రామాయపట్నం పోర్టుకు అనుబంధంగా ఇండోసోల్ కంపెనీ కోసం భూములు కేటాయించడం అనే వ్యవహారం ఇప్పుడు నానా రాద్ధాంతం అవుతోంది. జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం కాలంలో ఇండోసోల్ కంపెనీ కోసం భూములను మూడువేల ఎకరాల భూములను కేటాయించడం జరిగింది. అవి కాకుండా కందుకూరు నియోజకవర్గం పరిధిలోని కరేడు లో వారికి అవసరమైన భూములు ఇవ్వడానికి, గతంలో ఇచ్చిన చేపూరునుంచి తరలించేందుకు ఇప్పటి రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. అయితే ఇందుకు వ్యతిరేకంగా భూములు ఇచ్చేది లేదని స్థానిక పంచాయతీ తీర్మానం చేసి ప్రభుత్వాన్ని ప్రభుత్వానికి పంపింది. ఇప్పుడు కడేరు రైతులకు తాను అండగా నిలుస్తానని వైఎస్ జగన్మోహన్ రెడ్డి వారికి హామీ ఇస్తున్నారు. ఆయన కడేరు వెళ్లి రైతులకు ఆ మాట ఇవ్వలేదు. రైతులను తనవద్దకు పిలిపించుకుని ఆ మాట చెప్పి పంపారు.
అయితే.. దీని వెనుక చాలా పెద్ద హైలెవెల్ డ్రామా ఉన్నట్టుగా అనుమానాలు వ్యాప్తిలో ఉన్నాయి. ఇండోసోల్ కంపెనీ అనేది.. జగన్ యొక్క బినామీ, అనుచర సంస్థల్లో ఒకటి అనే ప్రచారం చాలా కాలంగా ఉంది. ఆ కంపెనీ ఆవిర్భావం, వారికి మూడువేల ఎకరాల భూముల కేటాయింపు అన్నీ జగన్ హయాంలోనే జరిగాయి. ఆ సంస్థకు తెరవెనుక అండగా ఉన్నది జగన్మోహన్ రెడ్డే అనే ప్రచారం కూడా ఉంది. ఇలాంటి నేపథ్యంలో ఇప్పుడు ఇండోసోల్ కు భూములు ఇవ్వడాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్న కరేడు రైతులు, తమకు న్యాయం జరగడం కోసం జగన్ నే ఆశ్రయించడం అనేది.. తాముగా వెళ్లి ఆయన ఉచ్చులో చిక్కుకున్నట్టే అని పలువురు అనుమానిస్తున్నారు. కందుకూరు వైసీపీ ఇన్చార్జి మధుసూదన్ యాదవ్ ఆధ్వర్యంలో కడేరు రైతులు వెళ్లి జగన ను కలవడం జరిగింది. గతంలో ఇండోసోల్ కంపెనీకి చేపూరు వద్ద భూములు ఇప్పించి, రైతులకు 417 కోట్ల పరిహారం కూడా ఇప్పించాం అని ఆయన అంటున్నారు.
అయితే అక్కడినుంచి ఇండోసోల్ తరలకుండా ఉండాలనే ఉద్దేశంతో వైసీపీ దళాలే తెరవెనుకనుంచి ఈ కడేరు రైతుల్లో వ్యతిరేకతను నింపుతున్నట్టుగా తెలుస్తోంది.
కడేరు రైతుల ఉద్యమాలకు ఇన్నాళ్లుగా మద్దతు ఇస్తూ వచ్చిన బీసీవై పార్టీ అధ్యక్షుడు రామచంద్ర యాదవ్ ఇప్పుడు ఆ పోరాటం నుంచి తప్పుకున్నారు. ఇండోసోల్ కంపెనీకి అసలు బినామీలతో నడిపిస్తున్న యజమాని జగన్మోహన్ రెడ్డి కాగా.. రైతులు అమాయకంగా వెళ్లి ఆయననే న్యాయం కోసం ఆశ్రయించడం వల్ల తాను పోరాటంనుంచి తప్పుకుంటున్నట్టుగా ఆయన వెల్లడించారు. కడప జిల్లాకు చెందిన నర్రెడ్డి విశ్వేశ్వర రెడ్డి యజమానిగా ఉన్న ఇండోసోల్ సోలార్ ప్యానెల్స్ కంపెనీకి జగన్ కు సన్నిహితమైనదే అయినప్పటికీ.. కేవలం రాష్ట్రాన్ని గ్రీన్ ఎనర్జీ హబ్ గా తయారు చేయడం.. అలాగే.. కూటమి ప్రభుత్వంలో పరిశ్రమల పట్ల రాజకీయ కక్ష సాధింపులు ఉండవని నిరూపించుకునేందుకు చంద్రబాబు దానిని ఎంకరేజ్ చేస్తున్నారు. అయితే జగన్ మాత్రం.. కూటమి హయాంలో అసలు పెట్టుబడులే రాష్ట్రానికి రాకూడదనుకుంటున్నట్టుగా, దీనిని కూడా అడ్డుకోడానికి సిద్ధమవుతుంుడడం గమనార్హం.
కరేడు రైతులు జగన్ ఉచ్చులో చిక్కుకుంటున్నారా?
Setback To YSRCP Ex MLA Nallapureddy In High Court In obscene comments Against TDP MLA case
The AP High Court has given key orders in the case of making obscene comments against TDP MLA Prashanthi Reddy. In this case, the bench gave an unexpected shock to YSRCP leader Nallapureddy Prasannakumar Reddy, who made obscene comments against the MLA. It hs rejected anticipatory bail.
It has ordered the police to issue notices against him under 35(3) of the BNS and investigate him. It has made it clear that the guidelines given by the Supreme Court in the Arnesh Kumar case must be followed.
Nallapureddy’s lawyer Manohar Reddy brought to the court’s attention that all the sections registered by the police against the petitioner are sections punishable by up to seven years. He said that these sections are also not applicable to him.
The government lawyer argued that Prasannakumar Reddy made obscene comments against Prashanthi Reddy on the first day and repeated them again on the second day. The bench, after hearing the arguments of both the parties, ordered that Prasanna Kumar Reddy be summoned and questioned under Section 35(3) of the BNS as all the sections filed by the police were punishable with a maximum of seven years.
Meanwhile, Home Minister Anitha criticized YSRCP chief Jaganmohan Reddy for not behaving like a humane person. “Prasanna Kumar Reddy learned from Jagan. No one except Jagan is defending his style. Jagan has a bad history of spreading false propaganda about his own sister, who was born through blood sharing”, she said.
She deplored that Jagan is visiting rowdy sheeters and the families of those who committed suicide after losing money on a betting app. During Jagan’s tour, she alleged that he trampled on talakaya once and then on mangoes again. She said that people should also think, isn’t it wrong to say that we will kill each other?
“MLA Prashanthi Reddy won with a majority of 50,000. Even the courts have rejected Prasanna Kumar Reddy’s comments on the female leader. We are taking legal action against him,” the Home Minister added.
సర్వత్రా విషమే: బనకచర్లకు మోకాలడ్డుతున్న జగన్!
వైఎస్ జగన్మోహన్ రెడ్డి దుర్మార్గపు ఆలోచనలు ఆయన కేవలం ఒక సాధారణ ఎమ్మెల్యేగా ఉన్నా సరే.. రాష్ట్రానికి చేటు చేయడానికే చూస్తున్నాయి. రాష్ట్రాన్ని సస్యశ్యామలం చేయడానికి, రాయలసీమకు నీళ్లందించడానికి కూటమి ప్రభుత్వం బనకచర్ల ప్రాజెక్టును సంకల్పిస్తే.. జగన్మోహన్ రెడ్డి దానికి కూడా అడ్డు తగులుతున్నారు. బనకచర్ల నిర్మించడం సబబు కాదని, సరైన ఆలోచన కాదని ఆయన తన అభిప్రాయం వెల్లడిస్తున్నారు. చూడబోతే.. రాష్ట్ర సంక్షేమం విషయం పక్కకు నెట్టేసి.. కూటమి ప్రభుత్వం ఏం చేసినా సరే.. దానిని అడ్డుకోవడం ఒక్కటే తన జీవితలక్ష్యంగా జగన్ వ్యవహరిస్తున్నట్టుగా ఉంది. రాష్ట్రంలోకి పెట్టుబడులు రాకుండా వందలాది నకిలీ మెయిల్స్ పెట్టుబడిదార్లకు పంపి.. అడ్డుకోవాలని చూసిన కుట్ర దళాలకు అధిపతి జగన్. తన హయాంలో ఏమీ చేయకపోగా.. రాష్ట్రానికి కూటమి ప్రభుత్వ పాలనలో కూడా కొత్త పరిశ్రమలు రాకుండా ఆయన అడ్డుకుంటున్న తీరును అందరూ గమనిస్తూనే ఉన్నారు. కేవలం పరిశ్రమలు మాత్రమే కాదు.. తన సొంతదైన రాయలసీమ ప్రాంతాన్ని సస్యశ్యామలం చేసేందుకు సంకల్పిస్తున్న నీటి ప్రాజెక్టులను కూడా అడ్డుకుంటాననే దుర్బుద్ధులను ఆయన ఇప్పుడు చాటుకుంటున్నారు.
జగన్ ఏర్పాటుచేసిన ప్రెస్ మీట్ లో బనకచర్లపై తన వైఖరి చెప్పాలని జాతీయ మీడియా ఆయనను సూటిగా ప్రశ్నించింది. అయితే ఈ విషయంలో జగన్మోహన్ రెడ్డి.. సూటిగా సమాధానం ఇవ్వకుండా డొంకతిరుగుడు మార్గాన్ని ఆశ్రయించారు. గోదావరి నుంచి ఏటా సముద్రంలో వృథాగా కలిసిపోతున్న మూడువేల టీఎంసీల వరద జలాలనుంచి కేవలం 200 టీఎంసీలను వాడుకోవడానికి మాత్రమే తాము ఈ ప్రాజెక్టు సంకల్పిస్తున్నట్టుగా చంద్రబాబు సర్కారు చెబుతోంది. అయితే ఈ విషయాలన్నీ మాట్లాడకుండా.. జగన్ పోలవరం ప్రాజెక్టు ఎత్తు తగ్గించారని, అలా తగ్గించడం వల్ల నష్టం జరుగుతుందని ఏదేదో మాట్లాడడం తమాషాగా ఉంది.
అదే సమయంలో.. ఇంద్రావతి నుంచి గోదావరిలోకి వస్తున్న నీటిని ఛత్తీస్ గఢ్ అడ్డుకుంటోందని, ప్రాణహిత నుంచి గోదావరిలోకి నీళ్లు రావడం ప్రశ్నార్థకంగా మారుతోందని ఇలాంటి సమయంలో గోదావరి మిగులు జలాలపై లెక్కలు తేలకుండా బనకచర్ల నిర్మించడం కరెక్టు కాదని జగన్ అంటున్నారు.
కేవలం వరద జలాలను వాడుకోవడానికి మాత్రమే బనకచర్ల నిర్మిస్తాం అంటూ.. చంద్రబాబు ప్రభుత్వం కేంద్రానికి చాలా స్పష్టమైన లెక్కలు సమర్పించింది. అందుకోసం గత వందేళ్ల మిగులు జలాల, వృథాగా సముద్రంలో కలుస్తున్న జలాల లెక్కలనుంచి సగటులు తీసి రాష్ట్రప్రభుత్వం కేంద్రానికి సమర్పించింది. జగన్ మోహన్ రెడ్డి.. మిగులు జలాల లెక్క తేలాలంటూ ఇప్పటికీ సన్నాయి నొక్కులు నొక్కడం బనకచర్లను అడ్డుకోడానికే అనే అభిప్రాయం వ్యక్తం అవుతోంది. ఒకవేళ జగన్ కు నిజంగానే తన వాదన మీద నమ్మకం ఉంటే.. ప్రభుత్వం సమర్పించిన మిగులు జలాల గణాంకాలు తప్పులని, అవి అభూత కల్పనలనీ నిరూపించాలని పలువురు డిమాండ్ చేస్తున్నారు. తన హయాంలో ఏమీ చేయలేకపోగా, చేసే ప్రభుత్వాన్ని అడ్డుకోవడం సరికాదని అంటున్నారు.
Mahesh Babu Takes on Risky Action Scenes Himself In SSMB29
Tollywood superstar Mahesh Babu is once again collaborating with visionary director S.S. Rajamouli for the eagerly awaited film SSMB29. The movie stars international sensation Priyanka Chopra and Malayalam star Prithviraj Sukumaran in key roles.
Amidst the massive budget and large canvas of the film, the director Rajamouli has been maintaining tight wraps around the updates, generating a web of curiosity about the movie. The shoot is progressing at a rapid pace with two schedules already complete. The crew is now set to move to Kenya for the key sequences.
Against the adventurous background of a forest landscape, SSMB29 has generated great anticipation among fans and film buffs. The movie promises to be filled with stunning action scenes and innovative stunts that guarantee a new cinematic experience.
In a thrilling news, there are reports that Mahesh Babu has decided to do all his action sequences himself without body doubles. This is the first time he is doing so and proves his commitment to giving realistic and engaging performances. He is reported to have begun rigorous physical training to get ready for these challenging action scenes.
If the reports are to be believed, the fans are in for a treat as Mahesh Babu gets into an action-hero and bold avatar, exhibiting unparalled energy and dedication to the silver screen.
‘మొగుణ్ని కొట్టి మొగసాలకెక్కిన..’ సామెతలా జగన్!
వెనకటికి పల్లెపట్టుల్లో ఓ మొరటు సామెత చెబుతుంటారు. అలవిగాని గయ్యాళి అయిన ఆడది తానే మొగుణ్ని కొట్టి.. ముందుగా తానే మొగసాలకెక్కి, అంటే రచ్చబండ దగ్గరికెళ్ల.. ‘నా మొగుడు నన్ను కొట్టేశాడో’ అని దొంగ ఏడుపులు ఏడ్చి గోల చేసిందంట- అనేది ఆ సామెత అర్థం. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి వ్యవహారసరళి అచ్చంగా ఈ సామెత తీరుగానే కనిపిస్తున్నది. ఎందుకంటే.. కడపజిల్లాలోని వైఎస్సార్ ఆర్కిటెక్చర్ యూనివర్సిటీ విద్యార్థులకు తీరని అన్యాయం చేసిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి.
వారి జీవితాలతో ఆడుకున్న వ్యక్తి జగన్. అక్కడ కోర్సు పూర్తిచేసినా కూడా.. వారి భవిష్యత్తు అగమ్యగోచరంగా మారడానికి ప్రధాన కారకుడు జగన్. అలాంటి జగన్ ఇప్పుడు వారికోసం కపటప్రేమను చూపిస్తున్నారు. పైగా.. కూటమి ప్రభుత్వం అక్కడి విద్యార్థుల ఆందోళనను తొలగించడానికి, వారి మేలుకోరి అన్ని రకాల చర్యలు తీసుకుంటే.. తనను చూసి భయపడి ఆ నిర్ణయాలు తీసుకున్నట్టుగా జగన్ ప్రగల్భాలు చెప్పుకుంటున్నాడు. తన ట్వీట్ కు ప్రభుత్వం జడుసుకున్నదని అంటున్నారు. ఆయన అత్యుత్సాహం చూసి జనం నవ్వుకుంటూ ఉండడం విశేషం.
జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత.. రాష్ట్ర విద్యారంగాన్ని ఉద్ధరించరేస్తున్న తరహాలో.. తన సొంత జిల్లాలో తన తండ్రి పేరుతో ఆర్కిటెక్చర్, ఫైన్ ఆర్ట్స్ యూనివర్సిటీని స్థాపించారు. విద్యాసంస్థలను ప్రారంభించడం అనేది కాంట్రాక్టర్లకు నిధులు దోచిపెట్టడం కోసం మాత్రమే అన్నట్టుగా ఈ యూనివర్సిటీని ఆర్భాటంగా ప్రారంభించిన జగన్.. ఆర్కిటెక్చర్ కోర్సుకు సంబంధించి.. ఢిల్లీనుంచి అనుమతులు తీసుకురావడం గురించి మాత్రం పట్టించుకోలేదు. అయిదేళ్లుగా అక్కడ చేరిన విద్యార్థులు మొరపెట్టుకుంటూనే ఉన్నప్పటికీ.. వారి ఆవేదన ఆయన చెవులకు సోకలేదు.
జగన్ పదులసార్లు ఢిల్లీ వెళ్లారు గానీ.. తన జిల్లాలో తాను స్థాపించిన వైఎస్సార్ ఆర్కిటెక్చర్ యూనివర్సిటీ అనుమతుల గురించి కనీసం లేఖ కూడా ఇవ్వలేదు. కడప ఎంపీగా అవినాష్ రెడ్డిని వివేకా హత్య కేసు నుంచి బయటపడేయడానికి చూపించిన శ్రద్ధలో ఒక్కశాతం కూడా తన తండ్రిపేరిట ఉన్న యూనివర్సిటీ మీద చూపించలేదు. తీరా ఈ ఏడాది పెద్దసమస్య వచ్చి పడింది. అక్కడ తొలిబ్యాచ్ విద్యార్థుల కోర్సు కూడా పూర్తయింది. అయితే యూనివర్సిటీకే ఢిల్లీలోని సీఓఏ గుర్తింపుల లేకపోవడంతో వారి భవిష్యత్తు అగమ్యగోచరం అయింది. జగన్ నిర్లక్ష్యం వలన.. వారికి గుర్తింపు ఉన్న సర్టిఫికెట్లు వస్తాయో లేదో అని భయపడుతూ వారు చాలా వారాలుగా ఆందోళనలు చేస్తూనే ఉన్నారు. వారి ఆందోళన కాలంలో జగన్ పలుమార్లు కడప జిల్లాకు వెళ్లినా వారివైపు కూడా చూడలేదు.
వైఎస్ షర్మిల వారిని పరామర్శించి.. జగన్ చేసిన ద్రోహాన్ని కనీసం చంద్రబాబు చక్కదిద్దాలని విజ్ఞప్తి చేసింది. అప్పటికే విద్యార్థుల భవిష్యత్తు గురించి శ్రద్ధ పెట్టిన సర్కారు మొత్తానికి ఈ ఏడాది మెరిట్ ద్వారా మాత్రమే అడ్మిషన్లు జరగాలని ఆదేశించింది. అయితే.. ఇదంతా తన ప్రతిభ అని జగన్ నిస్సిగ్గుగా చాటుకుంటున్నారు. వైఎస్సార్ ఆర్కిటెక్చర్ యూనివర్సిటీకి తాను చేసిన ద్రోహాన్ని చంద్రబాబు సర్కారు సరిదిద్దుతోంటే.. ఇలా చాటుకోవడం అనేది చవకబారుతనంగా ఉన్నదని ప్రజలు అంటున్నారు.
Vijay Deverakonda’s Kingdom Drops Emotional Track “Anna Antene”
Vijay Deverakonda’s highly awaited film, Kingdom, directed by Gowtam Tinnanuri, continues to attract attention with the release of its moving second single, “Anna Antene.”
The song wonderfully captures the long-term rapport between Vijay Deverakonda and Satyadev, and presents moments of shared sentiment and emotional touch. Anirudh Ravichander’s melodious voice and emotive composition imbue the song with realism and intensity, and Krishna Kanth’s lyrical depth further increases its emotional quotient.
Bhagyashri Borse essays the lead female role in this high-budget emotional drama. The movie is produced on a grand scale by Suryadevara Naga Vamsi and Sai Soujanya under their banners, with Srikara Studios supporting the film.
Scheduled for global theatrical release on July 31, Kingdom is set to be a gripping mixture of powerful emotions, heart-moving music, and visual narrative — making it one of the most highly anticipated releases of the season.
‘అది సినిమా డైలాగ్’ అంటూంటే భ్రష్టు పట్టిపోవడమే!
వైఎస్ జగన్మోహన్ రెడ్డికి మాటల్లో విచక్షణ ఉండదు. గతాన్ని గుర్తుంచుకుని, భవిష్యత్తు పర్యవసానాలను అంచనావేసి మాట్లాడగల తెలివి కూడా లేదు. అలాంటి జగన్మోహన్ రెడ్డి ఇటీవలి కాలంలో పదేపదే అంటున్న ఒక మాట వల్ల ఇప్పుడు మరింతగా భ్రష్టుపట్టిపోతున్నారు. జగన్ బుధవారం నాడు ఒక ప్రెస్ మీట్ ఏర్పాటుచేశారు. కృష్ణాజిల్లా జడ్పీ ఛైర్మన్ ను తెలుగుదేశం వారు నిలదీసినందుకు, దానిని ఖండించడానికి ఏర్పాటుచేసిన ప్రెస్ మీట్ అది. కానీ.. జగన్ తెలివికి అసలు పాయింటు ఎక్కడో మరుగున పడిపోయింది. ఆయన తన సొంత సోదితో ఆ సమయం మొత్తం హరించారు.
తన రెంటపాళ్ల పర్యటన నుంచి ప్రతిరోజూ వేస్తున్న ప్రసంగాల రికార్డునే మళ్లీ ఇక్కడ కూడా వినిపించారు. అయితే.. ‘రప్పా రప్పా నరుకుతాం’ అంటూ వివాదాస్పద ఫ్లెక్సిల వల్ల రేగిన వివాదంలో వైసీపీ ధోరణుల్ని ఆయన సమర్థించడం అనేది ప్రస్తుతానికి ఆయన పరువును బజారు పాల్జేస్తోంది.
పుష్ప2 సినిమాలోని.. ‘గంగమ్మ జాతరలో యేటను నరికినట్టు రప్పా రప్పా నరుకుతాం’ అనే డైలాగును ఫ్లెక్సిలుగా ముద్రించి.. జగన్ 2.0 సర్కారు వస్తే తెలుగుదేశం వారిని ఆ విధంగా నరుకుతాం అని అంటూ జగన్ యాత్రలో ఆయన మూకలు అల్లరిచేసిన సంగతి తెలిసిందే. వారిని అరెస్టుచేశారు కూడా.
అయితే ఆరోజునుంచి ఇప్పటిదాకా వైసీపీ నాయకులందరూ కూడా ‘రప్పా రప్పా’ డైలాగుల్ని వల్లెవేస్తూ ప్రభుత్వాన్ని రెచ్చగొట్టే పనిచేస్తున్నారు. హింసను ప్రేరేపించడమే లక్ష్యం అన్నట్టుగా పదేపదే అదే వాడుతున్నారు. మరొకవైపు ఆ మాటలను సమర్థించుకుంటున్నారు. అది సినిమా డైలాగే కదా.. సినిమాలో వాడినప్పుడు మరి బయట వాడితే తప్పేంటి.. ఫ్లెక్సిలు వేస్తే తప్పేంటి అని జగన్ సమర్థించుకుంటున్నారు.
ఈ సమర్థింపు ఆయన అజ్ఞానాన్ని బయటపెడుతున్నది. ఎందుకంటే.. సినిమాలో ఒక మాట అంటే.. దానికి ఒక సీను, ఆ డైలాగు రావడానికి దారి తీసిన పరిస్థితులు అన్నీ కారణం అవుతాయి.
అలాంటప్పుడే ఒక డైలాగును పదునుగా, ఆవేశంగా రాస్తే ఆ సీను పండుతుంది. పుష్ప2 సినిమాలో హీరో అన్న కూతురిని విలన్ గ్యాంగ్ కిడ్నాప్ చేసి ఎత్తుకుపోయి, సామూహిక అత్యాచారానికి పాల్పడబోతున్నారనగా.. వారిని హెచ్చరిస్తూ హీరో పలికే డైలాగు అది. మరి జగన్ తాలూకు కిరాయి గూండా మూకలు.. వారికి ఏ అన్యాయం జరిగిందని.. ఏ ఆవేశం పొంగుకొచ్చిందని ఆ డైలాగును ఫ్లెక్సిలుగా ముద్రించాయో జగనే కాస్త వివరించి చెబితే బాగుంటుంది. జగన్ ఇంట్లోని ఏమహిళలకు ఏ అన్యాయం జరిగిందని ఆయన దళాలకు ఆవేశం వచ్చిందో చెప్పాలి. నిజానికి తన సొంత తల్లి, సొంత చెల్లి మీద కూడా అసభ్యపు కారుకూతలను తన అనుచరులతోసోషల్ మీడియాలో పోస్టులు పెట్టించిన దారుణమైన వ్యక్తి జగన్. ఆయన ఇప్పుడు రప్పారప్పా డైలాగుల్ని సమర్థించుకోవడం చూసి.. ఆ పార్టీ లోని నాయకులే కొందరు పెదవి విరుస్తున్నారు. ఈ తప్పుడు మాటలను సమర్థించుకున్నంత కాలం.. తమ పార్టీ భ్రష్టుపట్టిపోవడమే అని ఆవేదన చెందుతున్నారు.
Rashmika Mandanna’s The Girlfriend Gains Momentum as First Single “Nadhive” Drops
Actress Rashmika Mandanna, the country’s crush as she is usually hailed as, is all ready to enthrall her fans yet again with her new romantic drama The Girlfriend. Produced by Geetha Arts and Dheeraj Mogilineni Entertainment, the movie has been creating huge expectations, particularly from Rashmika’s fast-growing fanbase.
Adding to the buzz, the producers have officially dropped the first single of the film – “Nadhive.” This melodious song, composed by Hesham Abdul Wahab, gives a beautiful emotional journey partly made possible by the mellow melody. With heartfelt melodies, Hesham brings an emotional song that puts a person in touch with themselves. The lyrics are penned by Rakendu Mouli, and the poetical and emotional elements of the lyrics beautifully go with the music.
The song has Rashmika with Dheekshith Shetty, both artists gave performances with deep emotion and romantic strain that execute the emotional depth of the song.
Directed by Rahul Ravindran, The Girlfriend is shaping up to be a heartfelt romantic entertainer. With “Nadhive” already receiving good words, anticipation is now building for what’s in store next. The film is readying for pan-India release and will release in various languages.
రొమాంటిక్ మెలోడిగా ‘నదివే’
నేషనల్ క్రష్గా గుర్తింపు పొందిన రష్మిక మందన్న నటిస్తున్న తాజా సినిమా “ది గర్ల్ఫ్రెండ్” పై ఆసక్తి రోజు రోజుకీ పెరిగిపోతోంది. ఇప్పటికే వరుస విజయాలతో క్రేజ్ మీదున్న రష్మిక ఒక రొమాంటిక్ ఎంటర్టైనర్లో నటిస్తోందని తెలిసినప్పటి నుంచే ఈ సినిమాపై మంచి బజ్ నెలకొంది. ఇప్పుడు ఈ సినిమాతో సంబంధించి మొదటి మ్యూజిక్ అప్డేట్ వచ్చింది.
హేషమ్ అబ్దుల్ వాహబ్ స్వరపరిచిన “నదివే” అనే మెలోడీ వీడియో సాంగ్ను మేకర్స్ విడుదల చేశారు. ఈ పాట సాఫ్ట్ మ్యూజిక్తో, ఫీల్గుడ్ ట్యూన్స్తో ఎంతో హాయిగా సాగుతుంది. మెలోడీ తరహాలో రూపొందిన ఈ పాటను స్వయంగా హేషమ్ పాడిన తీరు మంచి అనుభూతిని ఇచ్చేలా ఉంది. స్క్రీన్ మీద రష్మిక మందన్న, దీక్షిత్ శెట్టి కలసి అందమైన స్టెప్పులతో ఆ పాటను మరింత ప్రత్యేకంగా తీర్చిదిద్దారు.
ఈ సినిమాకు దర్శకుడిగా రాహుల్ రవీంద్రన్ వ్యవహరిస్తున్నాడు. ప్రేమకథ నేపథ్యంలో ఈ చిత్రాన్ని రూపొందిస్తుండగా, ఫస్ట్ సాంగ్ వదిలిన దగ్గర నుంచి సినిమాపై అంచనాలు మరింతగా పెరిగాయి. ఇక ఈ సినిమాను పాన్ ఇండియా లెవెల్లో విడుదల చేయాలని మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు. దీనికోసం ప్రమోషన్ కార్యక్రమాలను కూడా స్టెప్ బై స్టెప్ ప్లాన్ చేస్తున్నారు.
ప్రస్తుతం మ్యూజిక్ అప్డేట్తో మంచి శభ్దం తెచ్చుకున్న ఈ సినిమాకి సంబంధించి మిగతా వివరాల కోసం ఫ్యాన్స్ వేచి చూస్తున్నారు. రష్మిక ప్రెజెన్స్కి తోడు, కథా పరిణామాల మీద కూడా మంచి ఆసక్తి నెలకొంది.
హీరో రామ్ కొత్త అవతారం!
ఎనర్జిటిక్ హీరో రామ్ పోతినేని మరోసారి ప్రేక్షకుల్ని ఆకట్టుకునేందుకు కొత్త చిత్రంతో రాబోతున్నారు. ‘ఆంధ్ర కింగ్ తాలూకా’ అనే టైటిల్తో రూపొందుతున్న ఈ సినిమా ప్రస్తుతం ఫుల్ స్పీడ్లో షూటింగ్ దశలో ఉంది. ఈ చిత్రాన్ని పి. మహేష్ బాబు దర్శకత్వం వహిస్తున్నారు. రామ్ సరసన భాగ్యశ్రీ బొర్సె కథానాయికగా నటిస్తోంది. ఇప్పటివరకు విడుదలైన పోస్టర్లు, గ్లింప్స్ వంటివి సినిమాపై మంచి హైప్ని తీసుకువచ్చాయి.
తాజాగా ఈ సినిమా నుంచి ఫస్ట్ సింగిల్ పాట విడుదలకు సిద్ధమవుతోంది. ప్రేమభరితమైన రొమాంటిక్ మెలోడీగా ఈ పాట రాబోతున్నట్టుగా సమాచారం. ఈ స్పెషల్ సాంగ్ను సంగీత దర్శకుల ద్వయం వివేక్ – మెర్విన్ కంపోజ్ చేయగా, ఫేమస్ సింగర్ అనిరుధ్ రవిచందర్ ఆలపించారు. అయితే ఇందులో ఓ ఇంట్రెస్టింగ్ విషయం ఏంటంటే, ఈ పాటకు రామ్ స్వయంగా లిరిక్స్ రాశాడు. అంటే ఈసారి హీరోగా కాకుండా గీత రచయితగా కూడా తన టాలెంట్ను చూపించబోతున్నాడు.
ఈ లవ్ సాంగ్ను జూలై 18న రిలీజ్ చేయనున్నట్లు మేకర్స్ కన్ఫర్మ్ చేశారు. పాట వినిపించిన వెంటనే శ్రోతల మనసుల్లో నిలిచిపోయేలా ఉంటుందన్న నమ్మకంతో ఉన్నారు. ఇందులో సీనియర్ యాక్టర్ ఉపేంద్ర ఒక ముఖ్యమైన పాత్ర పోషిస్తున్నారు. మైత్రీ మూవీ మేకర్స్ నిర్మాణంలో తెరకెక్కుతున్న ఈ చిత్రానికి సంబంధించి మొదటి పాట సినిమాపై మరింత ఆసక్తి పెంచేలా ఉండబోతోందని టాక్ వినిపిస్తోంది.