలుగుదేశం టికెట్ ఆశించిన పరిటాల శ్రీరామ్‌కు, ఆస్థానాన్ని పొత్తుల్లో భాగంగా బిజెపికి కేటాయించడంతో భంగపాటు తప్పలేదు.

అయినాసరే.. ఆయన అక్కడ తెలుగుదేశం శ్రేణులందరినీ ఉత్తేజపరుస్తూ కూటమి అభ్యర్థి విజయానికి తామంతా కలసికట్టుగా పాటుపడాలని చెబుతున్న స్ఫూర్తిని గమనిస్తూ అపూర్వం అనిపిస్తోంది. టికెట్ ఆశించి నిరాశపడిన పరిటాల శ్రీరామ్.. పూర్తి స్థాయిలో అక్కడ బిజెపి అభ్యర్థిగా బరిలో నిలుస్తున్న ఆ పార్టీ జాతీయ కార్యదర్శి సత్యకుమార్ విజయం కోసం పనిచేస్తున్నారు.

తెలుగుదేశం పార్టీ కార్యకర్తలతో శ్రీరాం ఒక సమావేశం నిర్వహించారు. ఏదో ముఖస్తుతి కోసం పాజిటివ్ గా మాట్లాడుతున్నారని అనుకోవడానికి ఆ సమావేశంలో సత్యకుమార్ కూడా లేరు. అయినాసరే, శ్రీరాం  పార్టీ వారందరికీ ఒకటే చెప్పారు. ‘ఎవరు అభ్యర్థి అనేది మనం పట్టించుకోవాల్సిన అంశం కానేకాకూడదు. కూటమి అభ్యర్థిని గెలిపించడం మాత్రమే మన బాధ్యత. కార్యకర్తలందరూ కష్టపడి సత్యకుమార్ ను గెలిపించడానికి పనిచేయండి. ఆయన గెలుపు ద్వారా మన ధర్మవరం పేరు ఢిల్లీలో ప్రతిధ్వనించాలి. మీకు ఏ సమస్య వచ్చినా కూడా దాన్ని నేను చూసుకుంటాను. నన్ను దాటిన తర్వాతే మీదాకా సమస్య రాగలుగుతుంది’ అంటూ కార్యకర్తలను ఉత్తేజపరిచారు. నెలరోజులుగా అంతా కామ్ గా ఉన్న వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఇప్పుడు బయటకు వచ్చి తోకజాడిస్తున్నారని.. అయితే వారందరికీ కూడా మీరు ఒక హెచ్చరిక చేయాలని శ్రీరామ్ కార్యకర్తలకు చెప్పారు. మీరు సత్యకుమార్ ను చూడొద్దు.. ఆయన వెనుక ఉన్న శ్రీరామ్ ను చూడండి అని వారికి చెప్పండి అంటూ హెచ్చరించారు.

మొత్తానికి ఈస్థాయిలో పొత్తుల్లో ఉన్న అన్ని పార్టీల నాయకులు  అభ్యర్థులకు కలసికట్టుగా పనిచేస్తే.. కూటమి విజయం సునాయాసం అవుతుందని పలువురు అంచనా వేస్తున్నారు.

ఇందుకే.. జగన్ ఇన్నాళ్లూ బారికేడ్లు, పరదాలు కట్టింది!

ముఖ్యమంత్రిగా ఉన్నన్నాళ్లూ జగన్మోహన్ రెడ్డి ఏ ఊరికి వెళ్లినా సరే.. ఊరంతా అప్రకటిత కర్ఫ్యూ ఉండేది. జగన్ ప్రయాణించే మార్గాల్లో దుకాణాలు మూయించేవాళ్లు, చెట్లు నరికించే వాళ్లు, జనం పొరబాటున కూడా రోడ్డు మీదకిరాకుండా బారికేడ్లు కట్టేవాళ్లు, పైపెచ్చు ఆయనను చూడడానికి కూడా అవకాశం ఇవ్వకుండా పరదాలు కట్టేవాళ్లు..! చరిత్రలో ఎన్నడూ కూడా ఒక ముఖ్యమంత్రి ఈ తరహాలో ఊర్లలో పర్యటించడాన్ని ప్రజలు ఎరగరు. వారంతా ఛీత్కరించుకున్నారు.  

అయితే ఇక్కడ ప్రజలు గమనించాల్సింది ఏంటంటే.. జగన్మోహన రెడ్డి ఏమాత్రమూ అమాయకమైన నాయకుడు కాదు. పరదాలు కట్టకపోతే, బారికేడ్లు కట్టకపోతే ఏం జరుగుతుందో ఆయనకు తెలుసు. ప్రజలు రోడ్డు మీదకు వచ్చి తనకు అవమానకరమైన రీతిలో నిరసనలు తెలియజేస్తారని ఆయనకు తెలుసు. అందుకే అన్ని జాగ్రత్తలు తీసుకుంటూ వచ్చారు. నిజానికి బటన్ నొక్కి ప్రజల అకౌంట్లలో డబ్బు వేయడం అనేదానికి ఒక్కోసారి ఒక్కోఊరిలో సభ పెట్టడం అనవసరం. తాడేపల్లిలో కూచుని ప్రతిసారీ ఆ పనిచేయవచ్చు. కానీ.. సభ పెట్టడం.. డ్వాక్రా మహిళలందరినీ బలవంతంగా ఆ సభకు తోలడం.. వారి ఎదుట ఒక ప్రసంగం వినిపించడం తప్ప.. జనంలోకి వెళ్లడానికి జగన్ ఇన్నాళ్లూ భయపడిపోయారు.

ఆయన భయాలే ఇప్పుడు ఎన్నికల సమయంలో నిజం అవుతున్నాయి. ఆయన ఇప్పుడు ప్రజల్లో తిరగాల్సి వచ్చేసరికి ప్రజల నిరసనల్ని చవిచూస్తున్నారు. బస్సు యాత్ర పేరుతో ప్రజల్లోకి వెళుతున్ జగన్ కు చేదు అనుభవాలు తప్పడం లేదు. అసలే సభలకు జనం రావడం లేదు మొర్రో అనే అసహనం ఒకవైపు కాగా.. ప్రజల నిరసనలు మరోవైపు. నిన్నటికి నిన్న జగన్ బస్సు వస్తున్న మార్గంలో గ్రామాల మహిళలు ఖాళీ బిందెలతో వాహనానికి అడ్డు నిలిచి.. తమ నిరసనను, తాగునీటికి దిక్కులేదనే ఆవేదనను తెలియజేశారు.

ఆ అనుభవం రాగానే..  అప్రమత్తమైన పోలీసులు ఇవాళ జగన్ ప్రయాణించే మార్గంలో కూడా మహిళలు ఖాళీ బిందెలతో తయారయ్యారు. పోలీసులు వారినుంచి బలవంతంగా బిందెలను లాక్కునేశారు. అయినాసరే మహిళలు ఖాతరు చేయలేదు. జగన్ బస్సు వస్తుండగా అడ్డుపడి.. బస్సును ఆపు చేయించారు. తమ తాగునీటి సమస్యను జగన్మోహన్ రెడ్డికి తెలియజేయాలనుకున్నారు. జగన్ మాత్రం బస్సు దిగనేలేదు. బస్సులోంచి ఒక మహిళా వైసీపీ నాయకురాలు కిందికి దిగి వారికి సర్దిచెప్పే ప్రయత్నం చేశారు. అయితే మహిళలు తగ్గకపోవడంతో.. చివరికి జగన్ బస్సు దిగాల్సి వచ్చింది. ఆయన మొక్కుబడిగా మీ సమస్యను పరిష్కరిస్తా అని పొడిగా ఒక మాట చెప్పి తిరిగి బస్సు ఎక్కేశారు. పోలీసులు బలవంతంగా మహిళల్ని తొలగించడంతో బస్సు మళ్లీ కదిలింది.

ఇలాంటి ప్రతిఘటనలు, పరువుపోయే వ్యవహారాలు పుష్కలంగా ఉంటాయని తెలిసిన నాయకుడు గనుకనే ఇన్నాళ్లూ బారికేడ్లు, పరదాలు కట్టుకుని తిరుగుతూ గడిపారని ప్రజలు జోకులు వేసుకుంటున్నారు

జగన్ మాయకు చెక్.. బాబు ప్రకటనే ఆశాదీపం!

అసలే టీచర్లు.. అందరూ కూడా జగన్మోహన్ రెడ్డి మీద ఆగ్రహావేశాలతో రగిలిపోతున్నారు. టీచరు కమ్యూనిటీలో ప్రభుత్వ వ్యతిరేకత పుష్కలంగా ఉండగా, టీచర్లు కాగోరే నిరుద్యోగుల కమ్యూనిటీలో కూడా విపరీతమైన వ్యతిరేకత ఉంది. జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత.. ఒక్కసారి కూడా టీచరు ఉద్యోగాల నియామకాలు చేపట్టలేదు. తీరా ఎన్నికలు ముంచుకు వస్తున్న సమయంలో.. కేవలం 6100 పోస్టులకు నోటిఫికేషన్ ఇచ్చారు.

ఇప్పుడు ఎన్నికల కోడ్ కారణంగా ఆ పరీక్షల నిర్వహణను, టెట్ ఫలితాల వెల్లడిని ఎన్నికల సంఘం నిలిపివేసింది. ఎన్నికల ముందు టీచరు పోస్టులు భర్తీ చేస్తున్నట్టుగా నిరుద్యోగ టీచర్లను మాయ చేయడానికి జగన్ చేసిన ప్రయత్నాలకు ఎన్నికల సంఘం చెక్ పెట్టేసింది.

అదే సమయంలో నిరుద్యోగ టీచర్లలో సరికొత్త ఆశలకు చంద్రబాబునాయుడు ఊపిరులూదుతున్నారు. ఇరవై ముప్పయివేల ఖాళీలు ఉండగా.. కేవలం 6100 టీచరు పోస్టుల భర్తీకి మాత్రమే జగన్ నోటిఫికేషన్ ఇచ్చారు. అదే చంద్రబాబునాయుడు.. తమ పార్టీ అధికారంలోకి రాగానే.. మెగా డీఎస్సీ నిర్వహిస్తామని ధాటిగా ప్రకటించారు. దీంతో నిరుద్యోగ టీచర్లలో ఆశలు రేకెత్తుతున్నాయి. గతంలో కూడా చంద్రబాబునాయుడు ముఖ్యమంత్రిగా ఉండగా నిరుద్యోగులను వంచించకుండా డీఎస్సీలు నిర్వహించిన వైనాన్ని ప్రజలు గుర్తు చేసుకుంటున్నారు.

జగన్ ముఖ్యమంత్రి అయిన తర్వాత.. ఎలిమెంటరీ తరగతులను హైస్కూళ్లలో కలపడం లాంటి రకరకాల ప్రయోగాలతో అనేక స్కూళ్లను మూసివేయించారు. ప్రభుత్వ పాఠశాలల మనుగడ, భవిష్యత్తు ప్రశ్నార్థకం అయ్యేలాగా.. ప్రెవేటు స్కూళ్లలో చదివేవారికి కూడా.. అమ్మఒడి డబ్బులు అందిస్తున్నారు. ఇలాంటి నేపథ్యంలో అసలు ఉపాధ్యాయ లోకం భవిష్యత్తు ఎలా ఉంటుందో అని పలువురు భయపడుతున్నారు. ఉపాధ్యాయవర్గాలపై జగన్మోహన్ రెడ్డి కక్ష కట్టినట్టుగా వ్యవహరిస్తున్నారనే విమర్శలు ఉన్నాయి. పగబట్టినట్టుగా అనేక నిబంధనలు విధించి వారిని యాతనకు గురిచేస్తున్నారు. అదే సమయంలో వారిమీద ఒత్తిడి పెంచుతున్నారు. ఆ వర్గంలో తనపట్ల వ్యతిరేకత ఉన్నదని తెలిసి వారిని ఎన్నికల విధుల్లో పాల్గొననివ్వకుండా చూడాలని ఆయన కుట్ర చేశారు గానీ.. ఆ పాచిక పారలేదు. ఈసీ ఉద్యోగులు ఉండాల్సిందే అని తేల్చిన సంగతి తెలిసిందే. ఇప్పుడు కనీసం నిరుద్యోగ టీచర్లనైనా మాయ చేయడానికి చేసిన ప్రయత్నాలు కూడా బెడిసికొట్టాయి. ఇవన్నీ ఆయన పతనాన్ని శాసించే పరిణామాలే అని పలువురు వ్యాఖ్యానిస్తున్నారు.