Actor and Andhra Pradesh MLA Nandamuri Balakrishna expressed deep sorrow over the Air India plane crash that occurred in Gujarat on Thursday, describing it as an unspeakable national tragedy. He said the incident has shaken the entire nation, and the loss of lives, including Indian and foreign nationals, is extremely painful.
Balakrishna noted that it was particularly distressing that not only passengers and crew but also several people near the crash site lost their lives. Calling it a national calamity, he urged citizens across the country to stand in solidarity with the central government during this hour of crisis. He extended heartfelt condolences to the families of those who lost their lives in the accident.
The tragic crash occurred shortly after takeoff from Sardar Vallabhbhai Patel International Airport in Ahmedabad at around 1:30 PM on Thursday. Air India flight AI-171 was en route to London and was carrying 242 people, including 169 Indian nationals and 53 British citizens. Among the passengers was former Gujarat Chief Minister and BJP leader Vijay Rupani. Rescue and relief operations are currently underway at the crash site.
అమరావతి మహిళలను గురించి అసభ్య, వివాదాస్పద వ్యాఖ్యలతో రెచ్చిపోయిన వ్యవహారాలలో సజ్జల రామకృష్ణారెడ్డి కూడా అరెస్టుకు సిద్ధం కావాల్సిన పరిస్థితి! తుళ్లూరులో అమరావతికి చెందిన మహిళా రైతులు, రాష్ట్ర ఎస్సీ కార్పొరేషన్ డైరెక్టర్ కంభంపాటి శిరీష కలిసి వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు, మాజీ జర్నలిస్టు సజ్జల రామకృష్ణారెడ్డి మీద పోలీసులకు ఫిర్యాదు చేశారు. కొమ్మినేని శ్రీనివాసరావు, వివిఆర్ కృష్ణంరాజు వ్యాఖ్యలతోనే మనోవేదనకు గురై బాధపడుతున్న తమను ఉద్దేశించి సజ్జల రామకృష్ణారెడ్డి అసభ్యంగా మాట్లాడడం మరింతగా భాధించిందని వాపోయారు. కేసు రిజిస్టరు అయింది. నేడోరేపో ఈ ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసులో సజ్జల రామకృష్ణారెడ్డిని కూడా అరెస్టు చేసే అవకాశం ఉందని పలువురు భావిస్తున్నారు.
గత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పాలనకాలంలో జరిగిన అనేకానేక అరాచకాలకు సంబంధించి సజ్జల రామకృష్ణారెడ్డి మీద ఇప్పటికే బోలెడు కేసులు ఉన్నాయి. అప్పట్లో తెలుగుదేశం పార్టీ ప్రధాన కార్యాలయం మీద జరిగిన దాడి, విధ్వంసం కేసుకి సంబంధించిన కూడా ప్రధాన సూత్రధారిగా పార్టీ గూండాలను రెచ్చగొట్టి పంపించిన వ్యక్తిగా సజ్జల మీద ఫిర్యాదులు ఉన్నాయి.
ఈ కేసులలో నోటీసులు అందుకొని సజ్జల రామకృష్ణారెడ్డి విచారణకు హాజరయ్యారు కూడా. విచారణలో పోలీసులు అడిగిన ప్రశ్నలకు తెలియదు, గుర్తులేదు, మర్చిపోయా అంటూ ఆ పార్టీ నాయకులకు అలవాటైన సమాధానం మాత్రమే ఆయన చెబుతూ వచ్చారు. కానీ ఇప్పుడు నమోదైన ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు అంత తేలికైనది కాదు. ముందస్తు బెయిలు తెచ్చుకోవడం కూడా అంత సులభం కాదు. వివిఆర్ కృష్ణంరాజు ‘అమరావతి వేశ్యల రాజధాని’ అంటూ నీచమైన వ్యాఖ్యలు చేయడం, ఆ వ్యాఖ్యలకు మురిసిపోతూ చర్చా కార్యక్రమానికి ప్రయోక్తగా వ్యవహరించిన కొమ్మినేని శ్రీనివాసరావు వాటిని మరింత ప్రోత్సహించడం.. వారి వ్యవహారం రాష్ట్రంలో ఎంత మేర అగ్గి రాజేసిందో అందరికీ తెలుసు. ఆ తర్వాతి పరిణామాలలో నిరసనలు తెలియజేస్తున్న వారి మీద నిందలు వేయడం కోసం మీడియా ముందుకు వచ్చిన సజ్జల రామకృష్ణారెడ్డి.. అలాంటి ఆందోళనకారులందరూ కూడా సంకర తెగకు చెందినవారు అంటూ మరింత నీచమైన వ్యాఖ్యలు చేశారు. అమరావతి రైతులు మరింత ఆగ్రహించడానికి మరింత మనోవేదనకు గురికావడానికి ఆయన కారణం అయ్యారు. ఇప్పుడు ఎస్సీ కార్పొరేషన్ డైరెక్టర్ కంభంపాటి శిరీష మరికొందరితో కలిసి తుళ్లూరు పీఎస్ లో ఫిర్యాదు చేయడం జరిగింది. కొమ్మినేని అరెస్టు చేయడానికి దారి తీసిన కేసు కూడా ఆమె పెట్టినదే కావడం గమనార్హం. తాజాగా సజ్జల రామకృష్ణారెడ్డిని కూడా పోలీసులు అరెస్టు చేయబోతున్నారని అర్థమవుతోంది. పాత కేసులలో ముందస్తు బెయిళ్లు, అరెస్టు నుంచి రక్షణ లాంటి న్యాయపరమైన అవకాశాలు వాడుకున్న సజ్జల ఇప్పుడు ఏం చేస్తారో వేచిచూడాలి.
బెంగళూరులోని తన యలహంక ప్యాలెస్ లో ప్రతి వారాంతాన్నీ విలాసంగా గడుపుతూ ఉండే మాజీ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి.. ఆ విలాసాల నడుమ బోరు కొట్టినప్పుడు.. అప్పుడప్పుడూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి వచ్చి ఒకటి రెండు రోజులు పార్టీ సమావేశాల పేరుతో హడావుడి చేసి ప్రజలను పట్టించుకుంటున్న రాజకీయ నాయకుడి లాగా బిల్డప్ ఇచ్చి ఆ వెంటనే బెంగుళూరు పారిపోవడం కొత్త విషయం ఎంత మాత్రమూ కాదు. సాధారణంగా వీకెండ్ వచ్చిందంటే చాలు ఆయన తాడేపల్లి నుంచి బెంగళూరు ప్యాలెస్ సకుటుంబంగా వెళ్ళిపోతుంటారు. అయితే ఈసారి గురువారమే వెళ్ళిపోయారు. బుధవారం నాడు పొగాకు రైతుల కష్టాలను తెలుసుకుంటానంటూ.. ఆ రైతులను పరామర్శిస్తానంటూ.. ఒక చిన్న నాటకీయ ఎపిసోడ్ నడిపించిన జగన్మోహన్ రెడ్డి.. అక్కడి వ్యవహారం తన అంచనాలకు భిన్నంగా సాగే సరికి బెదిరిపోయారా? అనే అనుమానాలు ప్రజలలో కలుగుతున్నాయి. గురువారం నాడు గుంటూరులో పొగాకు రైతుల పరామర్శ కార్యక్రమం ముందే షెడ్యూలు చేసుకున్నప్పటికీ దానిని రద్దు చేసుకుని బెంగళూరు యలహంక ప్యాలెస్ కు వెళ్లిపోవడం గమనార్హం.
వైయస్ జగన్మోహన్ రెడ్డి ప్రతిపక్ష నాయకుడిగా గత ఏడాది రోజులలో ప్రజల గురించి పట్టించుకున్న సందర్భాలు ఎన్ని అని లెక్క తీయదలుచుకుంటే మునివేళ్ళ మీద చెప్పవచ్చు. సూటిగా పేర్కొనాలంటే గుంటూరు మిర్చి రైతుల పరామర్శకు వెళ్లిన సందర్భం తప్ప ఆయన ప్రజల కష్టాల గురించి గళం విప్పిన దాఖలాలు లేవు. తాను ఓడిపోయి ఏడాది పూర్తయిన తర్వాత పొగాకు రైతులకు గిట్టుబాటు ధర దక్కడం లేదు అనే అంశం మీద గళం విప్పాలని ఆయనకు అనిపించింది. పరామర్శ సంగతి తర్వాత ముందుగా తన ప్రచారం ఘనంగా ఉండేలాగా జనాన్ని పోగేయడానికి అవకాశం ఉంటుందని ప్రకాశం జిల్లా పొదిలి పర్యటనకు ఆయన వెళ్లారు. పొగాకు కొనుగోలు కేంద్రంలో అసలు ఒక్క రైతుతో కూడా మాట్లాడకుండా, రైతు ప్రతినిధులతో చర్చించకుండా తన పరామర్శ యాత్రను పూర్తి చేశారు. ప్రభుత్వం మీద తాను తలచిన రీతిలో బురద చల్లారు. హెలిపాడ్ నుంచి పొగాకు కేంద్రం వరకు వెళ్లడానికి మూడు కిలోమీటర్ల రోడ్డు షో నిర్వహించి తన రాజకీయ ప్రయోజనాల కక్కుర్తిని ప్రదర్శించారు. అమరావతి మహిళలపై అసభ్య వ్యాఖ్యల నేపథ్యంలో.. అక్కడి మహిళలు నల్ల బెలూన్లతో శాంతియుతంగా నిరసన వ్యక్తం చేసే ప్రయత్నంలో ఉండగా, తన పార్టీ గుండాలతో వారి మీద రాళ్లు చెప్పులు వేయించారు. పైపెచ్చు తన మీదనే రాళ్లతో దాడి జరిగినట్లుగా ప్రచారం చేసుకున్నారు.
ఇంకా కలిపి గురువారం నాడు గుంటూరులో పొగాకు రైతులను పరామర్శించాలని ప్లాన్ చేసిన కార్యక్రమాన్ని ఆయన రద్దు చేసుకున్నారు. పొదిలిలో మహిళల మీద తన పార్టీ గూండాలతో రాళ్లు చెప్పులతో దాడి చేయించినందుకు ప్రతిస్పందనగా గుంటూరులో ఈ సమయంలో తాను పర్యటిస్తే వ్యతిరేకత తప్పదని ఆయన భయపడ్డారనేది పార్టీ వర్గాల సమాచారం. మొత్తానికి పొగాకు రైతుల పరామర్శ కంటే బెంగళూరు ఎలహంక ప్యాలెస్ తనకు ముద్దు అని భావించి జగన్ పలాయనం చిత్తగించడం గమనార్హం.
తెలుగు సినీ పరిశ్రమలో దిల్ రాజు పేరంటే నిర్మాతగానే కాక, డిస్ట్రిబ్యూషన్ రంగంలోనూ మంచి గుర్తింపు పొందిన వ్యక్తిగా గుర్తింపు ఉంది. ఎన్నో సక్సెస్ఫుల్ సినిమాల్ని నిర్మించి తనదైన ముద్ర వేసిన దిల్ రాజు తాజాగా నితిన్ హీరోగా నిర్మిస్తున్న సినిమా తమ్ముడు గురించి మాట్లాడారు. ఈ సినిమా టైటిల్లో పవన్ కళ్యాణ్ టచ్ ఉండటం విశేషం. వేణు శ్రీరామ్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రానికి సంబంధించి విడుదలైన ట్రైలర్ ఇప్పటికే ప్రేక్షకుల్లో మంచి ఆసక్తిని పెంచింది.
అయితే ట్రైలర్ ఈవెంట్లో దిల్ రాజు చెప్పిన కొన్ని మాటలు ఇప్పుడు ఇంటర్నెట్లో చక్కర్లు కొడుతున్నాయి. తన కెరీర్లో కొన్ని ఆర్థిక ఇబ్బందులు ఎదురైన సమయంలో స్టార్ హీరోలు ఎలా మద్దతుగా నిలిచారనే విషయాన్ని చాలా ఎమోషనల్గా పంచుకున్నారు. ‘బృందావనం’ సినిమా సమయంలో ఎన్టీఆర్, ‘మిస్టర్ పర్ఫెక్ట్’ సమయంలో ప్రభాస్, ‘సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు’ టైమ్లో మహేష్ బాబు, అలాగే ‘వకీల్ సాబ్’ సందర్భంగా పవన్ కళ్యాణ్ తాను ఎదుర్కొంటున్న పరిస్థితులను అర్థం చేసుకుని ప్రతి విషయంలో ధైర్యం చెప్పారని గుర్తుచేసుకున్నారు.
వాళ్లు సినిమాల్లో నటించడం ఒక ఎత్తు అయితే, వ్యక్తిగతంగా కూర్చొని మాట్లాడి తన పరిస్థితి ఎలా ఉందో తెలుసుకొని, నెగెటివ్ ఆలోచనలు రానివ్వకుండా ధైర్యం చెప్పిన తీరు తను జీవితాంతం మర్చిపోలేనని అన్నారు. వారి సహాయంతోనే తాను ఎలాంటి సమయాన్నైనా ధైర్యంగా ఎదుర్కొగలిగానని చెప్తూ, వారిపట్ల ఉన్న గౌరవాన్ని మనసుపూర్వకంగా వ్యక్తం చేశారు.
దిల్ రాజు చెప్పిన ఈ భావోద్వేగ వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. తెలుగు సినిమా పరిశ్రమలో ఉన్న మానవ సంబంధాల గొప్పతనాన్ని ఇవి మరోసారి రుజువు చేస్తున్నాయంటూ నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.
బుల్లితెర ద్వారా చిన్నప్పట్నించీ ప్రేక్షకుల మనసు దోచుకున్న అవికా గోర్, ఇప్పుడు వ్యక్తిగత జీవితంలో ఓ కొత్త అధ్యాయాన్ని ప్రారంభించింది. ‘చిన్నారి పెళ్లికూతురు’ సీరియల్తో దేశవ్యాప్తంగా పేరు తెచ్చుకున్న ఆమె, ఇప్పుడు నిజంగా పెళ్లికూతురిగా మారేందుకు సిద్ధమవుతోంది.
ఇటీవలి రోజుల్లో టీవీ నటుడు మిలింద్ చంద్వాణితో అవికా ప్రేమలో ఉన్నట్లు వార్తలు వచ్చినా, అందుకు సంబంధించిన అధికారిక ప్రకటన మాత్రం ఇప్పటివరకు రాలేదు. కానీ తాజాగా జరిగిన ఓ ప్రైవేట్ వేడుకలో వీరిద్దరూ నిశ్చితార్థం చేసుకున్నారు. ఈ విషయాన్ని సోషల్ మీడియా ద్వారా ఆమే స్వయంగా పంచుకోవడం విశేషం.
ఎంగేజ్మెంట్ ఫోటోలతో పాటు తన ఆనందాన్ని అభిమానులతో షేర్ చేసుకున్న అవికా, తన జీవితంలో ఈ కొత్త ప్రారంభంపై ఎంతో ఉత్సాహంగా కనిపించింది. ఈ ఫోటోలు వైరల్ కావడంతో అభిమానులు పెద్ద ఎత్తున శుభాకాంక్షలు చెబుతున్నారు.
తొలిసారిగా టీవీపై చూసిన ఆ చిన్నారి ఇప్పుడు నిజంగా పెళ్లి కోసమే రెడీ అవుతుందనే విషయాన్ని తెలుసుకున్న అభిమానులు ఎమోషనల్ అవుతున్నారు. కొన్ని సంవత్సరాల క్రితమే టాలీవుడ్లోకి అడుగుపెట్టి, ‘ఉయ్యాల జంపాలా’ వంటి హిట్లతో మంచి గుర్తింపు తెచ్చుకున్న ఈ అందాల భామ జీవితంలోని మరో మెరుగైన దశను ఆరంభించింది.
ఫ్యాన్స్తో పాటు బాలీవుడ్ వర్గాల్లో కూడా ఈ న్యూస్ హాట్ టాపిక్గా మారింది. ఆమె ఎంపికపై అందరూ ఆశ్చర్యం వ్యక్తం చేస్తుండగా, కొత్త జంటకు బెస్ట్ విషెస్ వెల్లువెత్తుతున్నాయి.
టాలీవుడ్లో మరో క్రేజీ కాంబినేషన్ సెట్స్ మీదకు వెళ్లేందుకు రెడీ అయింది. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, సౌత్లో శక్తివంతమైన డైరెక్టర్లలో ఒకరిగా గుర్తింపు తెచ్చుకున్న అట్లీ కలిసి చేస్తున్న సినిమా పైన ఇప్పుడు అందరి దృష్టి ఉంది. ఈ ప్రాజెక్ట్ను అధికారికంగా ప్రకటించినప్పటి నుంచే అభిమానుల్లో భారీ స్థాయిలో ఉత్సాహం నెలకొంది.
ఈ సినిమా సూపర్ హీరో కాన్సెప్ట్తో రూపొందనుందన్న విషయం ముందుగానే బయటకు రావడంతో, అల్లు అర్జున్ ఏ రేంజ్లో స్క్రీన్పై మెరిసిపోతాడో చూడాలని ప్రేక్షకులు ఎదురుచూస్తున్నారు. ఈ సినిమాకు సంబంధించిన మొదటి అడుగు అయిన పూజా కార్యక్రమాలు ఇటీవల చాలా సింపుల్గా నిర్వహించారట. ఎలాంటి హంగు ఆర్భాటాలు లేకుండా, పరిమిత సంఖ్యలోనే వాళ్లను ఆహ్వానించి ఈ కార్యాక్రమాన్ని పూర్తిచేశారు.
ఇక కథానాయకుడు అల్లు అర్జున్ జూన్ 12 నుంచి ఈ చిత్ర షూటింగ్లో పాల్గొనబోతున్నట్టు సమాచారం. మొదటి షెడ్యూల్ను నాన్ స్టాప్గా కొనసాగించేందుకు ప్లాన్ చేశారని టాక్ వినిపిస్తోంది. ఈ నేపథ్యంలో ఇకపై షూటింగ్కు సంబంధించిన ప్రతి అప్డేట్ కోసం అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
ఇక ఈ సినిమాలో బాలీవుడ్ అందాల తార దీపికా పదుకొణె ఓ ప్రధాన పాత్రలో కనిపించనుందట. ఆమెతో పాటు మరికొన్ని ఫీమేల్ లీడ్ క్యారెక్టర్లు ఉండబోతున్నాయని సమాచారం. ఈ భారీ ప్రాజెక్ట్ను సన్ పిక్చర్స్ బ్యానర్పై కళానిధి మారన్ నిర్మిస్తున్నారు. బడ్జెట్ విషయంలో కూడా ఎంత కాంప్రమైజ్ చేయకుండా గ్రాండ్గా తెరకెక్కించేందుకు ప్లాన్ చేస్తున్నారని తెలిసింది.
ఈ స్థాయి స్టార్లు, టాలెంటెడ్ డైరెక్టర్ కాంబినేషన్లో వస్తున్న సినిమా కావడంతో, ప్రేక్షకుల అంచనాలు ఇప్పటికే చాలా హైకి వెళ్లిపోయాయి. సినిమాకు సంబంధించిన మరిన్ని విశేషాలు అధికారికంగా వెలువడాలని అందరూ ఆతురతగా ఎదురు చూస్తున్నారు.
టాలీవుడ్లో మాస్ యాక్షన్ ఎంటర్టైనర్ అంటేనే గుర్తొచ్చే పేర్లలో బాలకృష్ణ, బోయపాటి శ్రీను కాంబినేషన్ ప్రత్యేకంగా ఉంటుంది. ఈ ఇద్దరూ కలిసి తీసిన ‘అఖండ’ సినిమాకు వచ్చిన రెస్పాన్స్ ఎలా ఉంటే, ఇప్పుడు దాని సీక్వెల్గా తెరకెక్కుతున్న ‘అఖండ 2’పై కూడా ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి.
ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన టీజర్ విడుదలై మంచి హైప్ను క్రియేట్ చేసింది. బాలకృష్ణ పవర్ఫుల్ స్క్రీన్ ప్రెజెన్స్, బోయపాటి మాస్ మేకింగ్ స్టైల్ ఈ టీజర్లో స్పష్టంగా కనిపించాయి. అందుకే ఈ సినిమాను తెలుగు ప్రేక్షకులతో పాటు బాలీవుడ్ ఆడియన్స్ కూడా ఆసక్తిగా చూస్తున్నారు.
ఈ సినిమా పాన్ ఇండియా స్థాయిలో రిలీజ్ చేయాలని మేకర్స్ సిద్ధమవుతున్నారు. అంతేగాక, ఈ టీజర్ ప్రొడక్షన్కు ఏకంగా కోటిన్నర రూపాయలు ఖర్చు పెట్టారట. దీన్ని బట్టి ఈ సినిమా ప్రమోషన్లను ఎంత గ్రాండ్గా ప్లాన్ చేస్తున్నారో అర్థమవుతోంది.
ఇక ఈ సినిమాలో బాలయ్య సరసన ప్రగ్యా జైస్వాల్, సంయుక్త మీనన్ కథానాయికలుగా కనిపించనున్నారు. ముఖ్యమైన పాత్రలో ఆది పినిశెట్టి నటిస్తున్నాడు. సంగీతం థమన్ తన మార్క్ మ్యూజిక్తో సినిమాకు బలం చేకూర్చనున్నాడు.
ఈ ప్రాజెక్ట్ను ప్రముఖ నిర్మాణ సంస్థ 14 రీల్స్ ప్లస్ బ్యానర్పై రామ్ ఆచంట, గోపీ ఆచంట నిర్మిస్తున్నారు. మొత్తానికి మాస్ ప్రేక్షకుల కోసం బోయపాటి – బాలయ్య కాంబో మరోసారి స్క్రీన్పై మంటలు పుట్టించేందుకు సిద్ధంగా ఉంది.
టాలీవుడ్లో ప్రతిష్టాత్మకంగా రూపొందుతున్న భారీ చిత్రం “కన్నప్ప” ట్రైలర్ కోసం సినీ ప్రేమికులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఈ మూవీ ట్రైలర్ను జూన్ 13న విడుదల చేయబోతున్నట్టు ముందుగా ప్రకటించారు. కానీ ఆ ప్లాన్లో ఇప్పుడు చిన్న మార్పు జరిగింది. తాజా పరిణామాల నేపథ్యంలో హీరో విష్ణు మంచు తన సోషల్ మీడియా ద్వారా ట్రైలర్ పోస్ట్పోన్ అయ్యిందని వెల్లడించారు.
ఇప్పుడే అహ్మదాబాద్ సమీపంలో జరిగిన ఏర్ ఇండియా విమాన ప్రమాదం దేశవ్యాప్తంగా దిగ్భ్రాంతిని కలిగించింది. అందులో 240 మందికిపైగా ప్రయాణికులు ఉండటం, వారి భద్రతపై అనేక సందేహాలు తలెత్తడం వల్ల అందరి దృష్టీ ఆ ఘటనపైనే ఉంది. అటువంటి విషాద పరిస్థితుల్లో సినిమా ట్రైలర్ విడుదల చేసి ఉత్సాహంగా ప్రమోషన్ చేయడం తగదు అన్న భావనతోనే ఒక రోజు ఆలస్యంగా రిలీజ్ చేయాలని విష్ణు మంచు నిర్ణయించారు.
ఈ సినిమాలో పలు భాషలలో నటించిన టాప్ స్టార్స్ కనిపించనుండటంతో భారీ స్థాయిలో అంచనాలు ఏర్పడ్డాయి. ఇందులో మోహన్ బాబు, మోహన్ లాల్, శరత్ కుమార్, ప్రభాస్, అక్షయ్ కుమార్, కాజల్ అగర్వాల్ లాంటి నటులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. దర్శకుడు ముఖేష్ కుమార్ సింగ్ ఈ సినిమాను తెరకెక్కిస్తున్నాడు. జూన్ 27న సినిమాను గ్రాండ్గా థియేటర్లలో రిలీజ్ చేసేందుకు టీమ్ సిద్ధంగా ఉంది.
టెక్నికల్ గానే కాదు, నటీనటుల విభాగంలోనూ ఈ చిత్రం పాన్ ఇండియా స్థాయిలో ఉండడం వల్ల ట్రైలర్ పట్ల ఆసక్తి మరింత పెరిగింది. ఒక్క రోజు ఆలస్యమైనా, ఆ కంటెంట్ ఎలా ఉంటుందో తెలుసుకోవాలని ప్రేక్షకులు ఎదురు చూస్తున్నారు.
ప్రస్తుతం అల్లు అర్జున్ సినిమాల పై అభిమానుల్లో భారీ ఆసక్తి నెలకొంది. ఇప్పటికే అతను అట్లీ డైరెక్షన్ లో ఓ పాన్ వరల్డ్ స్థాయిలో రూపొందుతున్న భారీ సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. ఈ ప్రాజెక్ట్ విషయంలో మొదటి నుంచి భారీ బజ్ నెలకొనగా, తాజా పరిస్థితుల ప్రకారం ఆ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోందని టాక్ వినిపిస్తోంది.
అయితే, ఈ సినిమా తరువాత అల్లు అర్జున్ ఇంకెన్నో ప్రాజెక్ట్స్ లైన్లో పెట్టుకున్నప్పటికీ, త్రివిక్రమ్తో చేయాల్సిన సినిమా విషయంలో మాత్రం ఇంకా స్పష్టత రావడం లేదు. ఈ కాంబినేషన్పై చాలాకాలంగా ఊహాగానాలు సాగుతున్నప్పటికీ, ప్రస్తుతం ఆ ప్రాజెక్ట్పై ఎలాంటి పురోగతీ లేకపోవడంతో అది పూర్తిగా పక్కన పడినట్టే పరిస్థితి కనిపిస్తోంది.
ఇది ఇలా ఉండగా, మరోవైపు బన్నీ–సందీప్ రెడ్డి వంగా కాంబినేషన్ లో ఓ మాస్ యాక్షన్ మూవీ ఉండబోతోందన్న వార్తలు కూడా గతంలో వినిపించాయి. కానీ తాజా సమాచారం ప్రకారం ఆ ప్రాజెక్ట్ కూడా హోల్డ్లో ఉన్నట్టే భావిస్తున్నారు.
తాజాగా మరో ఇంట్రెస్టింగ్ బజ్ ఫిల్మ్ సర్కిల్స్ లో వైరల్ అవుతోంది. దానికి అనుగుణంగా మాస్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో అల్లు అర్జున్ ఓ భారీ ప్రాజెక్ట్ చేయబోతున్నాడని టాక్ వినిపిస్తోంది. దీనికి సంబంధించి నిర్మాతగా దిల్ రాజు వ్యవహరిస్తున్నాడనీ, ఇదే ప్రాజెక్ట్ కోసం బన్నీని ఇప్పటికే ఫిక్స్ చేశారన్న చర్చలు మళ్లీ ఊపందుకున్నాయి.
ఇప్పటికి అధికారిక ప్రకటన ఏమి లేకపోయినా, ఈ రూమర్స్ వింటే బన్నీ ఫ్యూచర్ ప్రాజెక్ట్స్ చాలా హై వోల్టేజ్ గా ఉండబోతున్నాయనిపిస్తోంది. మరి ఈ సమాచారంలో ఎంత నిజం ఉంది అనేది అధికారిక ప్రకటన వెలువడిన తరువాతే స్పష్టమవుతుంది.
Amyra Dastur: A Versatile Star Shining Across Indian Cinema
Amyra Dastur, born on May 7, 1993, in Mumbai, Maharashtra, has become a prominent name in Indian entertainment. Known for her striking looks and acting prowess, she has made her mark across Hindi, Tamil, Telugu, and Punjabi cinema, showcasing her versatility and global appeal.
Early Life and Background
Amyra was raised in a Parsi family in Mumbai, where her passion for performing arts began early. Fluent in multiple languages, including English, French, Tamil, and Gujarati, her multilingual abilities complement her diverse acting roles. Amyra pursued her schooling at Cathedral and John Connon School and later attended HR College of Commerce and Economics, balancing her education with her burgeoning interest in modeling and acting.
Her career began in the modeling world, featuring in advertisements for leading brands like Clean & Clear, Dove, Micromax, and Airtel. These commercials set the stage for her transition into films.
Bollywood Debut and Breakthrough
Amyra made her Bollywood debut in 2013 with the romantic drama “Issaq”, where she played the role of Bachchi Kashyap opposite Prateik Babbar. Though the film received mixed reviews, her performance was appreciated, and she was recognized as a promising new talent.
Expanding Horizons: Tamil, Telugu, and International Films
Tamil Cinema
Amyra ventured into Tamil cinema with “Anegan” (2015), starring alongside Dhanush. Her performance was widely acclaimed, earning her a strong foothold in the Tamil film industry.
Telugu Cinema
In 2018, she debuted in Telugu cinema with “Manasuku Nachindi”, further expanding her appeal across South Indian audiences.
International Recognition
Amyra’s global presence was solidified with the action-comedy “Kung Fu Yoga” (2017), where she starred opposite international superstar Jackie Chan. The film was a box-office success, bringing her international acclaim.
Notable Works and Streaming Success
Amyra has continued to deliver captivating performances in diverse roles. Some of her standout projects include:
“Mr. X” (2015): A sci-fi thriller where she starred alongside Emraan Hashmi.
“Kaalakaandi” (2018): A dark comedy that highlighted her adaptability to unconventional narratives.
“Prassthanam” (2019): A political drama where she held her own among a star-studded cast.
“Tandav” (2021): A political thriller on Amazon Prime, showcasing her ability to excel in web series formats.
“Bambai Meri Jaan” (2023): A gripping crime drama that earned her critical acclaim.
Why Amyra Dastur Stands Out
Versatility Across Industries: Amyra’s work spans Bollywood, Tamil, Telugu, and Punjabi cinema, demonstrating her wide-ranging talent.
Global Appeal: Projects like Kung Fu Yoga have introduced her to international audiences.
Cultural and Linguistic Adaptability: Her fluency in multiple languages allows her to connect with diverse audiences.
Passion for Acting and Advocacy: Beyond her screen presence, Amyra is an avid animal lover and supports causes close to her heart.
#AmyraDasturGallery
Explore Amyra Dastur’s complete filmography on her IMDb page