కోట్లు ఇచ్చిన ఆ పని చేయనంటున్న హైబ్రిడ్‌ పిల్ల!

టాలీవుడ్ ముద్దుగుమ్మ సాయి పల్లవి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఇండస్ట్రీలోకి ఓ డ్యాన్స్ షోతో ఎంట్రీ ఇచ్చి ఓ ఊపు ఊపిన ఈ అందాల రాక్షసి ఫిదా సినిమాతో ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి సూపర్‌ హిట్‌ ని తన ఖాతాలో వేసుకుంది.  ఆ మూవీ సూపర్ హిట్ అవ్వడంతో వరుస అవకాశాలు వెతుక్కుంటూ వచ్చాయి.

సాయి పల్లవి  ప్రస్తుతం తెలుగు, తమిళ్, మలయాళ సినిమాల్లో నటిస్తూ ఫుల్‌ బిజీగా ఉంది.  రీసెంట్ గా బాలీవుడ్ లోకి కూడా ఎంట్రీ ఇచ్చింది. కాగా, ప్రస్తుతం సాయి పల్లవి గురించి ఓ ఇంట్రెస్టింగ్ న్యూస్ నెట్టింట వైరల్ అవుతుంది  అది ఏంటంటే…సాయి పల్లవి ఇప్పటివరకు ఎటువంటి యాడ్స్ లలో కనిపించలేదు. అయితే ఓ యాడ్ కోసం ఈ అమ్మడికి ఏకంగా 2 కోట్ల వరకు రెమ్యునరేషన్ అందిస్తామని ఆఫర్ చేశారట.

 దానికి సాయి పల్లవి నో చెప్పిందని వినికిడి. అది ఓ స్కిన్ ఫెయిర్నె స్ కు సంబందించిన యాడ్ అట.  అలాంటివాటికి ఎప్పుడు దూరంగా ఉండే ఈ బ్యూటీ ఎన్ని కోట్లు ఇచ్చిన చెయ్యనని చెప్పేసిందంట. ఇక సినిమాల విషయానికొస్తే.. వరుస సినిమాలతో బిజీగా ఉంది. తెలుగు, తమిళ్, మలయాళ సినిమాల్లో నటిస్తూ బిజీగా ఉంది.. అలాగే హిందీ రామాయణంలో నటిస్తోందనే విషయం తెలిసిందే. సీతగా సాయి పల్లవి కనిపించబోతుంది.

Related Posts

Comments

spot_img

Recent Stories