బెంగళూరులోని తన యలహంక ప్యాలెస్ లో ప్రతి వారాంతాన్నీ విలాసంగా గడుపుతూ ఉండే మాజీ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి.. ఆ విలాసాల నడుమ బోరు కొట్టినప్పుడు.. అప్పుడప్పుడూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి వచ్చి ఒకటి రెండు రోజులు పార్టీ సమావేశాల పేరుతో హడావుడి చేసి ప్రజలను పట్టించుకుంటున్న రాజకీయ నాయకుడి లాగా బిల్డప్ ఇచ్చి ఆ వెంటనే బెంగుళూరు పారిపోవడం కొత్త విషయం ఎంత మాత్రమూ కాదు. సాధారణంగా వీకెండ్ వచ్చిందంటే చాలు ఆయన తాడేపల్లి నుంచి బెంగళూరు ప్యాలెస్ సకుటుంబంగా వెళ్ళిపోతుంటారు. అయితే ఈసారి గురువారమే వెళ్ళిపోయారు. బుధవారం నాడు పొగాకు రైతుల కష్టాలను తెలుసుకుంటానంటూ.. ఆ రైతులను పరామర్శిస్తానంటూ.. ఒక చిన్న నాటకీయ ఎపిసోడ్ నడిపించిన జగన్మోహన్ రెడ్డి.. అక్కడి వ్యవహారం తన అంచనాలకు భిన్నంగా సాగే సరికి బెదిరిపోయారా? అనే అనుమానాలు ప్రజలలో కలుగుతున్నాయి. గురువారం నాడు గుంటూరులో పొగాకు రైతుల పరామర్శ కార్యక్రమం ముందే షెడ్యూలు చేసుకున్నప్పటికీ దానిని రద్దు చేసుకుని బెంగళూరు యలహంక ప్యాలెస్ కు వెళ్లిపోవడం గమనార్హం.
వైయస్ జగన్మోహన్ రెడ్డి ప్రతిపక్ష నాయకుడిగా గత ఏడాది రోజులలో ప్రజల గురించి పట్టించుకున్న సందర్భాలు ఎన్ని అని లెక్క తీయదలుచుకుంటే మునివేళ్ళ మీద చెప్పవచ్చు. సూటిగా పేర్కొనాలంటే గుంటూరు మిర్చి రైతుల పరామర్శకు వెళ్లిన సందర్భం తప్ప ఆయన ప్రజల కష్టాల గురించి గళం విప్పిన దాఖలాలు లేవు. తాను ఓడిపోయి ఏడాది పూర్తయిన తర్వాత పొగాకు రైతులకు గిట్టుబాటు ధర దక్కడం లేదు అనే అంశం మీద గళం విప్పాలని ఆయనకు అనిపించింది. పరామర్శ సంగతి తర్వాత ముందుగా తన ప్రచారం ఘనంగా ఉండేలాగా జనాన్ని పోగేయడానికి అవకాశం ఉంటుందని ప్రకాశం జిల్లా పొదిలి పర్యటనకు ఆయన వెళ్లారు. పొగాకు కొనుగోలు కేంద్రంలో అసలు ఒక్క రైతుతో కూడా మాట్లాడకుండా, రైతు ప్రతినిధులతో చర్చించకుండా తన పరామర్శ యాత్రను పూర్తి చేశారు. ప్రభుత్వం మీద తాను తలచిన రీతిలో బురద చల్లారు. హెలిపాడ్ నుంచి పొగాకు కేంద్రం వరకు వెళ్లడానికి మూడు కిలోమీటర్ల రోడ్డు షో నిర్వహించి తన రాజకీయ ప్రయోజనాల కక్కుర్తిని ప్రదర్శించారు. అమరావతి మహిళలపై అసభ్య వ్యాఖ్యల నేపథ్యంలో.. అక్కడి మహిళలు నల్ల బెలూన్లతో శాంతియుతంగా నిరసన వ్యక్తం చేసే ప్రయత్నంలో ఉండగా, తన పార్టీ గుండాలతో వారి మీద రాళ్లు చెప్పులు వేయించారు. పైపెచ్చు తన మీదనే రాళ్లతో దాడి జరిగినట్లుగా ప్రచారం చేసుకున్నారు.
ఇంకా కలిపి గురువారం నాడు గుంటూరులో పొగాకు రైతులను పరామర్శించాలని ప్లాన్ చేసిన కార్యక్రమాన్ని ఆయన రద్దు చేసుకున్నారు. పొదిలిలో మహిళల మీద తన పార్టీ గూండాలతో రాళ్లు చెప్పులతో దాడి చేయించినందుకు ప్రతిస్పందనగా గుంటూరులో ఈ సమయంలో తాను పర్యటిస్తే వ్యతిరేకత తప్పదని ఆయన భయపడ్డారనేది పార్టీ వర్గాల సమాచారం. మొత్తానికి పొగాకు రైతుల పరామర్శ కంటే బెంగళూరు ఎలహంక ప్యాలెస్ తనకు ముద్దు అని భావించి జగన్ పలాయనం చిత్తగించడం గమనార్హం.
గుంటూరు గోడు వద్దు.. బెంగుళూరు ప్యాలెస్ ముద్దు!
వాళ్లే నన్ను సపోర్ట్ చేశారు!
తెలుగు సినీ పరిశ్రమలో దిల్ రాజు పేరంటే నిర్మాతగానే కాక, డిస్ట్రిబ్యూషన్ రంగంలోనూ మంచి గుర్తింపు పొందిన వ్యక్తిగా గుర్తింపు ఉంది. ఎన్నో సక్సెస్ఫుల్ సినిమాల్ని నిర్మించి తనదైన ముద్ర వేసిన దిల్ రాజు తాజాగా నితిన్ హీరోగా నిర్మిస్తున్న సినిమా తమ్ముడు గురించి మాట్లాడారు. ఈ సినిమా టైటిల్లో పవన్ కళ్యాణ్ టచ్ ఉండటం విశేషం. వేణు శ్రీరామ్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రానికి సంబంధించి విడుదలైన ట్రైలర్ ఇప్పటికే ప్రేక్షకుల్లో మంచి ఆసక్తిని పెంచింది.
అయితే ట్రైలర్ ఈవెంట్లో దిల్ రాజు చెప్పిన కొన్ని మాటలు ఇప్పుడు ఇంటర్నెట్లో చక్కర్లు కొడుతున్నాయి. తన కెరీర్లో కొన్ని ఆర్థిక ఇబ్బందులు ఎదురైన సమయంలో స్టార్ హీరోలు ఎలా మద్దతుగా నిలిచారనే విషయాన్ని చాలా ఎమోషనల్గా పంచుకున్నారు. ‘బృందావనం’ సినిమా సమయంలో ఎన్టీఆర్, ‘మిస్టర్ పర్ఫెక్ట్’ సమయంలో ప్రభాస్, ‘సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు’ టైమ్లో మహేష్ బాబు, అలాగే ‘వకీల్ సాబ్’ సందర్భంగా పవన్ కళ్యాణ్ తాను ఎదుర్కొంటున్న పరిస్థితులను అర్థం చేసుకుని ప్రతి విషయంలో ధైర్యం చెప్పారని గుర్తుచేసుకున్నారు.
వాళ్లు సినిమాల్లో నటించడం ఒక ఎత్తు అయితే, వ్యక్తిగతంగా కూర్చొని మాట్లాడి తన పరిస్థితి ఎలా ఉందో తెలుసుకొని, నెగెటివ్ ఆలోచనలు రానివ్వకుండా ధైర్యం చెప్పిన తీరు తను జీవితాంతం మర్చిపోలేనని అన్నారు. వారి సహాయంతోనే తాను ఎలాంటి సమయాన్నైనా ధైర్యంగా ఎదుర్కొగలిగానని చెప్తూ, వారిపట్ల ఉన్న గౌరవాన్ని మనసుపూర్వకంగా వ్యక్తం చేశారు.
దిల్ రాజు చెప్పిన ఈ భావోద్వేగ వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. తెలుగు సినిమా పరిశ్రమలో ఉన్న మానవ సంబంధాల గొప్పతనాన్ని ఇవి మరోసారి రుజువు చేస్తున్నాయంటూ నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.
చిన్నారి పెళ్లి కూతురి నిశ్చితార్థం!
బుల్లితెర ద్వారా చిన్నప్పట్నించీ ప్రేక్షకుల మనసు దోచుకున్న అవికా గోర్, ఇప్పుడు వ్యక్తిగత జీవితంలో ఓ కొత్త అధ్యాయాన్ని ప్రారంభించింది. ‘చిన్నారి పెళ్లికూతురు’ సీరియల్తో దేశవ్యాప్తంగా పేరు తెచ్చుకున్న ఆమె, ఇప్పుడు నిజంగా పెళ్లికూతురిగా మారేందుకు సిద్ధమవుతోంది.
ఇటీవలి రోజుల్లో టీవీ నటుడు మిలింద్ చంద్వాణితో అవికా ప్రేమలో ఉన్నట్లు వార్తలు వచ్చినా, అందుకు సంబంధించిన అధికారిక ప్రకటన మాత్రం ఇప్పటివరకు రాలేదు. కానీ తాజాగా జరిగిన ఓ ప్రైవేట్ వేడుకలో వీరిద్దరూ నిశ్చితార్థం చేసుకున్నారు. ఈ విషయాన్ని సోషల్ మీడియా ద్వారా ఆమే స్వయంగా పంచుకోవడం విశేషం.
ఎంగేజ్మెంట్ ఫోటోలతో పాటు తన ఆనందాన్ని అభిమానులతో షేర్ చేసుకున్న అవికా, తన జీవితంలో ఈ కొత్త ప్రారంభంపై ఎంతో ఉత్సాహంగా కనిపించింది. ఈ ఫోటోలు వైరల్ కావడంతో అభిమానులు పెద్ద ఎత్తున శుభాకాంక్షలు చెబుతున్నారు.
తొలిసారిగా టీవీపై చూసిన ఆ చిన్నారి ఇప్పుడు నిజంగా పెళ్లి కోసమే రెడీ అవుతుందనే విషయాన్ని తెలుసుకున్న అభిమానులు ఎమోషనల్ అవుతున్నారు. కొన్ని సంవత్సరాల క్రితమే టాలీవుడ్లోకి అడుగుపెట్టి, ‘ఉయ్యాల జంపాలా’ వంటి హిట్లతో మంచి గుర్తింపు తెచ్చుకున్న ఈ అందాల భామ జీవితంలోని మరో మెరుగైన దశను ఆరంభించింది.
ఫ్యాన్స్తో పాటు బాలీవుడ్ వర్గాల్లో కూడా ఈ న్యూస్ హాట్ టాపిక్గా మారింది. ఆమె ఎంపికపై అందరూ ఆశ్చర్యం వ్యక్తం చేస్తుండగా, కొత్త జంటకు బెస్ట్ విషెస్ వెల్లువెత్తుతున్నాయి.
కన్నప్ప ట్రైలర్ విడుదల..కారణం ఆ ప్రమాదమేనా!
టాలీవుడ్లో ప్రతిష్టాత్మకంగా రూపొందుతున్న భారీ చిత్రం “కన్నప్ప” ట్రైలర్ కోసం సినీ ప్రేమికులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఈ మూవీ ట్రైలర్ను జూన్ 13న విడుదల చేయబోతున్నట్టు ముందుగా ప్రకటించారు. కానీ ఆ ప్లాన్లో ఇప్పుడు చిన్న మార్పు జరిగింది. తాజా పరిణామాల నేపథ్యంలో హీరో విష్ణు మంచు తన సోషల్ మీడియా ద్వారా ట్రైలర్ పోస్ట్పోన్ అయ్యిందని వెల్లడించారు.
ఇప్పుడే అహ్మదాబాద్ సమీపంలో జరిగిన ఏర్ ఇండియా విమాన ప్రమాదం దేశవ్యాప్తంగా దిగ్భ్రాంతిని కలిగించింది. అందులో 240 మందికిపైగా ప్రయాణికులు ఉండటం, వారి భద్రతపై అనేక సందేహాలు తలెత్తడం వల్ల అందరి దృష్టీ ఆ ఘటనపైనే ఉంది. అటువంటి విషాద పరిస్థితుల్లో సినిమా ట్రైలర్ విడుదల చేసి ఉత్సాహంగా ప్రమోషన్ చేయడం తగదు అన్న భావనతోనే ఒక రోజు ఆలస్యంగా రిలీజ్ చేయాలని విష్ణు మంచు నిర్ణయించారు.
ఈ సినిమాలో పలు భాషలలో నటించిన టాప్ స్టార్స్ కనిపించనుండటంతో భారీ స్థాయిలో అంచనాలు ఏర్పడ్డాయి. ఇందులో మోహన్ బాబు, మోహన్ లాల్, శరత్ కుమార్, ప్రభాస్, అక్షయ్ కుమార్, కాజల్ అగర్వాల్ లాంటి నటులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. దర్శకుడు ముఖేష్ కుమార్ సింగ్ ఈ సినిమాను తెరకెక్కిస్తున్నాడు. జూన్ 27న సినిమాను గ్రాండ్గా థియేటర్లలో రిలీజ్ చేసేందుకు టీమ్ సిద్ధంగా ఉంది.
టెక్నికల్ గానే కాదు, నటీనటుల విభాగంలోనూ ఈ చిత్రం పాన్ ఇండియా స్థాయిలో ఉండడం వల్ల ట్రైలర్ పట్ల ఆసక్తి మరింత పెరిగింది. ఒక్క రోజు ఆలస్యమైనా, ఆ కంటెంట్ ఎలా ఉంటుందో తెలుసుకోవాలని ప్రేక్షకులు ఎదురు చూస్తున్నారు.
బన్నీ నెక్ట్స్ క్రేజీ బజ్!
ప్రస్తుతం అల్లు అర్జున్ సినిమాల పై అభిమానుల్లో భారీ ఆసక్తి నెలకొంది. ఇప్పటికే అతను అట్లీ డైరెక్షన్ లో ఓ పాన్ వరల్డ్ స్థాయిలో రూపొందుతున్న భారీ సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. ఈ ప్రాజెక్ట్ విషయంలో మొదటి నుంచి భారీ బజ్ నెలకొనగా, తాజా పరిస్థితుల ప్రకారం ఆ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోందని టాక్ వినిపిస్తోంది.
అయితే, ఈ సినిమా తరువాత అల్లు అర్జున్ ఇంకెన్నో ప్రాజెక్ట్స్ లైన్లో పెట్టుకున్నప్పటికీ, త్రివిక్రమ్తో చేయాల్సిన సినిమా విషయంలో మాత్రం ఇంకా స్పష్టత రావడం లేదు. ఈ కాంబినేషన్పై చాలాకాలంగా ఊహాగానాలు సాగుతున్నప్పటికీ, ప్రస్తుతం ఆ ప్రాజెక్ట్పై ఎలాంటి పురోగతీ లేకపోవడంతో అది పూర్తిగా పక్కన పడినట్టే పరిస్థితి కనిపిస్తోంది.
ఇది ఇలా ఉండగా, మరోవైపు బన్నీ–సందీప్ రెడ్డి వంగా కాంబినేషన్ లో ఓ మాస్ యాక్షన్ మూవీ ఉండబోతోందన్న వార్తలు కూడా గతంలో వినిపించాయి. కానీ తాజా సమాచారం ప్రకారం ఆ ప్రాజెక్ట్ కూడా హోల్డ్లో ఉన్నట్టే భావిస్తున్నారు.
తాజాగా మరో ఇంట్రెస్టింగ్ బజ్ ఫిల్మ్ సర్కిల్స్ లో వైరల్ అవుతోంది. దానికి అనుగుణంగా మాస్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో అల్లు అర్జున్ ఓ భారీ ప్రాజెక్ట్ చేయబోతున్నాడని టాక్ వినిపిస్తోంది. దీనికి సంబంధించి నిర్మాతగా దిల్ రాజు వ్యవహరిస్తున్నాడనీ, ఇదే ప్రాజెక్ట్ కోసం బన్నీని ఇప్పటికే ఫిక్స్ చేశారన్న చర్చలు మళ్లీ ఊపందుకున్నాయి.
ఇప్పటికి అధికారిక ప్రకటన ఏమి లేకపోయినా, ఈ రూమర్స్ వింటే బన్నీ ఫ్యూచర్ ప్రాజెక్ట్స్ చాలా హై వోల్టేజ్ గా ఉండబోతున్నాయనిపిస్తోంది. మరి ఈ సమాచారంలో ఎంత నిజం ఉంది అనేది అధికారిక ప్రకటన వెలువడిన తరువాతే స్పష్టమవుతుంది.
జగన్ కు చంద్రబాబు వెరీ క్లియర్ వార్నింగ్!
కొన్నాళ్ల కిందట మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఒక ప్రెస్ మీట్ పెట్టారు. ‘మహా అయితే ఏం చేస్తారు? నన్ను అరెస్టు చేస్తారా? చేసుకోండి. విజయవాడలోనే ఉన్నాను. వచ్చి చేసుకోండి’ అంటూ సవాళ్లు విసిరారు. ఒకవైపు అయిదేళ్లు దక్కిన అధికారంలో చేసిన పాపాలన్నీ వెలుగులోకి వస్తుండగా.. అనుక్షణం అరెస్టు భయంతో వణికిపోతున్న జగన్మోహన్ రెడ్డి.. ఈ మాటల ద్వారా మేకపోతు గాంభీర్యాన్ని ప్రదర్శించే ప్రయత్నం చేశారు. తన మీద ఎలాంటి పోలీసు చర్య తీసుకున్నా సరే.. దానిని రాజకీయ కక్ష సాధింపుల ఖాతాలోకి నెట్టేయాలని ఆయన ప్రయత్నిస్తున్నారు. అలాగని.. చర్యతీసుకోకుండా ఉండగలిగేలా ఆయన ప్రవర్తించడం లేదు కూడా..! ఇప్పుడు పరిస్థితి ఎలా తయారైనదంటే.. జగన్మోహన్ రెడ్డి ఎలాంటి తప్పులు చేస్తున్నారు.. చేయిస్తున్నారు అంటే.. ఆయన విజయవాడలో లేకపోయినా సరే.. బెంగుళూరు ప్యాలెస్ కాదు కదా.. సప్తసముద్రాల అవతల ద్వీపంలో మర్రిచెట్టు తొర్రలో దాక్కున్నా సరే పట్టుకువచ్చి శిక్షించాలని అనిపించేంత ఆగ్రహం కలిగిస్తున్నారు. అందుకే చంద్రబాబు కూడా అంతే క్లియర్ గా జగన్మోహన్ రెడ్డికి వార్నింగు ఇస్తున్నారు.
జగన్ తీరు మీద సీఎం మండిపడుతున్నారు. ‘ఎంత దైర్యం ఉంటే తెనాలిలో గంజాయి బ్యాచ్ ను పరామర్శిస్తారంటూ ఆగ్రహిస్తున్నారు. ఏడాది పాలన పూర్తయిన సందర్భంగా మీడియా సమావేశం ఏర్పాటుచేసిన చంద్రబాబు.. పొదిలిలో జగన్ బాధ్యత లేకుండా పర్యటించారని.. రౌడీలను వెంటేసుకుని వెళ్లి.. మహిళల మీద దాడులు చేయించారని ఆరోపించారు. దేవతల రాజధానిని వేశ్యల రాజధానిగా అభివర్ణించడాన్ని ఆయన తప్పుపట్టారు.
‘ఇప్పటివరకూ నా మంచితనాన్ని చూశారు. ఇకపై ఉపేక్షించేది లేదు. హద్దు మీరితే సహించేది లేదు.. 11 సీట్లకు జనం పరిమితం చేసినా బుద్ధి రాలేదు. వైకాపా తీరును మరోసారి ఆధారాలతో ఎండగడతా..’ అంటూ చంద్రబాబునాయుడు హెచ్చరించారు. మూడున్నర వేల కోట్ల రూపాయల లిక్కర్ స్కామ్ సహా.. అనేక కుంభకోణాల్లో స్వయంగా జగన్ మోహన్ రెడ్డి పాత్ర నెమ్మది నెమ్మదిగా బయటకు వస్తోంది. గమనించాల్సిన మరో సంగతి ఏంటంటే.. చాలా క్లియర్ గా వేల కోట్ల రూపాయల అవినీతి కుంభకోణం జరిగిన ఇసుక కుంభకోణం జోలికి కూటమి ప్రభుత్వం ఇంకా దృష్టి సారించలేదు. జగన్ తన అతి మాటలు చేతల ద్వారా.. ప్రభుత్వాన్ని రెచ్చగొడుతూ.. తన సకల పాపాల మీద సత్వరమే దృష్టి సారించే పరిస్థితిని క్రియేట్ చేసుకుంటున్నారని పలువురు భావిస్తున్నారు. అదే జరిగితే.. ఇక ఎప్పటికీ బెయిలు కూడా దొరకని విధంగా అవినీతికేసుల్లో ఇరుక్కుని ఆయన జైలు పాలు కావాల్సి వస్తుందని కూడా అంచనా వేస్తున్నారు.
Mithra Mandali’ Teaser: A New-Age Comedy That Promises Nonstop Fun
Tollywood’s streak of hit youthful comedies continues with the upcoming film “Mithra Mandali,” ready to bring a fresh wave of laughter and madness to the audience.
Makers released teaser introduces a group of friends portrayed by Priyadarshi, Vishnu Oi, Rag Mayur, and Prasad Behara. Their dynamic chemistry, combined with director Vijayendar’s vibrant storytelling, sets the tone for an energetic and feel-good comedy. The teaser’s colorful visuals and comic timing hint at a film that promises both fun and heart.
Adding to the fun, well-known comedians Satya and Vennela Kishore bring their trademark humor, while Niharika N M impresses with a strong, confident performance. A notable highlight is VTV Ganesh, whose funny clashes with the gang and witty parody scenes add an exciting twist.
Presented by Bunny Vas under the BV Works banner, the film is produced jointly by Sapta Aswa Media Works and Vyra Entertainments. Supported by producers Kalyan Manthina, Bhanu Pratapa, and Dr. Vijender Reddy Teegala, with Somaraju Penmetsa as co-producer, the project boasts a solid production team. Music composer RR Dhruvan lends his energetic tunes to the film’s lively atmosphere.
With its mix of emotion, insanity, and good comedy, Mithra Mandali is already making waves and fast turning into one of the most anticipated Telugu comedies. Audiences with a penchant for fun, friendship, and laughter have every right to be eagerly waiting for this new release.
ప్రజాస్వామిక ధోరణి అంటేనే జగన్ కు పగ!
వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రకాశం జిల్లా పొదిలి పర్యటనకు వెళ్లి గిట్టుబాట ధరల్లేక సతమతం అవుతున్న పొగాకు రైతులను పరామర్శించాలని అనుకున్నారు. అయితే ఆయన యాత్ర పరామర్శ యాత్రలాగా సాగలేదు. ప్రచార యాత్రలాగా సాగిపోయింది. చావుల్ని పరామర్శించడానికి వెళ్లినా కూడా.. సుదీర్ఘమైన యాత్రగా వందల సంఖ్యలో జనాన్ని పోగేసి.. వారితో ‘సీఎం సీఎం’ అని నినాదాలు చేయించుకుంటూ వెళ్లడం అలవాటు చేసుకున్న జగన్మోహన్ రెడ్డి.. పొగాకురైతుల వద్దకు కూడా మూడు కిలోమీటర్ల మేర యాత్ర చేసుకుంటూ వెళ్లారు. నిజానికి ఆయన టైమింగ్ బాగాలేదని చెప్పాలి. ఒకవైపు రాష్ట్రంలోని మహిళలను వేశ్యలుగా చిత్రీకరిస్తూ తన ఛానెల్లో డిబేట్ నడిపించడమే గాకుండా.. నిరసనలు తెలియజేయడం కూడా దుర్మార్గమైన చర్యగా అభివర్ణిస్తూ, అలాంటి వారిని సంకరతెగగా పేర్కొంటూ దుర్మార్గపు వ్యాఖ్యలు చేయించిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. ఆ ఎపిసోడ్ మొత్తం హాట్ హాట్ గా ఉన్న సమయంలోనే ఆయన పొదిలియాత్ర కూడా పెట్టుకున్నారు. సహజంగానే అక్కడి మహిళలు జగన్ పట్ల తమ నిరసన తెలియజేయడానికి పూనుకున్నారు. అలాంటి వారి మీద జగన్ ఆర్భాటపు యాత్రలో పాల్గొన్న వైసీపీ గూండాలు, రాళ్లతోను చెప్పులతోను దాడిచేయడం ఇక్కడ గమనార్హం.
ఇంతకూ ఆ మహిళలు చేసిన నేరం ఏమిటి? వారు చాలా ప్రజాస్వామిక పద్ధతిలోనే జగన్మోహన్ రెడ్డి పట్ల తమ నిరసనలు తెలియజేయడానికి పూనుకున్నారు. నల్ల బెలూన్లు ఎగరేసి, నల్ల బెలూన్లు పట్టుకుని జగన్ యాత్రలో ఆయనకు తమ అసంతృప్తి నిరసన తెలియజేయాలని అనుకున్నారు. అంతకు మించి వారు చేసిన నేరం ఇంకేమీ లేదు. ప్రతి వ్యవహారం కూడా ఫ్యూడల్ పద్ధతిలో ట్రీట్ చేయాలని తలపోసే.. దుర్మార్గపు ఫ్యాక్షనిస్టు భావజాలానికి ప్రతీక అయిన జగన్మోహన్ రెడ్డి.. ఈ నిరసన తెలియజేసే మహిళల మీదికి కూడా తన గూండాలను తైనాతీలను ఉసిగొల్పారు. వారు రెచ్చిపోయి రాళ్లు, చెప్పులు విసురుతూ నానా యాగీ చేశారు.
వైసీపీ గూండాలు చేసిన రాళ్ల దాడుల్లో కేవలం నిరసనలు తెలియజేస్తున్న మహిళలు మాత్రమే కాదు. పోలీసులు కూడా గాయపడ్డారు. హెలిప్యాడ్ నుంచి పొగాకు వేలం కేంద్రం వరకు జగన్ వాహనాల్లో రోడ్డు మార్గంలో వెళ్లిపోయి ఉంటే చాలా బాగుండేది. కానీ.. ప్రచారకాంక్ష ముదిరిన ఆయన జనాన్ని రోడ్డు పొడవునా పోగేయించి.. రోడ్డు షోగా తన వాహనాల కాన్వాయ్ తో అక్కడకు వెళ్లారు.
పొదిలిలో నిరసన తెలియజేసిన మహిళలు డిమాండ్ చేసినదంతా క్షమాపణ మాత్రమే. రాజధాని మహిళలను అంతలేసి అసభ్యపు మాటలు అనిపించిన తర్వాత.. సాక్షిమీడియా తరఫున భారతి గానీ, వైసీపీ తరఫున జగన్ గానీ ఇప్పటిదాకా సారీ చెప్పలేదు. వారిలో ఆ భావన కూడా లేదు. మహిళలను అవమానించినందుకు మురిసిపోయే ధోరణిలోనే వారున్నారు. అలాంటిది పొదిలిలో మహిళలు నిరసన తెలియజేస్తే వారిమీద చెప్పులతో రాళ్లతో దాడిచేయించారు. ఇది జగన్ లోని అసలు బుద్ధిని, మహిళల పట్ల ఆయనకుండే అసలు ఉద్దేశాలను తెలయజెబుతోందని ప్రజలు అంటున్నారు.