సింబ ఈజ్ కమింగ్‌ అంటూ వచ్చేసిన బాలయ్య కుమారుడు!

నందమూరి అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురు చూసిన తరుణం రానే వచ్చింది. సింబ ఈజ్‌ కమింగ్ అంటూ నందమూరి నటసింహం బాలకృష్ణ కుమారుడు మోక్షఙ ఎంట్రీ నేటికి కుదిరింది. ఈరోజు మోక్షు పుట్టిన రోజు సందర్భంగా ఆయనని హీరోగా పరిచయం చేస్తు హనుమాన్‌ దర్శకుడు ప్రశాంత్‌ వర్మ ఓ ఫోటోను సోషల్‌ మీడియా వేదికగా విడుదల చేశాడు.

ప్రశాంత్‌ వర్మ, మోక్షఙ తో కలిసి ఓ సినిమా చేయనున్నారనే టాక్‌ ఎప్పటి నుంచో వినిపిస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పుడు తాజాగా సోషల్‌ మీడియాలో విడుదలైన ఫోటోను చేసిన నందమూరి అభిమానులు ఫుల్‌ ఖుషీ అవుతున్నారు. మోక్షు హీరోగా ఎంట్రీ ఇవ్వబోతున్న సినిమాకి వారు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. . ఈ సినిమాని ఎస్ఎల్‌వీ బ్యానర్ పై సుధాకర్ చెరుకూరి మరియు బాలయ్య చిన్న కుమార్తె మతుకుమిల్లి తేజస్విని సంయుక్తంగా  నిర్మించబోతున్నట్లు సమాచారం.

Related Posts

Comments

spot_img

Recent Stories