తారక్‌ వారసులు ఆ వృత్తిలోకి వెళ్తున్నారా..ఏంటి ఇంత ట్విస్ట్‌ ఇచ్చావ్‌ బాస్‌!

సినీ పరిశ్రమలోని చాలా మంది సెలబ్రిటీలు తమ పిల్లలను చిత్ర పరిశ్రమకు వారసులుగా పరిచయం చేస్తుంటారు. చాలా కాలం నుంచి ఈ ట్రెండ్‌ నడుస్తోంది. ఈ క్రమంలోనే చాలా మంది వారసులు తమ పెద్దవారి బాటలోనే ఇండస్ట్రీకి వచ్చి హీరోలుగా కొనసాగుతున్న వారు ఉన్నారు.

ఈ క్రమంలోనే నందమూరి వారసులుగా సినీ ప్రపంచానికి పరిచయం అయిన హరికృష్ణ వారసులు యంగ్‌ టైగర్‌ ఎన్టీఆర్‌, కల్యాణ్‌ రామ్‌ ల గురించి పెద్దగా చెప్పాల్సిన అవసరం లేదు. వారి నటనతో అభినయంతో వారికంటూ సొంతంగా అభిమానులను సొంతం చేసుకున్నారు. సినీ ప్రపంచంల అగ్ర హీరోలుగా కొనసాగుతున్నారు.

ఈ క్రమంలోనే హరికృష్ణ పెద్ద కుమారుడు జానకి రామ్‌ కుమారులను సినీ ప్రపంచానికి పరిచయం చేశారు. వారి బాటలోనే తారక్‌ కుమారులు కూడా ఇండస్ట్రీకి పరిచయం అవుతారు అనుకుంటున్న తరుణంలో ఎన్టీఆర్‌ పెద్ద ట్విస్ట్‌ ఇచ్చాడు. తన ఇద్దరు కుమారులు కూడా సినీ ప్రపంచానికి రావడం తనకి ఇష్టం లేదని.. వారు వేరే ఏదైనా వృత్తిలో స్థిరపడితే చూడాలని అనుకుంటున్నట్లు ఎన్టీఆర్‌ తెలిపాడు.

వారిద్దరినీ హీరోలుగా కంటే డాక్టర్లను చేయాలని ఎన్టీఆర్ భావిస్తున్నట్లు తెలుస్తుంది. అందుకే వారిని అదే మార్గంలో పయనించేందుకు ప్రణతి కూడా ఒకే చెప్పిందంట..దీంతో ఈ విషయం తెలిసిన నందమూరి అభిమానులు చాలా ఫీలవుతున్నారు. అయితే ఎన్టీఆర్ తన కొడుకుల విషయంలో ఇలాంటి నిర్ణయం తీసుకున్నాడని తెలిసి అభిమానులు షాక్ అవుతున్నారు. 

Related Posts

Comments

spot_img

Recent Stories