చంద్రబాబుకు తప్పిన పెను ప్రమాదం!

విజయవాడలోని వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటిస్తున్న ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడికి తృటిలో పెద్ద ప్రమాదం తప్పింది. ఆయన బుడమేరు వరద ప్రవాహన్ని పరిశీలించేందుఉ మధురానగర్‌ రైల్వే ట్రాక్‌ పైకి వెళ్లారు.

 సరిగ్గా అదే సమయంలో ట్రాక్‌ పైకి ఓ ట్రైన్ దూసుకొచ్చింది. రైలు చూసి వెంటనే భద్రతా సిబ్బంది అలర్ట్ అయ్యి చంద్రబాబును పక్కనే ఉన్న ర్యాంప్‌ పైకి తీసుకుని వెళ్లారు. ముఖ్యమంత్రి చంద్రబాబుకు అతి సమీపం నుంచి రైలు వెళ్లింది. రైలు తగలకుండా ఓ పక్కకు నిలబడి ఉండటంతో పెద్ద ప్రమాదమే తప్పింది. రైలు వెళ్లిన తరువాత సీఎం సేఫ్గా బయటపడటంతో అధికారులు, భద్రతా సిబ్బంది అంతా ఊపిరి పీల్చుకున్నారు.

Related Posts

Comments

spot_img

Recent Stories