ఇండోసోల్ సోలార్ ప్యానెళ్ల పరిశ్రమకు భూములు ఇవ్వడానికి కరేడు రైతులు వ్యతిరేకత వ్యక్తం చేస్తుండడం ఇవాళ రాష్ట్రంలోని హాట్ టాపిక్ లలో ఒకటి. రైతులకు అర్థమయ్యేలా పరిస్థితులను వివరించి.. భూసేకరణ జరుగుతుందని, భూసేకరణ విషయంలో ప్రభుత్వం వెనక్కు మళ్లలేదని అధికారులు చెబుతున్నారు. అయితే ప్రభుత్వ సంకల్పం నెరవేరకుండా.. రైతుల్ని రెచ్చగొట్టి ఇండోసోల్ కు భూములు ఇవ్వకుండా చేయడానికి జగన్ మరియు ఆయన అనుచర దళాలు శతవిధాలా ప్రయత్నిస్తున్నట్టుగా తెలుస్తోంది.
ఇండోసోల్ కంపెనీ జగన్మోహన్ రెడ్డికి బినామీ కంపెనీ అనే ప్రచారం ఆయన ముఖ్యమంత్రిగా వారికి చేవూరు వద్ద భూములు కేటాయించినప్పటినుంచి ఉంది. అయితే ఇప్పుడు రామాయపట్నం పోర్టుకు అనుబంధంగా ప్రతిష్ఠాత్మకంగా బీపీసీఎల్ ను కూడా రాష్ట్రానికి తీసుకురావడంలో కూటమి ప్రభుత్వం విజయం సాధించింది. వారికి విస్తారమైన భూములు కావాల్సి ఉన్నందున చేవూరు వద్ద ఉన్న భూముల్ని ఇవ్వడానికి నిర్ణయించారు. ఆ మేరకు ఇండోసోల్ కంపెనీకి ప్రత్యామ్నాయంగా కరేడు వద్ద భూములు సేకరించి ఇస్తామని ప్రభుత్వం చెప్పింది. అంతవరకు బాగానే ఉంది. ఇండోసోల్ కంపెనీకి కర్త కర్మ క్రియ తానే అయిన జగన్మోహన్ రెడ్డి.. ఈ ప్రయత్నాన్ని ముందుకు సాగనివ్వకుండా అడ్డుకుంటున్నారు.
కరేడు రైతులు వ్యతిరేకత వ్యక్తం చేయడం వెనుక వైసీపీ నేతల కుట్రవ్యూహం ఉన్నదనే ప్రచారం వినిపిస్తోంది. ఇండోసోల్ కరేడుకు మారితే.. చేవూరు వద్ద బీపీసీఎల్ వస్తుంది. అది రాష్ట్రప్రభుత్వ ప్రతిష్ఠను పెంచుతుంది. అలా జరగడం జగన్ కు ఇష్టం లేదు. అందుకే ఆయన రైతులను రెచ్చగొడుతున్నారు. కడేరు రైతులు వ్యతిరేకత వ్యక్తం చేసిన తర్వాత.. కందుకూరు వైసీపీ పార్టీ ఇన్చార్జి మధుసూదన్ యాదవ్ ఆధ్వర్యంలో కేవలం 12 మంది రైతులు వచ్చి తాడేపల్లిలో జగన్ ను కలిశారు. వారి పోరాటానికి తన మద్దతు ఉంటుందని జగన్ వారితో చెప్పారు. నిజానికి ఆయన ఉద్దేశం మద్దతివ్వడం కాదు. అసలు రాష్ట్రానికి బీపీసీఎల్ రాకుండా అడ్డుకోవడం.
ఇండోసోల్ కు జగన్ భూములిచ్చారే గానీ.. ఇప్పటిదాకా వారు అక్కడ తమ కార్యకలాపాలు ప్రారంభించనేలేదు. అందువల్లనే వాళ్లకు ప్రత్యామ్నాయ స్థలాలు చూపించడానికి ప్రభుత్వం ప్రయత్నిస్తోంది. అది జరగకుండా జగన్ తన దళాలతో తెరవెనుకనుంచి అడ్డుకుంటున్నారు. ఇందుకోసం ఆయన ఇండోసోల్ కంపెనీ మీద తన ప్రెస్ మీట్ లో అవ్యాజమైన ప్రేమను కురిపిస్తున్నారు. వారి కంపెనీ 42 వేల కోట్ల పెట్టుబడి పెడుతుందని, 8 వేల ఉద్యోగాలు వస్తాయని అంటున్నారు. వారికిచ్చే స్థలం కరేడు వద్దకు మారినంత మాత్రాన ఆ ఉద్యోగాలు రావడం ఆగిపోదు కదా? అనేది ప్రజల సందేహం. అంతకంటె పెద్ద సంస్తకు ఎక్కువ స్థలం కావాలి గనుక.. బీపీసీఎల్ కు ఇవ్వడం ముఖ్యం అని, కానీ.. జగన్ దానిని అడ్డుకోడానికి ఇండోసోల్ ముసుగులో కపటప్రేమ చూపిస్తున్నారని పలువురు అంటున్నారు.
ఇండోసోల్ ముందూ వెనుకా తానే అయి నడిపిస్తున్న జగన్!
Pawan Kalyan’s Hari Hara Veera Mallu Pre-Release Event Set for July 21 in Hyderabad
Power Star Pawan Kalyan is poised to make a return to the screens with grandeur with his long-awaited movie Hari Hara Veera Mallu. Directed by Jyothi Krishna, the film is a period-fantasy action entertainer boasting an extravagance on an epic scale and one that can expect a dynamite and electrifying performance from Pawan in a role that is hitherto unseen. With huge expectations around the movie, the producers are sure that the film will create a sensation at the box office.
To further pump up the excitement, the team has announced officially a pre-release event mega one. The event takes place on July 21 at 6 PM at Hyderabad’s elite Shilpakala Vedika. This news was made public in a brand-new promotional poster, which has already begun trending among fans.
Hari Hara Veera Mallu has Nidhhi Agerwal as heroine, with Bobby Deol as the prime villain in a meaty role. The music of the film is by the legendary M.M. Keeravani. Produced by ace producer A.M. Rathnam, the film is being made on a large scale with big budget seriousness.
The movie is now locked for worldwide theatrical release on July 24 and fans are already counting down the days. With a fantastic cast, compelling story and Pawan Kalyan’s stardom, Hari Hara Veera Mallu is destined to be one of the year’s biggest releases.
My Baby Telugu Movie Faces Tough Challenge with Just One-Day Gap Before OTT Release
In a time when even a 30-day window between theatrical and OTT releases is seen as risky for box office returns, a surprising move by the makers of the Telugu-dubbed film My Baby is raising eyebrows. The film was released in Tamil originally, titled DNA, on June 20th, where a decent response was received. The Telugu version of the film comes to theatres on July 18th will be available on Disney+ Hotstar the day after on July 19th in all languages.
Directed by Nelson Venkatesan, DNA is a heavy emotional drama about child trafficking (and human trafficking) at its darkest. The film stars Atharvaa, who you may remember from the film Gaddalakonda Ganesh, and had music composed by five different composers, and the background score by seasoned composer Ghibran, to give the film plenty of technical depth but also a lot of emotional heft.
The biggest concern, however, is the extremely short gap between the theatrical and digital releases in Telugu. While the Tamil version is sticking to the traditional one-month OTT timeline, the Telugu release got delayed due to the late acquisition of dubbing rights. This delay has now led to the unfortunate scenario where the film’s digital premiere is almost simultaneous with its theatrical release.
ఓటీటీ పార్టనర్ ని ఫిక్స్ చేసుకున్న మాస్ జాతర!
మాస్ రాజా రవితేజ అభిమానులు ఎదురుచూస్తున్న తాజా సినిమా ‘మాస్ జాతర’పై మంచి హైప్ క్రియేట్ అవుతోంది. ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్న భోగవరపు భాను, పూర్తిగా మాస్ యాక్షన్ ఎంటర్టైనర్గా ఈ కథను మలుస్తున్నాడని సమాచారం. ఇప్పటికే విడుదలైన పోస్టర్లు, సాంగ్స్ సినిమాపై భారీ అంచనాలు పెంచాయి.
ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ వేగంగా కొనసాగుతోంది. ఈ క్రమంలో ఓటీటీ డీల్ కూడా ఫైనల్ అయిందని తెలిసింది. నాన్-థియేట్రికల్ రైట్స్ను ప్రముఖ డిజిటల్ ప్లాట్ఫారమ్ నెట్ఫ్లిక్స్ భారీ మొత్తానికి సొంతం చేసుకున్నట్లు టాక్. సమాచారం ప్రకారం ఈ డీల్ విలువ సుమారు రూ.20 కోట్లు అని తెలుస్తోంది.
సినిమాలో శ్రీలీల హీరోయిన్గా నటిస్తుండగా, సంగీతం భీమ్స్ సిసిరోలియో అందిస్తున్నాడు. ఈ భారీ ప్రాజెక్ట్ను సితార ఎంటర్టైన్మెంట్స్ మరియు ఫార్చున్ ఫోర్ సినిమాస్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. నాగవంశీ, సాయి సౌజన్య నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు. వినాయక చవితి సందర్భంగా, ఆగస్టు 27న ఈ సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకురావడానికి సన్నాహాలు చేస్తున్నారు.
రాజాసాబ్ మరోసారి వాయిదా!
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా వస్తున్న సినిమా ది రాజా సాబ్ కోసం ప్రేక్షకుల్లో భారీ అంచనాలు ఉన్నాయి. ఈ చిత్రాన్ని దర్శకుడు మారుతి హారర్ కామెడీ జానర్లో రూపొందిస్తున్నాడు. ప్రారంభంలో ఈ సినిమాను డిసెంబర్ 5న విడుదల చేస్తామని మేకర్స్ అధికారికంగా ప్రకటించారు.
అయితే, తాజా సమాచారం ప్రకారం ప్రస్తుతం జరుగుతున్న పోస్ట్ ప్రొడక్షన్ పనులు అనుకున్నంత వేగంగా పూర్తవ్వడం లేదట. ఈ కారణంగా డిసెంబర్ 5 రిలీజ్ ప్లాన్ కుదరకపోవచ్చని టాక్ వినిపిస్తోంది. ఒకవేళ ఈ తేదీ మిస్ అయితే, వచ్చే సంక్రాంతి సీజన్నే మేకర్స్ లక్ష్యంగా పెట్టుకోవాల్సి రావచ్చు.
ఈ లెక్కన చూస్తే, ది రాజా సాబ్ 2026 సంక్రాంతి బరిలోకి వచ్చే అవకాశం ఉందని సినీ వర్గాల్లో చర్చ నడుస్తోంది. ఇది నిజమవుతుందా లేదా అనేది చూడాలి. ఈ సినిమాలో నిధి అగర్వాల్, మాళవిక మోహనన్, రిద్ధి కుమార్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. థమన్ సంగీతం అందిస్తుండగా, ఈ చిత్రాన్ని పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్పై టి.జి. విశ్వప్రసాద్ నిర్మిస్తున్నాడు.
బాహుబలిని కట్టప్ప చంపకపోయి ఉంటే…రానా ఫన్నీ రిప్లై!
భారతదేశం అంతా ఒకప్పుడు చర్చించిన ప్రశ్న ఏదంటే, “కట్టప్ప బాహుబలిని ఎందుకు చంపాడు?” అనేది. బాహుబలి మొదటి భాగం ముగిసిన దగ్గర నుంచి ఈ ప్రశ్న అందరికీ కుతూహలంగా మారింది. రాజమౌళి, ప్రభాస్ లు ఆ సస్పెన్స్ ని అంత అద్భుతంగా సెట్ చేయడంతో, రెండో భాగం కోసం ప్రేక్షకులు ఉత్కంఠగా ఎదురు చూశారు.
ఇప్పుడు మేకర్స్ రీ-రిలీజ్ ముందు ఈ ప్రశ్నను మళ్లీ హైలైట్ చేస్తున్నారు. సోషల్ మీడియాలో బాహుబలి టీమ్ “ఒకవేళ కట్టప్ప బాహుబలిని చంపకపోతే?” అన్న ప్రశ్న వేసింది. దీనికి రానా సరదాగా స్పందిస్తూ, కట్టప్ప చేయకపోతే నేనే చేసేవాడిని అన్నట్లుగా రిప్లై ఇచ్చాడు.
అదే సమయంలో ప్రభాస్ కూడా తన స్టైల్ లో ఫన్నీగా రియాక్ట్ అయ్యాడు. రానా సమాధానానికి కౌంటర్ ఇస్తూ, మీరిద్దరూ కాదు నేను స్వయంగా ఇందుకోసం చంపనిచ్చాను అంటూ బాహుబలి 2 వందల కోట్లు వసూలు చేసిన విజయాన్ని గుర్తు చేసేలా రిప్లై ఇచ్చాడు.
ఈ సరదా సంభాషణ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఫ్యాన్స్ మళ్లీ బాహుబలి మూడ్ లోకి వెళ్లిపోతున్నారు. ఇక ఈ మోస్ట్ అవైటెడ్ రీ-రిలీజ్ అక్టోబర్ 31న పాన్ ఇండియా లెవెల్ లో భారీగా జరగబోతోంది.
వీరమల్లు ప్రీ రీలిజ్ ఈవెంట్ పై ట్విస్ట్!
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రధాన పాత్రలో వస్తున్న హరిహర వీరమల్లు సినిమా కోసం అభిమానులు ఎన్నాళ్లుగానే ఎదురుచూస్తున్నారు. చారిత్రక కాలం నేపథ్యంలో రూపొందుతున్న ఈ ప్రాజెక్ట్ మొదటి అనౌన్స్మెంట్ నుంచి ఎన్నో మార్లు నిలిచిపడి మళ్లీ స్టార్ట్ అవుతూ వచ్చింది కాబట్టి ఆసక్తి కూడా అంతకంతకు పెరిగింది. దర్శకుడు క్రిష్ తెరకెక్కిస్తున్న ఈ భారీ చిత్రం కథ పరిమాణం బలంగా ఉండటంతో జ్యోతికృష్ణతో కలిసి రెండుభాగాలుగా ప్లాన్ చేసినట్టు టాక్ వినిపిస్తోంది.
షూటింగ్ దశల్లో పడిన గ్యాప్లే కాదు, ప్రమోషన్ ప్లాన్లు కూడా తరచూ మారుతున్నాయి. పెద్ద స్థాయి ప్రీరిలీజ్ వేడుకను బహిరంగ ప్రదేశంలో భారీగా నిర్వహించాలని టీమ్ మొదట ఆలోచించిందని చెప్పుకుంటున్నారు. ఆ తర్వాత ఆ ఈవెంట్ను తిరుపతిలో పెడదామా అనే చర్చ, తర్వాత విశాఖపట్నం వైపు మారిన ప్లాన్ అనే వార్తలు బయటకు వచ్చాయి.
ఇప్పుడు తాజా వినికిడి ప్రకారం వేడుకలు ఈ రెండుచోట్ల కాకుండా హైదరాబాద్లోని శిల్పకళా వేదికలో జరగొచ్చని ఫిలింసర్కిల్స్లో మాటలు వినిపిస్తున్నాయి. ఎక్కడ నిర్వహించినా పవన్ కళ్యాణ్ అభిమానులు భారీగా హాజరై వేడుకను పండగలా మార్చే అవకాశమే ఎక్కువ. అన్ని మలుపులు దాటుకుని థియేటర్ల్లోకి అడుగుపెట్టే సమయానికి సినిమా మీద హీట్ ఏ స్థాయిలో ఉంటుందో చూడాలి. రిలీజ్ తర్వాత బాక్సాఫీస్ వద్ద హరిహర వీరమల్లు ఎంత బిగ్ ఇంపాక్ట్ క్రియేట్ చేస్తుందో అభిమానులంతా ఉత్కంఠగా వేచిచూస్తున్నారు.
అది నోలన్ సినిమా.. ఏడాదికి ముందే టికెట్లు విడుదల!
హాలీవుడ్లో తన ప్రత్యేకమైన స్టైల్తో ప్రేక్షకులను మైండ్బ్లాక్ చేసే డైరెక్టర్ అంటే క్రిస్టోఫర్ నోలన్ అని చెప్పాలి. తన సినిమాలు ఎప్పుడూ కొత్త కాన్సెప్ట్లు, అద్భుతమైన ప్రెజెంటేషన్తో ఉండటమే కాదు, ప్రతి ప్రాజెక్ట్పై అభిమానుల్లో విపరీతమైన అంచనాలు క్రియేట్ చేస్తాయి. ఇప్పుడు ఆయన చేస్తున్న తాజా సినిమా కూడా అదే స్థాయిలో హైప్ని క్రియేట్ చేస్తోంది.
నోలన్ సాధారణంగా ఎంత పెద్ద ప్రాజెక్ట్ అయినా కూడా నిర్దిష్ట సమయంలో పూర్తి చేస్తారు. ప్రస్తుతం ఆయన తెరకెక్కిస్తున్న సినిమా పేరు “ఒడిస్సి”. ఈ మూవీపై ఇప్పటినుంచే ప్రపంచవ్యాప్తంగా సూపర్ హైప్ ఉంది. కానీ ఇప్పుడు ఈ సినిమాకు సంబంధించిన మరో సెన్సేషనల్ అప్డేట్ బయటకు వచ్చింది.
సాధారణంగా ఏ సినిమా అయినా రిలీజ్కి ఒకటి రెండు నెలల ముందు టికెట్ బుకింగ్స్ ఓపెన్ చేస్తారు. కానీ నోలన్ సినిమా కోసం మాత్రం పరిస్థితి పూర్తిగా భిన్నంగా ఉంది. ఈసారి ఐమ్యాక్స్ 70 ఎంఎం వెర్షన్లో ప్రత్యేకంగా తెరకెక్కిస్తున్న ఈ చిత్రానికి టికెట్ బుకింగ్స్ ఏకంగా ఒక సంవత్సరం ముందుగానే స్టార్ట్ చేశారు. ఐమ్యాక్స్ వారు దీనిని అధికారికంగా ప్రకటించడంతో ఈ మూవీపై ఉన్న క్రేజ్ ఏ స్థాయిలో ఉందో అర్థమవుతోంది.
ఈ భారీ అంచనాల మధ్య, “ఒడిస్సి” వచ్చే ఏడాది జూలై 17న గ్రాండ్ రిలీజ్ కానుంది. నోలన్ మైండ్బ్లోయింగ్ సినిమాలను ఎప్పుడూ మిస్ కాకుండా చూసే ప్రేక్షకులు ఇప్పుడు నుంచే ఎగ్జైట్మెంట్లో ఉన్నారు. ఈ నిర్ణయం తర్వాత రెస్పాన్స్ ఎలా ఉంటుందో చూడాలి.
ఒక్క రోజులోనే ఓటీటీలోకి..!
ఓటిటి ప్లాట్ఫార్మ్ల ప్రభావం ఇప్పుడు ఎంతగా పెరిగిందో అందరికీ తెలిసిందే. థియేటర్లలో సినిమా రిలీజ్ డేట్స్ కూడా ఈ సంస్థల నిర్ణయాల మీద ఆధారపడుతున్న స్థితి వచ్చింది. సాధారణంగా ఎక్కువ సినిమాలు థియేటర్లలో విడుదలైన తర్వాత కనీసం మూడు వారాల నుంచి రెండు నెలల వరకు గ్యాప్ ఇచ్చి ఓటిటిలోకి వస్తుంటాయి.
కానీ తాజాగా ఒక సినిమా మాత్రం ఈ రూల్కి ఎక్స్సెప్షన్ అయింది. తమిళ నటుడు అథర్వ హీరోగా నటించిన తాజా సినిమా “డీఎన్ఏ” దీనికి ఉదాహరణ. ఈ చిత్రం తమిళంలో జూన్ 20న విడుదల కాగా, తెలుగులో “మై బేబీ” పేరుతో రేపు జూలై 18న థియేటర్లలోకి రానుంది.
ఇక్కడ అసలు ట్విస్ట్ ఏమిటంటే, తెలుగు వెర్షన్ రిలీజ్ అయిన కేవలం ఒక్క రోజు తర్వాతే అంటే జూలై 19 నుంచే ఈ సినిమా ఓటిటిలో స్ట్రీమింగ్కి అందుబాటులోకి వస్తుంది. ఈ డిజిటల్ హక్కులు జియో హాట్స్టార్ దగ్గర ఉండటంతో అక్కడే స్ట్రీమ్ కాబోతోంది.
ఇంత త్వరగా ఓటిటిలో రిలీజ్ చేయడానికి మేకర్స్ ఏమనుకున్నారు అనేది స్పష్టంగా తెలియకపోయినా, థియేటర్లలో కలెక్షన్స్పై ఇది ఎలాంటి ప్రభావం చూపుతుందో చూడాలి.
నా బెస్ట్ సినిమా ఏంటంటే..
భారతీయ సినిమాకు గర్వకారణంగా నిలిచిన దర్శకుడు ఎస్.ఎస్.రాజమౌళి ఎన్నో అద్భుతమైన చిత్రాలను అందించారు. ప్రతి ప్రేక్షకుడికి ఆయన సినిమాల్లో ఒక ఫేవరెట్ మూవీ ఉంటుంది. అలాగే రాజమౌళి గారికీ తన హృదయానికి దగ్గరైన సినిమా ఒకటి ఉందట. అది ఏంటో ఇటీవల ఒక ఈవెంట్లో బయటపెట్టారు.
జూనియర్ ఎన్టీఆర్ ప్రీ-రిలీజ్ కార్యక్రమంలో ప్రత్యేకంగా జరిగిన ప్రశ్నోత్తరాల్లో ఈ విషయం వెలుగులోకి వచ్చింది. స్క్రీన్పై ఆయన గత సినిమాల కొన్ని ఫ్రేమ్స్ చూపించారు. అందులో ‘ఈగ’ ఫ్రేమ్ వచ్చినప్పుడు అదే తనకు అత్యంత ఇష్టమైన సినిమా అని రాజమౌళి చెప్పేశారు. ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే మగధీర, సై, బాహుబలి, RRR వంటి బ్లాక్బస్టర్స్ ఉన్నా, ఆయనకు బెస్ట్గా అనిపించింది మాత్రం ‘ఈగ’ అని.
ఫ్యాన్స్ మాత్రం ఆయన నుంచి బాహుబలి లేదా RRR పేరు వినాలని అనుకున్నారు. కానీ ఈగ అని చెప్పడంతో చాలామందికి కాస్త ఆశ్చర్యమే కలిగింది. ఈ సినిమా క్రియేటివిటీ, కాన్సెప్ట్ విషయంలో ఎంత ప్రత్యేకమో అందరికీ తెలిసిందే. కాబట్టి రాజమౌళి మనసులో ఈగకు ఎందుకు అంత ప్రాధాన్యం ఉందో ఈ మాటలతో మరొక్కసారి స్పష్టమైంది.