బాలయ్య-మహేష్‌ బాబు మల్టీస్టారర్‌!

ప్రస్తుతం మన టాలీవుడ్ లో మరోసారి మల్టీస్టారర్ చిత్రాల పర్వం కొనసాగుతున్న సంగతి తెలిసిందే. అలా మన టాలీవుడ్ టాప్ స్టార్స్ అంతా కూడా ఇప్పటికే  మరో హీరోలతో సినిమాలు చేసి భారీ విజయాలను అందుకున్న సంగతి తెలిసిందే. అయితే తాజాగా మరో క్రేజీ మల్టీస్టారర్ కి బీజం పడినట్టుగా సమాచారం. అది కూడా నటసింహం బాలకృష్ణ ఇంకా సూపర్ స్టార్ మహేష్ బాబు కాంబోలో అట.

రీసెంట్ గా టాలీవుడ్ సినిమా ప్రముఖ సంగీత దర్శకుడు థమన్ చేసిన కామెంట్స్ తాజాగా వైరల్ గా మారాయి. తాను బాలకృష్ణ, మహేష్ బాబుల కాంబో కథ గురించి విన్నాను అని ఆ సినిమాకి కూడా తానే వర్క్ చేస్తున్నట్టుగా థమన్ చెప్పుకొచ్చాడు.

 సో ఈ సెన్సేషనల్ మల్టీస్టారర్ టాలీవుడ్ నుంచి రాబోయే  రోజుల్లో అభిమానులను అలరిస్తుందని చెప్పాలి. మరి ఇది ఏ దర్శకుడు ప్లాన్ చేసాడు అనేది మాత్రం ఇంకా సస్పెన్స్ గానే ఉంది. మరి ఈ క్రేజీ భారీ మల్టీస్టారర్ ని ప్లాన్ చేసిన ఆ దర్శకుడు ఎవరో ఎలాంటి సబ్జెక్టుతో ప్లాన్ చేసాడో చూడాల్సిందే.

Related Posts

Comments

spot_img

Recent Stories