గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ హీరోగా, జాన్వీ కపూర్ హీరోయిన్గా నటిస్తున్న తాజా సినిమా “పెద్ది” ఇప్పటికే సినిమాపై భారీ అంచనాలు నెలకొనేలా చేసింది. బుచ్చిబాబు సానా దర్శకత్వంలో రూపొందుతున్న ఈ మాస్ యాక్షన్ ఎంటర్టైనర్ షూటింగ్ ప్రస్తుతం వేగంగా జరుగుతుంది. ప్రతి అప్డేట్ మీద కూడా ప్రేక్షకుల్లో ఆసక్తి పెరిగిపోతోంది.
ఇక ఈ సినిమా నుంచి ఇటీవలే ఓ పవర్ఫుల్ యాక్షన్ సీక్వెన్స్ను షూట్ చేయగా, ఇప్పుడు మరో ఆసక్తికర సమాచారం బయటకు వచ్చింది. రామ్ చరణ్ కెరీర్లో “రంగస్థలం” ఒక సంచలన విజయం సాధించిన చిత్రంగా నిలిచింది. ఇప్పుడు “పెద్ది” సినిమా కోసం కూడా అలాంటి మాస్ ఆడియెన్స్ను టార్గెట్ చేస్తూ ఓ స్పెషల్ సాంగ్ను ఇటీవలే చిత్రీకరించారని టాలీవుడ్ వర్గాల్లో చర్చ నడుస్తోంది. ఈ పాట ఐటెం సాంగ్ స్టైల్లో ఉంటుందన్న వార్తలు వినిపిస్తున్నాయి.
కొద్దిరోజుల కితమే ఓ ఇంటెన్స్ ఫైట్ సీన్ను కంప్లీట్ చేయగా, వెంటనే ఈ మాస్ సాంగ్ను షూట్ చేయడం చూస్తే సినిమాకి ఎంత స్పీడుగా వర్క్ జరుగుతుందో అర్థం అవుతుంది. ఇక ఈ చిత్రానికి మ్యూజిక్ మెస్ట్రో ఏఆర్ రెహమాన్ సంగీతం అందిస్తున్న సంగతి తెలిసిందే. ఆయన సంగీతం ఈ సినిమాకి ప్రత్యేక ఆకర్షణగా మారబోతోంది.
వృద్ధి సినిమాస్ బ్యానర్పై ఈ భారీ పాన్ ఇండియా ప్రాజెక్ట్ తెరకెక్కుతోంది. ఎప్పటి నుంచో ఎదురుచూస్తున్న ఈ సినిమా 2026 మార్చ్ 27న గ్రాండ్గా థియేటర్లలోకి రానుంది. అప్పటివరకు మరిన్ని అప్డేట్స్తో అభిమానులను ఉత్సాహంలో ఉంచేలా మేకర్స్ ప్లాన్ చేస్తున్నట్టు తెలుస్తోంది.