డైరెక్షన్‌ ఆఫ్ ఫోటోగ్రఫీ తో యాక్షన్‌ రెక్కీ

పవర్‌ స్టార్‌ పవన్‌ కల్యాణ్ ప్రస్తుతం ఎన్నికల హడావిడిలో ఉన్నారు. దీంతో ఆయన కొంతకాలం పాటు సినిమాలకు విరామం ప్రకటించారు. అయితే పవన్‌తో యంగ్‌ టాలెంటెడ్‌ డైరెక్టర్‌ సుజీత్ రూపొందిస్తున్న చిత్రం ఓజీ . ఈ చిత్రంలో పవన్‌ సరసన ప్రియాంక మోహన్‌ నటిస్తున్న విషయం అందరికీ తెలిసిందే.

ఈ సినిమా షూటింగ్‌ చాలా వరకు పూర్తి అయ్యింది. ఇంకా కొంచెం మాత్రమే బ్యాలెన్స్ ఉంది. అయితే ప్రస్తుతం పవన్‌ బిజీగా ఉండడంతో పవన్‌ డేట్స్‌ కోసం చిత్ర బృందం వెయిట్‌ చేస్తుంది. దాంతో పవన్‌ ఏ క్షణాన డేట్‌ ఇచ్చినా షూటింగ్‌ పూర్తి చేసేందుకు చిత్రం బృందం రెడీగా ఉంది.

ప్రస్తుతం షూటింగ్‌ కి కాస్త విరామం దొరకడంతో సుజీత్‌ తన బృందంతో కలిసి లొకేషన్స్‌ వెదికే పనిలో పడ్డాడు. దీని గురించి సుజీత్‌ తన ఇన్‌ స్టా లో డైరెక్షన్‌ ఆఫ్ ఫోటోగ్రఫీ తో యాక్షన్‌ రెక్కీ అంటూ పోస్ట్‌ చేశాడు. ఈ పోస్ట్‌ , ఆ రెక్కీ రెండు ఓజీ కోసమే అని తెలుస్తుంది. ఏపీలో ఎన్నికలు ముగిసిన వెంటనే పవన్‌ షూటింగ్‌ కి వచ్చే అవకాశాలున్నట్లు తెలుస్తుంది.

ఈ సినిమాని పాన్‌ ఇండియా లెవల్లో సెప్టెంబర్‌ 27న విడుదల చేయనున్నట్లు సమాచారం.

Related Posts

Comments

spot_img

Recent Stories