పవన్ కళ్యాణ్ హీరోగా, నిధి అగర్వాల్ హీరోయిన్ గా రూపొందిన పాన్ ఇండియా మూవీ హరిహర వీరమల్లు ఇప్పటికే ప్రేక్షకుల్లో మంచి అంచనాలు ఏర్పరచుకుంది. జ్యోతి కృష్ణ దర్శకత్వం వహిస్తుండగా, క్రిష్ జాగర్లమూడి కూడ ప్రాజెక్ట్ లో భాగమయ్యారు.
ఈ సినిమా రిలీజ్ సమయం దగ్గరకి వస్తున్న వేళ మేకర్స్ ఈ ప్రాజెక్ట్ ని రెండు భాగాలుగా రూపొందిస్తున్నట్లు ప్రకటించారు. మొదటి భాగం పూర్తయ్యాక రెండవ భాగానికి సంబంధించిన ఆసక్తికరమైన ఎలిమెంట్స్ కనిపించబోతున్నాయని టాక్ వినిపిస్తోంది. ముఖ్యంగా పార్ట్ 1 లో చూపే సన్నివేశాలు రెండవ భాగానికి బలమైన బేస్ ఏర్పాటు చేస్తాయని, ఆ కారణంగా అభిమానులు, సినీ ప్రేమికులు మరింత ఉత్సాహంగా ఎదురుచూస్తున్నారని చెబుతున్నారు.
ఈ భారీ ప్రాజెక్ట్ కు ఎం ఎం కీరవాణి సంగీతం అందిస్తుండగా, ఏ ఎం రత్నం నిర్మాణ బాధ్యతలు చేపట్టారు. సినిమా జూన్ 12న గ్రాండ్ గా థియేటర్లలో ప్రేక్షకుల ముందుకు రాబోతోందని సమాచారం. మొత్తం మీద, హరిహర వీరమల్లు సినిమాకు ఉన్న క్రేజ్ ప్రస్తుతం రెండవ భాగానికి మరింత హైప్ తీసుకువస్తోంది.