బెయిలు మీద బాహ్యప్రపంచంలో ఉంటూ, ఒక దఫా అయిదేళ్ల పాటు ముఖ్యమంత్రి బాధ్యతలను కూడా నిర్వర్తించిన వైఎస్ జగన్మోహన్ రెడ్డి మీద వేల కోట్ల రూపాయల అవినీతికి పాల్పడినట్టుగా సీబీఐ, ఈడీ కేసులు సా..గుతున్న సంగతి అందరికీ తెలిసిందే. పాదయాత్ర రోజుల్లో ఒక తీరుగా, ముఖ్యమంత్రి అయిన తర్వాత ఒక తీరుగా.. తాను స్వయంగా విచారణకు హాజరుకాలేనంటూ రకరకాల సాకులు చెబుతూ.. విచారణల్ని పద్ధతిగా నడవనివ్వకుండా జాగ్రత్త పడుతూ వచ్చారు జగన్మోహన్ రెడ్డి. అదే సమయంలో సుప్రీం కోర్టులలో డిశ్చార్జి పిటిషన్లు కూడా వేసి.. తన అవినీతి కేసులు విచారిస్తున్న కోర్టులు తుది నిర్ణయానికి రాకుండా అడ్డు పడుతూ వ్యూహాత్మకంగా పావులు కదుపుతున్నారు. ఇలాంటి నేపథ్యంలో ఇప్పుడు ఆ కేసుల వ్యవహారంలో కదలిక వచ్చే అవకాశం కనిపిస్తోంది. తొందర్లోనే జగన్ కేసుల విచారణలు శిక్షల దాకా తేలిపోయేలా వేగం అందుకోనున్న సంకేతాలు వస్తున్నాయి.
జగన్ అక్రమాస్తుల కేసుల విచారణ ఆలస్యం అవుతున్నదని.. ఏపీ డిప్యూటీ స్పీకరు రఘురామక్రిష్ణరాజు గతంలో సుప్రీం కోర్టులో పిటిషన్ వేశారు. కేసులు సవ్యంగా విచారణ సాగాలంటే వాటి విచారణ మరో రాష్ట్రానికి బదిలీ చేయాలని ఆయన తన పిటిషన్లో కోరారు. తమాషా ఏంటంటే.. దాదాపుగా దశాబ్దం కిందట నమోదైన కేసుల్లో ఇప్పటిదాకా విచారణ ఎందుకు ఆలస్యం అవుతున్నదని సుప్రీం ధర్మాసనం ఆశ్చర్యం వ్యక్తం చేసింది. డిశ్చార్జి, వాయిదా పిటిషన్లు పైకోర్టుల్లో విచారణలో పెండింగులో ఉండడం వల్లనే అసలు కేసులు కూడా తేలడం లేదంటూ న్యాయవాదులు కోర్టు దృష్టికి తీసుకువెళ్లారు.
దీంతో ఆగ్రహించిన సుప్రీం న్యాయమూర్తి జగన్ అక్రమాస్తుల వ్యవహారాలకు సంబంధించి పెండింగులో ఉన్న అన్ని కేసుల వివరాలు తమకు పంపాలని, వాటిని బట్టి త్వరగా తెమిలేందుకు తగిన ఆదేశాలు ఇస్తామని పేర్కొన్నారు. ఈనెల 13లోగా అన్ని కేసుల వివరాలను సుప్రీంకు సమర్పించాల్సి ఉంటుంది.
అదే జరిగితే.. సుప్రీం తదనుగుణమైన ఆదేశాలు ఇచ్చిందంటే గనుక.. జగన్ కేసుల విచారణ వేగం పుంజుకుంటుందనే అభిప్రాయం న్యాయనిపుణుల్లో వ్యక్తం అవుతోంది. మహా అయితే ఏడాదిలోగా జగన్ మళ్లీ జైలుకు వెళ్లే పరిస్థితి వస్తుందని పలువురు అంచనా వేస్తున్నారు.
జగన్ కేసుల్లో జాప్యంపై సుప్రీంకే ఆశ్చర్యం!
అంతు తేల్చేదాకా పవన్ వదిలేలా లేరే!
కాకినాడ పోర్టు కేంద్రబిందువుగా జరుగుతున్న పీడీఎస్ బియ్యం స్మగ్లింగ్ విషయంలో డిప్యూటీ ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ నెక్ట్స్ ఫేజ్ కార్యాచరణకు వెళుతున్నారు. అక్రమార్కుల స్మగ్లర్ల అంతు తేల్చడమే లక్ష్యంగా ఆయన పావులు కదుపుతున్నారు. ఈ మేరకు ఉండవిల్లిలోని నివాసంలో ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు తో ప్రత్యేకంగా భేటీ అయిన పవన్ కల్యాణ్.. తాను స్వయంగా సముద్రం మీదకు వెళ్లి పరిశీలించినప్పుడు గమనించిన విషయాలు, అక్కడ స్మగ్లింగ్ దందా జరుగుతున్న తీరును మొత్తం సీఎంకు వివరించారు. ఈ బియ్యం మాఫియాకు అడ్డుకట్ట వేయాల్సి ఉన్నదని చర్చించారు.
చూడబోతే.. త్వరలోనే బియ్యం స్మగ్లర్ల ఆట కట్టించడానికి కఠిన చర్యలు ఉంటాయని అనిపిస్తోంది. గత మూడేళ్లలో ఒక్క కాకినాడ పోర్టునుంచే 48వేల కోట్లకు పైగా బియ్యం ఎగుమతి కావడం అనేది మాఫియా విపరీత ధోరణికి నిదర్శనం అంటూ పవన్, చంద్రబాబు దృష్టికి తీసుకువెళ్లారు. అయిదేళ్లుగా కాకినాడ పోర్టులోకి ఎవ్వరినీ అడుగుపెట్టనివ్వకుండా ఎలాంటి విచ్చలవిడితనం సాగుతున్నదో తెలియజెప్పారు.
పవన్ కల్యాణ్ కాకినాడ బియ్యం స్మగ్లింగ్ వ్యవహారాన్ని, పోర్టు అధికారులు తనను కూడా అనుమతించకుండా చూపించిన పెడసరం ధోరణుల్ని ఒకపట్టాన విడిచిపెట్టేలా కనిపించడం లేదు. ఇప్పుడు ఈ స్మగ్లింగ్ దందాపై చర్యలు తీసుకోవడం గురించి.. సీఎం దృష్టికి తీసుకువెళ్లినట్టే.. కేంద్రమంత్రి అమిత్ షాను కలవడానికి కూడా సిద్ధమవుతున్నట్టుగా మంగళగిరి వర్గాలు తెలియజేస్తున్నాయి. త్వరలోనే కేంద్ర హోం మంత్రిని కలిసి కాకినాడ పోర్టు నిర్వహణలో రహస్యాలకు ప్రాధాన్యం ఇస్తున్న తీరు, ఆ పోర్టు వల్ల దేశభద్రతకే ముప్పు వాటిల్లగల ప్రమాదాల గురించి.. షా కు చెప్పబోతున్నారని సమాచారం. ఈ విషయంలో ఆలస్యం చేసే ఉద్దేశంలేదని, ఒకవేళ అమిత్ షా తో అపాయింట్మెంట్ ఆలస్యం అయ్యేట్లయితే.. లేఖ ద్వారానైనా కాకినాడ పోర్టు దురాగతాలను కేంద్ర హోంశాఖ దృష్టికి తీసుకెళ్లి వారి ఆట కట్టించాలని పవన్ కల్యాణ్ ఆలోచిస్తున్నట్టు తెలుస్తోంది.
Pushpa 2’s Ticket Price Hike Under Judicial Review
Pushpa 2, the long-awaited film by Allu Arjun, is knocking at the door, but it has already created a controversy as the ticket price in Telangana has hiked to a sharp increase. Tickets for the premiere shows of the evening of December 4 have been sold at a premium price of ₹1200 while regular shows will be ₹531 at multiplexes and ₹354 at single screens.
The abrupt surge in ticket prices has outraged public opinion, and an aggrieved public has even approached the Telangana High Court to file a writ for challenge against the G.O. passed by the government accepting this hike. A hearing has been scheduled for tomorrow. There are expectations that the producers might win in court because technically speaking, producers have always been given the right to charge the price they want on their tickets.
With Telangana, the other will be Andhra Pradesh wherein the ticket price increase seems to be in line for hike. A new G.O. is to be brought out soon. Directed by Sukumar, Pushpa 2 stars Allu Arjun in the lead, Rashmika Mandanna plays the lady lead, and Fahadh Faasil plays the villainous antagonist. Produced under the banner Mythri Movie Makers, this film is already buzzing in the air and promising a huge box office result.
Siddharth’s Rom-Com ‘Miss You’ Gets a New Release Date
Actor Siddharth’s upcoming romantic-comedy drama gets a new release date. The actor announced the new release date, which is scheduled to hit theaters on December 13, 2024.
Directed by N. Rajasekhar, the film was earlier scheduled to release in theaters on November 29 but was postponed due to turbulent weather conditions in Tamil Nadu, which caused cyclone floods. The makers recently announced the postponement, and today, they have finalized the date.
On Monday, December 2, Siddhartha announced this exciting update with a new poster featuring Siddharth and Ashika Ranganath, with a caption, “#MissYou releases in Cinemas worldwide. December 13 In Tamil and Telugu.”
Directed by N. Rajasekhar, the film stars Siddharth and Ashika Ranganath in the main leads. The recently released trailer promises a delightful romantic comedy with the fresh chemistry between Siddharth and Ashika for the first time. Produced by Samuel Mathew under the 7 Miles per Second banner.
Apart from the main leads, Miss You also stars Bala Saravanan, Karunakaran, Sastika, Ponvannan, and others in significant roles. Ghibran composed the musical tunes for this romantic tale. The technical crew includes KG Venkatesh as the cinematographer, while Dinesh Ponraj handled the editing.
On the work front, Siddharth will be seen in the sports drama ‘Test’ alongside Nayanthara and R. Madhavan. Meanwhile, Ashika is set to appear in Chiranjeevi’s Vishwambhara and Sardar 2 with Karthi.
పృథ్వీరాజ్ పై ‘మోహన్ లాల్’ ఆసక్తికర వ్యాఖ్యలు!
మలయాళ సూపర్ స్టార్ మోహన్ లాల్ హీరోగా.. మలయాళ స్టార్ హీరో పృథ్వీరాజ్ సుకుమారన్ డైరెక్షన్ లో వచ్చిన పొలిటికల్ థ్రిల్లర్ లూసిఫర్. ఈ సినిమాకు కొనసాగింపుగా ‘లూసిఫర్2: ఎంపురాన్ (రాజు కన్నా గొప్పవాడు)’ రానుంది. అయితే, తాజాగా ఈ సినిమా షూట్ పూర్తైంది. ఈ విషయాన్ని తెలియజేస్తూ మోహన్లాల్ తాజాగా ఓ పోస్టులో వివరించారు.
ఇంతకీ, మోహన్ లాల్ తన పోస్ట్ లో ఏం రాసుకొచ్చారంటే.. ‘సినిమా చిత్రీకరణ ముగిసింది. 14 నెలల సమయం.. ఎనిమిది రాష్ట్రాలు.. యూఎస్, యూకే, యూఏఈ తో పాటు నాలుగు దేశాలు.. ఇదొక అద్భుతమైన అనుకొని ప్రయాణం.. ప్రతి ఫ్రేమ్ని ఎలివేట్ చేసే సృజనాత్మకత పృథ్వీరాజ్ సుకుమారన్ కే సాధ్యం.
స్క్రీన్ ప్లేతో ఈ కథకు ప్రాణం పోసిన మురళీ గోపీ, మాపై నమ్మకం ఉంచి ఎంతోగానో సపోర్ట్ చేసిన నిర్మాతలకు స్పెషల్ థ్యాంక్స్. నటీనటులు, టెక్నికల్ టీమ్ సమష్టి సహకారంతోనే మేము దీనిని సాధించగలిగాం. మమ్మల్ని ఎంతగానో ఆరాధించే అభిమానుల ప్రేమే.. మాపై నమ్మకాన్నిపెంచింది’ అంటూ మోహన్ లాల్ తన పోస్ట్ లో వివరించారు. మరి ఈ సీక్వెల్ ఏ రేంజ్ లో విజయం అందుకుంటుందో వేచి చూడాల్సిందే.
బొత్స ఆరాటం వాళ్లను ఇరికించడానికేనా?
ఒకసారి ప్రెస్ మీట్ లో మాట్లాడిన తర్వాత విన్నవారికీ, మాట్లాడిన వారికి కూడా ఏ అంశం గురించి మాట్లాడారో అర్థం కాకుండా మాట్లాడడం అనేది ఏపీ రాజకీయ నాయకుల్లో బొత్స సత్యనారాయణకు మాత్రమే చేతనైన సంగతి. తాజాగా ఆయన ప్రెస్ మీట్ ఏర్పాటు చేసి.. విద్యుత్తు చార్జీల పెంపు దగ్గరినుంచి.. షర్మిల చేస్తున్న ఘాటైన విమర్శల వరకు అనేక అంశాల గురించి మాట్లాడారు. ఆ క్రమంలో.. షిప్ లో స్మగ్లింగ్ అవుతున్న పీడీఎస్ బియ్యం వ్యవహారం కూడా ఉంది.
ఇప్పటికే ఈ స్మగ్లింగ్ వెనుక ఉన్న వైసీపీ నేతల్ని కలుగులోంచి బయటకు లాక్కురావడానికి డిప్యూటీ ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ రంగంలోకి దిగిన నేపథ్యంలో.. ఈ వ్యవహారం వెనుక ఉన్న మూలవిరాట్టులందరికీ వణుకు మొదలైంది. కాగా.. బొత్స సత్యానారాయణ మీకు చిత్తశుద్ధి ఉంటే, చేతనమైతే విచారణ చేయించి అసలు దోషులను తేల్చండి అంటూ పవన్ కల్యాణ్ కు ప్రభుత్వానికి సవాళ్లు విసురుతున్నారు. తప్పుడు పనిచేస్తున్నది, ఆ స్మగ్లింగ్ వెనుకనుంచి నడిపిస్తున్నది తమ పార్టీ వారే కాగా, చేతనైతే అరెస్టులు చేయండి అంటూ బొత్స సత్యనారాయణ దూకుడుగా మాట్లాడడం అనేది తమ పార్టీ వారికే చేటు చేస్తుందని వైసీపీ నేతలు కంగారు పడుతున్నారు.
వైసీపీ మాజీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర రెడ్డి తమ్ముడి కి చెందిన సంస్థ ఈ స్మగ్లింగ్ వెనుక ఉన్నట్టుగా పవన్ కల్యాణ్ ప్రెస్ మీట్ పెట్టిన రోజే ఆరోపించారు. నిజానికి బియ్యం స్మగ్లింగ్ ద్వారా.. ద్వారంపూడి వేల కోట్లు ఆర్జిస్తున్నట్టుగా పవన్ కల్యాణ్ ఎన్నికలకంటె ముందునుంచే ఆరోపిస్తున్నారు. ఆ ప్రాంతంలో ఎన్నికల ప్రచార సమయంలో కూడా ప్రధానంగా ఈ అంశాన్నే వాడుకున్నారు. అలాంటిది ఇప్పుడు.. బొత్స మాటల్ని గమనిస్తే.. ద్వారంపూడి ఫ్యామిలీని ఇరికించడానికే బొత్స అలా మాట్లాడుతున్నారా? అనే అనుమానాలు కూడా పలువురికి కలుగుతున్నాయి.
ఇటీవల శాసనమండలిలో చర్చ సందర్భంగా కూడా.. వైసీపీ వారు పాల్పడిన నేరానికి సంబంధించి ఒక చర్చ జరిగింది. ఆ సమయంలో కూడా బొత్స సత్యనారాయణ ఇదే తరహా దూకుడు ప్రదర్శించారు. చేతనైతే విచారణ జరిపి వారిని అరెస్టు చేసుకోండి అంటూ రెచ్చిపోయారు.
ఆ కేసులో అయినా, ఇప్పుడు పీడీఎస్ బియ్యం స్మగ్లింగ్ కేసులో అయినా విచారణలు జరగుతున్నాయి. దొంగల్ని ఖచ్చితంగా చట్టం ముందు నిలబెడతారు. తమ పార్టీ వారిని వీలైనంత తొందరగా అరెస్టు చేయించడానికే బొత్స ఈ సవాళ్లు విసురుతున్నారని పలువురు అంటున్నారు.
నేను చేసిన అతి పెద్ద తప్పు ఇదే!
హీరోయిన్ ‘రకుల్ ప్రీత్ సింగ్’ తాజాగా గాయపడింది. అయితే, తనకు జరిగిన ప్రమాదం గురించి పూర్తిస్థాయిలో రకుల్ తాజాగా మాట్లాడింది. ఈ క్రమంలో రకుల్ ప్రీత్ సింగ్ చేసిన కామెంట్లు ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి. ఇంతకీ రకుల్ ఏం చెప్పింది అంటే.. ‘అది అక్టోబర్ 5, ఆ రోజు నేను మరిచిపోలేని రోజు. ఎప్పట్లానే జిమ్ కు వెళ్లాను. 80 కిలోలు లిఫ్టింగ్ చేశాను.
దాంతో సడెన్ గా నా వెన్నెముకలో నొప్పి వచ్చింది. కానీ, ఆ నొప్పిని నేను పెద్దగా పట్టించుకోలేదు. అదే నేను చేసిన పెద్ద తప్పు’ అని రకుల్ వివరించింది. ఈ విషయం గురించి రకుల్ మాట్లాడుతూ.. ‘నాకు ఆ నొప్పి ఉన్నా.. నేను నేరుగా షూటింగ్ కు వెళ్లాను. రాత్రి ఇంటికొచ్చేసరికి వంగలేకపోయాను.
ఓ దశలో నా దుస్తులు కూడా నేను మార్చుకోలేకపోయాను. ఆ తర్వాత నాలుగు రోజులకు సడన్ గా నా నడుము నుంచి కింది భాగం మొత్తం చలనం లేకుండా అయిపోయింది. ఒక్కసారిగా నా బీపీ కూడా పడిపోయింది. అంతే ఆ దెబ్బతో స్పృహ తప్పిపోయాను. ప్రస్తుతం నా ఆరోగ్యం బాగానే ఉంది’ అంటూ వివరించింది.
బెల్టు తీస్తానన్నారు.. తడాఖా చూపించారు!
ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు.. అనంతపురం జిల్లా నేమకల్లులో పింఛన్ల పంపిణీ నిమిత్తం వెళ్లిన సందర్భంలో అక్కడి లబ్ధిదారుల కుటుంబాల వారితో కలిసిపోయారు. వారితో సమయం గడిపారు. వారి కష్టనష్టాలను, గ్రామాల్లో పరిస్థితులను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా.. గ్రామాల్లో మద్యం బెల్టుషాపుల వ్యవహారం కూడా సీఎం దృష్టికి వచ్చింది. ఈ సందర్భంగా చంద్రబాబునాయుడు మాట్లాడుతూ.. బెల్టుషాపులు నిర్వహిస్తే.. తాను తన బెల్టు తీయాల్సి వస్తుందని ఘాటుగానే హెచ్చరించారు.
మద్యం దుకాణాల్లో ఎమ్మార్పీ కంటె ఎక్కువకు విక్రయించే అక్రమాలకు పాల్పడుతున్నా తాటతీస్తానని గతంలోనే పలుమార్లు హెచ్చరించి ఉన్న సంగతి అందరికీ తెలిసిందే. ఈ నేపథ్యంలో కేవలం రెండు రోజుల వ్యవధిలోనే ప్రభుత్వం ఈ దిశగా కఠినమైన చర్యలు తీసుకున్నది. ఎమ్మార్పీ కంటె ఎక్కువకు అమ్మడం, బెల్టుషాపులు నిర్వహించడం అనే తప్పులకు పాల్పడే వారికి భారీ జరిమానాలు విధించేలా ప్రభుత్వం తాజాగా ఎక్సయిజు చట్టానికి సవరణలు చేస్తూ నోటిఫికేషన్ జారీచేసింది.
ఏ మద్యం దుకాణంలోనైనా ఎమ్మార్పీ కంటె ఎక్కువ ధరకు విక్రయిస్తున్నట్టుగా తేలితే గనుక.. వారికి రూ.5 లక్షల భారీ జరిమానా విధించేలా ప్రభుత్వం నిర్ణయించింది. ఒకసారి ఈ జరిమానా పడిన దుకాణం మళ్లీ అలాంటి తప్పునేచేస్తున్నట్టు తేలితే.. ఏకంగా వారి లైసెన్సునే రద్దు చేస్తారు. అలాగే మద్యం దుకాణం పరిధిలో బెల్టు షాపులు నిర్వహిస్తే కూడా రూ.5 లక్షల జరిమానా విధించేలా చట్టానికి మరో సవరణ చేశారు.
చంద్రబాబునాయుడు నేమకల్లులో హెచ్చరించిన రెండు రోజుల్లోనే బెల్టుషాపులమీద కఠినమైన జరిమానాలు విధిస్తూ చట్టసవరణలు జరగడం విశేషం. ఈ నిర్ణయాల ద్వారా.. బెల్టుషాపులకు చెక్ పెట్టినట్టే అవుతుందని ప్రజలు భావిస్తున్నారు.
మద్యం దుకాణాల్లో ఎమ్మార్పీపై ధర పెంచి అమ్ముతున్నారనే ఆరోపణలు కూడా ఇకపై వినిపించే అవకాశం లేదు. ఒకసారి దొరికితే రూ.5లక్షల జరిమానా విధించడం మాత్రమే కాదు.. రెండోసారి ఇదే తప్పు జరిగితే.. ఏకంగా లైసెన్సు రద్దు అయ్యేలా చట్టం చేయడం అనేది.. ఖచ్చితంగా దుకాణదారుల్లో మార్పు తెస్తుందని అంతా అనుకుంటున్నారు.
రెండో సినిమా డైరెక్టర్ ఎవరంటే!
నటసింహం బాలయ్య బాబు నట వారసుడు నందమూరి మోక్షజ్ఞ హీరోగా ప్రశాంత్ వర్మ డైరెక్షన్ లో మొదటి సినిమా రాబోతున్న సంగతి తెలిసిందే. అయితే ఇప్పుడు తాజాగా మోక్షజ్ఞ రెండో సినిమా పై కూడా ఓ క్లారిటీ వచ్చేసింది. దుల్కర్ సల్మాన్ హీరోగా మీనాక్షి చౌదరి హీరోయిన్ గా దర్శకుడు వెంకీ అట్లూరి తెరకెక్కించిన “లక్కీ భాస్కర్” సినిమా మంచి విజయాన్ని సాధించి రికార్డులు తిరగ రాసింది.
ఈ నేపథ్యంలో వెంకీ అట్లూరి – మోక్షజ్ఞ కలయికలో ఓ సినిమా సెట్ అయ్యిందనే టాక్ వినపడుతుంది. ఇప్పటికే, మోక్షజ్ఞ కోసం వెంకీ అట్లూరి ఓ కథ కూడా రెడీ చేసినట్లు సమాచారం. పైగా ఈ సినిమాని సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ రూపొందించనుంది. ఈ సినిమా పై ఇంకా అధికారికంగా ప్రకటన రానప్పటికీ, నందమూరి అభిమానులు ఈ మాటలు నిజమవుతాయని ఎంతోఆసక్తిగా ఉన్నారు. ఏది ఏమైనా నందమూరి మోక్షజ్ఞ ఎంట్రీ పై చాలా ఏళ్ల నుంచి బాలయ్య అభిమానులు చాలా ఆశగా ఎదురు చూస్తున్న సంగతి తెలిసిందే.