ప్రభాస్ సినిమాలో మరో బాలీవుడ్‌ నటి!

యంగ్‌ రెబల్‌ స్టార్‌, పాన్‌ ఇండియా హీరో  ప్రభాస్‌ ప్రస్తుతం చేతినిండా సినిమాలతో క్షణం తీరిక లేకుండా గడుపుతున్నాడు. గతేడాది సలార్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చి భారీ విజయాన్ని తన ఖాతాలో వేసుకున్నాడు. ఇప్పుడు కల్కి 2898 ఏడీ, రాజాసాబ్‌ ఈ రెండు సినిమాలు పూర్తి చేశాక ప్రశాంత్‌ నీల్‌ తో సలార్ 2 సినిమాని సెట్స్ మీదకి తీసుకుని వెళ్తాడని సమాచారం.

ఈ సినిమాలు చేస్తుండగానే… సందీప్ వంగా డైరెక్షన్‌ లో  స్పిరిట్‌ సినిమా ని కూడా త్వరగా పూర్తి చేయాలని ప్రభాస్‌ ఆలోచిస్తున్నట్లు తెలుస్తుంది.  సలార్ 1 బాక్సాఫీస్‌ వద్ద తన సత్తా చాటగా సలార్ 2 శౌర్యాంగ పర్వం కూడా అంతకు మించిన రేంజ్‌ లో తీర్చిదిద్దేందుకు ప్రశాంత్‌ నీల్‌ ప్రణాళికలు రచిస్తున్నాడు.

సలార్‌ లో శృతిహాసన్ హీరోయిన్ గా నటించి అందర్ని ఆకట్టుకుంది. అయితే తాజాగా రాబోతున్న సీక్వెల్ సినిమాలో శృతిహాసన్ తో పాటుగా మరో హీరోయిన్ ను కూడా చిత్ర బృందం రంగంలోకి దించబోతున్నట్లు తెలుస్తుంది.

సలార్ 2 లో బాలీవుడ్ భామ కియారా అద్వానీ నటించబోతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.. వార్ 2, డాన్ 3 సినిమాల్లో ఛాన్స్ అందుకున్న కియరా సౌత్ లో గేం చేంజర్ సినిమాలో నటిస్తుంది.  

Related Posts

Comments

spot_img

Recent Stories