Home Blog Page 863

ఈ ఒక్క ప్రశ్నకు జగన్ జవాబు చెప్పగలరా?

రాష్ట్రవ్యాప్తంగా ఎన్నికలను ఏయే అంశాలైనా ప్రభావితం చేస్తుండవచ్చు గాక.. కానీ కడప ఎంపీ బరిలో మాత్రం ఒకే ఒక్క అంశం ఈసారి కీలకం కానున్నది. అదే వివేకానందరెడ్డి హత్య! అయిదేళ్ల కిందట జరిగిన హత్య కేసులో నిందితులు ఎవరో ఇప్పటికీ నిగ్గు తేల్చకపోవడం అనేది ప్రభుత్వాలకు సిగ్గుచేటు వ్యవహారం కావొచ్చు.  కానీ అయిదేళ్ల ముందు జగన్ విజయానికి ఒక రకంగా పరోక్షంగా దోహదం చేసిన చిన్నాన్న వివేకానందరెడ్డి హత్య, అయిదేళ్ల తర్వాత ఇప్పుడు ఆయన పతనాన్ని నిర్దేశించబోతోంది. కడప ఎంపీ బరిలో పోటీచేస్తున్న ఒక చెల్లెలు షర్మిల, తన తండ్రిని చంపిన వారికి శిక్ష పడే వరకు విశ్రమించేది లేదని పోరాడుతున్న మరో చెల్లెలు సునీత ఇప్పుడు సింగిల్ పాయింట్ ఎజెండాతో ముందుకెళుతున్నారు.

ఈ నేపథ్యంలో వివేకా హత్య కేసు విషయంలో జగన్మోహన్ రెడ్డి చెబుతున్న మాయమాటలను చెల్లెళ్లిద్దరూ పదేపదే నిలదీస్తున్న సంగతి అందరికీ తెలిసిందే. తాజాగా సునీత అడిగిన ఒక్క ప్రశ్న.. ప్రజలను ఆలోచింపజేసేదిగా ఉంది. ‘‘వైఎస్ రాజశేఖర రెడ్డి జీవించి ఉంటే.. దీనిని సహించేవారా? పదవులకోసం తన తమ్ముణ్ని హత్య చేస్తే ఆయన చూసి తట్టుకునేవారా?’’ అని సునీత ప్రశ్నించారు. ఇది చాలా ఇంపార్టెంట్ ప్రశ్న. ఎందుకంటే వైఎస్ రాజశేఖరరెడ్డికి ఒక వర్గం ప్రజల్లో ఉండే అభిమానాన్ని పెట్టుబడిగా వాడుకోవడం ద్వారా మాత్రమే తన రాజకీయ జీవితాన్ని డిజైన్ చేసుకుని, ముఖ్యమంత్రి కూడా అయిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. అలాంటి జగన్.. రాజశేఖర రెడ్డి తమ్ముడిన చంపించిన వారిని ఉపేక్షిస్తున్నారంటే అది ఆయన స్ఫూర్తికి ఎంత పెద్ద ద్రోహమో ప్రజలు ఊహించుకోగలరు. వైఎస్సార్ జీవించి ఉంటే తమ్ముడిని చంపిన వారికి శిక్ష పడడం గురించి పట్టించుకోకుండా ఉండేవారా? అనేది ఇప్పుడు జగన్ సమాధానం చెప్పాల్సిందే.

వైఎస్ రాజశేఖర రెడ్డి ఆయన తమ్ముడు వివేకానందరెడ్డి ఎంత అన్యోన్యంగా ఉండేవారో అప్పటి రాజకీయాలతో పరిచయం ఉన్న అందరికీ స్పష్టంగా తెలుసు. వారిద్దరిదీ రామలక్ష్మణుల వంటి బంధం అని, తన తండ్రి, అన్న మాటను జవదాటేవారు కాదని సునీత చెప్పుకొచ్చారు కూడా. వైఎస్సార్ కడప ఎంపీగా బరిలో ఉంటే.. ఆయన తరఫున పులివెందుల ప్రజలకోసం పనిచేయడానికి ఎమ్మెల్యే బరిలో వివేకా పోటీచేసేవారు. అదే వైఎస్ఆర్ పులివెందుల ఎమ్మెల్యేగా పోటీచేస్తే.. కడప ఎంపీగా ఆయన వెళ్లేవారు. వివేకా రాజకీయ జీవితం మొత్తం కూడా వైఎస్ఆర్ ప్రస్థానం కోసమే అన్నట్టుగాను, ఆయనకు అనుగుణంగానూ మాత్రమే ఉండేది.

అలాంటి వివేకానందరెడ్డి.. వైఎస్ రాజశేఖర రెడ్డి మరణానంతరం పులివెందుల- కడప స్థానాల మధ్య తమ మధ్య ఉన్న అవగాహన లాంటిదే.. జగన్ – షర్మిల మధ్య ఉండాలని కోరుకున్నారు. జగన్ ఎమ్మెల్యేగాఉంటే, షర్మిల కడప ఎంపీ కావాలని ఆయన కోరుకోవడం అత్యాశ కాదు. కానీ కేవలం అందుకే ఆయనను చంపేశారని, వివేకా హంతకులను ఓడించేందుకే తాను రంగంలోకి  దిగానని అంటూ షర్మిల ఇప్పుడు పోరాడుతున్నారు. సునీత సంధిస్తున్న సూటి ప్రశ్నలకు జవాబు చెప్పకుండా జగన్ ఈ ఎన్నికల్లో ముందుకు వెళ్లలేరని ప్రజలు అనుకుంటున్నారు.

బెయిల్ రద్దయితే అవినాష్ పరిస్థితి ఏంటి?

ఒకవైపు రాజకీయాలు విమర్శలు ప్రతివిమర్శలతో హీటెక్కుతోంటే.. కడప ఎంపీ ఎన్నికకు సంబంధించిన మరో ఆసక్తికరమైన పరిణామం.. హైదరాబాదులో చోటుచేసుకుంటోంది. ఇక్కడి తెలంగాణ హైకోర్టులో.. కడపలోని వైఎస్సార్ కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి అవినాష్ రెడ్డి కి గతంలో మంజూరుచేసిన బెయిల్ ను రద్దు చేయాలని కోరుతున్న పిటిషన్ చర్చకు వచ్చింది. ఈ పిటిషన్ పై న్యాయస్థానం సంధిస్తున్న ప్రశ్నలు చూస్తోంటే.. అవినాష్ రెడ్డి బెయిలు రద్దు కావచ్చుననే అభిప్రాయం కూడా పలువురికి కలుగుతోంది. ప్రస్తుతానికి ఆ పిటిషన్ ఏప్రిల్ 15 వ తేదీకి వాయిదా పడిన నేపథ్యంలో ఆరోజున ఏ సంగతీ తేలుతుంది.

మాజీ ఎంపీ వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో కీలక నిందితుల్లో ఒకరు ఎంపీ అవినాష్ రెడ్డి. ఆయన ప్రస్తుతం బెయిలుపై బయట ఉన్నారు. కడప ఎంపీగా మళ్లీ పోటీచేస్తున్నారు. అయితే.. అవినాష్ రెడ్డి బయట ఉండడం వలన సాక్షులను ప్రభావితం చేసే అవకాశం ఉన్నదని, తనకు కూడా బెదిరింపులు వస్తున్నాయని, తన తండ్రి మీద దాడులు కూడా జరిగాయని.. అందుచేత తక్షణం అవినాష్ రెడ్డి బెయిల్ ను రద్దు చేయాలని కోరుతూ అప్రూవర్ గా మారిన మరో నిందితుడు దస్తగిరి తెలంగాణ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. దాని మీద తెలంగాణ హైకోర్టులో విచారణ జరిగింది. ఈ సందర్భంగా కోర్టు చేసిన వ్యాఖ్యలు ఆసక్తికరం.

దస్తగిరి డిసెంబరులోనే ఫిర్యాదు ఇచ్చినప్పటికీ.. అవినాష్ రెడ్డి బెయిలును రద్దు చేయాల్సిందిగా ఇన్నాళ్లుగా మీరెందుకు కోరలేదు అంటూ.. న్యాయస్థానం దర్యాప్తు సంస్థ సీబీఐను ప్రశ్నించడం విశేషం. ప్రభుత్వ సంస్థ కావడం వలన అనుమతులకు కాస్త ఆలస్యం అవుతుందని సంజాయిసీ చెప్పుకున్న సీబీఐ తాజాగా, అవినాష్ రెడ్డి బెయిల్ రద్దుచేస్తే మాత్రమే సాక్షులకు రక్షణ ఉంటుందంటూ చాలా స్పష్టంగా కోర్టులో పేర్కొంది.

ఈ నేపథ్యంలో 15వేతేదీనాటి వాయిదాలో అవినాష్ రెడ్డి బెయిల్ రద్దు కావచ్చుననే చర్చ జరుగుతోంది. ఈ పిటిషనుకు సంబంధించి.. అవినాష్ తరఫు న్యాయవాదులు చేస్తున్న వాదనలు అంతగా బలంగా లేవని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. బెయిల్ రద్దు కోరుతూ మూడో వ్యక్తి పిటిషన్ వేయడానికి వీల్లేదంటూ వారు వాదనలు వినిపించారు. అయితే ఇలాంటి కేసుల్లో ఇతరులు కూడా బెయిల్ రద్దు కోరుతూ పిటిషన్ వేయచ్చునని గతంలో సుప్రీం కోర్టు ఇచ్చిన తీర్పులను కూడా వాదనల సందర్భంగా దస్తగిరి తరఫు న్యాయవాది వినిపించారు. పైగా దస్తగిరి తాను వేరే కేసులో జైలులో ఉండగా.. అవినాష్ తరఫు వ్యక్తులు వచ్చి తనను ఎలా భయపెట్టినదీ, ఎలా ప్రలోభపెట్టినదీ అంతా కూడా కోర్టుకు వివరించారు. ఈ నేపథ్యంలో 15వతేదీ వాయిదా కీలకం కానుంది.

బెయిలు రద్దయితే అవినాష్ రెడ్డి పరిస్థితి అగమ్యగోచరం అవుతుంది. 15వతేదీన బెయిలు రద్దయితే.. అప్పటికి ఎంపీ ఎన్నికల పోలింగుకు నెలరోజుల వ్యవధి ఉండవచ్చు గానీ.. జైలుకు వెళ్లడం వల్ల అవినాష్ కు వచ్చే సానుభూతి ఏమీ ఉండదు. మరింతగా ఆయన ఓటమికి దగ్గరవుతారనే సంగతి అర్థమవుతోంది. 

సీఎస్‌ను మార్చేదాకా అన్నీ అధికారిక అరాచకాలే?!

ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చిన తర్వాత.. కీలకమైన సమయంలో అధికార పార్టీకి కొమ్ముకాస్తూ, ప్రతిపక్ష పార్టీలను ఇబ్బందులకు గురిచేస్తున్న ఉన్నతస్థాయి అధికారులపై కేంద్ర ఎన్నికల సంఘం వేటు వేసిన సంగతి అందరికీ తెలిసిందే. ఆరుగురు ఐపీఎస్ అధికారులు, ముగ్గురు జిల్లా కలెక్టర్లపై ఇటీవల వేటు వేసి.. వారిని అప్రాధాన్య పోస్టుల్లో నియమించాల్సిందిగా, ఎన్నికల విధులకు దూరంగా ఉంచాల్సిందిగా ఈసీ అప్పుడే ఆదేశించింది. వారి స్థానాల్లో కొత్తగా నియమించేందుకు ఒక్కో పోస్టుకు ముగ్గురు అధికార్ల పేర్లతో సిఫారసులు పంపాల్సిందిగా సీఎస్ ను ఆదేశించింది. ఈ నేపథ్యంలో తాజాగా ఆ పోస్టుల్లో కొత్త నియామకాలు కూడా పూర్తయ్యాయి. అయితే కొత్తగా నియమితులైన వారు కూడా ఇప్పటిదాకా ఉన్న తమ ట్రాక్ రికార్డులో అధికార వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి కొమ్ముకాసే నాయకులుగా ముద్రపడిన వారే కావడం విశేషం. సీఎస్ జవహర్ రెడ్డి ఏరి కోరి మరీ.. వైసీపీ అనుకూల ఐఏఎస్, ఐపీఎస్ అధికార్ల పేర్లను ఈసీకి పంపినట్టుగా విమర్శలు వస్తున్నాయి. వీరి సారథ్యంలో కూడా.. అధికార యంత్రాంగం యావత్తూ.. అధికార పార్టీకి కొమ్మకాసేలాగానే ప్రవర్తిస్తుందనే ఆరోపణలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో అసలు సీఎస్ జవహర్ రెడ్డిని మార్చే నిర్ణయం తీసుకుంటే తప్ప.. అధికార యంత్రాంగం నిజాయితీగా పనిచేయడం జరగదని పలువురు విమర్శిస్తున్నారు.

నిజానికి సీఎస్ జవహర్ రెడ్డి కూడా జగన్ అనుకూల వైఖరితోనే తప్పుడు నిర్ణయాలు తీసుకుంటున్నారనే విమర్శలు చాలా కాలంగా ఉన్నాయి. సీఎస్ జవహర్ రెడ్డితోపాటు, డీజీపీ రాజేంద్రనాధ్ రెడ్డిని కూడా మారిస్తే తప్ప.. ఎన్నికలు నిష్పక్షపాతంగా జరిగే అవకాశం లేదని తెలుగుదేశం నాయకులు పలుమార్లు ఈసీకి ఫర్యాదు చేస్తున్నారు. ఈ ఇద్దరు ఉన్నతాధికారులపై ఇప్పటికే ఈసీ ప్రత్యేకంగా నజర్ వేసినట్టు సమాచారం. ఈ ఇద్దరూ కూడా అధికారపార్టీ అనుకూల వైఖరితోనే చెలరేగుతున్నారు. తెదేపా అభ్యర్థుల మీద రాష్ట్రవ్యాప్తంగా ఎక్కడెక్కడ ఎన్నెన్ని కేసులు నమోదై ఉన్నాయో చెప్పమని అడిగితే కూడా డీజీపీ స్పందించలేదని తెలుగుదేశం వారు ఫిర్యాదు చేశారు.

ఇలాంటి నేపథ్యంలో జిల్లాల్లో అరాచకాలు సృష్టిస్తున్న ఎస్పీలు, కలెక్టర్లను ఎందరిని మార్చినా.. వారి స్థానంలో మళ్లీ కొత్తగా వైసీపీ అనుకూల అధికారులే వస్తుంటారని.. సీఎస్ పోస్టులో జవహర్ రెడ్డి ఉన్నంత వరకు అంతా అలాగే జరుగుతుంటుందని పలువురు వ్యాఖ్యానిస్తున్నారు. ముందు సీఎస్ ను తప్పించి, ఆ తర్వాత.. మిగిలిన కిందిస్థాయి అధికారుల నియామకాలు చేపడితే.. న్యాయం జరుగుతుందని అంటున్నారు. 

ఈ నిర్ణయం సీఎస్‌కు ఆత్మహత్యా సదృశం!

అధికార పార్టీకి తొత్తులుగా వ్యవహరిస్తున్న ఆరోపణలు రుజుమైన నేపథ్యంలో వేటుకు గురైన ఎస్పీలు, కలెక్టర్లకు బదులుగా కొత్తవారి నియామకం తాజాగా పూర్తయింది. అయితే కొత్తగా నియమితులైన వారు కూడా.. గతంలో తమ తమ అధికార బాధ్యతల్లో అధికార పార్టీకి కొమ్ముకాసిన వారే అనే సంగతి వెలుగులోకి వస్తోంది. వేటుకు గురైన వారి స్థానంలో నియమించేందుకు ఒక్కొక్క స్థానానికి ముగ్గురేసి పేర్లతో ప్రతిపాదనలు పంపాలని ఈసీ , ఏపీ చీఫ్ సెక్రటరీ ని కోరింది. సీఎస్ జవహర్ రెడ్డి.. పనిగట్టుకుని.. వైసీపీకి అనుకూలంగా ఉండగల అధికారుల పేర్లను మాత్రమే పంపినట్టు ఇప్పుడు నిరూపణ అవుతోంది. వీరి పేర్లను సిఫారసు చేయడం ద్వారా.. సీఎస్ జవహర్ రెడ్డి ఆత్మహత్యా సదృశమైన నిర్ణయం తీసుకున్నారని పలువురు వ్యాఖ్యానిస్తున్నారు.

అసలే సీఎస్ జవహర్ రెడ్డి, డీజీపీ రాజేంద్రనాధ్ రెడ్డి ల వ్యవహార సరళి మీద ఈసీ వద్ద అనేక ఫిర్యాదులు ఉన్నాయి. అధికార పార్టీకి మేలుచేసేలా వీరు నిర్ణయాలు తీసుకుంటున్నారని తెలుగుదేశం, జనసేన ఈసీకి ఫిర్యాదులు చేశాయి. అసలే సీఎస్ వ్యవహార సరళి మీద బోలెడు అనుమానాలు వ్యాప్తిలో ఉండగా.. మళ్లీ అయిన ఇలా వ్యవహరించడం తన గోతిని తానే తవ్వుకోవడం వంటిదని పలువురు వ్యాఖ్యానిస్తున్నారు. ఇప్పుడు కొత్తగా నియమించిన ఆరుగురు ఐపీఎస్ లు, ముగ్గురు ఐఏఎస్ ల పరిధిలో.. రాబోయే రోజుల్లో ఏ ఒక్క చిన్న సంఘటన జరిగినా, అధికార పార్టీకి వారు కొమ్ముకాస్తున్నట్టుగా ఆరోపణలు వచ్చినా.. ఆ ప్రభావం వారిని సిఫారసు చేసిన సీఎస్ జవహర్ రెడ్డిమీద పడుతుంది.

ఈ ఆరోపణలు ఇంకాస్త ఎక్కువైతే కేంద్ర ఎన్నికల సంఘం ముందుగా చీఫ్ సెక్రటరీని మార్చేసినా ఆశ్చర్యం లేదని పలువురు అంటున్నారు. గతంలో కూడా 2019 ఎన్నికలకు పూర్వం ఈసీ , చీఫ్ సెక్రటరీని మార్చిన వైనం అందరూ గుర్తుచేస్తున్నారు. కొత్తగా నియమితులైన వారిలో.. కొందరి గురించి ఆరోపణలు ఎక్కువగా ఉన్నాయి. వివిధ విభాగాల్లో ఉంటూ తెలుగుదేశం పార్టీ నాయకులను వేధించడమే పనిగా గతంలో పనిచేసిన వారిని ఇప్పుడు మళ్లీ కొత్త పోస్టుల్లో నియమించారనే ఆరోపణలు వస్తున్నాయి. ఇలాంటి బదిలీల వల్ల అసలు ఉపయోగమే ఉండదని, ఇలా జరిగేట్లయితే.. ఎందరు అధికార్ల మీద ఈసీ వేటు వేసినా నిష్పాక్షికంగా ఎన్నికలు జరగబోవని పలువురు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. 

డార్లింగ్ తో ఫోటోను షేర్‌ చేసిన అమ్మడు!

యంగ్‌ రెబల్ స్టార్ ప్రభాస్ ప్రధాన పాత్రలో, డైరెక్టర్ నాగ్ అశ్విన్ డైరెక్షన్ లో రూపుదిద్దుకుంటున్న భారీ బడ్జెట్ చిత్రం కల్కి 2898AD ఈ చిత్రం లో హీరోయిన్‌ దీపికా పదుకునే, దిశా పటాని లు  లీడ్ రోల్స్ చేస్తున్నసంగతి తెలిసిందే. ఇటలీ లో జరిగిన షూటింగ్ స్పాట్ లో దిశా కొన్ని ఫోటోలను తీసి అభిమానులతో పంచుకున్న విషయం తెలిసిందే. అందులో ప్రభాస్ తో దిగిన సెల్ఫీ ఒకటి.

ప్రభాస్ తో దిశా దిగిన సెల్ఫీ ఆడియెన్స్ ను, ఫ్యాన్స్ ను బాగా అట్రాక్ట్‌ చేస్తుంది.. దిశా ఈ ఫోటోను తన సోషల్‌ మీడియా ఖాతాలో పోస్ట్‌ చేసిన కొద్ది సేపటికే సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. త్వరలో థియేటర్ల లోకి రానున్న ఈ మూవీ లో అమితాబ్ బచ్చన్, కమల్ హాసన్  కీలక పాత్రల్లో నటిస్తున్నట్లు చిత్ర బృందం ఇప్పటికే వెల్లడించిన సంగతి తెలిసిందే. సంతోష్ నారాయణన్ ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నారు.  వైజయంతి మూవీస్ బ్యానర్ పై చిత్రాన్ని నిర్మిస్తున్నారు.

Family Star Movie Review: Boring Than“Mogali Rekulu”

0

Review By Abhinav Santosh, TeluguMOPO

Movie Name: Family Star
Release Date: April 5, 2024
Cast: Vijay Devarakonda, Mrunal Thakur, Jagapathi Babu, Rohini, Vasuki, Vennela
Kishore & Others
Director: Parasuram Petla
Music Director: Gopi Sundar
Rating: 2.5/5

Story:
Govardhan is an architect from a middle-class background, who dedicated his life to
his whole family. Indu, a student comes as a tenant in his home who eventually
brings a significant turning point in Govardhan’s life. However, when Govardhan
plans to get engaged with Indu, he gets to know a shocking reveal from Indu. As he
falls for her but puts her away when he gets to know that Indu pretended to love him
for a thesis work on ‘middle-class men”. With that anger, Govardhan joins into a elite
company to prove her that he’s not just a middle-class man. He shockingly bumps
into Indu in that elite company. Who is she, and How did things go after that? How
Indhu handles Govardhan’s hate? The answers to these questions unfold as the
story progresses, which needs to be experienced on the big screen.

Review:
Family Star has a very weak plot. It feels more boring as the story progresses, the
screenplay is too dragged which almost tests the patience of the audience. The film
was initially very hyped by the makers but unfortunately it doesn’t live upto the
expectations and sadly do not justify the title. The characterisations of the main
leads and supporting casts are designed good but will not be remembered. The
scenes written to establish the middle-class family life is not quite appealing and
moreover feels little annoying. The family values and emotions works in bits &
pieces. The conflict between the brothers doesn’t workout and and feels almost
fake. Narration goes flat throughout the film. Few scenes did generate laughs but
remains forgettable. The makers tried a lot to showcase Vijay as a mass action hero
with few fight scenes which feels total waste to the story. The phrase ‘Iron eh
vanchala enti’ fight scene is made good but was too long to watch. The whole itself
drags a lot that the audience feel it as a daily soap serial. The emotions in the family
are not convincing.

Vijay as Govardhan is good but the character he plays is little cranky for audience
too and felt like Vijay didn’t fit into Govardhan as his accent feels underworked but
tried his best to fit in the role. Vijay has nothing to offer as Govardhan except saying
‘kopam unte nannu kottu ra babu’. Mrunal Thakur as Indu is beautiful and was
perfect in her role. The chemistry between Vjiay and Mrunal works out very well and
feels as a fresh pair on screen.

Director Parasuram Petla miserably fails to deliver a good family entertainer this
weekend as it showed the laziness of the director to even correct out the technical
and logical mistakes appeared in the film. Director could have taken some time to
workout on the story, especially on the screenplay which might really help the film to
atleast engage the audience. Writing is weak, Screenplay is lazy and dragging.
Technically, the production values of the film is top-notch. Music by Gopi Sundar is a
total disappointment. None of the bgms are good and except ‘Nandanandana’ no
other songs are good to watch on screen, totally unforgettable. Cinematography by
K.U.Mohanan is decent and he shows Mrunal exceptionally beautiful in some frames.

Cinematography feels realistic. Editing by Marthand.K.Venkatesh could have been
little crisp because as said above the film feels like a daily soap serial.
Is it worth watching in theatres?

I would say, Family Star offers nothing great than few laughable and cute lead pair
scenes. it’s better to watch at home on OTT.

అర్థరాత్రి రోడ్డు మీద నయన తార ఏం చేసిందంటే!

లేడీ సూపర్‌ స్టార్‌ నయనతార గురించి ఏ ఇండస్ట్రీ ప్రేక్షకులకు కూడా పరిచయం అక్కర్లేదు. అగ్ర హీరోల సరసన ఆడిపాడడమే కాకుండా… వారికే పోటీగా నిలిచింది. స్టార్ హీరోలతో సమానంగా రెమ్యూనరేషన్‌ అందుకుంటుంది. ఓ వైపు సినిమాలతో బిజీగా ఉన్నా కూడా ఆమె ఎప్పుడూ సోషల్‌ మీడియాలో యాక్టివ్‌ గానే ఉంటుంది.

అయితే తాజాగా ఈ ముద్దుగుమ్మ ఇన్‌ స్టా లోకి కూడా అడుగుపెట్టింది.ఆ అకౌంట్‌ లో తాజాగా ఓ వీడియోను షేర్‌ చేసింది. ప్రస్తుతం ఆ వీడియో  నెట్టింట తెగ వైరల్‌ అవుతుంది.  ఆ వీడియోలో నయన తార తో పాటు మరో ఇద్దరు కూడా కనిపిస్తున్నారు. వారంతా అర్ధరాత్రి రోడ్డుపై ఐస్ క్రీమ్ తింటూ కనిపించారు. వారితో నయన్ చాలా ఎంజాయ్‌ చేస్తూంది. వాళ్లంతా నయన్ స్నేహితులులాగా ఉన్నారు.

ఐస్ క్రీమ్ తింటూ చాలా ఎంజాయ్‌ చేస్తున్నారు.  ఆ ఐస్ క్రీమ్ షాప్ ముందే నయనతార బ్యానర్ ఒకటి ఉంది. ఆ ఇద్దరు నయన్ తో చాలా ఫన్నీగా ఓ వీడియోను చేశారు. ఆ వీడియోనే  ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొడుతుంది.

ఈ వీడియోను చూసిన చాలా మంది అంత పెద్ద స్టార్ అయిన ఇలా సింపుల్ గా రోడ్డు పక్కన ఐస్‌ క్రీమ్‌ తినడం గ్రేట్ అంటూ కామెంట్స్ పెడుతున్నారు.

పుష్పగాడి పెళ్లాం అంటే ఆ మాత్రం ఉండాల్సిందే!

రష్మిక పుట్టినరోజు సందర్భంగా పుష్ప 2 చిత్రం నుంచి శ్రీవల్లి ఫస్ట్‌ లుక్‌ ను చిత్ర బృందం  విడుదల చేసింది. దీనిని సినిమా అధికారిక సోషల్ మీడియా ఖాతాలలో అధికారిక విడుదల చేశారు.  ఈ ఫోటోలో ఆకుపచ్చని చీరని కట్టుకొని, భారీగా బంగారం ఆభరణాలను ధరించి చాలా అందంగా ఉంది. అంతేకాకుండా హీరోయిన్‌ నుదట సింధూరం కూడా ఉంది.

ఈ  సినిమా ఆగస్టు 15న ప్రపంచ వ్యాప్తంగా విడుదలవుతుందని ఇప్పటికే చిత్ర బృందం తెలిపిన సంగతి తెలిసిందే. కాకపోతే ప్రస్తుతం దేశంలోని ఎలక్షన్ల కారణంగా ఈ సినిమా ఆలస్యం అయ్యేలా కనపడుతుంది. పుష్పా సినిమా మొత్తం మూడు భాగాలలో  ఉంటుందని దర్శకుడు సుకుమార్ ఇప్పటికే తెలిపారు.

పుష్ప మొదటి భాగం సంబంధించి ఇప్పటికే అనేక అవార్డులను గెలుచుకుంది. ఇక హీరో అల్లు అర్జున్ ని అయితే  ఏకంగా నేషనల్ నటుడిగా నిలబెట్టింది. 

అబ్బాబ్బ ఏమి ఉంది బాసూ!

తెలుగు  చిత్ర పరిశ్రమలో ఎంత మంది హీరోయిన్లు వచ్చినప్పటికీ రష్మిక కి ఉన్న క్రేజ్‌ మాత్రం అసలు తగ్గలేదు. ఎప్పటికప్పుడే కొత్త కొత్త పాత్రలను ఎంచుకుంటూ బాక్సాఫీస్‌ రికార్డులు బద్దలు కొట్టే సినిమాలలో నటిస్తోంది. పుష్ప సినిమాతోనే రష్మిక మందన నటనపరంగా మంచి పేరు తెచ్చుకున్న.. ఆ తర్వాత విడుదలైన యానిమల్ సినిమాతో తనదైన నట విశ్వరూపాన్ని చూపించి అందరి మన్నలను పొందింది.

సౌత్‌ లో మాత్రమే కాకుండా… బాలీవుడ్‌ లో కూడా యానిమల్‌ సినిమాతో ఎంట్రీ ఇచ్చి తన నటన ప్రతిభని దేశానికి చూపించింది. కాగా ఈరోజు రష్మిక పుట్టిన రోజు. ప్రస్తుతం రష్మిక పుష్ప 2 , ది గర్ల్ ఫ్రెండ్‌, కుబేర సినిమాలు ఉన్నాయి. వాటి చిత్రీకరణలో ఫుల్ బిజీగా ఉంది.
రష్మిక బర్త్‌ డే సందర్భంగా ది గర్ల్‌ ఫ్రెండ్‌ సినిమాకు సంబంధించిన ఓ ఆసక్తికరమైన పోస్టర్‌ ను విడుదల చేసింది.

ఈ పోస్టర్స్‌ లో రష్మిక ఎంతో క్యూట్‌ గా కనిపించిందో.. ఆ ఫోటోలను చూస్తే ఎంతైనా చూడాలనిపించేలా ఉంది. ఈ పోస్టర్లలో రష్మిక కాలేజీ స్టూడెంట్‌ లా అనిపిస్తోంది. నేషనల్‌ క్రష్‌ ఎప్పుడు ఆనందంగా ఉల్లాసంగా.. ఉండాలంటూ పుట్టినరోజు శుభాకాంక్షలు అంటూ చిత్ర బృందం తెలిపింది.

Rashmika Mandanna In A New Avatar For Pushpa 2: The Rule

National crush Rashmika Mandanna celebrates her 28th birthday today. As Rashmika Mandanna celebrates another year of life, the movie makers of her upcoming highly anticipated film ‘Pushpa 2: The Rule’ have unveiled the first look at her as Srivalli.

The makers took to social media to unveil the first-look poster and captioned, “Wishing the nation’s heartthrob ‘Srivalli’ aka @rashmika_mandanna a very Happy Birthday. #Pushpa2TheRuleTeaser on April 8th. #PushpaMassJaathara #Pushpa2TheRule Grand Release Worldwide on 15th AUG 2024.”

Rashmika Mandanna as Srivalli in the poster unveils a fresh interpretation and essence to the character, in contrast to her image in the prequel film. In the poster, the actress is draped in a green saree and emanates confidence, commanding attention through her dominant stance. The actress leaves an indelible impression with her look, with ornate gold ornaments and kumkum on her forehead combined with black kajal on her eyes.

Earlier, the makers of the film announced the release date of Pushpa 2: The Rule teaser. The film’s teaser is all set to launch on the occasion of Icon Star Allu Arjun’s birthday. Fans are eagerly waiting to witness the Pushpa Mass Jaathara on April 8th. Pushpa 2: The Rule, helmed by Maverick director Sukumar. The film’s stellar cast includes Fahadh Faasil, Sunil, and Anasuya. 

Apart from Pushpa 2, Rashmika Mandanna is geared up with three projects: The Girlfriend, Kubera, and the Hindi film Chaava. Girlfriend, helmed by Rahul Ravindran. In Kubera, which is helmed by Sekhar Kammula, the actress collaborated with Dhanush for the first time.