బాలయ్య..క్రిష్‌ ..క్రేజీ ప్రాజెక్ట్‌ ఎప్పుడంటే!

నందమూరి బాలకృష్ణ ప్రస్తుతం “అఖండ 2 తాండవం” అనే భారీ యాక్షన్ చిత్రంతో బిజీగా ఉన్నారు. ఈ సినిమా పూర్తయ్యాక ఆయన శక్తివంతమైన ప్రాజెక్ట్స్ లైనప్‌లోకి అడుగుపెట్టబోతున్నారు. ఈ క్రమంలోనే బాలయ్య మరోసారి క్రిష్ జాగర్లమూడితో కలసి పని చేయనున్నారనే వార్తలు ఫిల్మ్ నగర్ లో వినిపిస్తున్నాయి.

ఇది నిజమే అయితే, గౌతమీపుత్ర శాతకర్ణి, ఎన్టీఆర్ బయోపిక్ తర్వాత ఈ కాంబినేషన్‌లో ఇది మూడో సినిమా అవుతుంది. క్రిష్-బాలయ్య కాంబినేషన్ గతంలో విభిన్నమైన పాత్రలు, శక్తివంతమైన కథలతో ప్రేక్షకులను ఆకట్టుకుంది. ఇప్పుడు రాబోతున్న కొత్త చిత్రంలో కూడా బాలయ్య రెండు పాత్రల్లో కనిపించనున్నారనే సమాచారం బయటకు వచ్చింది.

ఇప్పటి వరకూ బాలకృష్ణ చాలాసార్లు డ్యూయల్ రోల్స్ చేశారని తెలిసిందే. ప్రతిసారి ఆయన నటనతో అభిమానులను ఆకట్టుకున్నారు. తాజా సినిమా కోసం కూడా ఆయన డబుల్ రోల్ చేస్తే, మరోసారి అలాంటి ఎంటర్టైన్మెంట్ ఉండే అవకాశం ఉంది. అయితే ఈ విషయాలపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. బాలయ్య, క్రిష్ కాంబోలో వచ్చే కొత్త సినిమా గురించి మరిన్ని వివరాలు త్వరలో బయటకు రావచ్చు.

Related Posts

Comments

spot_img

Recent Stories