ప్రభాస్‌ ప్రాజెక్టులోకి అనుష్క ఎంట్రీ!

టాలీవుడ్‌ ది మోస్ట్‌ బ్యూటీఫుల్‌ కపుల్ అని అభిమానులు ముద్దుగా పిలుచుకునే జంట ఏదైనా ఉంది అంటే అది ప్రభాస్‌ – అనుష్క జంట అనే చెప్పవచ్చు. వీరిద్దరూ మొట్ట మొదటి సారి ‘బిల్లా’ సినిమాలో కలిసి నటించారు.దీంతో వీరిద్దరి కెమిస్ట్రీకి టాలీవుడ్ లో మంచి క్రేజ్‌ ఏర్పడింది.  తర్వాత ‘మిర్చి, బాహుబలి1, బాహుబలి2’ మూవీస్‌లో జంటగా నటించి ఆకట్టుకున్నారు. దీంతో స్క్రీన్‌పై వీళ్లిద్దరి క్రెమిస్ట్రీకి, పెయిర్‌కు అందరూ ఫిదా అయిపోయారు. అయితే.. బాహుబలి తర్వాత వీరిద్దరూ కలిసి నటించలేదు.

కానీ, వీళ్లిద్దరిని మళ్లీ కలిసి ఒకే తెరపై చూడాలని అభిమానులు ఎంతగానో ఎదురు చూస్తున్నారు.  ఈ క్రమంలోనే ప్రభాస్, అనుష్క కలిసి ఓ సినిమా చెయ్యబోతున్నట్లు ప్రస్తుతం నెట్టింట ఓ వార్త వైరల్ అవుతోంది. అంతే కాదు.. ప్రభాస్ చేస్తున్న సెట్‌లోకి అనుష్క కూడా ఎంట్రీ ఇచ్చింది. మంచు విష్ణు డ్రీమ్ ప్రాజెక్ట్ ‘కన్నప్ప’. దాదాపు రూ. 150 కోట్ల భారీ బడ్జెట్‌తో తెరకెక్కుతున్న ఈ మూవీలో ఇప్పటికే చాలా మంది పాన్ ఇండియా స్టార్లు నటిస్తున్నట్లు టాక్ వచ్చిన విషయం తెలిసిందే.

ముఖ్యంగా.. మోహ‌న్ లాల్‌, న‌య‌న‌తార‌, కృతిస‌న‌న్‌, శివ‌రాజ్ కుమార్‌ కన్ఫర్మ్ కాగా.. ప్రభాస్ పేరు కూడా వినిపిస్తుంది. అయితే.. దీనిపై ఇప్పటివరకు ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు. ఈ క్రమంలోనే ఇప్పుడు ఈ ప్రాజెక్ట్‌లోకి అనుష్క రాబోతున్నట్లు ఓ వార్త చక్కర్లు కొడుతోంది. ఇందులో పార్వతిగా మొదట కంగానాను అనుకున్నారట.

కానీ ఇప్పుడు అనుష్కను ఒకే చేశారట. అంతే కాదు పార్వతి పాత్ర చెయ్యడానికి అనుష్క సైతం ఒకే చెప్పిందని టాక్. 

Related Posts

Comments

spot_img

Recent Stories