జగన్ కు సన్నిహితుడైన మాజీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర రెడ్డి ఇప్పుడు జైలులో కుమిలిపోతున్నారో లేదో గానీ.. బయట ఉన్న ఆయన వర్గీయులు, అభిమానులు మాత్రం మనస్తాపంలో ఉన్నారు. తమ నాయకుడు జైలులో ఉన్నాడు. తాజాగా పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి కూడా అరెస్టు అయ్యాడు. ఆదివారం రాత్రిలోగా.. మిథున్ కూడా రిమాండు నిమిత్తం జైలుకు వెళ్లే అవకాశం ఉంది. అయితే పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి అరెస్టు అయినప్పటినుంచి.. రాష్ట్రానికి అతిపెద్ద ద్రోహం జరిగిపోయినట్టుగా.. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్రవ్యాప్తంగా నానా రాద్ధాంతమూ చేస్తోంది. అదే సమయంలో.. చెవిరెడ్డి అరెస్టు అయినప్పుడు ఈ స్థాయిలో పార్టీ నాయకులందరూ బయటకు వచ్చి మాట్లాడడం, ఖండించడం జరగలేదు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీని, జగన్మోహన్ రెడ్డిని నమ్ముకుని తమ నాయకుడు ఎంత విశ్వాసంగా ఉంటూ సేవలు చేస్తున్నప్పటికీ.. అక్కడ సెకండ్ గ్రేడ్ సిటిజన్ గానే చూస్తున్నారని, మిథున్ రెడ్డి అరెస్టు అయినప్పుడు ఒకరకంగా- భాస్కర రెడ్డి అరెస్టు అయినప్పుడు మరో రకంగా పార్టీ స్పందిస్తున్నదని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
మిధున్ రెడ్డి అరెస్టు గురించి వైసీపీ నాయకులు ప్రతి ఒక్కరూ నిన్న రాత్రినుంచి తమ ఖండనలను వరుసగా విడుదల చేస్తూనే ఉన్నారు. ఆదివారం మొత్తం కూడా రాష్ట్రమంతా వైసీపీ నాయకులు ఇదే టాపిక్ మాట్లాడుతూ మీడియా దృష్టిని ఆకర్షించే ప్రయత్నం చేసే అవకాశం ఉంది. అయితే.. తమ నాయకుడు చెవిరెడ్డి భాస్కర రెడ్డి కూడా అంతే కీలకమైన నాయకుడు అయినప్పటికీ.. పార్టీలో జగన్ కు ఇంకా గొప్పగా సేవలు చేసిన నాయకుడు అయినప్పటికీ.. ఆయన అరెస్టు అయినప్పుడు పార్టీ ఈ స్థాయిలో స్పందించలేదని ఆయన అబిమానులు బాధపడుతున్నట్టు సమాచారం.
నిజానికి లిక్కర్ స్కామ్ కు సంబంధించినంత వరకు చెవిరెడ్డి భాస్కరరెడ్డి చేసిన నేరాలకు, పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి చేసిన నేరాలకు చాలా వ్యత్యాసం ఉన్నదని చెవిరెడ్డి అభిమానులు అనుకుంటున్నారు. అసలు స్కామ్ రూపకల్పన దగ్గరినుంచి ఏ రకంగా దోచుకోవాలి.. ఎవరెవరినుంచి దోచుకోవాలి.. లాంటి వ్యవహారాల ప్లానింగ్ దశ నుంచీ పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి భాగస్వామి అని, అదే చెవిరెడ్డి విషయానికి వస్తే.. ఎన్నికల ముందు జగన్ పురమాయింపు మేరకు వసూళ్ల సొమ్మును తీసుకువెళ్లి కొందరు అభ్యర్థులకు పంచిపెట్టడం తప్ప ఆయన ఏ పాపం ఎరగడని ఏమీ బావుకోలేదని వారు అంటున్నారు.
అలాగే.. స్కామ్ సాగినం కాలమూ పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి ప్రతినెల 5 కోట్లరూపాయలు తన వాటాగా తీసుకున్నట్టుగా సిట్ విచారణలో తేలడాన్ని కూడా వారు గుర్తు చేస్తున్నారు. అలాంటి మిథున్ రెడ్డికోసం జగన్ గానీ, వైసీపీ పార్టీ నాయకులందరూ గానీ పడుతున్న ఆరాటంలో కనీసం పదో వంతు.. అప్పట్లో చెవిరెడ్డిని అరెస్టు చేసినప్పుడు చూపించిఉంటే తమకు ఎంతోనైతిక స్థైర్యం ఉండేదని అనుకుంటున్నారు.
చెవిరెడ్డి ఆవేదన.. నన్ను మాత్రం పట్టించుకోలేదే!
22న తాడేపల్లి ప్యాలెస్కు జగన్! 23న మూలాఖత్!
ప్రస్తుతం బెంగళూరులోని యలహంక ప్యాలెస్ లో సేదతీరుతున్న మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి రావడానికి మరో అవకాశం దొరికింది. రాష్ట్రంలో చీమ చిటుక్కుమన్నా సరే పరామర్శలు పలకరింపులు సానుభూతి అంటూ యాత్రలు నిర్వహించే వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఈనెల 22వ తేదీన మంగళవారం రాష్ట్రానికి రానున్నట్టుగా సమాచారం. సోమ లేదా మంగళవారాల్లో రాష్ట్రానికి వచ్చి బుధవారం నాడు జైలులో రిమాండు ఖైదీగా ఉండబోయే పెద్దిరెడ్డి మిథున్ రెడ్డిని ములాఖత్ రూపంలో కలవాలని అనుకుంటున్నట్టుగా పార్ీట వర్గాలు చెబుతున్నాయి.
పెద్దిరెడ్డి మిథున్ రెడ్డిని సిట్ పోలీసులు శనివారం రాత్రి ఎనిమిదిన్నర గంటల సమయంలో అరెస్టు చేసిన సంగతి తెలిసిందే. అప్పటినుంచి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు అందరూ కూడా ఈ అరెస్టును తీవ్రస్థాయిలో ఖండిస్తున్నారు. సుదీర్ఘంగా ఏడుగంటలకు పైగా విచారించిన అనంతరం పోలీసులు మిథున్ రెడ్డిని అరెస్టు చేశారు. ఆదివారం రాత్రి లోగా ఆయనను న్యాయమూర్తి ఎదుట హాజరు పరిచే అవకాశం ఉంది. మిథున్ రెడ్డిని ఖచ్చితంగా రిమాండుకు పంపే అవకాశం ఉన్నదని అంతా అనుకుంటున్నారు.
అదే సమయంలో అరెస్టు అయిన తర్వాత తీసుకోవాల్సిన చర్యలేంటి? వెంటనే బయటకు రావడానికి ఉన్న మార్గాలేంటి అనే విషయంలో పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి రెండు రోజులుగా తన న్యాయవాదులతో చర్చలు జరుపుతూనే ఉన్నారు. సుప్రీం కోర్టులో దాఖలు చేసిన ముందస్తు బెయిలు పిటిషన్ తిరస్కరణకు గురైనప్పటినుంచి.. ఆయన ఈ ప్రయత్నాల్లో ఉన్నారు. తొలుత శనివారం మరోసారి ముందస్తు బెయిలు పిటిషన్ సుప్రీంలో వేయాలని అనుకున్నప్పటికీ.. దానివల్ల ఉపయోగం లేదని న్యాయనిపుణులు చెప్పారు. అరెస్టు అయిన తర్వాత బెయిలుకు అవకాశం ఉన్నదని ఆయనకు న్యాయవాదులు హామీ ఇచ్చినట్టుగా సమాచారం.
అయితే, న్యాయమూర్తి ఖచ్చితంగా రిమాండుకు పంపుతారని.. రిమాండుకు వెళ్లిన తర్వతా వెంటనే బెయిలు తెచ్చుకోవడం కూడా అంత సులభం కాదని న్యాయనిపుణులు అంటున్నారు. ఎందుకంటే.. పెద్దిరెడ్డి మిథున్ రెడ్డిని పోలీసు కస్టడీకి తీసుకుని కొన్ని రోజుల పాటూ విచారించాల్సిన అవసరం ఉన్నదని పోలీసులు ఆయన పిటిషన్లకు అభ్యంతరాలు వ్యక్తం చేసే అవకాశం ఉంది.
అదే సమయంలో మిథున్ రెడ్డి ముందస్తు బెయిల్ పిటిషన్ కొట్టేసినప్పుడు సుప్రీం కోర్టు వ్యాఖ్యలను కూడా గుర్తు చేసుకోవాల్సి ఉంది. ఆయనను అరెస్టు చేయకుండా అసలు విచారణ ఎలా పూర్తవుతుందని సుప్రీం పేర్కొంది. అందుకే ముందస్తు బెయిల్ కోరికను తిరస్కరించింది. లొంగిపోవడానికి పదిరోజుల సమయం ఇవ్వడానికి కూడా తిరస్కరించింది. సుప్రీం అంత స్పష్టంగా పేర్కొన్న నేపథ్యంలో.. తొలుత రిమాండుకు పంపి, ఆ తర్వాత పోలీసులు కస్టడీలోకి తీసుకుని విచారణ పూర్తి చేసే వరకు మిథున్ రెడ్డికి బెయిలు లభించడం సాధ్యం కాదని పలువురు విశ్లేషిస్తున్నారు. మరి ఏం జరుగుతుందో వేచిచూడాలి.
అనిల్ యాదవ్ స్క్రిప్టు రాసిందెవరో పాపం..!
రాజకీయ నాయకులు చాలా మందికి వారి సోషల్ మీడియా పోస్టులు వండి పోస్టు చేయడానికి ప్రత్యేకించిన సహాయకులు ఉంటారు. తమ తమ నాయకుల బుద్ధిని, భావజాలాన్ని బట్టి.. వారే పోస్టులు తయారుచేసి తమ నాయకుడికి చూపించి.. అక్కడితో పోస్టు చేసేస్తారు. చిన్నా పెద్ద నాయకులందరికీ ఇలాగే జరుగుతుంటుంది. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ లాంటి కేంద్రీకృత వ్యవస్థల్లో అయితే.. ఏ నాయకుడు ఏ ఊళ్లో ప్రెస్ మీట్ పెట్టి ఏం మాట్లాడాలో, ఏ సోషల్ మీడియా హ్యాండిల్ మీద ఏం పోస్టు పెట్టాలో.. సమస్తమూ తాడేపల్లి ప్యాలెస్ లోనే తయారై బట్వాడా అవుతుంటాయి. ఈ క్రమంలో పెద్దిరెడ్డి మిథున్ రెడ్డిని సిట్ పోలీసులు అరెస్టు చేసిన తర్వాత.. రాష్ట్రవ్యాప్తంగా అనేకమంది వైఎస్సార్ కాంగ్రెస్ నాయకులు.. రాష్ట్రమంతా ఖండన ముండనలకు దిగారు. ఆ సమయంలో ప్రెస్మీట్లకు అవకాశం లేదు. కొందరు నాయకులు ఇంట్లో కూర్చుని ఒక ఖండన వీడియో తయారుచేసి మీడియాకు పంపారు. దాదాపుగా అందరూ కూడా ట్విటర్ ఖాతాల్లో పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి అరెస్టు ను తీవ్రంగా ఖండిస్తూ పోస్టులు పెట్టారు. కాకపోతే నెల్లూరుకు చెందిన మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ పెట్టని పోస్టు పార్టీనే నవ్వులపాలు చేసేలా ఉంది.
‘‘లిక్కర్ స్కామ్ అంటారు.. కానీ, ఆధారం లేదు.
డబ్బు సీజ్ కాలేదు
మద్యం లభించలేదు.
చార్జ్ షీట్ లో పేరు లేదు.
ఇంకెక్కడా కుంభకోణం.
కానీ అరెస్టు ఉంది. ఎందుకంటే.. టార్గెట్ జగనన్న, ఈ కుట్రలో మిథున్ అన్నను భాగావాడారు, ఇది స్కామ్ కాదు చంద్రబాబు గారి ప్రతీకార డ్రామా’’ అని అనిల్ కుమార్ యాదవ్ ట్వీట్ చేశారు.
తలాతోకాలేని, లాజిక్ లేని ఇంత సోది పోస్టు మరొకటి లేదని జనం నవ్వుకుంటున్నారు. అప్పటికే రాత్రి అయిపోయేసరికి.. పోస్టులు తయారుచేసే సహాయకుడు అందుబాటులో లేడని.. పాపం అనిల్ కుమార్ యాదవ్ తాను సొంతగా పోస్టు పెట్టుకోవలసి వచ్చిందో ఏమో అని నవ్వుకుంటున్నారు. ఈ మాటల్ని విడివిడిగా గమనిస్తే..
‘లిక్కర్ స్కామ్ లో సమస్త ఆధారాలని చూపించారు.
డబ్బు సీజ్ కాలేదు- అనడం తప్పు.. ఆల్రెడీ 62 కోట్లు సీజ్ చేసినట్టు చార్జిషీట్ లో పేర్కన్నారు.
మద్యం లభించనేలేదు అన్నారు- ఎలా లభిస్తుంది. పనికిరాని మద్యాన్ని పేదలచేత తాగించి వారి ప్రాణాలతో జగన్ ఆడుకున్నారు. మద్యం కంపెనీలనుంచి ముడుపులు తీసుకున్నారు. ఇప్పుడు మద్యం కావాలంటే ఎక్కడ దొరుకుతుంది’ అని జగన్ అంటున్నారు. అసలు కేసు ఏమిలో కూడా తెలియకుండానే ఇలా పోస్టులు పెడుతున్నారేమో అని నవ్వుకుంటున్నారు. సహాయకుడు లేకుండా రాస్తేమాత్రమే ఇంతస్థాయి చవకబారు పోస్టు
తయారవుతుందని ప్రజలు అంటున్నారు.
చార్జిషీట్ దాఖలు.. డిఫాల్ట్ బెయిలుకు నో ఛాన్స్!
వైఎస్ జగన్మోహన్ రెడ్డి పరిపాలన సాగిన అయిదేళ్ల కాలంలో.. కొత్త లిక్కర్ పాలసీని రూపొందించి, అమల్లోకి తీసుకురావడం ద్వారా ప్రభుత్వంలోని వారు దాదాపు మూడున్నర వేల కోట్ల రూపాయల ప్రజాధనం కాజేసిన కేసులో.. ప్రత్యేక దర్యాప్తు బృందం సిట్ అధికారులు ప్రిలిమినరీ చార్జిషీట్ ను కోర్టుకు సమర్పించారు. చార్జిషీట్ దాఖలు చేయడంతో.. లిక్కర్ స్కామ్ దర్యాప్తులో ఒక కీలకఘట్టం జరిగినట్లు అయింది. ఇది కేవలం ప్రిలిమినరీ చార్జిషీట్ అని, మరో 20 రోజుల్లోగా మరొక ఛార్జిషీట్ దాఖలు చేస్తామని సిట్ అధికారులు కోర్టుకు నివేదించారు. మొత్తం ప్రాథమిక చార్జిషీటే ఏకంగా 300 పేజీలతో ఉండడం విశేషం. చార్జిషీటు కూడా దాఖలైన నేపథ్యంలో.. ఈ కేసులో ఇప్పటికే అరెస్టు అయిన నిందితులు డిఫాల్ట్ బెయిలు పొందే అవకాశం లేకుండాపోయింది.
మద్యం కేసుల్లో పోలీసులు చురుగ్గా దర్యాప్తు సాగించడం ఏప్రిల్ లో మొదలైంది. ఈ కేసులో ఇప్పటిదాకా 41 మందిని నిందితులుగా పోలీసులు పేర్కొన్నారు. వీరిలో 11 మందిని అరెస్టు చేశారు. వీరందరినీ కూడా పలుదఫాలుగా రిమాండునుంచి పోలీసు కస్టడీకి తీసుకుని విచారించి వివరాలు రాబట్టారు. వీరితో పాటు ఏకంగా 268 మందిని సాక్షులుగా కూడా విచారించి అనేక వివరాలను నమోదు చేశారు. ఫోన్ కాల్ డేటాలు, గూగుల్ టేకౌట్ టెక్నాలజీ ద్వారా.. ఏ సమయంలో ఏ నాయకులు ఎక్కడ ఉన్నారు వంటి అనేక వివరాలను కూడా పోలీసులు సేకరించారు. వాటన్నింటితో సహా.. వందకు పైగా ఫోరెన్సిక్ ల్యాబ్ నివేదికలు, డేటా ఉన్నటువంటి ఎలక్ట్రానిక్ పరికారలను కూడా కలిపి కోర్టుకు సిట్ అధికారులు అందించారు. మొత్తం 62 కోట్ల రూపాయల సొమ్మును కూడా సీజ్ చేసినట్లు వెల్లడించారు.
మద్యం కుంభకోణం ద్వారా దోచుకున్న మూడున్నర వేల కోట్ల రూపాయలను.. వివిధరూపాల్లోకి మార్చి.. స్వాహా చేసినట్టుగా చార్జిషీట్ లో వివరాలు నమోదు చేశారు. వివిధ బ్యాంకులు, ఆస్పత్రులు, బంగారం కొనుగోళ్లు, రియల్ ఎస్టేట్ కంపెనీలు, సినిమాల్లో పెట్టుబడులు పెట్టినట్టుగా నిర్ధరించారు. అలాగే వేల కోట్ల రూపాయలను విదేశాలకు హవాలా మార్గాల్లో తరలించినట్టుగా కూడా తేల్చారు. విదేశాల్లో రియల్ ఎస్టేట్ ఇన్ ఫ్రా కంపెనీల్లో పెట్టుబడులు పెట్టినట్టుగా కూడా గుర్తించారు.
ఈ మద్యం కుంభకోణంలో వసూళ్ల పర్వం నడిపించిన కింగ్ పిన్, నెట్వర్క్ లీడర్ గా కెసిరెడ్డి రాజశేఖర రెడ్డి ఉన్నారు. అలాగే మద్యం పాలసీ రూపకల్పన దగ్గరినుంచి.. వసూళ్లు పూర్తి చేయడం.. ఆ మొత్తాలను ఎక్కడికి అందాలో అక్కడకు చేరవేయడం వంటి తుదిదశ పనుల వరకు పైస్థాయిలో పర్యవేక్షణ మొత్తం మాస్టర్ మైండ్ గా పేర్కొంటున్న పెద్దిరెడ్డి మిథున్ రెడ్డిదే అని కూడా విచారణలో వెల్లడైంది. ఈ చార్జిషీట్ లో కొందరు నిందితులు విచారణలో వెల్లడించిన వివరాల్లో మిథున్ రెడ్డి పేరు కూడా ఉన్నది గానీ.. కుంభకోణంలో ఆయన పాత్ర ఏమిటి? అనేది పోలీసులు తేల్చలేదు. మొత్తానికి అరెస్టు అయిన నిందితులు, సకాలంలో పోలీసులు చార్జిషీటు దాఖలు చేయని కారణంగా డిఫాల్ట్ బెయిలు పొందే అవకాశమే లేకుండా.. ప్రిలిమినరీ చార్జిషీటు దాఖలు చేయడం జరిగిందని ప్రజలు అనుకుంటున్నారు.
మిథున్ అరెస్టుకోసం వేచిచూసిన వైసీపీ నేతలు!
ఈ రకమైన వాక్యం చూస్తే కొంచెం చిత్రంగా అనిపిస్తుంది గానీ.. ఇది నిజం. ఎందుకంటే.. మద్యం స్కామ్ లో మిథున్ రెడ్డిని శనివారం నాడు పోలీసులు అరెస్టు చేయబోతున్నారనే సంగతి.. శుక్రవారం నాటికే అందరికీ తేటతెల్లం అయిపోయింది. ఆయన అరెస్టుకోసం పోలీసులు శుక్రవారం నాడే వారంటుకు ప్రయత్నించిన నేపథ్యంలో ఆ విషయంలో దాపరికం లేకుండాపోయింది. అరెస్టు తప్పదని తెలిసీ.. శనివారం నాడు కూడా ముందస్తు బెయిలు కోసం సుప్రీంలో మరో పిటిషన్ వేయించడానికి మిథున్ రెడ్డి తన న్యాయవాదులతో సంప్రదింపులు జరిపారు.
అయితే దాని వల్ల ఫలితం ఉండదని, అరెస్టు అయిన తర్వాత బెయిలు కోసం ప్రయత్నిస్తే చాన్సుంటుందని వారు తేల్చిచెప్పారు. ఈ నేపథ్యంలో అరెస్టుకు సిద్ధపడే మిథున్ రెడ్డి సిట్ పోలీసుల ఎదుటకు వచ్చారు. అయితే.. రాష్ట్రంలోని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు అందరూ కూడా.. పొద్దుపోయిన తర్వాత పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి ఎప్పుడెప్పుడు అరెస్టు అవుతాడా అని ఎదురుచూస్తూ గడిపారు. ఎందుకంటే..
మిధున్ రెడ్డి అరెస్టు గురించి ముందుగానే తెలిసిపోయింది కాబట్టి.. తాడేపల్లి ప్యాలెస్ లో శనివారం ఉదయంనుంచి కూడా తత్సంబంధిత కసరత్తు ప్రారంభం అయింది. మిథున్ రెడ్డిని అరెస్టు చేసిన తర్వాత ఏం చేయాలనే విషయంలో వైసీపీ అగ్రనాయకులు, వ్యూహకర్తలు అందరూ కూర్చుని మల్లగుల్లాలు పడ్డారు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి అప్పటికి రెండు రోజుల ముందే యలహంక ప్యాలెస్ కు చేరిపోయారు. మిధున్ రెడ్డి అరెస్టును రాష్ట్రంలోనే ఒక అతిపెద్ద సమస్యగా చిత్రీకరించాలని, కూటమి ప్రభుత్వం మీద నిరసనలు వ్యక్తం చేయడానికి ఒక అతిపెద్ద అస్త్రంగా మార్చుకోవాలని తాడేపల్లి ప్యాలెస్ వ్యూహాలు నిర్ణయించాయి.
ఉదయం నుంచి కూడా.. రాష్ట్రవ్యాప్తంగా మూలమూలలా ఉన్న నాయకులు అందరికీ పురమాయింపులు వెళ్లాయి. అందరికోసం తాడేపల్లిలోనే స్క్రిప్టులు తయారయ్యాయి. నాయకులందరికీ పంపబడ్డాయి. మిథున్ రెడ్డిని అరెస్టు చేసే సమయాన్ని బట్టి.. వీలైన నాయకులందరూ కూడా ప్రెస్ మీట్లు పెట్టి.. ఈ అరెస్టును ఖండించాలని.. కార్యకర్తలు రోడ్ల మీదికి వచ్చి నిరసనలు వ్యక్తం చేయాలని ఆదేశాలు, మార్గదర్శకాలు వెళ్లాయి.
అయితే మిథున్ రెడ్డి.. అసలు మద్యం స్కామ్ అనేది జరగనేలేదని, తాను ఎంపీగా ఉండగా, రాష్ట్రంలో జరిగే లిక్కర్ పాలసీ రూపకల్పనలో తనకు సంబంధం ఎందుకు ఉంటుందని.. మిథున్ రెడ్డి విచారణాధికారులను ఎదురు ప్రశ్నించారు. ఆయన సహకరించకపోవడంతో.. విచారణ సుదీర్ఘంగా సాగింది. దాదాపు ఏడుగంటలకు పైగా మిథున్ రెడ్డిని విచారించిన పోలీసులు.. రాత్రి 9 గంటలు సమయంలో ఆయనను అరెస్టు చేస్తున్నట్టు ప్రకటించారు. నోటీసులు ఇచ్చి అరెస్టు చేశారు.
అరెస్టు సమాచారాన్ని ఆయన బంధువులకు తెలియజేశారు.
అప్పటికి బాగా రాత్రి కావడంతో.. అప్పటిదాకా తాడేపల్లినుంచి ఆదేశాలు అందుకున్న రాష్ట్రంలోని వైఎస్సార్ కాంగ్రెస్ నాయకులు అందరూ కూడా.. ప్రెస్ మీట్లు పెట్టే అవకాశం కూడా లేకపోయింది. అందరూ ట్విటర్ ఖాతాల్లో తమ ఖండనల్ని హోరెత్తించారు. కొందరు నాయకులు.. అత్యంత శ్రద్ధతో ఆ వేళలో కూడా ఒక పర్సనల్ వీడియో ఖండనలను షూట్ చేసుకుని.. మీడియాకు విడుదల చేశారు. అలా ఖండించడం కోసం.. అరెస్టు అయ్యేదాకా వైసీపీ నాయకులందరూ ఎదురుచూసి, ఖండనలను విడుదల చేసిన తర్వాత శాంతించారు. అంతసేపూ ఎఫ్పుడెప్పుడు అరెస్టు చేస్తారా? అని ఎదురుచూస్తూ గడిపారని పార్టీ వర్గాలే పేర్కొంటున్నాయి.
మిథున్ రెడ్డి అరెస్టు.. ఊహించిందే జరిగింది!
మూడున్నర వేలకోట్ల రూపాయలకుపైగా ప్రజాధనాన్ని ముడుపుల రూపంలో కాజేసిన అతిపెద్ద కుంభకోణంలో.. మాస్టర్ మైండ్ గా అందరూ అభివర్ణిస్తున్న వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు, రాజంపేట ఎంపీ పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి శనివారం రాత్రి 8.20 గంటల ప్రాంతంలో అరెస్టు అయ్యారు. ఈ కుంభకోణానికి సంబంధించి గతంలో ఒకసారి సాక్షిగా ఆయనను పిలిపించి విచారించిన సిట్ పోలీసులు, ఆ తర్వాత ఆయనను ఏ4 నిందితుడిగా చేర్చారు. నిందితుడిగా చేర్చిన తర్వాత.. తొలిసారిగా శనివారమే విచారణకు రావాలని నోటీసులు ఇచ్చారు.
ఈ కేసులో ముందస్తు బెయిలు కోసం హైకోర్టు, సుప్రీం కోర్టుల్లో చేసిన ప్రయత్నాలు కూడా తిరస్కరణకు గురయ్యాయి. ఆ నేపథ్యంలో శనివారం విచారించిన తర్వాత.. మిథున్ రెడ్డిని అరెస్టు చేస్తారని అందరూ ఊహించారు. దానికి తగ్గట్టుగానే.. శనివారం మధ్యాహ్నం సిట్ కార్యాలయానికి వచ్చిన మిథున్ రెడ్డిని సుదీర్ఘంగా 7 గంటలకు పైగా విచారించిన అధికారులు రాత్రి 9 గంటల సమయంలో అరెస్టు చేస్తున్నట్టు ప్రకటించారు.
ఆరెస్టు చేస్తున్నట్టుగా ఆయనకు నోటీసులు ఇచ్చి తర్వాత అరెస్టు చేశారు. ఆయనను అరెస్టు చేసినట్టుగా సమాచారాన్ని నిబంధనల ప్రకారం ఆయన కుటుంబసభ్యులకు కూడా తెలియజేశారు. ఆయనను ఆదివారం సాయంత్రం న్యాయమూర్తి ముందు హాజరుపరిచే అవకాశం ఉంది. ఆయనకు న్యాయమూర్తి పద్నాలుగు రోజుల రిమాండు విధించే అవకాశం ఉన్నదని తెలుస్తోంది.
జగన్మోహన్ రెడ్డి పరిపాలన మొదలు కాగానే.. రాష్ట్రాన్ని అడ్డగోలుగా దోచుకోవడానికి కొత్త కొత్త పాలసీలు రూపొందించే ప్రయత్నాలు అనేకం జరిగాయి. వాటిలో భాగంగానే.. లిక్కరు వ్యాపారానికి సంబంధించి కూడా కొత్త పాలసీ తయారైంది. ప్రభుత్వం ద్వారానే మద్యం దుకాణాలను నిర్వహించడం వల్ల.. మొత్తం అమ్మకాలు తమ కనుసన్నల్లోనే ఉంటాయని, తమతో లాలూచీ పడిన మద్యం కంపెనీలకు మాత్రమే ఆర్డర్లు ఇవ్వడం ద్వారా.. వారినుంచి డైరక్టుగా తామే కమిషన్లు తీసుకోవచ్చునని, అలాగే ధరలు కూడా పెంచేస్తే.. పెంచిన ధరల మొత్తం కూడా తామే కాజేయవచ్చునని ఒక మాస్టర్ ప్లాన్ సిద్ధం చేశారు.
ఏపీ బెవరేజెస్ కార్పొరేషన్ పేరుతో లిక్కరు వ్యాపారం కోసం ఒక సంస్థను ఏర్పాటుచేశారు. ఆ సంస్థ ఎండీ, ఎక్సయిజు శాఖ అధికారులతో కలిసి పాలసీ విధివిధానాలు ఎలా ఉండాలి.. ఏ రూపంలో గుట్టుచప్పుడు కాకుండో వేల కోట్లరూపాయలు దోచుకోవడం సాధ్యమవుతుంది అనే దిశగా వారంతా కసరత్తు చేశారు. ఆ విషయంలో మిథున్ రెడ్డిదే మాస్టర్ మైండ్ అని విచారణలో తేలింది. పాలసీ రూపకల్పన తర్వాత.. మద్యం కంపెనీలనుంచి వసూళ్లు రాబట్టే బాధ్యత మాత్రం రాజ్ కెసిరెడ్డి చేతిలో పెట్టారు. ఆయన ఆ పని సమర్థంగా చేయడానికి ఒక పెద్ద నెట్వర్క్ ను నడిపించారు. మిథున్ రెడ్డి మార్గదర్శకాల మేరకు వసూళ్లు చేసిన డబ్బులను రకరకాల మార్గాల్లో ఆయన చెప్పిన వారికి చేరవేశారు. మొత్తానికి కేసువిచారణ ప్రారంభమైన తర్వాత.. నాలుగునెలలుగా హైడ్రామా నడుస్తూ రాగా.. ఎట్టకేలకు పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి అరెస్టు జరిగింది.
Actor Nikhil Siddhartha Raises Concern Over Soaring Multiplex Prices
Actor Nikhil Siddhartha has voiced concern over the high cost of watching films in multiplexes, especially for middle-class families. Highlighting the financial strain, he pointed out that a family of four in cities like Hyderabad ends up spending over ₹1,000 to watch a film, with additional expenses during the interval.
Sharing his personal experience, Nikhil said he was shocked to find that the price of popcorn and beverages exceeded the actual ticket cost. While high ticket prices are already a burden, the inflated cost of snacks makes movie-watching unaffordable for many, he said.
The actor called on distribution circles and theatre managements to consider regulating pricing to make cinema more accessible. His comments have resonated with audiences, with several netizens responding positively and expressing similar concerns about the rising costs of theatre visits.
Chiranjeevi-Anil Ravipudi Film Hit by Leaks; Makers Warn Legal Action
The upcoming film starring megastar Chiranjeevi and directed by Anil Ravipudi, currently being developed under the working titles Mega 157 and ChiruAnil, is presently being shot in the Kerala region. However, the project has encountered an unexpected setback after behind-the-scenes visuals from the set were leaked and circulated on social media.
In response, the film’s production house has issued an official statement condemning the unauthorized recordings and sharing of video clips and photographs from the shooting location. It warned that legal action would be taken against those who breach set protocols and share content without permission.
“We have observed some unauthorized videos and images from the film’s sets being circulated on social media. We urge everyone not to record any content without official consent. Any violation will result in legal action. Such disruptions not only affect the workflow but also disturb the dedicated efforts of the entire team. We appeal to everyone not to share these images and to await official updates only,” the statement read.
The film, a comedy entertainer, features Nayanthara as the female lead. Veteran actor Venkatesh is expected to make a special appearance in a guest role. The makers are aiming for a Sankranti 2026 release. Interestingly, Chiranjeevi will be seen playing a character named Shankar Varaprasad — his real name — and the team is reportedly considering the title Mana Shiva Shankar Varaprasad Garu for the final release.
AP Liquor Scam: YSRCP MP Mithun Reddy Arrested After SIT Interrogation
In a major development linked to the ongoing Andhra Pradesh liquor scam investigation, YSR Congress Party MP Peddireddy Mithun Reddy was arrested by the Special Investigation Team (SIT) on Saturday. He has been named the fourth accused (A4) in what is emerging as one of the most significant corruption scandals in the state.
Mithun Reddy appeared at the SIT office in Vijayawada for questioning, where he was reportedly grilled for nearly seven hours. After the intense interrogation process, officials from SIT formally arrested him. His family members have been contacted, and officials have confirmed that he would be produced before a magistrate on Sunday.
Prior to his arrest, Mithun Reddy had sought anticipatory bail from both the Andhra Pradesh High Court and the Supreme Court, but both pleas were dismissed. With no legal shield remaining, the MP attended the summons issued by the SIT, which eventually led to his arrest.
The AP liquor case has been under the spotlight for months, with allegations pointing to a massive illegal liquor network involving key figures. Mithun Reddy’s arrest marks a significant step in the SIT’s probe as they continue to unravel the depth of the liquor scam and the involvement of political heavyweights.