కడప ఎంపీ స్థానం నుంచి ఏపీసీసీ చీఫ్ షర్మిల పోటీచేయడం ఖరారు అయిపోయింది. అధికారికంగా కాంగ్రెసు పార్టీ జాబితాను కూడా ప్రకటించింది. ఇడుపులపాయలో తండ్రి వైఎస్సార్ సమాధి వద్ద షర్మిల నివాళి అర్పించి.. వైసీపీ తరఫున పోటీచేస్తున్న తమ్ముడు అవినాష్ రెడ్డి మీద, ఆయనను గెలిపించడానికి కంకణం కట్టుకున్న అన్నయ్య జగన్మోహన్ రెడ్డి మీద సమరశంఖం పూరించారు. కడప ఎంపీ బరిలో రాష్ట్రంలోనే అత్యంత ఆసక్తికరమైన, సంచలనాత్మక పోటీకి ఆమె తెర తీశారు.
ఒకవైపు వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఎన్నికల ప్రచార సభల్లో మాట్లాడుతూ.. చిన్నాన్న వివేకాను ఎవరు చంపారో అందరికీ తెలుసునని, వారికి చంద్రబాబునాయుడు మద్దతు ఇస్తున్నారని పడికట్టు మాటలతో, నర్మగర్భపు వ్యాఖ్యలతో ప్రజలను మభ్యపెట్టడానికి ప్రయత్నిస్తూ ఉన్న సంగతి అందరికీ తెలిసిందే. ఒకవైపు జగన్ అలా డొంకతిరుగుడుగా మాట్లాడుతూ ఉండగా మరొకవైపు షర్మిల డైరెక్ట్ ఎటాక్ కు దిగుతున్నారు. వివేకాను చంపించిన అవినాష్ రెడ్డిని ఓడించడానికే తాను ఎన్నికల బరిలోకి దిగినట్టుగా చెబుతున్నారు.
తనను కడప ఎంపీగా చూడాలనేది వైఎస్ వివేకానందరెడ్డి చిన్నాన్న ఆఖరి కోరిక అని వైఎస్ షర్మిల చెబుతుండడం విశేషం. హత్యకు గురికావడానికి కొన్ని రోజుల ముందే.. చిన్నాన్న వివేకా తన దగ్గరకు వచ్చి, కడప ఎంపీ పదవికి పోటీచేయాల్సిందిగా కోరారని షర్మిల చెప్పారు. అందువల్లనే ఆయనను అవినాష్ రెడ్డి చంపిచినట్లుగా కూడా ఆమె చెప్పారు. చిన్నాన్న చివరి కోరికను తీర్చడానికే తాను.. ఆయనను హత్య చేసిన వారితో తలపడుతున్నానని చెప్పిన షర్మిల మాటలు కడప ప్రజల్లో కొత్త ఆలోచనను కలిగిస్తున్నాయి.
ఎవరు చంపారో ప్రజలకు తెలుసు- లాంటి ఇండైరక్టు మాటల జోలికి షర్మిల వెళ్లడం లేదు. చాలా సూటిగా చిన్నాన్నను చంపించిన అవినాష్ రెడ్డిని గెలిపించడానికి జగనన్న కష్టపడుతున్నాడే.. చిన్నాన్న ఆత్మ క్షోభించకుండా ఉంటుందా? అని ఆమె ప్రశ్నిస్తున్నారు. జగన్ కూడా ‘చిన్నాన్న వివేకా’ను తన ప్రచారాస్త్రంగా వాడుకోవాలని అనుకుంటూ ఉండగా.. షర్మిల కూడా అదే చిన్నాన్నను తన బ్రహ్మాస్త్రంగా అవినాష్ పై ప్రయోగిస్తుండడం గమనించదగిన విషయం.
ఈ ఎన్నికల ప్రచారంలో వైఎస్ షర్మిల , అవినాష్ రెడ్డి హంతకుడు అంటూ ఎంత నిర్దాక్షిణ్యంగా విమర్శలతో విరుచుకుపడబోతున్నారో స్పష్టంగా అర్థమవుతోంది. ఆమె దూకుడు సంకేతాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఆమె ఎన్నికల ప్రచారంలో వివేకా భార్య సౌభాగ్యమ్మ, కూతురు సునీత కూడా జత చేరే అవకాశం పుష్కలంగా ఉంది. కడప జిల్లాల్లో ప్రస్తుతం మూడుస్థానాలకు మాత్రమే కాంగ్రెస్ అభ్యర్థులను ప్రకటించింది. పులివెందులలో జగన్ పై తలపడేది ఎవరో ఇంకా తేల్చలేదు. వివేకా కుటుంబసభ్యులకే అక్కడ కూడా టికెట్ ఇస్తే గనుక.. ఈ పోటీలు ఇంకా రసవత్తరంగా మారుతాయని పలువురు అంచనా వేస్తున్నారు.
వివేకా చివరికోరిక కోసం.. హంతకులతో తలపడుతున్నా
Vishwak Sen’s Hint On Man Of Masses Jr. NTR’s Devara Music
Tollywood’s young and talented hero, Vishwak Sen, is currently working on his next, Gangs of Godavari, which is slated to release in theaters on May 17, 2024. The actor recently met his beloved hero, Jr. NTR, and gave a hint on Devara’s music. Vishwak Sen shared some photos on his Instagram handle featuring the actor, accompanied by Jr. NTR. captioned, “Love you always
Following Vishwak Sen’s post, the anticipation among fans about Devara Part 1 once again grew even further. Earlier, the team released a glimpse of Devara Part 1, which raised expectations for Jr. NTR’s mass avatar. Devara, helmed by Koratala Siva and starring Jr. NTR and Janhvi Kapoor as the lead pair.
Vishwak Sen took to his Instagram and congratulated the ‘Tillu Square’ team on their recent success and wrote, “Congratulations @Siddu_buoy and @nagavamsi19 anna for smoothest 100cr success. @jrntr anna what a night. Thanks again.” It seems that Jr. NTR hosted a night and congratulated the Tillu Square team. Vishwak Sen additionally shared a story in which he wore a watch and asked fans to guess “whose watch.”
On Vishwak Sen’s upcoming endeavors, he is currently set to release his next, Gangs of Godavari. Up next, his upcoming projects include Mechanic Rocky and Laila. Recently, on the actor’s birthday, the movie makers released updates on his projects.
ఆటంకాలు దాటితేనే కదా జగన్.. తమరు హీరో అయ్యేది!
ముందుగా ఓ కథ చెప్పాలి. వ్యాసాలు రాయడంలో పోటీ ఉంటుందని టీచరు ముందే చెప్పిపంపాడు. ఓ పిల్లవాడు ఆవు వ్యాసం తప్ప మరేమీ చదువుకోకుండా వచ్చాడు. టీచరు విమానం గురించి రాయమని అడగ్గానే.. విమానం గాలిలో ఎగురును గాలిలో వెళుతుండగా చూస్తే.. కింద నేలపై ఆవు కనిపించును. ఆవుకు నాలుగు కాళ్లుండును, రెండు కొమ్ములుండును, పొదుగు ఉండును, ఆవు పాలిచ్చును.. అని రాసుకుంటూ పోయాడు. ఆలయం గురించి రాయమని అడిగితే.. ఆలయంలో దేవుడు ఉండును. అలాగే గోశాల ఉండును. గోశాలలో ఆవు ఉండును.. ఆవుకు నాలుగు కాళ్లుండును, రెండు కొమ్ములుండును, పొదుగు ఉండును, ఆవు పాలిచ్చును.. అని రాసుకుంటూ పోయాడు. ఇలా సబ్జెక్టు ఏది ఇచ్చినా కూడా ఆవు గురించి రాసుకుంటూ పోయాడు. అంతటి మహాప్రబుద్ధుడు అన్నమాట.
ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ప్రస్తుత వ్యవహార సరళి కూడా అంతకంటె గొప్పగా ఏమీ లేదు. ఆయనకు అత్యంత బాగా తెలిసిన విద్య ఎదుటివారి మీద నిందలు వేయడం. ఎదుటివారు అనడం కంటె.. చంద్రబాబుమీద అంటే ఇంకా బాగుంటుంది. పవన్ కల్యాణ్ ఎన్ని పెళ్లిళ్లు చేసుకున్నాడో.. ప్రపంచానికి చాటిచెబుతూ తిరగడం మాత్రమే. అంతకుమించి.. ఆయన తనలోని హీరోయిజాన్ని నిరూపించుకునే ప్రయత్నం చేయడంలేదు.
రాష్ట్రవ్యాప్తంగా వాలంటీర్లను అడ్డగోలుగా వాడుకుని.. వారిద్వారా ప్రజలను ప్రలోభాలకు గురిచేయవచ్చునని, జగన్ కు ఓటు వేయకపోతే.. పించన్లు రావు అని బెదిరించవచ్చునని వైఎస్సార్ కాంగ్రెస్ రకరకాల ప్లాన్లు వేసింది. అయితే ఈ రెండు నెలల పాటూ.. వాలంటీర్లు ఇళ్లకు వెళ్లి డబ్బులు పంపిణీ చేయరాదంటూ కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశాలు ఇచ్చింది. ఫిర్యాదు చేసినది సిటిజన్ ఫోరమ్ ఫర్ డెమాక్రసీ అనే సంస్థ. అయితే.. జగన్ మాత్రం ఏదో ఆవు వ్యాసం రాసినట్టుగా ఈ వ్యవహారానికి సంబంధించి చంద్రబాబు మీద విమర్శలు చేస్తున్నాడు. ఏప్రిల్ 1 నుంచి పింఛన్లు ఇవ్వకుండా చంద్రబాబు అడ్డుపడుతున్నాడని తన ఎక్స్ ఖాతాలో రాసుకొచ్చారు. ఆటంకాలు సృష్టించారని జగన్ ఆరోపిస్తున్నారు.
అయినా జగన్ తెలుసుకోవాల్సిన విషయం ఒకటుంది. చంద్రబాబు ఆటంకాలు సృష్టించిన మాట నిజమే అనుకుందాం.. వాటిని దాటుకుని వెళ్లి.. ప్రతి ఇంటికీ పెన్షనును ఇతర యంత్రాంగం ద్వారా చేరవేస్తేనే కదా జగన్ లోని చిత్తశుద్ధి బయటపడేది. ఆయన హీరోయిజం తెలిసి వచ్చేది. అవ్వాతాతల మీద మాటల్లో ప్రేమ కురిపించే జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వ యంత్రాంగం ద్వారా ఇళ్లకు ఇప్పుడు కూడా పింఛను చేరిస్తే.. చంద్రబాబు ఎన్ని ఆటంకాలు సృష్టించినా సరే.. తాను చేశానని గొప్పగా చెప్పుకోవచ్చు కదా.. ఆ ప్రయత్నం ఆయన ఎందుకు చేయడం లేదు.. అని ప్రజలు ప్రశ్నిస్తున్నారు.
తేజాకు జోడిగా హాయ్ నాన్న భామ!
తేజా సజ్జా బాల నటుడిగా ఇండస్ట్రీలోకి అడుగు పెట్టి.. హీరోగా మారి సినిమాలు చేస్తున్నాడు. ఇప్పటి వరకు తేజా తీసిన సినిమాలు హిట్ ని అందుకున్నాయి. కానీ ఈ సంక్రాంతికి విడుదలైన హనుమాన్ మాత్రం సూపర్ హిట్ అందుకుని భారీ కలెక్షన్లను వసూలు చేసి అగ్ర హీరోల సరసన తేజాని నిలబెట్టింది.
ఈ సినిమాతో పాన్ ఇండియా హిట్ అందుకున్న తేజా తన నెక్స్ట్ సినిమాకి రెడీ అయిపోయాడు. ఏ డైరెక్టర్ తో సినిమా చేస్తాడా అని అందరూ ఎదురు చూస్తున్నారు. ఇదంతా ఓకే కానీ తేజా పక్కన హీరోయిన్ గా చేస్తున్న నటి ఎవరు అనే దాని మీద కూడా చాలా అనుమానాలు నెలకొన్నాయి.
తాజాగా హీరోయిన్ ఎవరనే దాని మీద ఓ క్లారిటీ వచ్చేసింది. హీరో తేజ తన తరువాతి సినిమాను కార్తీక్ ఘట్టమనేనితో చేయనున్ననట్లు టాక్ . ఈ డైరెక్టర్ మాస్ మహారాజ రవితేజతో ఈగల్ సినిమాను తీశాడు.తాజాగా తేజా- కార్తీక్ కాంబోలో మిరాయ్ అనే సినిమా రాబోతుంది. ఈ సినిమాలో రితికా నాయక్ అనే ఢిల్లీ భామ నటిస్తుంది.
ఈ ముద్దుగుమ్మ ఢిల్లీకి చెందిన మోడల్. తెలుగులో ఇప్పటివరకూ రెండు సినిమాల్లో నటించింది. విశ్వక్ సేన్ హీరోగా నటించిన ‘అశోకవనంలో అర్జున కళ్యాణం’, హాయ్ నాన్న సినిమాల్లో మెరిసింది. రితికా నాయక్ తేజకి జోడిగా సెట్ అవుతుందని అభిమానులు అంటున్నారు. అయితే దీనిపై ఇంకా క్లారిటీ రావాల్సి ఉంది. ఈ సినిమా తరువాత తేజా జై హనుమాన్ సినిమా లో నటించనున్నారు..
నవ్విస్తూ భయపెడుతూ మళ్లీ వచ్చేసింది!
అంజలి ప్రధాన పాత్రలో శ్రీనివాస్ రెడ్డి, సత్యం రాజేష్, షకలక శంకర్, ప్రధాన పాత్రలుగా వచ్చిన గీతాంజలి సినిమా ఎంత హిట్ అయిందో అందరికీ తెలిసిందే. ఇప్పుడు ఆ సినిమాకి సీక్వెల్ గా శ్రీనివాస్ రెడ్డి, సునీల్, సత్యం రాజేష్, సత్య, షకలక శంకర్, అలీ, బ్రహ్మాజీ, రవి శంకర్, రాహుల్ మాధవ్ ప్రధాన తారాగణంగా గీతాంజలి మళ్లీ వచ్చింది.. అంటూ ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.
ఈ సినిమాకు శివ తుర్లపాటి డైరెక్షనలో తెరకెక్కుతున్న హారర్ కామెడీ ఎంటర్టైనర్ గా ఇది రూపుదిద్దుకుంటుంది. ఈ చిత్రం నుండి విడుదలైన పోస్టర్స్కి ప్రేక్షకుల నుండి మంచి స్పందన వచ్చింది.
తాజాగా ఈ చిత్రం ట్రైలర్ ను విడుదల చేసారు చిత్ర బృందం. ఈ ట్రైలర్ మొదటి నుంచి కూడా ప్రేక్షకుల్ని ఆకట్టుకుంది. కామెడీ, హారర్ ఎలిమెంట్స్ తో ఈ ట్రైలర్ అలరించింది. ఈ చిత్రం ఏప్రిల్ 11, 2024 న ప్రపంచ వ్యాప్తంగా థియేటర్ల లో విడుదల కాబోతుంది. ఈ చిత్రాన్ని ఎంవీవీ సినిమా, కోన ఫిల్మ్ కార్పొరేషన్ బ్యానర్ లపై ఎంవీవీ సత్య నారాయణ, GV లు సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఈ చిత్రానికి ప్రవీణ్ లక్కరాజు సంగీతం అందించారు.
వైసీపీ.. సిగ్గుమాలిన శవరాజకీయం!
ప్రపంచంలో ఎక్కడ ఏం జరిగినా సరే దానిని తమ రాజకీయ అవసరాలకు, స్వార్థానికి వాడుకోవాలని ఆలోచించడంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ మరీ నీచత్వానికి దిగజారుతోంది. ఆరోగ్యం బాగాలేక ఒక వృద్ధుడు కనుమూస్తే.. పింఛను ఇంటికి తెచ్చి ఇవ్వడం లేదు గనుక.. పింఛను కోసం సచివాలయానికి వెళ్లాల్సి వస్తుందనే బాధతో గుండె ఆగి మరణించినట్టుగా వైసీపీ ప్రచారానికి పూనుకుంది. పార్టీ ప్రచారానికి వారి తొత్తు మీడియా సాక్షి వంతపాడడం విశేషం. మృతుడి బంధువులతో అలా చెప్పించడానికి శిక్షణ కూడా సాక్షి రిపోర్టర్లే ఇవ్వడం ఇంకా ఘోరంగా విమర్శల పాలవుతోంది.
విషయం ఏంటంటే.. తిరుపతి జిల్లా వెంకటగిరి నియోజకవర్గంలోని ఒక వృద్ధుడు వెంకటయ్య మరణించాడు. ఆయనకు కొన్నాళ్లుగా ఆరోగ్యం సరిగా లేదు. తిరుపతిలోని కూతురు ఇంటివద్ద ఉంటూ చికిత్స చేయించుకుంటూ ఉండేవాడు. తిరుపతినుంచి వెంకటగిరికి వచ్చాడు. తర్వాత మరణించాడు.
ఆ మరణం గురించి తెలిసిన వెంటనే వాలంటీరు, సాక్షి రిపోర్టరు అక్కడ రాబందుల్లా వాలిపోయారు. ‘ఒకటో తేదీ పింఛను ఇంటికి తెచ్చి ఇస్తారనే ఉద్దేశంతో మా మామ తిరుపతి నుంచి వచ్చాడు. రాగానే వాలంటీరు వచ్చాడా అని అడిగారు. లేదు.. ఈసారి వాలంటీరు తెచ్చి ఇవ్వడు. మూడోతేదీ సచివాలయానికి వెళ్లి తీసుకోవాలి అని నేను చెప్పగానే కుప్పకూలి గుండె ఆగి చనిపోయాడు’ అని ఆయన కోడలితో చెప్పించారు. చంద్రబాబు ఈసీకి ఫిర్యాదు చేసి, పింఛను నిలిపేసినందుకే వెంకటయ్య మృతి చెందినట్టు చెబితే.. సీఎం జగన్ ప్రత్యేకంగా ఆర్థిక సహాయం కూడా అందిస్తారంటూ.. ఆయన కూతురిని కూడా పురిగొల్పారు. అయితే.. వెంకటయ్య కోడలు,కూతురు వీరు నేర్పించినట్లుగా చెప్పడానికి తడబడుతూంటే.. వారికి మళ్లీ మళ్లీ ట్రైనింగు ఇచ్చారు. ఈ శవరాజకీయాల ట్రైనింగు క్లాసులు ఆడియో రికార్డులు లీకయ్యాయి. సాక్షి రిపోర్టరు, వాలంటీరు వాళ్లకు ట్రైనింగు ఇవ్వడం, సీఎం ప్రత్యేక సాయం అంటూ ఊరించడం.. చంద్రబాబును దోషిగా చూపేందుకు కుట్ర చేయడం ఇవన్నీ బయటకు వచ్చాయి.
వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎంతగా అయినా దిగజారుతుందని తెలుసుగానీ, మరి శవ రాజకీయంలో కూడా ఇంత నీచంగా దిగజారుతుందా అని ప్రజలు విస్తుపోతున్నారు. ఈరెండునెలల్లో మరింత వృద్ధులు చచ్చిపోవాలని వైసీపీ కోరుకుంటుందేమోనని, రాష్ట్రంలో ఇప్పుడు ఏ వృద్ధుడు చనిపోయినా కూడా.. కేవలం పింఛను ఇంటికి తెచ్చి ఇవ్వనందువల్లనే చచ్చిపోయినట్టుగా వంకర ప్రచారాలతో చెలరేగుతారని ప్రజలు అనుకుంటున్నారు. సచివాలయాల వద్ద పింఛను కోసం వచ్చే వృద్ధుల కోసం సరైన ఏర్పాట్లు చేయకుండా.. మరింత మందిని పొట్టన పెట్టుకుని వైసీపీ ప్రభుత్వం.. నిందను చంద్రబాబు మీదకు నెట్టడానికి ప్రయత్నిస్తుందని కూడా అనుకుంటున్నారు.
అంబికా, జీవీఎల్ రూపంలో పొత్తుల్లో ముసలం!
అధికార మార్పిడి జరిగితే తప్ప రాష్ట్రాన్ని కాపాడడం కష్టం అనే మాట ప్రతిపక్ష నేతల నుంచి చాలాకాలంగా వినిపిస్తూనే ఉంది. జగన్మోహన్ రెడ్డి ఓటమి ఒక్కటే లక్ష్యంగా.. ప్రతిపక్షాలు జట్టుకట్టాయి. పవన్ కల్యాణ్.. వ్యతిరేక ఓటు చీలకూడదనే లక్ష్యంతో పాటు, చంద్రబాబునాయుడు యొక్క పాలనానుభవం అవసరం ఈ రాష్ట్రానికి చాలా ఉన్నది అనే ఉద్దేశంతో.. చాలా కాలం కిందటే తెలుగుదేశంతోక లిసి వెళుతున్నట్టు ప్రకటించారు. ఆ పొత్తుల కూటమిలోకి అతి ప్రయత్నమ్మీద భారతీయ జనతా పార్టీని కూడా తీసుకువచ్చారు. జగన్మోహన్ రెడ్డి పాలన వంటి అవినీతి మయమైన సర్కారు మరెక్కడా ఉండదని నినదించిన ప్రధాని మోడీ కూడా పొత్తులకు పచ్చజెండా ఎత్తారు.
అయితే, ఇప్పుడు ఏపీ భారతీయ జనతా పార్టీలోని కొందరు జగన్మోహన్ రెడ్డి కోవర్టులు పొత్తుల్లో ముసలం పెట్టడానికి ప్రయత్నిస్తున్నారు. పొత్తు పార్టీల మధ్య విభేదాలు సృష్టించడం ద్వారా.. కూటమి అభ్యర్థుల పరాజయానికి పునాది వేయాలని అనుకుంటున్నారు. ఇలాంటి వారిలో రాజ్యసభ ఎంపీ జీవీఎల్ నరసింహారావు, అంబికా కృష్ణ వంటి వారు ఉండడం విశేషం.
జీవీఎల్ నరసింహారావు వ్యవహారం మరీ చోద్యంగా ఉంది. ప్రజల్లో తిరిగి పనిచేసే అలవాటు లేని, మీడియా ముందు చిలక పలుకులు పలకడం తప్ప, ప్రజానాయకుడిగా గుర్తింపులేని ఆయనకు ఈసారి ఎంపీగా ప్రత్యక్ష ఎన్నికల్లో దిగాలనే కోరిక పుట్టింది. విశాఖ నుంచి పోటీచేయాలని ఆయన అనుకున్నారు. ఒకవేళ పార్టీ సొంతంగా పోటీచేసి ఉన్నా కూడా ఆయనకు ఆ సీటు దక్కుతుందో లేదో చెప్పడం కష్టం. అలాంటి నేపథ్యంలో విశాఖను తీసుకోవడం గురించి.. బిజెపి చాలా కసరత్తు చేసి చివరికి ఆ సీటు వద్దనుకుంది. విశాఖ ఉక్కును ప్రెవేటీకరించాలన్న కేంద్రం నిర్ణయం గొడ్డలిపెట్టుగా మారుతుందన్న భయంతోనే విశాఖను వద్దనుకున్నట్టు సమాచారం. రాజమండ్రి, నరసాపురం తీసుకుంది. అయితే ఇప్పుడు జీవీఎల్ హఠాత్తుగా తెరమీదికి వచ్చి తనకు విశాఖపట్నం సీటు కావాలని మారాం చేస్తున్నారు.
విశాఖలో పార్టీ చాలా బలంగా ఉన్నదని, గత అయిదేళ్లుగా విశాఖలో క్షేత్రస్థాయిలో చాలా వర్క్ చేస్తూ ప్రజాబలం పెంచుకున్నాం అని.. అక్కడ ఎంపీ సీటు తమ పార్టీకి ఇవ్వావలని జీవీఎల్ ను పోటీచేయించాలని ఇప్పుడు రకరకాల వాదనలు వస్తున్నాయి. జీవీఎల్ అనుచరులు అధిష్ఠానానికి లేఖ కూడా రాశారు. అక్కడ పార్టీని నిర్మాణం చేశామంటున్న నాయకులు విశాఖ ఉక్కు కోసం ఎన్ని పోరాటాలు చేశారో, అక్కడి ప్రజలతో ఎంత మమేకం అయ్యారో చెబితే బాగుంటుంది. జీవీఎల్ నరసింహారావు తొలినుంచి కూడా.. జగన్మోహన్ రెడ్డి కోవర్టుగా పనిచేస్తున్న నాయకుడే అని గుర్తింపు ఉంది. దానికి తగ్గట్టుగానే ఆయన ఇప్పుడు పార్టీలో ముసలం పెడుతున్నారు. స్నేహపూర్వక పోటీ కి పార్టీ తమను అనుమతించాలని అంటున్నారు.
అలాగే అంబికా కృష్ణ కూడా ఇదే తరహా ముసలంతో సిద్ధంగా ఉన్నారు. పార్టీ 175 స్థానాల్లోనూ సొంతంగా పోటీచేయాలని, లేకపోతే ఎప్పటికీ రాష్ట్రంలో బలపడదని ఆయన సన్నాయినొక్కులు నొక్కుతున్నారు. మొత్తానికి బిజెపిలో ముసలం పుట్టించడానికి తమ కోవర్టుల ద్వారా వైఎస్సార్ కాంగ్రెస్ గట్టి ప్రయత్నాలే చేస్తున్నట్టుంది.
ఆర్డీవో ఆఫీస్ కు తారక్!
యంగ్ టైగర్ ఎన్టీఆర్ చివరిసారిగా జక్కన్న రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కిన ఆర్ఆర్ఆర్ సినిమాలో కనిపించారు. ఈ చిత్రం తో ప్రపంచవ్యాప్తంగా సూపర్ క్రేజ్ ను సొంతం చేసుకున్నారు. ప్రస్తుతం తారక్ టాలీవుడ్ స్టార్ డైరెక్టర్ కొరటాల శివ దర్శకత్వం లో తెరకెక్కుతున్న దేవర చిత్రం లో నటిస్తున్నారు.
ఈ సినిమాలో బాలీవుడ్ భామ జాన్వీ కపూర్ హీరోయిన్ గా నటిస్తుండగా.. సైఫ్ ఆలీఖాన్ విలన్ గా చేస్తున్నాడు. తాజాగా తారక్ ఖైరతాబాద్ లోని ఆర్డీవో ఆఫీస్ కు వెళ్లాడు. తన కొత్త కారు రిజిస్ట్రేషన్ కోసం ఎన్టీఆర్ ఆర్డీవో కార్యాలయానికి వెళ్లినట్లు తెలుస్తుంది. దీనికి సంబంధించిన పలు చిత్రాలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.
తారక్ దేవరతో పాటు అటు బాలీవుడ్ వార్ 2 లో కూడా కనిపించబోతున్న విషయం తెలిసిందే.
ఆ రోజు ఎప్పటికీ మరచిపోలేను!
తెలుగు చిత్ర పరిశ్రమలో మహానటి సావిత్రి తరువాతే ఎవరైనా అనడంలో అతిశయోక్తి లేదు. తెలుగు లో మాత్రమే కాకుండా ఇతర భాషల్లో కూడా తనదైన ముద్ర వేసిన ఆమెతో తనకున్న కొన్ని మధుర జ్ఙాపకాలను అయితే మెగాస్టార్ చిరంజీవి గుర్తు చేసుకున్నారు.
ఇటీవల జరిగిన సావిత్రి క్లాసిక్స్ పుస్తక ఆవిష్కరణ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా పాల్గొన్న చిరు కొన్ని ఆసక్తికర కామెంట్స్ చేశారు. పునాది రాళ్లు సమయంలో 1978 ఫిబ్రవరి నెలలో నరసింహరాజు గారు సావిత్రి గారితో సినిమా చేయబోతున్నాను అని చెప్పినపుడు నా ఒళ్ళు అంతా జలదరించింది.
నేను ప్రసాద్ నుంచి చిరంజీవిగా మారిన ఒకటి రెండు రోజుల్లోనే అంతా గొప్ప నటితో పరిచయం ఏర్పడడం తనని తాను చిరంజీవిగా పరిచయం చేసుకున్నప్పుడు ఆవిడ శుభం అని చెప్పారని అలా తర్వాత రోజు షూటింగ్ మధ్యలో వర్షం వచ్చినపుడు చిన్న జల్లు కురుస్తుంది. ఆ సమయంలో ఎవరికీ ఏమీ తోచనపుడు సావిత్రి గారే అందరికి తన గురించి చెప్తూ చిరంజీవి అనే ఈ అబ్బాయి డాన్స్ బాగా చేస్తాడు అని పిలిచి చెయ్యమన్నారని తెలిపారు.
అలా చెప్పడమే ఆలస్యం నా టేప్ రికార్డర్ తోనే పాట పెట్టి వర్షం లో డాన్స్ చేయడం మొదలు పెట్టాను. ఆ సమయంలోనే కాలు జారి కింద పడినప్పటికీ నాగు పాములా ఏదో క డాన్స్ చేసేసానని గుర్తు చేసుకున్నారు. ఆ తరువాత సావిత్రి గారు చెప్పిన మాటలు ఎప్పటికీ తను మర్చిపోనని ఆయన అన్నారు.
‘నాకు బాగా నచ్చావయ్యా భవిష్యత్తులో గొప్ప నటుడివి అవుతావు అన్నారు. నీలో ఎంతో స్ఫూర్తిని చూశానని చెప్పిన మాటలు నాకు వెయ్యేనుగుల బలాన్నిచ్చినట్టు అనిపించింది’ అని చిరంజీవి తెలిపారు.