చరణ్‌కి అరుదైన గౌరవం!

మెగా పవర్ స్టార్, గ్లోబల్‌ స్టార్‌ రామ్ చరణ్ హీరోగా, స్టార్ డైరెక్టర్ శంకర్ కాంబోలో తెరకెక్కుతున్న  పొలిటికల్ యాక్షన్ ఎంటర్టైనర్ గేమ్ చేంజర్ పై ప్రేక్షకుల్లో, అభిమానుల్లో భారీ అంచనాలు ఇప్పటికే నెలకొన్నాయి. ఈ చిత్రం కోసం అందరూ ఎంతో ఆసక్తిగా చూస్తున్నారు. ఈ క్రమంలో  రామ్ చరణ్ కి మరో అరుదైన గౌరవం దక్కింది.

ఆగస్ట్‌లో 15వ వార్షిక ఇండియన్ ఫిల్మ్ ఫెస్టివల్ ఆఫ్ మెల్‌బోర్న్ లో చరణ్‌ పాల్గొననున్నారు. ఈ కార్యక్రమానికి A.R రెహమాన్, కరణ్ జోహర్, రాజ్ కుమార్ హిరానీ, ఇంతియాజ్ అలీ, కబీర్ ఖాన్ వంటి దర్శకులు, నిర్మాతలు కూడా హాజరు కానున్నారు.ఎంతో ప్రతిష్టాత్మకమైన ఇండియన్ ఫిల్మ్ ఫెస్టివల్ ఆఫ్ మెల్‌బోర్న్ 15వ ఎడిషన్‌లో ముఖ్య అతిథిగా పాల్గొనేందుకు చరణ్‌ ఆహ్వానం అందుకున్నారు.

 అంతే కాదు నటన రంగంలో విశేష కృషి కనబరిచిన చరణ్ ఇండియన్ ఫిల్మ్ ఫెస్టివల్ ఆఫ్ మెల్‌బోర్న్ వేడుకలో ఇండియన్ ఆర్ట్ & కల్చర్ అంబాసిడర్ గా అవార్డు అందుకోబోతున్నారు. ఈ అవార్డు పొందిన మొదటి భారతీయ నటుడిగా అరుదైన గౌరవం దక్కించుకున్నారు చరణ్. 

Related Posts

Comments

spot_img

Recent Stories