కృష్ణ ఫ్రమ్ బృందావనం అంటూ వచ్చేస్తున్న ఆది సాయి కుమార్‌!

టాలీవుడ్‌ యంగ్‌ హీరో ఆది సాయి కుమార్‌ ప్రస్తుతం వెబ్‌ సిరీస్‌ ల్లో నటిస్తూ ఫుల్‌ బిజీగా ఉంటున్నాడు. సినిమా హిట్టా, ఫ్లాపా అనే సంబంధం లేకుండా ఏదోక విధంగా థియేటర్లలోకి వచ్చి పలకరిస్తున్నాడు.  ఆది తాజాగా మరో  కొత్త సినిమాను ప్రకటించాడు.  ప్రస్తుతం మూడు సినిమాలను ఆది లైన్ లో పెట్టాడు.

తాజాగా మరో సినిమా కూడా షురూ  చేసారు. సూపర్ హిట్ కాంబోని రిపీట్ చేస్తూ ఆడియన్స్ ముందుకు వస్తున్నారు. గతంలో చుట్టాలబ్బాయి సినిమాతో మంచి విజయాన్ని అందుకున్న దర్శకుడు వీరభద్రమ్ చౌదరితో కలిసి మరో సినిమాను చేస్తున్నాడు. మళ్లీ విలేజ్ డ్రామా, ఫ్యామిలీ, లవ్, కామెడీ, ఫీల్ గుడ్ ఎమోషన్ ఇలా అన్ని అంశాలతో ఉన్న చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు.  

రు. ఈ మూవీని లక్ష్మీ ప్రసన్న ప్రొడక్షన్స్ బ్యానర్ మీద తూము నరసింహా, జామి శ్రీనివాసరావు కలిసి నిర్మిస్తున్నారు. ఈ చిత్రానికి ‘కృష్ణ ఫ్రమ్ బృందావనం’ అనే టైటిల్‌ను ఖరారు చేశారు. గురువారం పూజా కార్యక్రమాలతో ఈ సినిమాను ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి ప్రముఖ నిర్మాత దిల్ రాజు, సక్సెస్ ఫుల్ డైరెక్టర్ అనిల్ రావిపూడి, విలక్షణ నటుడు, డైలాగ్ కింగ్ సాయి కుమార్ ముఖ్య అతిథులుగా విచ్చేశారు.

Related Posts

Comments

spot_img

Recent Stories