విజయ్‌ దేవరకొండ తరువాత సినిమాలో హీరోయిన్‌ ఎవరంటే!

టాలీవుడ్ రౌడీ హీరో విజయ్‌ దేవరకొండ గురించి ఇండస్ట్రీకి పెద్దగా పరిచయం అక్కర్లేదు… స్నేహితుడి పాత్రలు చేస్తూ నెమ్మది నెమ్మదిగా హీరోగా ఎదిగి సినీ ప్రపంచంలో తనకంటూ ప్రత్యేక స్థానాన్ని…ఫ్యాన్‌ బేస్‌ ని ఏర్పరచుకున్నాడు. తన డైలాగ్‌ డెలివరీ, నటనతో అమ్మాయిల మనసులు దోచుకున్నాడు.

తాజాగా విజయ్ సినిమా ఫ్యామిలీ స్టార్‌ అనుకున్న స్థాయిలో ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోయింది. అయినా నిరాశ చెందని విజయ్‌ తన తరువాత సినిమా మీద ఫుల్‌ ఫోకస్‌ పెట్టినట్లు తెలుస్తుంది.  విజయ్‌ తన తరువాత సినిమాని డైరెక్టర్‌ గౌతమ్‌ తిన్ననూరి దర్శకత్వంలో చేస్తున్న విషయం తెలిసిందే.

ఈ సినిమాకి వీడీ 12 అనే వర్కింగ్‌ టైటిల్‌ ని పెట్టారు.. త్వరలోనే సినిమా పేరును ఖరారు చేస్తారనే టాక్‌. ఇక్కడ వరకు బాగానే ఉన్నా… ఈ సినిమాలో విజయ్‌ సరసన కథానాయికగా ఆడిపాడేది ఎవరూ అనే సందేహం అందరిలోనూ ఉంది. ఈ క్రమంలోనే దీనికి సంబంధించిన ఓ వార్త సోషల్‌ మీడియాలో వైరల్‌ గా మారింది.

అది ఏంటంటే.. ప్రేమలు సినిమాలో నటించిన మమితా బైజుని ఈ సినిమాలో హీరోయిన్‌ గా తీసుకుంటున్నట్లు ఓ వార్త ప్రచారం చేస్తుంది. ఇదిలా ఉంటే ఈ సినిమా కోసం మరో హీరోయిన్‌ పేరు కూడా పరిశీలనలో ఉది. ఆమె ఎవరో కాదు మిస్టర్ బచ్చన్‌ హీరోయిన్‌ భాగ్యశ్రీ బోర్స్‌ పేరు కూడా తెర మీదకు వచ్చింది.

మరి ఏ ముద్దుగుమ్మ విజయ్ దేవరకొండతో రొమాన్స్ చేసే అవకాశం దక్కించుకుంటుందో వేచి చూడాలి. ఈ స్పై థ్రిల్లర్ ను సితార ఎంటర్టైన్మెంట్స్,  ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ బ్యానర్‌లపై నిర్మిస్తున్నారు.

Related Posts

Comments

spot_img

Recent Stories