టాలీవుడ్లో భారీ అంచనాల మధ్య రూపొందిన పాన్ ఇండియా సినిమా ‘కన్నప్ప’ ఇప్పుడు విడుదలకు సిద్ధమైంది. మంచు విష్ణు తన డ్రీమ్ ప్రాజెక్ట్గా భావించిన ఈ సినిమాను ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరపైకి తీసుకువచ్చారు. భక్తి నేపథ్యంలో రూపొందిన ఈ చిత్రానికి బాలీవుడ్ దర్శకుడు ముఖేష్ కుమార్ సింగ్ దర్శకత్వం వహించారు.
సినిమా విడుదలకు కేవలం కొన్ని గంటలే మిగిలుండడంతో, ప్రేక్షకుల్లో ఆసక్తి నెలకొంది. ఇప్పటికే అడ్వాన్స్ బుకింగ్స్కు స్పందన అద్భుతంగా వచ్చిందని చిత్రబృందం చెబుతోంది. ప్రముఖ టికెట్ బుకింగ్ ప్లాట్ఫామ్ అయిన బుక్ మై షోలో 24 గంటల వ్యవధిలోనే లక్షా పదిహేనువేల టికెట్లు అమ్ముడుపోయాయని సమాచారం. ఇది సినిమాపై ఉన్న క్రేజ్ను స్పష్టంగా చూపిస్తుంది. దీంతో ఫస్ట్ డే నుంచే భారీ వసూళ్లు నమోదు అయ్యే అవకాశాలు ఉన్నాయి.
ఈ చిత్రంలో మోహన్ బాబు, మోహన్ లాల్, శరత్ కుమార్, ప్రభాస్, అక్షయ్ కుమార్, కాజల్ అగర్వాల్ వంటి ప్రముఖులు ముఖ్య పాత్రల్లో నటించగా, వీరి సంయుక్త నటన ఈ సినిమాకు ప్రత్యేక ఆకర్షణగా నిలవనుంది. పలు భారతీయ భాషల్లో విడుదలవుతున్న ఈ చిత్రం, ప్రేక్షకులను విశ్వాసం మరియు ఆధ్యాత్మికతతో ముడిపడిన ప్రయాణంలో తీసుకెళ్లబోతోంది.
పాన్ ఇండియా లెవెల్లో రిలీజ్ అవుతున్న ఈ సినిమా మొదటి రోజే మంచి హైప్ను సొంతం చేసుకుంది. మంచి కంటెంట్ ఉంటే తప్పకుండా మంచి రెస్పాన్స్ వస్తుందన్న నమ్మకంతో మేకర్స్ ఉన్నారు.