మరో బిగ్గెస్ట్‌ సినిమాతో రాబోతున్న బెల్లంకొండ వారబ్బాయి!

టాలీవుడ్‌ యంగ్‌ హీరోల్లో బెల్లంకొండ సాయి శ్రీనివాస్‌ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ప్రముఖ ప్రొడ్యూసర్ బెల్లంకొండ సురేష్‌ కుమారుడిగా టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చిన సాయి శ్రీనివాస్‌…అల్లుడు శీను సినిమాతో ఇండస్ట్రీలోకి వచ్చి..ప్రేక్షకులను ఆకట్టుకున్నాడు. ఆ తరువాత వరసు సినిమాలు చేసినప్పటికీ కొన్ని హిట్లు..కొన్ని ఫ్లాపులతో కెరీర్ లో ఎత్తుపల్లాలను చూశాడు.

తెలుగులోనే కాకుండా హిందీలో కూడా అడుగు పెట్టాడు..కానీ అక్కడ కూడా ఫ్లాప్ నే అందుకున్నాడు. కొంచెం బ్రేక్‌ తరువాత బెల్లంకొండ శ్రీనివాస్ మరో రెండేళ్ల పాటు వరుస సినిమాలను లైన్ లో పెట్టి ముందుకు దూసుకుపోతున్నాడు. ఈ యంగ్ హీరో తాజాగా సాగర్ చంద్ర దర్శకత్వంలో టైసన్ నాయుడు సినిమాలో యాక్ట్‌ చేస్తున్నాడు. ఈ సినిమా త్వరలో థియేటర్లలోకి రానుంది..అంతేకాకుండా  కౌశిక్ డైరెక్షన్‌ లో “కిష్కిందపురి” అనే సినిమాకు ఇప్పటికే సంతకం చేయగా.. త్వరలోనే ఈ సినిమా షూటింగ్ ప్రారంభం కానుంది.

ఇదిలా ఉంటే బెల్లంకొండ శ్రీనివాస్ త్వరలోనే ఓ బిగ్గెస్ట్ మూవీలో నటించేందుకు సిద్ధం అవుతున్నాడు.దాదాపు రూ.50 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కుతున్న ఈ చిత్రం ద్వారా బైరెడ్డి దర్శకుడిగా పరిచయం కానున్నారు .అయితే ఈ చిత్రం స్క్రిప్ట్ బెల్లంకొండ శ్రీనివాస్ కు నచ్చడంతో చిత్ర బృందం ప్రీ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరిపింది. ఈ సినిమాను తెరకెక్కించేందుకు  సరైన నిర్మాణ సంస్థ కోసం ఆయన ఎదురుచూస్తున్నారు.

Related Posts

Comments

spot_img

Recent Stories