ఇద్దరు పెద్ద స్టార్స్‌ తో అట్లీ సినిమా!

ఒకే ఫ్రేమ్‌ లో ఇద్దరు స్టార్‌ హీరోలు కనిపిస్తే అభిమానులకు ఎలా ఉంటుందో చెప్పాల్సిన అవసరం లేదు. గాడ్‌ ఫాదర్‌ సినిమాలో టాలీవుడ్‌ మెగాస్టార్‌ చిరంజీవి …బాలీవుడ్‌ బాస్‌ సల్మాన్‌  ఖాన్‌ ని ఒకే ఫ్రేమ్‌ లో డైరెక్టర్‌ మోహన్‌ రాజా చూపించిన సంగతి తెలిసిందే. విక్రమ్ సినిమాలో లో లాస్ట్ 10నిమిషాల ముందు రోలెక్స్ పాత్రలో సూర్య ఎంతటి సంచలనం చేసాడో చూసాం. అటువంటి క్రేజీ కాంబినేషన్ మరోటి సెట్స్ పైకి వెళ్లబోతుంది. షారుక్ ఖాన్ హీరోగా దీపికా పదుకొనె, నయన తార కీలక పాత్రలు పోషించిన సినిమా జవాన్.

ఈ సినిమాకి అట్లీ దర్శకుడిగా వ్యవహరించిన సంగతి తెలిసిందే. అట్లీ రూపొందించిన ఈ సినిమా ఎంతటి పెద్ద విజయాన్ని సాధించిందో తెలిసిన విషయమే. ఇప్పుడు మళ్లీ ఓ భారీ మల్టీ స్టారర్‌ చిత్రాన్ని తెరకెక్కించడానికి అట్లీ రెడీ అయ్యాడు. ఈ యాక్షన్‌ థ్రిల్లర్‌ మూవీ కోసం స్టార్ హీరోస్ కమల్‌ హాసన్, సల్మాన్‌ ఖాన్‌లను రంగంలోకి దించినట్లు గత కొన్ని రోజులుగా వార్తలు వినిపిస్తున్నాయి. ఒకవేళ ఇదే నిజమైతే బాక్సాఫీస్ బద్దలవడం ఖాయమని తెలుస్తుంది.

ప్రస్తుతం ఈ భారీ ప్రాజెక్ట్ కోసం సల్మాన్, కమల్‌తో చర్చలు జరుపుతున్నారు అట్లీ. వీరిద్దరూ ఇందులో నటించడానికి సిద్ధంగా ఉన్నారని సమాచారం. ఇంతకు ముందు ఎన్నడూ చూడని భారీ యాక్షన్‌ సినిమాగా దీన్ని తీర్చిదిద్దుతున్నారు అట్లీ. త్వరలో కథను పూర్తి చేసి అక్టోబరులో ప్రీ ప్రొడక్షన్ పనుల్ని ప్రారంభించడానికి సన్నాహాలు చేస్తున్నారు. వచ్చే ఏడాది దీన్ని సెట్స్‌పైకి తీసుకెళ్లనున్నారని అట్లీ సన్నిహిత వర్గాలు తెలిపాయి. అన్ని అనుకున్నట్టు జరిగితే వచ్చే ఏడాది జనవరి నుంచి ఈ సినిమా మొదలు కాబోతుంది.

Related Posts

Comments

spot_img

Recent Stories