Home Blog Page 792

Dulquer Salmaan’s ‘Lucky Bhaskar’ locks festival date

After stealing hearts of Telugu moviegoers with his impressive performance in Mahanati and Sita Ramam, Malayalam heartthrob Dulquer Salmaan is gearing up to consolidate his image in Tollywood with his upcoming film Lucky Bhaskar, a heist thriller which has him playing a middle class bank employee who turns a parvenu overnight. 

As per the latest reports, the makers of Lucky Bhaskar locked September 7th as the release date. The film will have festival advantage in Telugu States as Vinayaka Chavithi falls on the same date. The shooting formalities of Lucky Bhaskar are nearing completion and the team is planning to kick start the promotional campaign very soon. 

Dulquer Salmaan took to X to announce this news. He posted “This 𝐕𝐢𝐧𝐚𝐲𝐚𝐤𝐚 𝐂𝐡𝐚𝐭𝐮𝐫𝐭𝐡𝐢, Get ready to experience #LuckyBaskhar’s unforgettable journey on the Big Screens! 💫🏦Worldwide Grand Release on 𝟕𝐭𝐡 𝐒𝐄𝐏𝐓 in Telugu, Malayalam, Tamil & Hindi Languages🤩“. 

A new poster featuring the Sita Ramam actor in a uber cool classy avatar in a retro get-up has been unveiled on this occasion. 

Happening beauty Meenakshii Chaudhary is the female lead in Lucky Bhaskar. Sensible filmmaker Venky Atluri, who delivered big hits with Tholi Prema and Sir, is aiming to score a hat-trick with this film. GV Prakash is the music composer. 

Suryadevara Nag Vamshi and Trivikram’s wife Sai Soujanya are jointly bankrolling the film. 

ఎమ్మెల్సీలపై జగన్ వక్రనిర్ణయాలకు చెక్!

జగన్మోహన్ రెడ్డి భవితవ్యం గురించి ముందే గ్రహించిన ఎమ్మెల్సీలు కొందరు.. ఎన్నికలకు పూర్వమే ఆ పార్టీని విడిచి పెట్టడం జరిగింది. అయితే.. వారు పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నారంటూ.. మండలి ఛైర్మన్ కొయ్యే మోషేన్ రాజు వారి మీద వేటు వేసేశారు. వీరిలో రెండు స్థానాలకు మళ్లీ ఎన్నికలు జరగగా తెలుగుదేశం, జనసేన అభ్యర్థులు ఏకగ్రీవంగా విజయం సాధించారు. అయితే అధికారికంగా తెలుగుదేశం పార్టీలో చేరకపోయినప్పటికీ.. వక్రపూరితంగా ఆరోపణలు బనాయించి.. వేటు వేసిన మరో ఇద్దరు ఎమ్మెల్సీలకు సంబంధించి.. జగన్ కు ఎదురుదెబ్బ తగిలేలా ఉంది. వీరిని మండలి ఛైర్మన్ అనర్హులుగాి ప్రకటించినప్పటికీ.. ఆ స్థానాలు ఖాళీ అయినట్లుగా నోటిఫై చేయవద్దని హైకోర్టు కేంద్ర ఎన్నికల సంఘాన్ని ఆదేశించింది. జగన్ కుట్రకు ఆరకంగా బ్రేక్ పడింది. 

విజయనగరం జిల్లా శృంగవరపు కోటకు చెందిన ఎమ్మెల్సీ ఇందుకూరి రఘురాజు, మరో ఎమ్మెల్సీ జంగా కృష్ణమూర్తి విషయంలో ఇలాంటి ఆదేశాలు వెలువడ్డాయి. 
ఎస్ కోటకు చెందిన ఇందుకూరి రఘురాజు భార్య సుబ్బలక్ష్మి అక్కడ వైస్ ఎంపీపీగా ఉన్నారు. ఆమె తెలుగుదేశం పార్టీలో చేరారు. భార్య పార్టీ మారింది గనుక.. రఘురాజుపై కూడా పార్టీ ఆగ్రహించింది. ఆయన ఎమ్మెల్సీ స్థానానికి ఎసరు పెట్టారు. పార్టీ వ్యతిరేక కార్యక్రమాలు చేస్తున్నారంటూ.. నోటీసులు ఇచ్చి అనర్హత వేటు వేశారు. 
ఇంతకూ వారు పేర్కొన్న కారణాలు వింటే నవ్వొస్తుంది. పార్టీ నాయకుల మీద విమర్శలు చేశారట. ప్రభుత్వం మీద విమర్శలు చేశారట. ఇవే కారణాలుగా వేటు వేయడం జరిగింది. ఈ తీరుపై రఘురాజు హైకోర్టుకు వెళ్లడంతో, ఆయన ఖాళీని నోటిఫై చేయవద్దని హైకోర్టు ఆదేశించింది. 

అదే  మాదిరిగా ఇవాళ జంగా కృష్ణమూర్తి విషయంలో కూడా తీర్పు వచ్చింది. తనను అనర్హుడిగా చేయడంపై జంగా హైకోర్టుకు వెళ్లారు. జగన్ ద్వారా అనేక రకాలుగా నష్టపోయిన జంగా ఆ పార్టీనుంచి బయటకు వచ్చాక వేటు వేయడం జరిగింది. ఆ విషయంలో కోర్టుకువెళ్లగా ఆయన స్థానాన్ని కూడా నోటిఫై చేయవద్దని ఈసీకి ఆదేశాలు వెళ్లాయి. మొత్తానికి తనను ధిక్కరించిన మండలిలోని సభ్యులపై వేటు వేయించడానికి జగన్ ఎంచుకున్న వక్రమార్గాలు కూడా ఫలించడం లేదు. 

ఏపీ ప్రజల్ని రంజింపజేస్తున్న రేవంత్ జోకులు!

‘బొంకరా బొంకరా పోలిగా అంటే టంగుటూరు మిరియాలు తాటికాయలంత’ అన్నాడట వెనకటికి ఒక మహాప్రబుద్ధుడు. ఇప్పుడు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వైఖరి కూడా అదేవిధంగా కనిపిస్తోంది. ఏదో వైయస్ రాజశేఖర్ రెడ్డి జయంతి సభను కాస్త ఆర్భాటంగా నిర్వహిస్తూ, అతిథిగా ఆహ్వానించిన పాపానికి ఆయన షర్మిల జీవితం నలుగురిలో నవ్వుల పాలయ్యే తరహా ప్రసంగంతో కామెడీ చేస్తున్నారు. జోకులు వేస్తున్నారు. 2029 ఎన్నికలలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వస్తుందని, షర్మిల ఏపీ ముఖ్యమంత్రి అవుతుందని రేవంత్ రెడ్డి జోస్యం చెబుతున్నారు. 
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ రాజకీయాల గురించి నిన్న మొన్నటిదాకా ఇసుమంతైనా పట్టించుకోలేదు. సార్వత్రిక ఎన్నికల సమయంలో ఏపీ సారథిగా ఉన్నటువంటి వైయస్ షర్మిల రాష్ట్రంలో ప్రచారానికి రావాల్సిందిగా రేవంత్ రెడ్డి చుట్టూ పలుమార్లు తిరిగినా ఆయన పట్టించుకోలేదు. చివరికి పొరుగున ఉన్న కర్ణాటక రాష్ట్రానికి కూడా వెళ్లారు. కనీసం వైఎస్ షర్మిల పోటీ చేస్తున్న కడపకు ఒక పర్యాయం కూడా రేవంత్ అడుగుపెట్టలేదు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎన్నడో శవాసనం వేసిన కాంగ్రెస్ పార్టీ ఎన్నికలలో ఏమాత్రం మెరుగైన ప్రదర్శన చూపలేకపోయింది. ఓటు శాతాన్ని మెరుగుపరచుకోలేకపోయింది. 
తీరా ఇప్పుడు వైఎస్ జయంతి కోసం ఏపీలో అడుగుపెట్టి రాబోయే నాలుగేళ్లలో అధికారంలోకి వచ్చే స్థాయిలో కాంగ్రెస్ బలపడిపోతుందని రేవంత్ రెడ్డి జోస్యం చెబుతున్నారు. ముఖ్యమంత్రిగా వైఎస్ షర్మిల అవుతుందట! తెలంగాణలో సొంత రాజకీయ పార్టీని స్థాపించి రాష్ట్రమంతా పాదయాత్ర చేసి కేసీఆర్ ప్రభుత్వం పట్ల ప్రజల్లో వ్యతిరేకతను పెంచడానికి షర్మిల శక్తివంచనలేకుండా పాటుపడ్డారు. చివరికి తన పార్టీని కాంగ్రెస్లో విలీనం చేసినప్పటికీ తగు ఫలితం మాత్రం ఆమెకు దక్కలేదు. కనీసం ఆ రాష్ట్ర రాజకీయాలలో వైఎస్ షర్మిల అస్తిత్వం కూడా ఉండకుండా బయటికి గెంటేసారు. ఆమె ఏపీలో రాజకీయాలు చేసుకోవాలని రేవంత్ రెడ్డి అన్నారు. అలాగని ఆమె ఏపీ సారధి అయిన తర్వాత ఆయన అందించిన సహకారం ఎంత మాత్రమూ లేదు. కాగా ఇప్పుడొచ్చి 2029 కల్లా షర్మిల రాష్ట్ర ముఖ్యమంత్రి అవుతుందని, తాను ఆమె వెన్నంటి నిలుస్తానని ఆయన ప్రకటించడం చూసి  ప్రజలు నవ్వుకోవడం తప్ప మరేం చేయగలరు.

ఏపీ మహిళలకు శుభవార్త చెప్పిన చంద్రబాబు!

 ఈ ఏడాది జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో ఏపీలో అసెంబ్లీ, లోక్‌సభ ఎన్నికల్లో టీడీపీ కూటమి భారీ విజయం సాధించి..నూతన ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో రాష్ట్ర ముఖ్యమంత్రిగా టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు బాధ్యతలు స్వీకరించారు. సీఎంగా బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి కూడా చంద్రబాబు రాష్ట్రాభివృద్ధి పై ప్రత్యేక దృష్టి పెట్టారు.

అంతేకాదు ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీల అమలు చేసేందుకు ప్రత్యేక ఫోకస్ పెట్టారు. అధికారంలోకి వచ్చిన ఎన్డీయే సర్కార్ ఎన్నికల ప్రచారంలో తామిచ్చిన హామీలను అమలు చేసే దిశగా అడుగులు వేస్తున్నట్లు సమాచారం. కర్ణాటక, తెలంగాణ రాష్ట్రాల్లో అమల్లో ఉన్న మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం గురించి తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డితో చంద్రబాబు ఇంతకుముందే చర్చించిన విషయం తెలిసిందే.

ఈ క్రమంలో తాజాగా మరో పథకాన్ని అమలు చేసేందుకు రంగం సిద్దమైందనే వార్తలు వినిపిస్తున్నాయి. కొత్త ప్రభుత్వం మహిళల అభివృద్ధికి పెద్దపీట వేసినట్లు తెలుస్తోంది. సూపర్ సిక్స్ పథకం కింద కూటమి ఎన్నికల సమయంలో ఆరు హామీలు ఇచ్చిన సంగతి తెలిసిందే. అందులో ఈ పథకం కూడా ఉంది. ఈ పథకం కింద 18 ఏళ్ల వయసు దాటిన.. 59 సంవత్సరాల వరకు మహిళలకు ఈ పథకం ద్వారా ప్రతి నెలా అకౌంట్‌లో డబ్బులు జమ చేస్తారు. ‘ఆడబిడ్డ నిధి’ కింద 18 సంవత్సరాలు నిండిన ప్రతి మహిళకు నెలకు రూ.1500 ఇచ్చేందుకు ప్రభుత్వం రంగం సిద్దం చేస్తుంది.

త్వరలోనే విధివిధానాలను సీఎం చంద్రబాబు ప్రకటించనున్నట్లు సమాచారం. ఈ పథకాన్ని వచ్చేనెల నుంచి అమలు చేయబోతున్నట్లు వార్తలు వస్తున్నాయి.

 Epic Success: Kalki 2898 AD Nears Rs. 1000 Crore Mark

The globally acclaimed actor Prabhas and visionary director Nag Ashwin have struck gold with their latest epic, *Kalki 2898 AD*. This cinematic masterpiece has taken the box office by storm, raking in a staggering Rs. 950 crores globally in just 11 days and is set to break the Rs. 1000 crore barrier. Fans and critics alike are buzzing with excitement, speculating if it will outshine SS Rajamouli’s *RRR* in lifetime collections.

Boasting a star-studded cast that includes legends like Amitabh Bachchan, Deepika Padukone, Kamal Haasan, Rajendra Prasad, Disha Patani, Saswata Chatterjee, Brahmanandam, Anna Ben, Shobana, Mrunal Thakur, Dulquer Salmaan, Vijay Deverakonda, and Ram Gopal Varma, this film is a powerhouse of talent. Produced with a lavish budget by Vyjayanthi Movies and featuring an electrifying score by Santhosh Narayanan, *Kalki 2898 AD* is a cinematic spectacle you won’t want to miss.

నోరు పారేసుకోకు…నెక్ట్స్‌ జైలుకు నువ్వే!

ఏపీ మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఏనాడు కూడా జనంలోకి వచ్చి ప్రజల సమస్యలు తెలుసుకున్న పాపాన పోలేదని నెల్లూరు జిల్లా సర్వేపల్లి ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి మండిపడ్డారు.  జగన్ లాగా చంద్రబాబు నాయుడు ప్యాలెస్ లకు పరిమితం కాలేదు.. ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించినప్పటి నుంచి జనంలోనే ఉంటూ.. రాష్ట్ర అభివృద్ధి కోసం కష్టపడుతున్నారని పేర్కొన్నారు.

చంద్రబాబు నాయుడు, రేవంత్ రెడ్డి కలిసి రెండు తెలుగు రాష్ట్రాల అభివృద్ధి కోసం సమావేశం అవడం శుభపరిణామమని చెప్పుకొచ్చారు. జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో రాష్ట్రం ఎన్ని విధాలుగా నాశనం అవ్వాలో అన్ని విధాలుగా సర్వ నాశనం అయిందని విమర్శలు గుప్పించారు. ఐదేళ్ళలో మాజీ మంత్రి కాకాణి గోవర్దన్ రెడ్డి దోచుకున్నది బయటపెడతానని.. చంద్రబాబుపై అనవసరంగా నోరు పారేసుకుంటున్నారని సోమిరెడ్డి మండిపడ్డారు. కాకాణి గోవర్దన్ రెడ్డి చేసిన అవినీతి గురించి తీస్తే వారానికి ఒక సీరియల్ లా వస్తాయిని.. త్వరలో పిన్నెల్లి రామకృష్ణారెడ్డికి  తోడుగా కాకాణి జైలుకు వెళ్లడం ఖాయమని ఆయన అన్నారు.

ఇక నుంచి ఏపీలో ఆ విధానం రద్దు…!

ఏపీలో చంద్రబాబు ప్రభుత్వం ఓ కీలక నిర్ణయం తీసుకుంది. గత ప్రభుత్వం తీసుకు వచ్చిన ఇసుక విధానాలను రద్దు చేసింది. ఈ మేరకు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. త్వరలోనే 2024 ఇసుక విధానం రూపకల్పన చేయనున్నట్లు ప్రకటన విడుదల చేసింది. అప్పటి వరకు కలెక్టర్లకు ఇచ్చిన అంతర్గత మార్గదర్శకాలు అమల్లో ఉంటాయని తెలిపింది.

2019, 2021 సంవత్సరాల్లో గత ప్రభుత్వం ఇచ్చిన రెండు ఇసుక పాలసీలను రద్దు చేస్తున్నట్లు ప్రభుత్వం ఉత్తర్వుల్లో తెలిపింది. ఉచిత ఇసుక సరఫరాపై విధి విధానాలు ఖరారు చేస్తూ జీవో ను విడుదల చేసింది. 2024 కొత్త ఇసుక విధానాన్ని రూపొందించేంత వరకు అమలు చేయాల్సిన కొత్త మార్గదర్శకాలను జారీ చేసింది. రాష్ట్ర ఖజానాకు రెవెన్యూ లేకుండా ఇసుక సరఫరా జరపాలని తాజా జీవోలో వెల్లడించారు. వినియోగదారులకు ఇసుకను అందుబాటులోకి తేవడమే లక్ష్యంగా ఇసుక సరఫరాపై మార్గదర్శకాలను విడుదల చేశారు.

ఇసుక తవ్వకాల నిమిత్తం జిల్లా కలెక్టర్ చైర్మన్ గా జిల్లా స్థాయి కమిటీల ఏర్పాటుకు ఆదేశాలు జారీ చేశారు. జిల్లా ఇసుక కమిటీల్లో జిల్లా ఎస్పీ, జేసీ సహా వివిధ శాఖలకు చెందిన జిల్లా స్థాయి అధికారులు ఉండనున్నారు. జిల్లాల్లోని స్టాక్ పాయింట్లను స్వాధీనం చేసుకోవాలని జిల్లా ఇసుక కమిటీలకు సూచనలు చేసింది ప్రభుత్వం.49 లక్షల మెట్రిక్ టన్నుల మేర ఇసుక రాష్ట్రంలోని వివిధ స్టాక్ పాయింట్లల్లో అందుబాటులో ఉందని ప్రభుత్వం వివరించింది.  డి-సిల్టేషన్ ప్రక్రియ ఎక్కడెక్కడ చేపట్టాలనే అంశాలపై జిల్లా స్థాయి కమిటీలు నిర్ణయం తీసుకోనున్నాయి. ఇసుక లోడింగ్, రవాణ ఛార్జీలను నిర్దారించే బాధ్యతను జిల్లా కమిటీకి అప్పగించనున్నారు.

తమరికి అర్థం కాకపోతే వింతేముంది అంబటీ!

రెండు తెలుగు రాష్ట్రాలకు చెందిన ముఖ్యమంత్రుల సమావేశం ఎందుకు జరిగిందో గౌరవనీయ మాజీ మంత్రివర్యులు అంబటి రాంబాబు గారికి అర్థం కావడం లేదుట. ఈ సమావేశం గురించి వారికి వివరణ ఇవ్వాలిట. అయినా ఇద్దరు సీఎంల భేటీ ఎందుకు జరిగిందో తనకు అర్థమవుతుందని అంబటి ఎలా అనుకున్నారో అర్థం కావడం లేదు. రెండేళ్లు నీటిపారుదల శాఖ మంత్రిగా పనిచేసి కూడా.. పోలవరం ప్రాజెక్టు నాకు అర్థం కాలేదని చెప్పిన మేథావికి.. ఈ భేటీ ఎలా అర్థమవుతుంది.. అని ప్రజలు అంబటిపై జోకులేసుకుంటున్నారు.

అంబటి తన జ్ఞానం ప్రదర్శించడాన్ని అక్కడితో ఆపడం లేదు. అంతకుమించి అతిశయమైన మాటలు మాట్లాడుతున్నారు. కృష్ణా జలాల నీటి పంపకాల అంశాన్ని తేల్చలేదని అంబటి అంటున్నారు. ఈ భేటీ కేవలం విభజన చట్టం ద్వారా తలెత్తిన సమస్యలను పరిష్కరించుకోవడానికి ఏర్పాటుచేసిన భేటీ అని ముందునుంచి ప్రకటిస్తూనే వస్తున్నారు.

ఆ సమస్యలు అనేవి ఎట్టి పరిస్థితుల్లోనూ ఒక్క భేటీతో తేలిపోయేవి కాదు. అయిదేళ్లపాటు పరిపాలన చేసి అసలు ఇలాంటి ప్రయత్నమే చేయని చేతగాని ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి అనుచరుడైన అంబటి రాంబాబు ఈ ప్రయత్నాన్ని అర్థం చేసుకోగలరని అనుకోవడం భ్రమ అని ప్రజలు వ్యాఖ్యానిస్తున్నారు. ఈ సమస్యలేమీ తేలకుండానే.. హైదరాబాదు లోని ఉన్న ఆస్తులు, సెక్రటేరియేట్ లో వాటాలను తెలంగాణ రాసిచ్చేసిన అసమర్థ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అనుచర దళాలకు.. అసలు చంద్రబాబునాయుడు- రేవంత్ రెడ్డి చేస్తున్న ప్రయత్నం గురించి మాట్లాడే హక్కే లేదని ప్రజలు వ్యాఖ్యానిస్తున్నారు.

ఇద్దరు సీఎంల భేటీ.. చాలా చక్కగా మూడంచెల్లో సమస్యలన్నిటినీ పరిష్కరించడానికి ప్రయత్నిస్తున్నారు. ఇది మంచి ఫలితాలు రాబట్టే అవకాశం ఉంది. ఇందులో ఎలాంటి వివాదాలకు ఆస్కారం లేదు. అయితే.. అంబటి మాత్రం లేని వివాదాల్ని బూచిలా చూపించే ప్రయత్నంలో ఉన్నారు.

బహుశా వైసీపీ వాళ్లే కొన్ని మీడియా సంస్థలకు లీకులు ఇచ్చి, పెయిడ్ కథనాలు వేయించారేమో తెలియదు గానీ.. టీటీడీ ఆస్తుల్లో, బోర్డు పదవుల్లో, ఆదాయంలో తెలంగాణ వాటా కోరుతున్నదని, సముద్ర తీరంలో వాటా కోరుతున్నదని, పోర్టుల్లో వాటా కోరుతున్నదని రకరకాల గాలి కబుర్లను పోగేసి.. వాటికి చంద్రబాబు నాయుడు వివరణ చెప్పాలని అడగడం.. ఆయన అజ్ఞానానికి నిదర్శనం అని ప్రజలు నవ్వుకుంటున్నారు. 

గేమ్‌ ఛేంజ్‌ అవ్వబోతుంది..చరణ్‌ నుంచి క్రేజీ పోస్ట్‌!

స్టార్ డైరెక్టర్ శంకర్ – మెగాపవర్ స్టార్ ‘రామ్ చరణ్ తేజ్’ కాంబోలో రాబోతున్న పాన్ ఇండియా సినిమా గేమ్ ఛేంజర్‌. ఈ సినిమా షూటింగ్ పూర్తయ్యింది. ఈ మైలురాయికి గుర్తుగా, రామ్ చరణ్ ఈ ఉదయం ఓ ఇన్‌ స్టా స్టోరీని అభిమానులతో పంచుకున్నారు. చరణ్ హెలికాప్టర్ల వైపు నడుస్తున్న రెండు చిత్రాల కోల్లెజ్‌ను పోస్ట్ చేశారు, ఒకటి సినిమాలోనిది కాగా, మరొకటి చిత్రీకరణ పూర్తయిన తర్వాత తీసిన పిక్. పైగా ఈ పిక్స్ కింద “గేమ్ మారబోతోంది” అని క్యాప్షన్ కూడా రాసుకొచ్చాడు.

అదేవిధంగా, ‘మా “గేమ్‌ఛేంజర్” చరణ్ సినిమా షూటింగ్ మొదటి రోజు నుండి చివరి వరకు సాగిన మెగా పవర్ ప్యాక్డ్ జర్నీ. తాజాగా షూటింగ్ ముగిసింది. త్వరలో కొన్ని సాలిడ్ అండ్ క్రేజీ అప్‌డేట్‌లను మీ ముందుకు తీసుకువస్తున్నాము’ అంటూ చిత్రబృందం కూడా ఒక పోస్ట్ పెట్టి తెలిపింది. పొలిటికల్ యాక్షన్ థ్రిల్లర్‌గా రానున్న ఈ సినిమాలో చరణ్ తండ్రీకొడుకులుగా యాక్ట్‌ చేస్తున్నారు. కాగా ఈ మూవీలో చరణ్ సరసన కియారా అద్వానీ హీరోయిన్‌ గా చేస్తున్న విషయం తెలిసిందే.

ఈ సినిమాలో  అంజలి, శ్రీకాంత్, ఎస్‌జె సూర్య, నవీన్ చంద్ర వంటి ప్రముఖ నటీనటులు ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. 

స్పిరిట్‌ మూవీ లో ప్రభాస్ ఆ పాత్ర చేయబోతున్నాడా!

సెన్సేషనల్‌ హిట్ల దర్శకుడు సందీప్ రెడ్డి వంగా డైరెక్షన్‌ లో ప్రభాస్ హీరోగా ‘స్పిరిట్‌’ అనే సినిమా చేయబోతున్న విషయం తెలిసిందే. ప్రస్తుతం ఈ సినిమా స్క్రిప్ట్‌ పనుల్లో సందీప్ రెడ్డి బిజీగా ఉన్నాడని తెలుస్తుంది. మరోవైపు ఈ మూవీ కోసం ప్రభాస్ అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. అయితే తాజాగా ప్రభాస్ పాత్ర పై ఓ ఇంట్రెస్టింగ్ అప్ డేట్ వినిపిస్తోంది.

ఈసినిమాలో పవర్ ఫుల్ మాఫియా డాన్ గా ప్రభాస్ పాత్ర ఉండబోతోందని, ముఖ్యంగా ప్రభాస్ పాత్రలోని డెప్త్ కూడా నెవ్వర్ బిఫోర్ అనే రేంజ్ లో ఉంటుందని సమాచారం. అలాగే, ఈ సినిమాలో ప్రభాస్ రెండు డిఫరెంట్ లుక్స్ లో కనిపించనున్నారని.. అందులో ఒకటి పక్కా మాస్ లుక్‌ అని, ఆ లుక్ లో ప్రభాస్ నిజంగా ప్రేక్షకులకు షాక్ ఇస్తాడని మూవీ మేకర్స్‌ అంటున్నారు.

పూర్తిగా రఫ్ అండ్ రగ్గుడ్ లుక్ తో ప్రభాస్ సరికొత్త గెటప్ లో ఈ సినిమాలో కనిపించబోతున్నాడంట. అదేవిధంగా ప్రభాస్ రెండో లుక్ సూపర్ స్టైలిష్ గా హాలీవుడ్ రేంజ్ లో ఉంటుందని సమాచారం.. అన్నట్టు ప్రభాస్ నుంచి ప్రేక్షకులు ఏదైతే బలంగా కోరుకుంటున్నారో అదే ఈ సినిమాలో ఉండనుందంట. ఇప్పటికే, 80 శాతం స్క్రిప్ట్ వర్క్ పూర్తి చేసుకుంది. రూ.300 కోట్లకు పైగా బడ్జెట్‌ తో ఈ సినిమా రూపుదిద్దుకుంటుంది.