అబ్బే..అలాంటిది ఏమి లేదు!

ఈ మధ్య కాలంలో స్టార్‌ హీరోల సినిమాల గురించి సోషల్‌ మీడియాలో వైరల్ అయ్యే వార్తల్లో ఏది నిజమో..ఏది కాదో కూడా తెలియని పరిస్థితి ఉంటుంది. తాజాగా రాజాసాబ్ విషయంలోనూ అదే జరిగింది. యంగ్‌ రెబల్‌ స్టార్‌  ప్రభాస్ నటిస్తున్న సినిమాల్లో రాజా సాబ్ పై సూపర్ హైప్ ఉంది. డైరెక్టర్‌ మారుతి ఈ సినిమాను తెరకెక్కిస్తుండగా.. మాళవిక మోహనన్, నిధి అగర్వాల్ హీరోయిన్లుగా చేస్తున్నారు.  

ఇప్పటికే విడుదలైన గ్లింప్స్‌లో ప్రభాస్ లుక్ కేక పెట్టించేలా ఉంది. అలాగే.. తమన్ ఇచ్చిన గ్లింప్స్ బ్యాక్ గ్రౌండ్ కూడా అదిరిపోయింది. దీంతో.. ఈ సినిమా మ్యూజిక్ ఆల్బమ్ పై భారీ అంచనాలే ఉన్నాయి. ఈ నేపథ్యంలో.. రాజా సాబ్ ఆడియో హక్కులకు సంబంధించి కొన్ని రూమర్స్ వైరల్ అవుతున్నాయి. ఈ సినిమా ఆడియో హక్కులు 15 కోట్లకు అమ్ముడు పోయినట్లు గత కొంతకాలంగా ప్రచారం జరుగుతుంది. కానీ.. ఈ వార్తల్లో ఎలాంటి నిజం లేదని తేలిపోయింది.

ప్రముఖ నిర్మాత, మారుతీ ఫ్రెండ్ అయినటువంటి ఎస్‌కెఎన్ సోషల్ మీడియాలో.. రాజా సాబ్ ఆడియో రైట్స్ పై ఓ వివరణ ఇచ్చారు. ప్రభాస్ ఫ్యాన్స్ ఈ న్యూస్ నిజమా? కాదా? అని ఎస్‌కెఎన్‌ను ట్యాగ్ చేయగా.. అదంతా ఫేక్ న్యూస్ అని మూవీ బృందం కొట్టిపారేశారు. సో.. రాజా సాబ్ ఆడియో రైట్స్ పై వస్తున్న వార్తల్లో ఏ నిజం లేదన్నమాట. ఇకపోతే.. ప్రస్తుతం రాజా సాబ్ షూటింగ్ శరవేగంగా పూర్తి చేసుకుంటుంది.

 ఈ సినిమా షూటింగ్ పూర్తి అయిన వెంటనే.. హనురాఘవపూడి ప్రాజెక్ట్‌ను ప్రభాస్ సెట్స్‌ మీదకి తీసుకుని వెళ్లనున్నాడు.  ఈ ఏడాదిలో రాజా సాబ్ షూటింగ్ పూర్తి చేయనున్నారు. ఇప్పటికే ఈ సినిమాను 2025 ఏప్రిల్ 10న విడుదల చేస్తామని మేకర్స్ అనౌన్స్ చేశారు. దీంతో.. మారుతి ఆ డేట్ టార్గెట్‌గా రాజాసాబ్‌ను పూర్తి చేసే పనిలో పడ్డాడు. మరి మారుతి, ప్రభాస్‌ను ఎలా హ్యాండిల్ చేస్తాడో వేచి చూడాల్సిందే.

Related Posts

Comments

spot_img

Recent Stories